జనగామ రూరల్: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలల్లో 5 నుంచి 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని 9346677568, 9441903130, 9912230123 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment