
విద్యానగర్(కరీంనగర్): హర్షిత్ రెడ్డి, హన్షిత దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మా త దిల్రాజు ప్రియదర్శి, కావ్య, కల్యాణిరామ్, సుధాకర్రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రధారులుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో నిర్మించిన బలగం సినిమా విజయం సాధించింది. బుధవారం సాయంత్రం కరీంనగర్లోని మహా త్మా జ్యోతిరావు పూలే గ్రౌండ్లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ముఖ్య అతిథిధిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, చిత్ర దర్శకుడు వేణు, నటీనటులు, సాంకేతిక సబ్బంది హాజరవుతారని పేర్కొంది.