Success Meet
-
విజయవాడలో సందడి చేసిన ‘కోర్ట్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
‘కోర్ట్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
‘కోర్ట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'మజాకా' మూవీ థాంక్స్ మీట్ లో మెరిసిన రీతు వర్మ (ఫొటోలు)
-
సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)
-
తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది: బ్రహ్మానందం
‘‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా చూసిన వారు ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడు’ అని రాజా గౌతమ్ని మెచ్చుకుంటుంటే ఓ తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తుంటాను. చాలా కాలం తర్వాత ‘బ్రహ్మా ఆనందం’ వంటి ఓ మంచి సినిమా, మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది’’ అని నటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం(Brahma Anandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) తాతా మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్(Success Meet)లో రాజా గౌతమ్ మాట్లాడుతూ–‘‘బ్రహ్మా ఆనందం’ చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘నా గత చిత్రాల్లా ‘బ్రహ్మా ఆనందం’కి కూడా మంచి మౌత్ టాక్ వచ్చింది. అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి’’ అని రాహుల్ యాదవ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం... మేం ఊహించని సన్నివేశాల్లోనూ నవ్వుతున్నారు’’ అని ఆర్వీఎస్ నిఖిల్ తెలిపారు. -
చైతన్య నటన చూశాక నాన్నగారు గుర్తొచ్చారు: అక్కినేని నాగార్జున
‘‘తండేల్’ కోసం చైతన్య రెండేళ్లు కష్టపడ్డాడు. ఓ రోజు ‘సముద్రంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే మత్స్యకారుల కష్టాలు అర్థం అవుతున్నాయి’ అన్నాడు చైతన్య. నెలల తరబడి సముద్రంలో చిన్న పడవపై ఉండే మత్స్యకారులందరికీ చేతు లెత్తి దండం పెడుతున్నాను. ఈ మూవీలో నాగచైతన్య నటన చూస్తుంటే మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొచ్చారు. 2025లో ‘తండేల్’ మంచి ముహూర్తం. వస్తున్నాం... కొడుతున్నాం’’ అన్నారు అక్కినేని నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలైంది.మంగళవారం నిర్వహించిన ‘తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘అరవింద్గారు ‘తండేల్’ కథ విన్న, చందు మొండేటితో తీద్దామన్న, దేవిశ్రీతో మ్యూజిక్ చేయిద్దామన్న వేళా విశేషం... టీమ్ అందర్నీ సెట్ చేయడానికి బన్నీ వాసు, అందరూ ప్రయత్నించిన వేళా విశేషం... వీళ్లందరూ నాగచైతన్యని అడిగిన వేళా విశేషం.. శోభితని చైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం... ఇవన్నీ బాగున్నాయి. ‘తండేల్’ విడుదలైన రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని కలిసేందుకు వెళ్లాం. అప్పుడు ఫోన్ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్లాం.వచ్చాక ఫోన్ ఆన్ చేయగానే... ఫ్యాన్స్ వద్ద నుంచి కంగ్రాట్స్ అంటూ మెసేజులు. నాకన్నా, చైతన్య కన్నా మా శ్రేయోభిలాషులు, అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. ‘తండేల్’ కథని నాక్కూడా వినిపించారు అరవింద్గారు. ‘100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్’... ఇలా మా ఫ్యామిలీకి ఒకదాన్ని మించి మరొక సక్సెస్ ఇచ్చిన మీకు థ్యాంక్స్. అల్లు... అక్కినేని కుటుంబాలకు బాగా సెట్టయింది. అరవింద్గారిని బన్నీ వాసు చక్కగా కన్విన్స్ చేసి, ఇలాంటి మంచి సినిమాలు తీసేలా చేస్తాడు. చైతన్యలోని ఒక నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు చందు’’ అన్నారు.‘‘తండేల్’కి సంబంధించి బిగ్గెస్ట్ తండేల్ (నాయకుడు) చందు మొండేటి. మా గీతా ఆర్ట్స్లో కలకాలం నిలిచి΄ోయే చిత్రాల్లో ‘తండేల్’ని ది బెస్ట్ సినిమాగా తీసుకుంటాం. తన నటనతో చింపేశాడు చైతు’’ అని పేర్కొన్నారు అల్లు అరవింద్. ‘‘నాపై నమ్మకంతో చైతన్యగారిని నాకు అప్పగించిన నాగార్జున సార్కి రిటర్న్ గిఫ్ట్గా ‘తండేల్’తో నాగచైతన్యగారిని వంద కోట్ల క్లబ్లో కూర్చోబెడతాం. నాలుగైదు రోజుల్లో 100 కోట్ల ΄పోస్టర్ని వేసి, పెద్ద వేడుక చేస్తాం. చైతన్యతో ‘100 పర్సెంట్ లవ్, తండేల్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’ వంటి హిట్ సినిమాలు తీశాం. ఇక మీరు (నాగార్జున) కూడా గీతా ఆర్ట్స్కి డేట్స్ ఇస్తే వీటన్నిటికంటే పెద్ద సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొడతాం’’ అని చె΄్పారు బన్నీ వాసు. ‘‘మా నాన్నగారిని చూసి నాకు క్రమశిక్షణ, భక్తి వచ్చాయి. నాన్నగారి కన్నా ఇంకా గొప్ప అర్హతలు ఎవరిలో అయినా ఉన్నాయా? అంటే అది అరవింద్గారే. చైతన్యగారితో భవిష్యత్తులో ఓ గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ‘తెనాలి రామకృష్ణ’ కథని మళ్లీ అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి? ఏం చె΄్పాలి? అని తీసుకొస్తాం. ఆ మూవీలో ఏఎన్ఆర్గారు చేసినటువంటి అభినయం మళ్లీ చైతన్యగారు చేస్తారు. అది మనం చూడబోతున్నాం’’ అని తెలి΄ారు చందు మొండేటి. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజులాంటిపాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరతావని వాసు ఎప్పుడో చె΄్పాడు. ఈ మూవీ నీ కెరీ ర్లో బెస్ట్ అవుతుందని అరవింద్గారు చె΄్పారు. నేనూ నమ్మా. చందు, నా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఎన్నోపాత్రలతో ఆడియన్స్ని అలరించాలి, ఎంతో కష్టపడాలనేప్రోత్సాహం, ధైర్యాన్ని ఈ సినిమా ద్వారా అరవింద్గారు, వాసు ఇచ్చారు. సినిమా లవర్స్ అంటే మన తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో మీరు మాకు చూపించారు’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాత భాను, నటి, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళి΄ాళ్ల,పాటల రచయిత శ్రీమణి, కథా రచయిత కార్తీక్ తదితరులుపాల్గొన్నారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ
‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్తో ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్లో జరిగిన సక్సెస్మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్గా తీసుకుని చేస్తాను.వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్బీకే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్’ ఉండాలని మొదలుపెట్టాం.డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్బాబు (ఫొటోలు)
-
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది తెలుగు ప్రేక్షకుల విజయం: వెంకటేశ్
‘‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘΄పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్’లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అనిల్, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు, సినిమా యూనిట్కి థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్ఫూర్తిగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మేము ఊహించినదానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమాతో నా కెరీర్లో ఎనిమిది సక్సెస్లు అంటున్నారు... ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఈ విజయం వచ్చేది కాదు’’ అన్నారు.‘‘వెంకటేశ్గారు నిర్మాతల బాగు కోరుకుంటారు. కాబట్టే ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు’’ అని శిరీష్ పేర్కొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్, వెంకటేశ్గారి కాంబినేషన్లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ ΄పొంగల్’’ అని చెప్పారు. ‘‘నేను చేసిన భాగ్యం పాత్ర క్రెడిట్ అంతా అనిల్గారికే దక్కుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ఈ వేడుకలో నటులు అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, కెమెరామేన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తదితరులు మాట్లాడారు. -
మహిళలకు టికెట్లు ఉచితం: ధర్మ
‘‘మా ‘డ్రింకర్ సాయి’ చిత్రం మహిళలకు, ఫ్యామిలీస్కు నచ్చడం సంతోషంగా ఉంది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాకు ఈ మూవీలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన మా ముగ్గురు నిర్మాతలకు థ్యాంక్స్... వాళ్లను జీవితంలో మరచిపోను. ఈ సినిమాతో యువతని చెడగొట్టలేదు అనే పేరొచ్చింది... అది చాలు. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నా’’ అని హీరో ధర్మ అన్నారు. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’.బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల అయింది. శనివారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో కిరణ్ తిరుమల శెట్టి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్లో ఎంపికైన వారికి డ్రింకర్ సాయి ఈ నెల 31న మంచి పార్టీ ఇస్తాడు’’ అని చెప్పారు.‘‘తొలి ప్రయత్నంగా ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది’’ అన్నారు బసవరాజు శ్రీనివాస్. ‘‘యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా సినిమా బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది’’ అని బసవరాజు లహరీధర్, ఇస్మాయిల్ షేక్ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ మా మూవీలో ఉన్నాయి. ఇంకా మూవీ చూడని వారు వెంటనే వెళ్లి చూడాలి’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ఈ సక్సెస్మీట్లో కెమేరామేన్ ప్రశాంత్ అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రాజేశ్ వుల్లి మాట్లాడారు. -
థ్రిల్ ఇస్తోంది: అనన్య నాగళ్ల
‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. మా మూవీ ఆడియన్స్కి మంచి థ్రిల్ ఇస్తోంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘సినిమా స్క్రీన్ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తోంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే ప్రశంసలు వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో సక్సెస్ సాధించాననుకుంటున్నాను’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు: దర్శకురాలు హరిత
వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజైంది. ఆదివారం జరిగిన సక్సెస్మీట్లో హరిత గోగినేని మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి 30 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో 70కి పైగా అవార్డులు దక్కాయి. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక అవార్డు గెలుచుకుంటే ఎంతో ప్రచారం దక్కుతుంది.కానీ మేం కొత్తవాళ్లం కాబట్టి ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు. తెలుగు సినిమాలో ఎవరూ వాడని, యునిక్ కలర్ ΄్యాట్రన్ను మేం వాడాం. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్లో ఈ సినిమా చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమాను 150 థియేటర్స్లో రిలీజ్ చేశాం. అన్ని సెంటర్స్ నుంచిపాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ఏఆర్ అభి. -
నా క్యారెక్టర్కు కనెక్ట్ అవుతున్నారు
సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలోపారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్మీట్లో పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నాపాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా ప్రసాద్. ‘‘ఈ సినిమాపాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు మార్కండేయ. -
సుకుమార్కి రుణపడి ఉంటాను: అల్లు అర్జున్
‘‘దేశం నలుమూలల నుంచి మా ‘పుష్ప 2’ యూనిట్కి స΄ోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి, భారతీయులకు థ్యాంక్స్. ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్గారికి «థ్యాంక్స్. నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది.శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతోంది. చిత్రబృందం తరఫున, తెలుగువారందరి తరఫున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్గారికి థ్యాంక్స్. దేశంలో మా సినిమాకు స΄ోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఆ సంఘటన చాలా బాధ కలిగించింది ‘‘నేను ‘పుష్ప 2’ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే. అనుకోకుండా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతిగారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత ఇరవయ్యేళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను. అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు. డిసెంబరు 4న వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్లి΄ోయాను. ఇంటికి వచ్చిన తర్వాత రేవతిగారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చె΄్పాలి. ఈ సినిమాను ఇంతగా ్ర΄ోత్సహించింది, పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే. 3 గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్లో ఉన్నారు. నా టీమ్లోని వారంతా సుకుమార్లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ. మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. ఎందుకంటే జరిగిన ఘటన (రేవతి మృతి) అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్. వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘పుష్ప 2’ రెండు రోజులకు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినందుకు ఆనందంగా ఉంది. టికెట్ ధర 800 ప్రీమియర్ షోకి మాత్రమే.. ఆ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులో ఉన్నాయి. అందరూ కచ్చితంగా సినిమాని చూడాలి’’ అని యలమంచిలి రవిశంకర్ కోరారు. -
‘రోటీ కపడ రొమాన్స్’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'ధూం ధాం' సక్సెస్ మీట్.. చీరలో హెబ్బా సూపర్! (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'దయచేసి ఎవరినీ అలా జడ్జ్ చేయకండి..' కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ' మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. ఈ సినిమా చూడటానికి ఎవరొస్తారు. ఇప్పుడు అవసరమా..? పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకన్నారు. విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడ్డా. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్కు ఇస్తాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి ఎక్కవు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. నేను మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలని' అన్నారు.ఆ తర్వాత కిరణ్ మాట్లాడుతూ..'ఈ మాట చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందేమో నాకు తెలియదు. దయచేసి ఎవరినీ కూడా మార్కెట్ పరంగా జడ్జ్ చేయకండి. వీడి మార్కెట్ ఇంత.. వాడి మార్కెట్ ఇంత.. ఇంకోడి మార్కెట్ ఇంత. ఇదంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు. ఈరోజు కింద ఉన్న వ్యక్తి వచ్చే శుక్రవారానికి టాప్కి వెళ్లొచ్చేమో. టాప్లో ఉన్న హీరో రెండు శుక్రవారాల్లో కిందకు పడొచ్చేమో. నా సినిమాను అందరూ ఆదరించారు. అందరం కలిసి మంచి సినిమా చేద్దాం' అని అన్నారు. -
శివ కార్తికేయన్ 'అమరన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?
ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్గా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్) -
రజినీకాంత్ వేట్టయాన్.. వారికి బిర్యానీ వడ్డించిన డైరెక్టర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన పది రోజుల్లోనే రూ.129 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా వేట్టయాన్ చిత్రబృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ప్రతి ఒక్కరికీ భోజనాలు వడ్డించారు.(ఇది చదవండి: వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్కు దగ్గర్లో రజనీకాంత్)ఈ సక్సెస్ మీట్లో వేట్టయాన్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. A gathering of gratitude and celebration! 🤩 The VETTAIYAN 🕶️ family comes together, thankful for the overwhelming support and love from the press and media. ✨ #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/W0yA6yqgYH— Lyca Productions (@LycaProductions) October 20, 2024 -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'రామ్ నగర్ బన్నీ' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇకపై తెరపై దావూదీ...
దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్లో విజృంభించారు... సాంగ్స్లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్మీట్కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు. ఆరేళ్లకు సోలోగా... ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్లో ‘ఆర్ఆర్ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అయింది. 7 రోజులకు రూ. 400 కోట్లు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు. దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది. ‘దేవర 2’ ఎప్పుడంటే... ‘దేవర 2’ షూట్ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది. -
దేవర మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
కార్తి ‘సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘మత్తు వదలారా 2’ సక్సెస్ మీట్ ఫోటోలు
-
అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?’ అనే ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ... ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి గణేశ్ ఆచార్య మెయిన్ కొరియోగ్రాఫర్. విజయ్ పోలకి, ఆ అమ్మాయి (బాధితురాలు) అడిషనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్ చేసిన ఓ లిరికల్ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలñ న్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.ఎవరైనా డ్యాన్స్ మాస్టర్స్, డ్యాన్సర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ చెబితే స్పందించడం తప్ప హీరోకు (అల్లు అర్జున్) ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు. -
‘మత్తు వదలరా- 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అభిమానులకు భోజనం వడ్డించిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ డైరెక్షన్లో ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.భోజనం వడ్డించిన హీరో..బాక్సాఫీస్ వద్ద తంగలాన్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్ హీరో అయి ఉండి సింపుల్గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #Thangalaan success meetA @chiyaan treat 🥳 pic.twitter.com/nFoFtL7FAA— Kalaiarasan 𝕏 (@ikalaiarasan) August 27, 2024 -
హీరో రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మల్లెమొగ్గ. తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తథాస్తు మూవీ పోస్టర్ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ ..' ‘మల్లె మొగ్గ’ విజయంవంతం కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తోట వెంకట నాగేశ్వరరావు జీవితంలో చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. హీరో రామ్ తేజ్ ఎనర్జిటిక్గా నటించాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు తప్పకుండా ఆదరణ పొందుతాయి. ‘మల్లె మొగ్గ’ సినిమా ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా టీమ్కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.నటుడు భానుచందర్ మాట్లాడుతూ ..'మల్లె మొగ్గ సినిమాలో మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి స్టోరీతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఈ కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉన్నాయి.సకుటుంబంగా ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాతో పాటు రామ్ తేజ్ చేస్తున్న తథాస్తు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నా' అని అన్నారు.హీరో రామ్ తేజ్ మాట్లాడుతూ..' నన్ను హీరోగా చేసిన మా మామయ్య, మా డైరెక్టర్ తోట వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు. ఆయన పేరు, మా తాతయ్య పేరు నిలబెడతా. మల్లె మొగ్గ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ. మేము ఇకపై సిటీ నేపథ్యమున్న చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాం. మల్లె మొగ్గ సినిమాలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా' అని అన్నారు.దర్శక, నిర్మాత తోట వెంకట నాగేశ్వరారవు మాట్లాడుతూ ..‘మల్లె మొగ్గ’ సినిమాకు ఆదరణ బాగుంది. సిటీలో థియేటర్స్ తక్కువగా దొరికాయి. రిలీజైన ప్రతి చోటా మూవీ బాగుందనే రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇది ఎమోషన్, సెంటిమెంట్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మేము ఇప్పుడు చేయబోయే తథాస్తు మూవీ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్' అని అన్నారు. -
‘మల్లె మొగ్గ’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
Om Bheem Bush Movie: ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
కడుపుబ్బా నవ్వుకునే మూవీ, చివరి 20 నిమిషాలైతే..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్కు వచ్చింది. అందరూ థియేటర్కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. కష్టే ఫలి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు. చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది! -
లంబసింగి మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్మీట్ (ఫొటోలు)
-
కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను: రవితేజ
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్స్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈగల్’కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది. కార్తీక్ ‘ఈగల్’ కథ చెప్పినప్పుడే సహదేవ వర్మ పాత్రకు ఎగ్జైట్ అయ్యాను. నా పాత్ర మేకోవర్కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్తో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్స్ ’ సినిమాతో ఈ బ్యానర్లో హాట్రిక్ కొడుతున్నాం. కార్తీక్, కావ్యా థాపర్లకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘యాక్షన్స్ సినిమా తీయాలనే నా ఆశ రవితేజగారి ‘ఈగల్’తో నెరవేరింది’’ అన్నారు కార్తీక్. ‘‘రవితేజగారితో ‘ధమాకా’లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చి, ఇప్పుడు ‘ఈగల్’తో ఈ బ్లాక్బస్టర్ను కొన సాగించాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. దర్శకుడు హరీష్శంకర్, ‘ఈగల్’ యూనిట్ సభ్యులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. -
ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున
‘‘సెప్టెంబరు 20న నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) బర్త్ డే. ఆ రోజు విగ్రహావిష్కరణ పూర్తికాగానే ‘నా సామిరంగ’ షూటింగ్కు బయలుదేరాను. ‘ఎందుకంత తొందర.. ఇంకాస్త సేపు ఉండొచ్చుగా’ అని అమల నాతో అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని నేను చెప్పగానే పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తానన్న నమ్మకాలు బయట ఎవరికీ లేవు. నా టీమ్ ముఖాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. సినిమాను రిలీజ్ చేశాం. కీరవాణిగారు బాగా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందర్నీ చాలా మిస్ అవుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నామీనన్ , రుక్సార్ థిల్లాన్ , షబ్బీర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్కు ముందుగా థ్యాంక్స్. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కనపడగానే నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని, కాస్త ఆలస్యంగా మేం చెప్పినప్పటికీ సహకరించిన డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్స్. నెక్ట్స్ సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కీరవాణి, చంద్ర బోస్గార్లు ఇలానే కలిసి ఉంటూ ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఓ సినిమా విడుదలై, సక్సెస్ సాధించి, సెలబ్రేషన్స్ షీల్డ్స్ అందుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా నా తొలి సినిమాకే జరగడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘నవరస భరితమైన సినిమాగా ‘నా సామిరంగ’ నిలిచింది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సక్సెస్మీట్లో పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నాగార్జున, కీరవాణి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్, చిత్రబృందం షీల్డ్స్ అందుకున్నారు. -
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
‘హాయ్ నాన్న’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘మంగళవారం’ మూవీలో మాస్క్లో ఉంది ఎవరో తెలుసా...(ఫొటోలు)
-
మంగళవారం మూవీ సక్సెస్ మీట్.. పాయల్ రాజ్పుత్ సందడి (ఫోటోలు)
-
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో సబ్కాంట్రాక్టర్గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
Rudramkota Movie Success Meet: రుద్రం కోట మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Ameesha Patel: గదర్ 2 సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెగాస్టార్ (ఫోటోలు)
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
రంగబలి మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
ఛలో తర్వాత రంగబలి
‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్కి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సుధాకర్కి థ్యాంక్స్’’ అన్నారు హీరో నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై 7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్లో పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు. -
'మెగాస్టార్ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది'
'సామజ వరగమన’ కథని రామ్ చెప్పినప్పుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైంది. ‘సామజ వరగమన’ చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు' అని హీరో శ్రీ విష్ణు అన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– 'ఈ సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్లో చిరంజీవిగారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది’ అన్నారు. ‘‘నవ్వించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వెంకటేశ్గారు సీనియర్ మోస్ట్. ఆ ప్లేస్కి ఇప్పుడు శ్రీవిష్ణు యాప్ట్’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత సంతోషంగా ఉంది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ అబ్బరాజు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, విజయ్ కనకమేడల, వశిష్ట, నటుడు వీకే నరేష్, రెబా మోనికా జాన్ మాట్లాడారు. -
స్పై మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘స్పై’కి నా కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మా సినిమాని ఇంతగా ఆదరించి, నా కెరీర్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపైనా మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాట ఇస్తున్నా’’ అని నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘స్పై’కి ఇంత పెద్ద ఓపెనింగ్స్ (రూ. 11 కోట్ల 7లక్షలు) రావడం హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు గ్యారీ బీహెచ్. -
విమానం మూవీ సక్సెస్ మీట్ స్టిల్స్
-
ఇకపై నవ్వించే సినిమాలే చేస్తాను
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ‘అన్స్టాపబుల్’ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నామంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఇచ్చిన తీర్పే రియల్ బ్లాక్ బస్టర్.. ఇకపై నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్స్టాపబుల్’. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేయడం తేలికైన విషయం కాదు. రజిత్ రావుగారు సినిమాపై ΄్యాషన్తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ‘‘అన్స్టాపబుల్ 2’ని రత్నబాబు దర్శకత్వంలోనే చేస్తున్నాం’’ అన్నారు రజిత్ రావు. -
పరేషాన్తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
బిచ్చగాడు 2 మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' సక్సెస్ మీట్ ఫోటోలు
-
2018 Movie: ‘2018’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
తేజ్ మీద చాలా కోపంగా ఉంది..
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
ఫన్నీ స్పీచ్ తో నవ్వులు పూయించిన సోనియా.. తేజ్ రియాక్షన్ చూడండి
-
Virupaksha Success Meet : ‘విరూపాక్ష’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
రేపు ‘బలగం’ సక్సెస్ మీట్
విద్యానగర్(కరీంనగర్): హర్షిత్ రెడ్డి, హన్షిత దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మా త దిల్రాజు ప్రియదర్శి, కావ్య, కల్యాణిరామ్, సుధాకర్రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రధారులుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో నిర్మించిన బలగం సినిమా విజయం సాధించింది. బుధవారం సాయంత్రం కరీంనగర్లోని మహా త్మా జ్యోతిరావు పూలే గ్రౌండ్లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ముఖ్య అతిథిధిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, చిత్ర దర్శకుడు వేణు, నటీనటులు, సాంకేతిక సబ్బంది హాజరవుతారని పేర్కొంది. -
చీరకట్టులో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్
‘‘సార్’లాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు.. గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్. నారాయణమూర్తి. ‘‘సార్’ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘కె. విశ్వనాథ్గారిలా ‘సార్’ చిత్రంతో తనదైన ముద్రను ఆరంభించాడు వెంకీ’’ అన్నారు తనికెళ్ల భరణి. -
ధనుష్ ‘సార్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Waltair Veerayya Team Photos: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో తొక్కిసలాట
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లు సమాచారం. వీరయ్య విజయ విహారం పేరిట వాల్తేరు వీరయ్య చిత్రబృందం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!) కాగా.. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. -
ఆ సీన్ చూసి నన్ను చంపేస్తారేమోనని భయపడ్డా: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోడా పోడీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై తన బౌండరిలను చేరిపేసుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో డిగ్లామర్స్ రోల్స్కే కాదు విలన్ పాత్రలకు సైతం సై అంటుంది. అలా సినిమాల్లో లేడీ విలన్గా విజృంభిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంలో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఇక రీసెంట్గా ఆమె తెలుగులో బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో నటించింది. ఇందులో సొంత అన్నయ్యను చంపే చెల్లెలిగా ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ఇందులో తన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత తనని చంపేస్తారని మూవీ షూటింగ్ సమయంలో భయాందోళనకు గురయ్యానంది. తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని చంపుతారేమో అని ఆందోళనకు గరయ్యా. షూటింగ్లో ఈ సీన్ చేసేటప్పుడు నేను భయంతో ఇబ్బంది పడ్డాను. అది చూసి బాలయ్య నాలో ధైర్యం నింపారు. ఈ సీన్ చేస్తున్నప్పుడు నేను భయపడుతుంటే ‘ఎందుకు భయం?’ అని అడిగారు. ఇది చూశాక మీ ఫ్యాన్స్ నెగిటివ్గా తీసుకుంటారేమో, నాపై విరుచుకుపడతారమో అని ఆయనతో అన్నాను. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘నెగెటివ్గా ఏం తీసుకోరని.. పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది. -
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్.. సెలబ్రెటీల సందడి
-
Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
‘18పేజిస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సర్ధార్ సక్సెస్ మీట్: నాగార్జున అన్న సపోర్ట్ని మర్చిపోలేను: హీరో కార్తీ
‘‘ఖాకీ, ఖైదీ’ చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ‘సర్దార్’తో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. లైలా కీలక పాత్రలో నటించారు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున రిలీజ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున అన్న సపోర్ట్ని మర్చిపోలేను. సినిమా అనేది ఒక సంస్కృతిగా ఉన్న మన దేశంలో ఒక నటుడిగా ఉండటం నా అదృష్టం’’ అన్నారు. ‘‘తెలుగులో ‘సర్దార్’ విడుదల చేసినందుకు గర్వంగా ఉంది. మంచి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లు’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. ఇప్పుడు ‘సర్దార్’కి మరో ఘన విజయం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు పీఎస్ మిత్రన్. రజీషా విజయన్, నటుడు–రచయిత రాకేందుమౌళి మాట్లాడారు. -
'సర్దార్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘కాంతార’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘గాడ్ఫాదర్’ క్లైమాక్స్ని మళ్లీ రీ షూట్ చేశాం: చిరంజీవి
‘‘ఎన్ని సినిమాలు చేసినా ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతే. ఓ సినిమాకు ఎంత డబ్బులు వచ్చాయిన్నది కాదు.. ఎంతమంది చూసి వావ్ అన్నారన్నది కూడా అంతే ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్’ రేంజ్ బ్లాక్బస్టర్ ‘గాడ్ ఫాదర్’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గాడ్ ఫాదర్’ సినిమాకు కొంత మంది దర్శకుల పేర్లు అనుకున్నాం. ఫైనల్గా దర్శకుడు మోహన్ రాజా రావడం నాకు ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఆ తర్వాత సత్యానంద్గారిని ఇన్వాల్వ్ చేశాను. నా ఇన్ఫుట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఓ క్లైమాక్స్ షూట్ చేశాం. ఆ తర్వాత మళ్లీ క్లైమాక్స్ను రీ షూట్ చేశాం. సినిమాను నేను ఓ క్రిటిక్గా చూసినప్పుడు తప్పులు తెలుస్తాయని నా గట్ ఫీలింగ్. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవి కళ్లతో యాక్ట్ చేశారు అని అంటుంటే ఆ క్రెడిట్ టీమ్ అందరిదీ’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ – ‘‘రెండు రోజుల క్రితమే నిశ్శబ్ద విస్ఫోటనంకి మీనింగ్ తెలిసింది నాకు. ఎవడు పడితే వాడు మాటి మాటికి, సరిసాటి రానోళ్లందరూ మాట్లాడుతుంటే ఒక చిరునవ్వుతో ఆయన (చిరంజీవి) ఆ క్షణం ఆ పని అలా జరిగేలా ముందుకు వెళ్తున్నారు చూడండి.. అది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే. 153 సినిమాలకు ఆయన చిరునవ్వే నిదర్శనం’’ అన్నారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు. ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాము’’ అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ– ‘‘ప్రాజెక్ట్లో చిరంజీవిగారు ఇన్ వాల్వ్ అవుతున్నారు అని ఎవరైనా అంటే కొడతాను. ఆయన అనుభవాన్ని ఊపయోగించుకోలేకపోతే మేం ఫూల్స్. ప్రతి సీన్ లోనూ ఆయన ఇన్ పుట్ ఉంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఆయన్ను (చిరంజీవి) అడగకుండా కూడా నేను చెబుతున్నాను. ‘అమ్ముడుపోయారు.. అమ్ముడు పోయారు అంటున్నారు. మద్రాస్లో ప్రసాద్ ల్యాబ్ పక్కన ఉండే కృష్ణా గార్డెన్ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజింగ్ రోజున ఆయన అప్పులు అన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీని అమ్మిన వ్యక్తి ఆయన. ఈ రోజుకీ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పని చేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతుంటారు. ఏదంటే అది రాస్తుంటారు. ఆయన స్పెషల్ పర్సన్ కాబట్టి ఏదంటే అది రాయొచ్చు. అదో హక్కు అయిపోయింది. ప్రజారాజ్యంలో నుంచి పుట్టిన బాధ, ఆవేశమే ఈ రోజు జనసేన. ఆ రోజు చిరంజీవిగారి గురించి ఏం మాట్లాడారో దానికి సమాధానమే జనసేన. సార్.. మీరు సహనంగా, వినయంగా.. దండాలు పెడుతూనే ఉండండి. మేం కాదనం. దయచేసి కొన్ని విషయాల్లో మనం కొంతమందిని వదులుకోవాల్సి ఉంది. సోషల్ మీడియాలో కానీ, మీడియా వ్యక్తులు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేప్పుడు ఒకసారి ఆలోచించండి’’ అన్నారు. రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – ‘‘ఈ సందర్భంగా రామాయణంలోని ఓ సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. చూడామణి, నగలు.. వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు కానీ.. నిజంగా నేను సీతనే చూశాను అని రాముడికి చెప్పి నమ్మించాలంటే మీ ఇద్దరికే తెలిసిన మీ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని నాకు చెబితే ఆ సన్నివేశాన్ని నేను రాముడికి చెబుతా’’ అని సీతతో హనుమంతుడు అంటాడు. అప్పుడు సీత.. ‘‘ఓ రోజు నేను రాముడి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఓ కాకి వచ్చి నా గుండెలమీద పొడుస్తుంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. కానీ నా రక్తపు చుక్క తగిలి రాముడు నిద్రలేచి చూస్తుండే సరికి కాకి మళ్లీ పొడవటానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో ఓ గరికను లాగి ఆ కాకిమీదకు బ్రహ్మాస్త్రంగా వేశాడు’’ అంటూ ఓ సన్నివేశం హనుమంతుడికి చెబుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే... నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే..ఓ వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని గరిక వినయంగా ఒప్పుకుంటే... ఆ గరిక విలువ, రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ పెరగదు... తగ్గదు.. ఆ రాముడి విలువ ఎప్పుడూ అలానే ఉంటుంది’’ అన్నారు. ఎడిటర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు, నటీనటులు కస్తూరి, మురళీ మోహన్, సునీల్, మురళీ శర్మ, డెలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వాతిముత్యం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్ మీట్.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘కృష్ణ వ్రింద విహారి’ చాలా మంచి సినిమా. థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా ఉన్నాం. మా సినిమాకి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇచ్చిన అనీష్ కృష్ణకు థ్యాంక్స్. ‘ఛలో’ తర్వాత నేను గర్వపడే హిట్ ఇచ్చినందు నిర్మాత, మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుత.. ‘‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో కలసి థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దసరా సెలవులు వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. రాధికగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనీష్ ఆర్.కృష్ణ. ఈ కార్యక్రమంలో నటీనటులు హిమజ, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు పాల్గొన్నారు. -
ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు
యంగ్ హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక కార్తీకేయ-2 మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. చదవండి: స్పెయిన్లో జెండా ఎగురవేసిన నయనతార ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ తాను ఆనందంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నాకేప్పుడు కూడా స్టేజ్ మీద ఇంత టెన్షన్ ఉండదు. ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా.. నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఈ సినిమా విజయం సాధించినప్పటికి కార్తీకేయ-2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. చదవండి: రీ-రిలీజ్కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్బస్టర్ చిత్రాలు! ఆ బాధవల్లే నేను ఈ హిట్ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు.. నన్ను భరించినందుకు చందూ మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, వాళ్ల వరకు ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు’ తెలిపింది. ఇక హీరో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తీకేయ-2 ఇంతటి విజయం సాధిస్తుందని మేం ఊహించలేదు. అంతట హౌజ్ఫుల్స్ పడుతున్నాయి. పూర్తిగా మౌత్ టాక్తోనే సినిమా జనాల్లో ఆదరణ దక్కించుకుంటోంది’ అని అన్నాడు. -
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్లలో విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
సినిమాకు మిశ్రమ స్పందన.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్
Karthi Viruman Movie Unit Celebrates Success: కోలీవుడ్ హీరో కార్తీ కథానాయకుడిగా 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించిన చిత్రం 'విరుమాన్'. 'కొంబన్' చిత్రం తరువాత ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ఇది. దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అయిన ఈ చిత్రంలో రాజ్కిరణ్ , ప్రకాష్రాజ్, సూరి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తమిళనాడులో శక్తి ఫిలింస్ సంస్థ విడుదల చేసింది. గత శుక్రవారం (ఆగస్టు 12) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ముఖ్యంగా రాగద్వేషాల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో ప్రదర్శింపబడుతోంది. అయితే టాక్కు అతీతంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 'విరుమాన్' చిత్ర యూనిట్ శనివారం (ఆగస్టు 13) చిత్ర కార్యాలయంలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. చిత్ర కథానాయకుడు కార్తీ, దర్శకుడు ముత్తయ్య, శక్తి ఫిలింస్ శక్తివేల్, చిత్ర సహ నిర్మాత రాజశేఖర్, కర్పూర సుందర పాండియన్ తదితరులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. -
‘బింబిసార’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, చెన్నై: మాయోన్ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్ చెన్నైలో కేక్ కట్ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్కు సీక్వెల్ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet: ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్బస్టర్. 'సమ్మతమే' మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్కు వెళ్లి చూస్తే హౌస్ఫుల్ అయింది.' అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్గా ఉండమని కామెంట్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి -
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్ హాసన్
‘‘మరో చరిత్ర’ సినిమా తర్వాత నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ విషయంలో నేనెప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఉంటాను. ఆ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్లు ఆడింది. సినిమాకి భాష లేదు.. సినిమాది ప్రపంచ భాష. ‘విక్రమ్’ విజయం నాలో మరోసారి గొప్ప ఉత్సాహాన్ని నింపింది’’ అని కమల్హాసన్ అన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ నెల 3న తెలుగులో రిలీజ్ చేశారు. చదవండి: పక్షవాతం బారిన జస్టిన్ బీబర్, వీడియో వదిలిన స్టార్ సింగర్ మూవీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో విక్రమ్ సక్సెస్ మీట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘నితిన్, సుధాకర్ రెడ్డిగారి వల్లే ‘విక్రమ్’ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. రానాకి నేనంటే ఎంత ఇష్టమంటే.. ‘నా సినిమా ఫ్లాప్ అయినా కూడా బావుంది’ అని మెచ్చుకునేవాడు’’అన్నారు. ‘‘విక్రమ్’ ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు లోకేష్ కనగరాజ్. ‘‘విక్రమ్’ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు సుధాకర్ రెడ్డి. ‘‘విక్రమ్’ చిత్రాన్ని ఒకే రోజు తెలుగు, తమిళ భాషల్లో చూశాను’’ అన్నారు రానా. -
విక్రమ్ మూవీ సక్సెస్ మీట్
-
అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్..
Adivi Sesh Major Promise To Those Who Wants To Join In Army: ‘‘ఎమోషనల్గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నిటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ఈ సినిమా చూసిన చాలామంది ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై నేనొక మేజర్ ప్రామిస్ చేస్తున్నాను. సీడీఎస్, ఎన్డీఏలో చేరాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్నవారికి సపోర్ట్ చేయాలని మా టీమ్ నిర్ణయించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ని లాంచ్ చేస్తాం’’ అన్నారు అడివి శేష్. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ‘ఇండియా లవ్స్ మేజర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ– ‘‘సందీప్ రియల్ హీరో అని తెలుసు కానీ ఈ సినిమాకి నన్ను డైరెక్టర్గా చేయమని శేష్ అన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుని, సందీప్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేశాం. శేష్కి స్పెషల్ థాంక్స్. అలాగే రచయిత అబ్బూరి రవిగారి సపోర్ట్ని మర్చిపోలేం’’ అని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి ‘‘మా మొదటి సినిమా ‘మేజర్’ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. అడివి శేష్ మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఇలా యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఇప్పుడు తెరపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. ‘మేజర్’ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు’’ అని నిర్మాతలు శరత్, అనురాగ్ పేర్కొన్నారు. చిత్రకథానాయిక సయీ మంజ్రేకర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు అనీష్ కురువిల్లా ‘మేజర్’ విజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి
Actress Pragathi Emotional Speech In F3 Success Meet: దగ్గుబాటి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్గా నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్లో చిత్రబృందం వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే నటి ప్రగతి వ్యక్తిగత విషయాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే కొన్నిరోజులు బ్రేక్ కూడా తీసుకున్నాను. కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్ అమ్మ పాత్ర వరకు చాలా సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశాను. అవేవీ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర ఎఫ్ 2 రూపంలో ఒక బ్లెస్సింగ్ వచ్చింది. తర్వాత ఎఫ్ 3లో అవకాశంతోపాటు నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది.' అని ఎమోషనల్ అయ్యారు ప్రగతి. చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ -
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. -
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు వస్తున్నారు’’ అని వెంకటేశ్ తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ -
అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు
Mahesh Babu Reaction On Stage Dance In Kurnool Meet: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్ను సర్కారు వారి పాట టీమ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మహేశ్ బాబు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగాలనే కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. 'సభలో స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ ఎక్కి చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు ?' అని అడిగిన ప్రశ్నకు మహేశ్ బాబు.. 'అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్ మొత్తం షాక్, సర్ప్రైజ్లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి మూవీ చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక.. స్టేజ్పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అలా చేసేశా.' అని సమాధానం ఇచ్చారు. కాగా 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. చదవండి: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వేదికపై మహేష్బాబు డ్యాన్స్
-
SVP Success Meet Kurnool: కర్నూలులో ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ
-
‘మా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘బ్యాచ్’. నేహా పటాన్ హీరోయిన్. శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్మీట్లో సాత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి కథలో నటించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’’ అన్నారు. ‘‘సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు శివ. ‘‘మా సినిమాకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు రమేష్. ‘‘ఈ సినిమాను 1000 థియేటర్స్లో విడుదల చేసి రమేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోహీరోయిన్లుగా బాగా చేశారు’’ అన్నారు నటుడు, సంగీతదర్శకుడు రఘు కుంచె. -
రాజమహేంద్రవరంలో ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్
-
బంగార్రాజు సక్సెస్ మీట్.. నానమ్మ, తాతలు గుర్తుకు వచ్చేలా
Bangarraju Movie Success Meet At Annapurna Studios In Hyderabad: బంగార్రాజు సినిమా చూశాక అమల ఇంటికి రాగానే అమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసిందని కింగ్ నాగార్జున తెలిపారు. అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి విజయంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం (జనవరి 15)న బంగార్రాజు చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్మెంట్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 'జనవరి 14 అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. ప్రతి సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని నాన్నాగారు అంటుండేవారు. అలాగే ప్రయత్నిస్తున్నాం. బంగార్రాజుకు ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ నుంచి కలిపి ఒక్క రోజులోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా చూశాకా పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారు. అది పాత్రపరంగా డైరెక్టర్ డిజైన్ చేసిందే. సినిమా చూశాక అమల ఇంటికి రాగానే ఆమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు. వారు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. వారు మా వెనక ఉన్నారనే ఫీలింగ్ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, నాన్నలను గుర్తుచేసుకున్నామని చెప్పారు. ఈ సినిమాకు మరో సీక్వెల్ను ఇప్పుడే ప్లాన్ చేయలేం.' అని నాగార్జున వెల్లడించారు. నాగ చైతన్య మాట్లాడుతూ బంగార్రాజు సినిమాలో చేయడం నాకు సవాల్గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎనర్జిటిక్ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఇందుకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. షూటింగ్లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఒకసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. అని పేర్కొన్నాడు. 'పండుగ సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడం మాకు బగా కలిసివచ్చింది. నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సంగీతం దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు తగిన ట్యూన్స్ ఇచ్చి ఆడియోకు మరింత క్రేజ్ వచ్చేలా చేశాడు.' అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు. కథ ప్రకారం వీఎఫ్ఎక్స్ చేశానన్నారు జునైద్. కథకు కావాల్సిన అన్ని అంశాలను డైరెక్టర్తో చర్చించి చేయడం వల్లే గ్రాఫిక్ విజువల్స్కు మంచి పేరు వచ్చిందన్నారు. ఇదీ చదవండి: బంగార్రాజు మూవీ ఎలా ఉందంటే.. -
తిరుపతిలో గ్రాండ్గా అల్లు అర్జున్ ‘పుష్ప’ సక్సెస్ మీట్..
-
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సక్సెస్ మీట్
-
ఆ ప్రశంసలతో మా కష్టాన్ని మర్చిపోయాం
‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు గురు బాగా తీశారు’’ అన్నారు శ్రీకాంత్. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రధారులుగా జి. మహేష్ నిర్మాణంలో గురు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదే మా కథ’. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా సినిమా సక్సెస్మీట్ను ఎమోషనల్ హిట్ అంటున్నాం. ‘మార్నింగ్ సినిమా చూశాను... ఈవెనింగ్ మా ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లి సినిమా చూపించాను’ అని ఒకరు ఫోన్ చేసి చెప్పారు’’ అన్నారు గురు. ‘‘ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. సినిమా చూసినవారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు జి. మహేశ్. చదవండి: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ -
ప్రపంచంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది
-
హైదరాబాద్లో ‘లవ్ స్టోరీ’ మ్యాజికల్ సక్సెస్ మీట్
-
'వైల్డ్ డాగ్' సక్సెస్ మీట్
-
ఉప్పెన విజయోత్సవంలో సినీ ప్రముఖుల సందడి..
-
జాతి రత్నాలు మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
నాకు వాళ్లతోనే అసలైన పోటీ: రామ్
సాక్షి, బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): గత 15 ఏళ్లగా తాను ఎవరికి పోటీ కాదని.. ఇప్పటినుంచి అభిమానులతోనే తనకు పోటీ అని సినీ హీరో రామ్ అన్నారు. శనివారం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో రెడ్ చిత్రం విజయోత్సవాన్ని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ అభిమానులు తనను అందరించడంలో తనతో పోటీ పడుతున్నారన్నారు. తాను మంచి సినిమాలు చేసి వారికి పోటీ ఇస్తానన్నారు. లాక్డౌన్ తర్వాత వచ్చిన రెడ్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులను మరువలేమన్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో? రిజల్ట్లో కూడా అన్ని ట్విస్ట్లు వచ్చాయన్నారు. ఉదయం షోలో డివైడ్ టాక్ వచ్చిన తమ చిత్రం సాయంత్రానికి హిట్ టాక్ సొంతం చేసుకుందన్నారు. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని.. ప్రేక్షకుల ఆదరణతో కష్టం మొత్తం మరచిపోయామన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక శర్మ, నిర్మాత కృష్ణపోతినేని, దర్శకుడు తిరుమల కిశోర్, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రెడ్ మూవీ రివ్యూ: నిరాశపరిచే రీమేకు ఇది!) -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
-
మరింత బలంగా... మరింత పైపైకి...
దాదాపు పదకొండేళ్ల క్రితం 2009లో ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్ కప్కు ఆతిథ్యమిచ్చింది. సిడ్నీలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 12,717 మాత్రమే! ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ జరిగింది. ఆదివారం జరిగిన ఫైనల్కు ఏకంగా 86,174 మంది హాజరయ్యారు. స్టేడియంలో కూర్చున్న వారి సంఖ్యనే ఇంత ఉంటే టీవీల్లో, ఇంటర్నెట్లో చూసిన వారి గణాంకాలు అయితే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రపంచకప్కు వచ్చిన ఈ భారీ స్పందన చూసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ విజయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిర్వహణ కూడా కీలక పాత్ర పోషించగా... మహిళల క్రికెట్కు మరింత జోష్ తెచ్చేందుకు ఇదే సరైన సమయంగా ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్తో పాటు అన్ని దేశాల్లో మహిళా క్రికెట్ మరింతగా దూసుకుపోవడం ఖాయం. సాక్షి క్రీడా విభాగం: మహిళల క్రికెట్లో గతంలో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహభరిత వాతావరణం ఇప్పుడు వచ్చేసిందంటే ఆశ్చర్యం కాదు. మెల్బోర్న్లో ఫైనల్ ముగిసిన తర్వాత తాము కూడా రాబోయే టోర్నీని ఇదే స్థాయిలో నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ నికెర్క్ ప్రకటించింది. టి20లే కాదు మహిళల వన్డేలకు కూడా ఆదరణ పెరుగుతోందని 2017 వరల్డ్ కప్ చూపించింది. ఈ టోర్నీ తర్వాత వాయు వేగంతో మహిళల క్రికెట్ అందరినీ ఆకర్షించింది. దానికి కొనసాగింపుగానే మెల్బోర్న్లో ఈ భారీ జనసందోహం! సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అయితే వరల్డ్ కప్లకే కాకుండా రెండు మెగా టోర్నీల మధ్యలో కూడా అమ్మాయిల ఆటపై ఆసక్తి సన్నగిల ్లకుండా ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తుండటం విశేషం. గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలతో మహిళల క్రికెట్కు ఊపు తెచ్చే మార్పులు ఇకపై కూడా కొనసాగడం ఖాయం. వచ్చే ఏడాదిలోగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 10 లక్షల మంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చేలా చేయాలనేదే తమ లక్ష్యమని ఐసీసీ ప్రకటించింది. సుదీర్ఘ ప్రణాళికతో... ఏడేళ్ల క్రితం మెల్బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ‘మహిళల యాషెస్’ వన్డే సిరీస్ జరిగితే ఆటగాళ్లు, బంధుమిత్రులు తప్ప ఎవరూ లేరు. కానీ వరల్డ్ కప్ ఆతిథ్య జట్టుగా భారం భుజాన వేసుకున్న తర్వాత ఆసీస్ బోర్డు (సీఏ) చురుగ్గా పని చేసింది. ‘ఫిల్ ద ఎంసీజీ’ ట్యాగ్లైన్తో పప్రంచ వ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టి అందరి దృష్టి టోర్నీపై పడేలా చేసింది. ఆతిథ్య జట్టు ప్రదర్శనే ఎప్పుడైనా ఒక టోర్నీ సక్సెస్కు కొలబద్దలా పని చేస్తుందనేది వాస్తవం. అది 2011 (భారత్), 2015 (ఆస్ట్రేలియా), 2019 (ఇంగ్లండ్) పురుషుల వన్డే వరల్డ్ కప్లు దీనిని చూపించాయి. సొంత జట్టు సాధారణంగా ఉంటే అభిమానుల్లో ఆసక్తిని తీసుకురావడం కష్టం. అందుకే నిర్వాహక దేశంగానే కాకుండా సొంత మహిళల టీమ్పై కూడా సీఏ భారీగా ఖర్చు చేసింది. క్రికెట్ను కెరీర్గా తీసుకునే మహిళలకు ధైర్యం ఇచ్చేందుకు 2016లో ప్రత్యేకంగా 42 లక్షల 30 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 40 లక్షలు) కేటాయించిన క్రికెట్ ఆస్ట్రేలియా తర్వాతి నాలుగేళ్లు సమర్థంగా తమ ప్రణాళికను అమలు చేసింది. అన్ని రకాల ప్రోత్సాహం... మహిళా క్రికెటర్లు ఏ రకమైన అభద్రతాభావానికి గురి కాకూడదని, అప్పుడే కెరీర్ను ఎంచుకుంటారనేది అన్ని క్రికెట్ బోర్డులు, ఐసీసీ గుర్తించాయి. ఒక్కసారిగా అమ్మాయిల ఆటకు పెరిగిన క్రేజ్కు అది కూడా ఒక కారణం. ఈ వరల్డ్ కప్ టోర్నీ విజేతకు ఐసీసీ 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 41 లక్షలు) ప్రైజ్మనీ గా ప్రకటించింది. 2018 వన్డే వరల్డ్కప్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా బోర్డు మరో అడుగు ముందుకేసి తమ జట్టు విజేతగా నిలిస్తే 8,85,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 36 లక్షలు) బహుమతిగా ఇస్తామని చెప్పింది. ఇది దాదాపు పురుషుల జట్టుతో సమానం. న్యూజిలాండ్ అందరికంటే ముందుగా తమ ప్లేయర్లకు ‘ప్రసూతి సెలవులు’ మంజూరు చేయగా, ఆసీస్ కూడా దానిని అనుసరిస్తోంది. ఇప్పుడు ఇంగ్లండ్ బోర్డు కూడా 20 మిలియన్ పౌండ్లు (రూ. 194 కోట్లు) భవిష్యత్తు కోసం పెట్టేందుకు సిద్ధమైంది. అన్నింటికి మించి పురుషుల టోర్నీ జరిగే సమయంలో కాకుండా మహిళలకు విడిగా ప్రపంచకప్ జరగడం పెద్ద మేలు చేసింది. 2018లోనూ ఇలాగే జరిగినా... వెస్టిండీస్ బోర్డు గొప్పగా పని చేయలేదు. కానీ ఈ సారి భారీ చెల్లింపులు, భారీ కవరేజ్, మైదానంలో అత్యుత్తమ సౌకర్యాలు మాత్రమే కాదు... వసతి, ప్రయాణం, అలవెన్స్ల విషయంలో వివక్ష లేకుండా సమానత్వాన్ని పాటించింది. భారత్ కూడా... మన మహిళల క్రికెట్కు సంబంధించి 2017 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరడం మేలిమలుపు. ఆ మెగా టోర్నీ తర్వాతే అందరిలోనూ ఆసక్తి పెరి గింది. జట్టులోని దాదాపు ప్రతీ అమ్మాయి పేరు మారుమోగిపోగా, సగటు అభిమానులు వాళ్లందరినీ గుర్తు పట్టేందుకు కారణమైంది. కాంట్రాక్ట్లతో ప్లేయర్లలో బోర్డు ధైర్యం నింపగా... అగ్రశ్రేణి క్రీడాకారిణులు మైదానం బయట కూడా బ్రాండింగ్లతో సొమ్ము చేసుకుంటున్నారు. బయట బిగ్బాష్ లీగ్, కియా సూపర్ లీగ్ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ వెంటనే 2018లో రెండు జట్లతో ఐపీఎల్ సమయంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగ్గా, గత ఏడాది అది మూడు జట్లకు పెరిగింది. ఇప్పుడు మరో జట్టును అదనంగా చేర్చి నాలుగు టీమ్లతో ఐపీఎల్ తరహా టోర్నీ నిర్వహించబోతున్నారు. తాజా టోర్నీలోనూ ఫైనల్లోనే ఓడినా... మన మహిళలు తమ ప్రదర్శనతో ఇప్పటికే అందరి మనసులు చూరగొన్నారు. ఇకపై షఫాలీ కావచ్చు లేదా పూనమ్ కావచ్చు... వీరంతా ఎక్కడ ఆడినా ఆయా మ్యాచ్లపై ఆసక్తి కచ్చి తంగా పెరుగుతుంది. బీసీసీఐ కూడా దీనికి అనుగుణంగా దేశవాళీ టోర్నీ ల్లో ప్రణాళికలు రూపొందించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుత నిర్వహణ తమ జట్టుతో టైటిల్ అందించడంతో పాటు ప్రపంచ మహిళా క్రికెట్కు కూడా ఎంతో మేలు చేసిందనేది వాస్తవం. ఇదే పునాదిపై రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్ మరింతగా ఎదగడం ఖాయం. -
కర్నూలులో ‘అశ్వథ్థామ’ విజయోత్సవ యాత్ర
-
‘డిస్కో రాజా’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
అల ఆర్కే బీచ్లో..
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో దూసుకుపోతున్న అల వైకుంఠపురంలో చిత్ర బృందం ఆదివారం సాగర తీరంలో సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సభను ఆర్కేబీచ్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే సినిమాలో పాటలకు డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు పాల్గొన్నారు. విశాఖ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి విశాఖ అభివృద్ధిలో చిత్ర పరిశ్రమ పాలుపంచుకోవాలని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చిత్ర ప్రమోషన్స్ మాత్రమే కాకుండా షూటింగ్లు విరివిగా ఇక్కడే జరపాలన్నారు. విశాఖలో ఎటు చూసినా అందాలేనని.. షూటింగ్లకు అనుకూలమన్నారు. స్టూడియోలు నిర్మించి విశాఖకు ఆప్తులుకావాలని పిలుపునిచ్చారు. అభిమానులకు చిరంజీవి ఓ దేవుడైతే.. అరవింద్ పర్యవేక్షకుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చిత్రపటాలను అందజేసి సత్కరించారు. అభిమానుల సాక్షిగా ‘రాములో రాములా’ అల వైకుంఠపురంలో విపరీతంగా ట్రెండ్ అయినా ‘రాములో రాములా’ పాటకు బన్నీ, పూజా హెగ్డే అద్భుతమైన స్టెప్పులు వేసి విశాఖ అభిమానులను అలరించారు. యువకులు గ్యాలరీ లో ఈలలు, చప్పట్లతో మార్మోగేలా చేశారు. అ భిమానులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశారు. సామజవరగమనా అంటూ మెప్పించిన పూజా ‘సామజవరగమనా నిను చూసి ఆగగలనా’ అంటూ పూజా హెగ్డే సాగర తీరాన తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో వావ్ అనిపించింది. అంతకుముందు పూజా తెలుగులో మాట్లాడుతూ విశాఖ వాసులు ఎంతో మంచివాళ్లని కొనియాడారు. సినిమాను ఎంతగానో ప్రేమించే ప్రేక్షకులు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సొంతమన్నారు. బన్నీతో రెండోసారి నటించడం చాలా ఆనందంగా ఉందని, మరిన్ని సినిమాల్లో ఆయన సరసన నటించాలని ఉందన్నారు. అలరించిన థమన్ బృందం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బృందం చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. వారితోపాటు శివమణి 20 నిమిషాలకుపైగా తన డ్రమ్స్ ప్రదర్శనతో అదరహో అనిపించారు. సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పాటకు చేసిన డ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంది. అడుగడుగునా ‘శ్రేయాస్’ లోపం శ్రేయాస్ మీడియా అంటే తెలియనివారుండరు. సౌత్ ఇండియాలో పెద్ద సినిమాల ప్రమోషన్స్ ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఈవెంట్ నిర్వహణలో ప్లానింగ్ లోపం కారణంగా ఎప్పుడు విశాఖలో ఏ సినిమా ఈవెంట్ జరిగినా అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు నరకమే. విశాఖ నిర్వహించే ఈవెంట్లకు పాస్లను ఎక్కువమందికి ఇష్టానుసారంగా ఇవ్వడం.. వచ్చిన వారికి కూర్చోవడానికి కూడా స్థలం లేక ఇబ్బందులు పడడం పరిపాటిగా మారింది. అభిమాన తారలను చూసేందుకు వచ్చిన వారంతా రోడ్డుపై బారులు తీరుతుండడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో సిరిపురంలో నిర్వహించిన ఈవెంట్లో కూడా ఇలాగే జరిగితే నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా శ్రేయాస్ మీడియా తీరు మారలేదు. స్థలం తక్కువగా ఉండి పాస్లను అధిక సంఖ్యలో జారీ చేసి ప్రేక్షకులకు నరకం చూపించారు. నా ప్రతి సినిమాకు వైజాగ్తో సంబంధం: అర్జున్ హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాల్లో వైజాగ్కు ఏదో ఒక సంబంధం ఉండి తీరుతుందన్నారు. మంచి సినిమా తీస్తే ఎంతలా ఆదరిస్తారో ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్నారు. థమన్ మ్యూజిక్ ఈ సినిమా విజయంతో కీలక పాత్ర ప్రోషించిందన్నారు. ఇన్ని సినిమాలు చేసి విజయం సాధించినా.. ఎవరూ నా నటన బాగుందని ఫోన్ చేసి చెప్పలేదు. కానీ ఈ సినిమాకు ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి నటన బాగుందని చెబుతున్నారనంటే దానికి కారణం త్రివిక్రమ్ అన్నారు. ఆయన వల్లే ఇండస్ట్రీ హిట్ సాధించామన్నారు. ఎవరికైనా అభిమానులు ఉంటారు కానీ తనకు మాత్రం ఆర్మీ ఉంది అన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఉత్సవ నగరం విశాఖ: త్రివిక్రమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశ్రీ, చలం, సీతారామశాస్త్రి లాంటి ఎంతో గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన ఘనత విశాఖదే అన్నారు. విశాఖ ఎప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సవంగా ఉంటుందని కొనియాడారు. విశాఖ ప్రజలు కూడా అలానే ఉంటారన్నారు. విశాఖలో సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బన్ని కనిపించలేదని కేవలం బంటు మాత్రమే కనిపించేలా నటించి ఈ చిత్ర విజయానికి కారణమయ్యారన్నారు. -
అభిమానుల కోసం టాప్ ఎక్కిన బన్నీ..
వైజాగ్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు వైజాగ్లో ఘనస్వాగతం లభించింది. తన తాజా చిత్రం అల.. వైకుంఠపురములో... సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం చిత్రబృందంతో కలిసి బన్నీ ఆదివారం వైజాగ్కు వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్లో ఆ ఈవెంట్ జరగనుంది. ఇందు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే వైజాగ్ చేరుకున్న బన్నీకి అభిమానలు ఘనస్వాగతం పలికారు. అలాగే భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం బన్నీ కారుపైకి ఎక్కారు. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. అల్లు అర్జున్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా సక్సెస్ ఈవెంట్ కోసం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. కాగా, జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నేడు వైజాగ్లో, జనవరి 24న తిరుపతిలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
మహేశ్బాబుకు జన నీరాజనం..
సాక్షి, హన్మకొండ: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన “సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సూపర్స్టార్ మహేష్బాబు, హీరోయిన్ రష్మిక, లేడీ అమితాబ్ విజయశాంతి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటులు రాజేంద్రప్రసాద్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మూడు గంటల పాటు సాగిన వేడుకల్లో సత్య బృందం నృత్యాలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమకూర్చిన పాటలతో గాయకులు అభిమానులను ఉర్రూతలూగించారు. అందరికీ ధన్యవాదాలు తనపై అభిమాన వర్ష కురిపించిన ప్రతి ఒక్కరికి హీరో మహేష్బాబు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అన్ని సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం సంతోషకర విషయం అన్నారు. అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కా బాప్గా సినిమాను ఆదరించిన అభిమాన దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్లో కూడా మంచి సందేశాత్మకమైన చిత్రాలే కాకుండా అభిమానులకు నచ్చే విధంగా తీస్తానని హీరో అన్నారు. మంచిగున్నారా... హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘హలో వరంగల్.. మంచిగున్నారా’ అంటూనే సినిమాలోని అర్థమవుతుందా అనే డైలాగ్ను చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభకు వేలాదిగా అభిమానులు హాజరుకాగా జేఎన్ఎస్ కిక్కిరిసిపోయింది. సినీ పరిశ్రమను వరంగల్ కు గుంజుకురండి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ‘సినిమాలు అనగానే విజయవాడ, వైజాగ్కు వెళ్తున్నారు.. అలా కాకుండా సిని పరిశ్రమను వరంగల్ అడ్డాగా గుంజుకురావాలి’ అని సినీ ప్రముఖులను ఉద్దేశించి కోరారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తన వంతుగా సహకరిస్తానని అన్నారు. కాగా నిర్మాత దిల్ రాజు తన ప్రసంగంలో సినీ పరిశ్రమను వరంగల్కు గుంజుకురావడం కష్టమైనదేనని చెప్పారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, నగర పోలీసు కమిషనర్ వి.రవీందర్, గ్రేటర్ మేయర్ గుండా ప్రకాశ్రావుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, సభ అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు పర్వతగిరిలో మంత్రి దయాకర్రావు స్వగృహానికి వెళ్లారు. చదవండి: నెవ్వర్ బిఫోర్ సంక్రాంతి -
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్
-
‘మాకు డైరెక్టర్ను కొట్టాలనిపించేది!’
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఒకే సినిమాతో అరంగేట్రం చేసి దిగ్విజయాన్ని అందుకున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రోటీన్ చిత్రాల మత్తు వదిలిస్తోంది. విడుదలైన రోజు నుంచి హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్తో పాటు రాజమౌళి కుటంబం ఈ సినిమా సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక మూవీ సక్సెస్ మీట్లో భాగంగా శ్రీసింహా, సత్య, అగస్త్యలను రాజమౌళి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రోమోలో భాగంగా సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో పేర్కొంటూ అదేవిధంగా చిత్ర షూటింగ్లో ఆ ముగ్గురు ఎదుర్కొన్న కష్టాలు, బాధలను రాజమౌళితో పంచుకున్నారు. పూర్తి వీడియోను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రితేష్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. నరేశ్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, తదితరులు నటించారు. చదవండి: ‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ జనవరి 3న వస్తున్న ‘యమదొంగ’! -
‘వెంకీమామ’ సక్సెస్ మీట్
-
‘మిస్ మ్యాచ్’ సక్సెస్ మీట్
-
ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు
సందీప్ మాధవ్ టైటిల్ రోల్లో జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భ ంగా దర్శకుడు జీవన్ రెడ్డి, కెమెరామేన్ సుధాకర్ రెడ్డి యక్కంటి మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘జార్జ్ రెడ్డి’ కథను సినిమాగా తీయాలనుకున్నప్పుడు చాలా పరిశోధన చేశాం. జార్జ్ రెడ్డి గురించి తెలిసిన వాళ్లను కలిశాం. వాళ్ల దగ్గర నుంచి వివరాలు సేకరించాం. ఆ సేకరించిన వివరాలు చదవడానికే నాకూ, కెమెరామేన్ సుధాకర్ అన్నకు కొన్ని నెలలు పట్టింది. జార్జ్ రెడ్డి లైఫ్ జర్నీనే స్క్రీన్ప్లేగా చూపించాలనుకున్నాను. ఆయన గురించి చెప్పాలంటే 10–12 గంటల సినిమా తీయాలి. రెండున్నర గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినదాంతో సుమారు 120 బయోపిక్స్ తీయొచ్చు అనిపించింది. జార్జ్ రెడ్డి సిద్ధాంతాలు ఏంటి? ఆయన ఎమోషన్స్ ఏంటి? జార్జ్ రెడ్డి నిజాయితీ, తన ఫైటింగ్ స్పిరిట్ ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. ఇప్పటి తరం వాళ్లు కూడా అవసరమైనప్పుడు తమ గొంతుని వినిపించాలి. ఈ సినిమా ఎవర్నీ కించపరచకూడదనుకున్నాం. కథకు తగ్గట్టుగానే కొన్ని కమర్షియల్ హంగులు జోడించాం. ఉస్మానియా యూనివర్శిటీలో చాలా కథలున్నాయి. వాటిని సినిమాలుగా తీస్తాను’’ అన్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తెలుగు సినిమా హీరోల కన్నా పెద్ద హీరో జార్జ్ రెడ్డి. ఈ సినిమాను యువత అందరూ చూడాలి. ‘రైజ్ యువర్ వాయిస్’ అనేది జార్జ్ రెడ్డిగారి నినాదం. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పే ధైర్యం కావాలి. అలాంటి లక్షణం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఆ స్ఫూర్తిని యూత్కి చెప్పాలనుకున్నాం’’ అన్నారు. -
వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమైన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్స్గా నటించారు. హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సక్సెస్ మీట్లో హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చాలా సంవత్సరాలుగా దర్శకత్వం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. వయసు కాదు.. ప్రతిభే ముఖ్యం అని నమ్మిన కోటేశ్వరరావుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే మీడియా రంగంలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి. ‘‘మాకు ఎంతో సహకారం అందించిన మైత్రీ మూవీస్ రవిగారు, నిర్మాత అనిల్ సుంకరగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు అనురాగ్ కొణిదెన. లిరిసిస్ట్ తిరుపతి జవాన్, హీరోయిన్ శ్వేతా అవస్తి మాట్లాడారు. -
సైరా సక్సెస్ మీట్
-
ఘనంగా గద్దల కొండ గణేష్ విజయోత్సవ సభ
-
‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
-
‘గద్దలకొండ గణేష్’ సక్సెస్ మీట్
-
సక్సెస్ సందడి
సాక్షి, ఒంగోలు మెట్రో: స్థానిక రవి ప్రియా మాల్లో ‘గుణ 369’ చిత్ర బృందం బుధవారం సాయంత్రం సందడి చేసింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ సినిమా విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, సినిమా షూటింగ్ దాదాపుగా ఒంగోలులోనే చేయటం శుభపరిణామమన్నారు. తర్వాత చిత్రం సొంత బ్యానర్లోనే తీస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సినిమా దర్శకుడు అర్జున్ జంధ్యాల, కమెడియన్ మహేష్, చిత్ర యూనిట్ పాల్గొనగా, మాల్ చైర్మన్ కంది రవి శంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సాయినాథ్, మాల్ డైరెక్టర్ కె. విష్ణువర్ధన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.