బీజేపీ విజయోత్సవ ర్యాలీ
జనగామ రూరల్: బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యాన గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ.. ఈ విజయం ఘనత ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలకే దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అని ఈ ఎన్నిక ద్వారా రుజువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పజూరి లక్ష్మీనర్సయ్య, ఉడుగుల రమేశ్, అనిల్, శశిధర్రెడ్డి, హరిశ్చంద్ర గుప్తా, దేవర ఎల్ల య్య, పెద్దోజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment