కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి

Published Sat, Mar 8 2025 2:12 AM | Last Updated on Sat, Mar 8 2025 2:07 AM

కారు

కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి

● కూతురికి గాయాలు ● కారు నడిపిన పెళ్లి కొడుకుపై ఫిర్యాదు

శంకరపట్నం: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ(35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్‌ కూతురు నవ్య వివాహం మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్‌ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్‌ శ్రవణ్‌ కారు దిగి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్‌ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్‌ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూరాబాద్‌, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థిఽతి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్‌ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి
1
1/1

కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement