జనగామ రూరల్: చేనేత టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవా లని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు పి.చౌడేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఈ కోర్సుకు సంబంధించి 60 సీట్లు కేటాయించారని, పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ను 9030079242 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment