Balagam Movie
-
బలగం సింగర్ మొగిలయ్య మృతి
-
జానపద కళాకారుడు 'బలగం మెగిలయ్య' మృతి
'బలగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయిన 'మొగిలయ్య' అనారోగ్యంతో మరణించారు. బలగం సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. దీంతో ఆయన్ను అందరూ బలగం మెగిలయ్యగా చెరగని ముద్ర వేశారు. తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు మొగిలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీకి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వరంగల్లోని ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.తన గాత్రంతో కళకు ప్రాణం పోసి, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన గాయకుడు మొగిలయ్య. అలా బలగం సినిమాలో చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుంటూ మొగిలయ్య, కొమురమ్మ కలిసి పాడిన 'తోడుగా మా తోడుండి.. నీడలా మాతో నడిచి' అనే సాంగ్ ఆ చిత్రానికే ప్రధానంగా నిలిచింది. ఈ పాట సమయంలో ప్రక్షకులు కూడా చాలా భావోద్వేగానికి గురికావడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కనిపించాయి. అయితే, ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మరణించడంతో చాలామందిని కలిచివేస్తుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథలనే తమ జీవనాధారంగా మార్చుకున్నారు. కరీంనగర్, గోదావరిఖని,సిరిసిల్ల తదితర జిల్లాలలో బుర్రకథలు చెబుతూ వచ్చిన కొద్ది ఆదాయంతోనే బతుకు పోరాటం సాగించారు. ఆయనకు ఒక కుమారుడు సుదర్శన్ ఉన్నారు. అతను స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. మొగిలయ్య టాలెంట్ను గుర్తించిన 'బలగం' చిత్ర దర్శకుడు వేణు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా ఆయనకు ‘భీమ్లా నాయక్’లో కూడా ఒక జానపదం గీతం పాడే అవకాశం వచ్చింది.కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మొగిలయ్య వరంగలోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మరణించారు. గతంలో ఆయనకు మెరుగైన వ్యైద్య సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం అందించింది. చిరంజీవితో పాటు నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ వేణు యెల్దండి వంటి వారు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆర్థిక సాయం అందించారు. కానీ, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా నిర్మాత దిల్ రాజు, వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. -
బలగం బ్యూటీ.. చాలా హాట్ గురూ!
-
శారీలో బలగం హీరోయిన్.. ఈ స్టిల్స్ చూశారా?
-
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?
69వ ఫిల్మ్ ఫేర్ -2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబి చిత్రాల్నే దాదాపు అవార్డులన్నీ వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)69వ ఫిల్మ్ ఫేర్ తెలుగు-2024 అవార్డ్ విజేతల జాబితాఉత్తమ సినిమా - బలగంఉత్తమ నటుడు - నాని (దసరా)ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (దసరా)ఉత్తమ దర్శకుడు - వేణు (బలగం)ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (బేబి)ఉత్తమ నటి (క్రిటిక్స్) - వైష్ణవి చైతన్య (బేబి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నవీని పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటుడు - రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటి - రూపలక్ష్మి (బలగం)ఉత్తమ గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)ఉత్తమ గాయని - శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)ఉత్తమ సాహిత్య - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)ఉత్తమ సంగీతం - విజయ్ బుల్గానిన్ (బేబి)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - సత్యన్ సూరన్ (దసరా)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాష్ (దసరా)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా) -
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
ఈ దశాబ్దంలో నా ఫేవరేట్ మూవీ అదే: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్గా ఈవెంట్కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్లో ఒక మైల్స్టోన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. Grandfather time lo #SrNTR Inspiration,Nanna time lo #Chiranjeevi Inspiration,Aa tarwtha #RaviTeja Inspiration.Ma generation ki @NameisNani Inspiration.#Nani Anna, A Genuine Person❤️.Can’t wait for #SaripodhaaSanivaaram @DVVMovies #VivekAthreya pic.twitter.com/PPf7HhxjEP— Saikumar Devendla (@saidevendla) July 16, 2024#Nani About #Balagam and #Darling Film 💥💥💥💥pic.twitter.com/fH1HSAhYrG— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా?
హీరో నాని సినిమా ప్లానింగ్ గురించి అందరికి తెలిసిందే. చేతిలో ఒక్క సినిమా ఉండగానే..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసుకుంటాడు. అందుకే హిట్, ఫ్లాప్ తేడా లేకుండా ఈ నేచురల్ స్టార్ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి. గతేడాది డిసెంబర్లో ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను పలకరించిన నాని..ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను)ఈ చిత్రం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయాల్సింది. అందులో ఒకటి బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కాలి. నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్తో వేణు ఓ కథను కూడా రెడీ చేశాడట. ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. (చదవండి: రిలీజ్కు ముందే కల్కి మరో రికార్డు.. )కానీ ఇప్పుడు ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నానినే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. బలగం వేణు చెప్పిన కథకు, శ్రీకాంత్ ఓదెల చెప్పిక కథల మధ్య సారూప్యత ఉండడంతో..నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సాహో ఫేం సుజిత్ సినిమాను కూడా నాని రిజెక్ట్ చేశాడు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో నాని-వేణు కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. -
'బలగం' మొగిలయ్యకు అస్వస్థత.. సాయం కోసం ఎదురుచూపు
టాలీవుడ్లో సంచలన హిట్గా నిలిచిన చిత్రం 'బలగం'. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత పాటను ఆలపించిన జానపద కళాకారుడు మొగిలయ్యను అందరూ అభినందించారు.ప్రజలను కన్నీళ్లు పెట్టించిన ఈ పాటను బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాడారు. అయితే, మొగిలయ్య మరోసారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు 67 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బుందుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపిన మొగిలయ్య సతీమణి సాయం కోసం ఎదురుచూస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కొమురమ్మ వేడుకుంది. -
బలగం సినిమాతోనే గుర్తింపు: సంజయ్కృష్ణ
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు. -
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్రామ్ స్మైల్కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్ రాజు' సాయం
అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్కు దిల్ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్ రాజుతో పాటు బలగం డైరెక్టర్ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. #DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️ The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu pic.twitter.com/gVNabIzGNK — Dil Raju Productions (@DilRajuProdctns) February 3, 2024 -
Rewind 2023: బడ్జెట్తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచిన స్మాల్ మూవీస్పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్టాక్తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
బలగం-2 లో హీరో నాని..!
-
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు
సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి. ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. (చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు) ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?) మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మిస్టర్ ఫ్రెంగ్నెంట్.. సుహాన్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలు కూడా డీసెంట్ హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. -
రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు
టాలీవుడ్లో గుర్తుండిపోయే సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటివరకు కమెడియన్ గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఈ ఏడాది 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోస్ కూడా చేశారు. ఇక 'బలగం' తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో యాక్ట్ చేసిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Venu Yeldandi (@venuyeldandi9) -
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
‘బలగం’ మూవీ.. సర్పంచ్కు కన్నీటి వీడ్కోలు..!
కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్గా నటించి అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్ లావణ్య–శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టాలీవుడ్లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం బలగం. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కాగా.. ఈ సూపర్ హిట్ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) అయితే ఈ చిత్రంలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నర్సింగం తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్రబృందం సభ్యులు ఆయనకు సంతాపం ప్రకటించారు. వేణు ట్వీట్లో రాస్తూ..' నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం.' అంటూ బలగం సినిమా రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ‘బలగం’ తర్వాత యష్తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు ) నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏 మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏 బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023 -
ప్రతి రైతు మనుసును కదిలిస్తున్న 'నాగలి' చిత్రం.. యూట్యూబ్లో విడుదల
నిజ జీవిత విలువల నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పలుకుతుంటారు. రైతన్న కష్టసుఖాలను తెరపై ఆవిష్కరించే సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇదే బాటలో ఇప్పుడు 'నాగలి' అనే ఒక లఘు చిత్రాన్ని డాక్టర్ విశ్వామిత్ర రెడ్డి, మానస (USA) సమర్పణలో సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా యూట్యూబ్లో విడుదలైన 'నాగలి' అనే 24 నిమిషాల లఘు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బలగం ఫేమ్ అరుసం మధుసుదన్ కీలక పాత్రలో నటించారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా ధరఖాస్తు చేసుకోండి: విజయ్) నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం ప్రతి ఏడాది భారత్లో సుమారు 15 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడూ పలు మార్లు వ్యాఖ్యానించింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటాయి.. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరిదీ కూడా రైతు నేపథ్యం కాబట్టి. అలాంటి రైతుల ఘోషను గుర్తించిన సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ వంతుగా ఇలాగైనా రైతుల ఆత్మహత్యలు ఆగాలనే ఆకాంక్షతో 24 నిమిషాల నిడివితో 'నాగలి' అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మొదట తన ప్రేమను ప్రియురాలు కాదని చెప్పడంతో ఒక యువకుడు పొలం గట్టుపైనే పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు నటుడు మధు అక్కడ ప్రత్యక్షం అయి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.. ఈ సీన్ రెగ్యూలర్ సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. నీతో పాటు పురుగుల మందు తాగి చనిపోయేందుకు ఒక పెద్దాయన కూడా ఇక్కడికి వస్తున్నాడని ఆ యువకుడితో చెప్తాడు. అది నీకు ఎలా తెలుసని ఆ యువకుడు ప్రశ్నిస్తాడు. ఈలోపు ఆ పెద్దాయన నిజంగానే వస్తాడు. వారిద్దరూ చనిపోబోతున్నట్లు ముందే అతను ఎలా గ్రహించాడు...? ఒకరైతు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు..? ఆ యువకుడిని కాదన్న యువతి ఎవరు..? వారితో పాటు ఉన్న తీరని కష్టాలు ఏంటి..? తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్రతి గ్రామంలో ఉండే యువకుల్లో కొందరైనా ఇలా ఆలోచిస్తే తమ చుట్టూ ఉన్న రైతులను కాపాడుకోవచ్చని దర్శకుడు జానా రాజ్కుమార్ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరూ చూసేయండి. -
రాయలసీమ నేపథ్యంలో...
రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని సోమవారం విడుదల చేశారు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం ‘సగిలేటి కథ’’ అన్నారు. ‘‘సగిలేటి కథ’ అనే నవల నా సినిమాకి ప్రేరణ మాత్రమే.. కథ పూర్తిగా ఒరిజినల్గా ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్ . ‘‘కేరాఫ్ కంచరపాలెం, బలగం’ వంటి చిత్రాల కోవలోనే ‘సగిలేటి కథ’ కూడా ఉంటుంది’’ అన్నారు సమర్పకుడు నవదీప్. -
‘బలగం’ తర్వాత యష్తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు
'ఆకాశం దాటి వస్తావా’ మంచి మ్యూజికల్ మూవీ. కొత్త ప్రతిభని పరిచయం చేయాలనే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో శశి, యష్లతో ఈ యూత్ఫుల్ సినిమా చేస్తున్నాం' అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీక మురళీధరన్ హీరోయిన్. ‘దిల్’ రాజుప్రొడక్షన్ బ్యానర్లో ‘బలగం’ తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, పోస్టర్ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– 'నా సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తానని యష్తో అన్నాను. కానీ లుక్ పరంగా బాగున్నాడు. అందుకే హీరోగా పరిచయం చేస్తున్నాం. సింగర్ కార్తీక్ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు' అన్నారు. 'జీవితంలో అన్ని బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఇదే ΄పాయింట్తో ఈ సినిమా కథ సాగుతుంది' అన్నారు శశి కుమార్ ముతులూరి. 'నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శశి, హర్షిత్, హన్షితగార్లకు థ్యాంక్స్' అన్నారు యష్. -
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
Balagam Actors Images: 'బలగం'కు 100 అవార్డులు.. విశ్వ విజయ శతకం వేడుకలు (ఫోటోలు)
-
కొత్త ఊపిరి వచ్చినట్లుంది
‘‘వంద కోట్ల రూపాయల పోస్టర్స్, వంద రోజుల ఫంక్షన్స్ చూశాను. కానీ తొలిసారి వంద అవార్డుల ఫంక్షన్ను ‘బలగం’తో చూస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడులైంది. ‘బలగం’కు ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా విశ్వ విజయ శతకం ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మా పిల్లలు హన్షిత, హర్షిత్ నిర్మించిన తొలి సినిమానే వంద అంతర్జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయం. పెద్ద బడ్జెట్తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ ‘బలగం’ చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఇటీవల హిట్టయిన ‘సామజ వరగమన’, ‘బేబీ’ వంటి చిత్రాలతో చిన్న, ఫ్యామిలీ చిత్రాలు ఆడతాయనే నమ్మకం మళ్లీ వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్లయింది’’ అన్నారు. ‘‘బలగం’ తెలంగాణ సినిమాగా ప్రచారమైంది. కానీ తెలుగు సినిమా’’ అన్నారు వేణు. ‘‘నేను, అన్న నిర్మించిన తొలి చిత్రానికి వంద అంతర్జాతీయ అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు హన్షిత. -
'బలగం' హీరోయిన్కి అవమానం!
Kavya Kalyan Ram Body Shaming: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ బయటకు సంతోషంగానే కనిపిస్తుంటారు. కానీ వాళ్లలో కొందరు సినిమా ఛాన్సుల కోసం చాలా కష్టపడుంటారు. అయితే వాటి గురించి పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కెరీర్ సక్సెస్ లో ఉన్నప్పుడు అసలు చెప్పరు. కానీ 'బలగం' హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ మాత్రం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!) బాలనటిగా చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్లోకి వచ్చిన కావ్య కల్యాణ్ రామ్ది ఖమ్మం. 'గంగోత్రి' మూవీలో వల్లంగి పిట్టగా నటించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవిరాముడు తదితర చిత్రాలతో పేరు సంపాదించింది. పెరిగిన పెద్దయిన తర్వాత 'మసూద'లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. 'బలగం'తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. 'మసూద'తో హీరోయిన్గా ఈమె నటించిన 'ఉస్తాద్' రిలీజ్కు రెడీగా ఉంది. ఈ ప్రమోషన్స్లో మాట్లాడిన కావ్య.. 'కెరీర్ మొదట్లో ఓ ఆడిషన్ కి వెళ్తే దర్శకనిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీరు లావుగా ఉన్నారు. ఇలా ఉంటే ఛాన్సులు రావు, సన్నగా అవ్వండి అని హేళన చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) (ఇదీ చదవండి: రూల్స్ బ్రేక్ చేసిన హీరో విజయ్.. పోలీసులు సీరియస్) -
బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!
చిన్న సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన చిత్రం బలగం. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని తెరపై ఆవిష్కరించిన వేణుపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందటే.. ఏకంగా పల్లెల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. అంతలా ఆడియన్స్కు కనెక్ట్ అయింది. వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. (ఇది చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?) ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై వందకుపైగా అవార్డులు సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ సాధించింది. పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్లో వివిధ విభాగాల్లో బలగం సినిమాకు అవార్డులు దక్కాయి. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. గతంలో ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. కానిస్టేబుల్, గ్రూప్-4 పరీక్షల్లో ప్రశ్నలు అంతే కాకుండా గతంలో తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఇటీవలే జరిగిన గ్రూప్-4 పరీక్షలో సైతం బలగం సినిమా ప్రశ్నను అడిగారు. తెలంగాణలో పల్లెపల్లెలో బలగం సినిమాకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. అలాగే మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. (ఇది చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్లో అభిమానులు!) A journey of Excellence and Recognition! ❤️ Earlier, we had Films running for 100 days.. Films running in 100 centers.. Films collecting 100 crores .. Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗#balagam pic.twitter.com/26yfgS8sse — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023 -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి. -
ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటున్న బలగం మొగిలయ్య..
-
ఆర్థిక ఇబ్బందులు.. ‘బలగం’ మొగిలయ్యకు ‘దళితబంధు’
దుగ్గొండి (వరంగల్): ‘బలగం’సినిమా లో పాడిన పాటతో అందరి దృష్టినీ ఆకర్షించిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులకు దళితబంధు పథకం మంజూరైంది. మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్పై ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన కుటుంబాన్ని ఆదుకుని చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి దళితబంధును మంజూరు చేయించారు. ఈ మేరకు మొగిలయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం దళితబంధు మంజూరు పత్రాలు అందించారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ మొగిలి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. (గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలు: ఈ పాపమెవరిది? పేదలే సమిధలు) -
‘బలగం’వేణుకి బంపరాఫర్.. బాలయ్యతో సినిమా!
తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో వేణు యెల్డండి ఒకరు. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు.. దర్శకుడిగా మారి ‘బలగం’ అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు.. పలు అంతర్జాతీయ అవార్డులను సాధించింది. వేణు దర్శకత్వ ప్రతిభపై మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ప్రశంసల జల్లు కురిపించారు. వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో ప్రజలంతా కలిసి ఎల్ఈడీ తెరపై ఈ సినిమా వీక్షించారంటే.. బలగం ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఇప్పటి వరకు బలగం సక్సెస్ని ఎంజాయ్ చేసిన వేణు.. ఇప్పుడిక తన తదుపరి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాడు. తనకు డైరెక్టర్గా చాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు వేణు. దిల్ రాజు కూడా ఇదే మాట చెప్పారు. అయితే తర్వాతి సినిమా ఏ హీరోతో తీస్తారనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వేణు తర్వాతి చిత్రంపై క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) వేణు తన రెండో సినిమాను ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్యకు వేణు కథ చెప్పాడట. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే రూమర్ కనుక నిజమైతే.. బలగం వేణుకి బంపరాఫర్ దక్కినట్లే అని నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది వేణు స్పందిస్తేనే తెలుస్తుంది. ఇక బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు కూడా బాలయ్యకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలు అందించిన బోయపాటి కూడా త్వరలోనే మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్
బలగం సినిమానా? మజాకా? కానిస్టేబుల్ పరీక్షలో బలగం చిత్రానికి సంబంధించిన ప్రశ్న వచ్చిందంటే ఈ మూవీ ఏ రేంజ్లో ఆదరణ పొందిందో అర్థమవుతోంది. ఏప్రిల్ 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో బలగం సినిమాకు వచ్చిన అవార్డుపై ఓ ప్రశ్న అడిగారు. మార్చి 2023లో ఒనికో ఫిలింస్ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది? అని అడిగారు. ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి 1. ఉత్తమ డాక్యుమెంటరీ, 2. ఉత్తమ నాటకం, 3. ఉత్తమ దర్శకుడు, 4. ఉత్తమ సంభాషణ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో 2. ఉత్తమ నాటకం సరైన సమాధానం. ఈ సినిమా ఒక్క ఒనికో ఫిలిం అవార్డు మాత్రమే ఏంటి లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు అందుకుని సత్తా చాటింది. తాజాగా కానిస్టేబుల్ పరీక్షలో బలగంపై ప్రశ్న రావడంపై దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'నిన్న నా స్నేహితుడొకరు ఈ ఫోటో పంపారు. చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. నా కలను నిజం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ చేతులెత్తి నమస్కరించిన ఎమోజీలను జత చేశాడు. Good morning all .. Friend sent me ds pic yesterday,I am very happy and proud. I thank all the Telugu audience. Who made my dreams come true🙏🙏 #balagam @dilrajuprodctns @acharya_venu @BRSHarish @KTRBRS @telangana_folks_ @TelanganaCMO @TelanganaToday pic.twitter.com/IMYrNt2afO — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 1, 2023 చదవండి: రూ.7 లక్షలు రావాల్సి ఉంది, చైతన్య మాస్టర్కు పేమెంట్ ఆపేశారు కానిస్టేబుల్ పరీక్షలో బలగంపై ప్రశ్న -
కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ') అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి) -
సెంటిమెంట్ తో ఏజెంట్ మూవీ బ్లాక్బస్టర్ హిట్!
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
నీ మొహానికి హీరోయిన్ అవుతావా?.. అని ఎగతాళి చేశారు!
బలగం సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పల్లె సెంటిమెంట్ను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు వేణు యెల్దండిని ఓ రేంజ్కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటీనటులకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేని పాత్ర ఒకటుంది. ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. బలగం సినిమాలో ఆ సీన్ మీకు గుర్తుందా? 'అదేనండి ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి థమ్స్ అప్ బాటిల్ తెచ్చి ఇవ్వడం.. ఆ తర్వాత ప్రియదర్శి సిగ్గుపడడం.. అది చూసి ముసలావిడ ముఖం తిప్పుకోవడం' ఆ సీన్లో బొద్దుగా కనిపించిన అమ్మాయి గురించి మీకు తెలుసా? ఇంతవరకు ఒక్క సినిమా చేయకుండానే అద్భుతంగా నటించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా తన ఎక్స్ప్రెషన్స్తో అదరగొట్టింది. ఆ అమ్మాయి పేరే సౌదామిని. ఆర్టిస్ట్ కావాలన్న కోరికతో టాలీవుడ్లో తొలి అవకాశం అందుకున్న సౌదామిని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (చదవండి: Hollywood Actor: సింగర్లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!) సౌదామిని మాట్లాడుతూ.. ' వేణు సర్ ఆఫీసుకు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు. వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగా. కేకులు తినేసి బరువు పెరిగాను. నాకు ఫన్ జోనర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు భయం. అన్నయ్యను తీసుకెళ్లేవాణ్ని. కొందరు నన్ను చూసి నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాళ్లు. నేను ఈ స్థాయికి రావడానికి వేణు సర్ కారణం. వేణు సర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. బలగం సినిమా తర్వాత జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. వేణు సర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. తెలుగులో అల్లు అర్జున్, చిరంజీవి నా ఫేవరేట్.' అని చెప్పారు. (చదవండి: Pooja Hegde: బుట్టబొమ్మను వదలని ఫ్లాపులు.. ఆ సినిమాతోనైనా మారేనా!) -
తాగుడుకు బానిసయ్యా.. అసలు ఈ బతుకు ఎందుకు అనుకున్నా?: కమెడియన్
తనదైన బాడీ లాంగ్వేజీతో, తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ నవ్వించగల వ్యక్తి కర్తానందం. జబర్దస్త్ స్టేజీపై కమెడియన్గా సత్తా చాటిన ఆయన వెండితెరపై కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాల్లో నటించి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'మాది సూర్యాపేట. ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నా. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మా ఐదుగురిని అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పోషించింది. తను ఇప్పుడు లేదు, కానీ తన గురించి తలుచుకుంటే కన్నీళ్లాగవు. నేను చిన్నతనం నుంచే నాటకాలు వేసేవాడిని. చదువుకునే వయసులోనే జలగం వెంగళ్రావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో కూలీ పనులు చేశాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఈ పరిస్థితుల్లో తాగుడుకు బానిసయ్యాను. ఏ పని చేసినా కలిసిరాలేదు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగాను. ఎందుకు ఈ బతుకు? అనిపించింది. కానీ ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. సాయం కోసం మా ఫ్రెండ్స్ను ఆశ్రయించాను. అప్పుడు పోలీస్ శాఖ ప్రతి జిల్లాకు కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది. వారు నన్ను ఆ కళాబృందానికి హోంగార్డుగా పనిచేయమన్నారు. 22 సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి కొంతకాలం క్రితమే రిటైరయ్యాను. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన బోలెడన్ని సినిమాల్లో నటించాను. చాకలి ఐలమ్మ సినిమాలో జబర్దస్త్ రాజమౌళితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా వేణు టీమ్లో చేరాను. దాదాపు 200 ఎపిసోడ్లు చేశాను. నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన వేణు బలగం సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. ఆయన నా దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటూ కంటతడి పెట్టుకున్నాడు కర్తానందం. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాకి’!
సాధారణంగా కొన్ని సినిమాల్లో జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు. ముఖ్యంగా పెంపుడు కుక్క, గుర్రం, ఏనుగు లాంటి జంతువులను బేస్ చేసుకొని సినిమాలను తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అంతేకాదు హీరో కంటే ఆ జంతువులకు సంబంధించిన సన్నివేశాలే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శకుల కన్ను కాకులపై పడింది. కాకులను బేస్ చేసుకొని సన్నివేశాలను రాసుకుంటున్నారు. అవి ప్రేక్షలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాకి కాన్సెప్ట్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కాకి కాన్సెప్ట్ అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చె సినిమా ‘బలగం’. ఓ మనిషి తదానానంతరం కాకి పిండం ముట్టడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. కథంతా కాకి చుట్టే తిరుగుతుంది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇక రీసెంట్గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’చిత్రంలోనూ కాకికి ఇంపార్టెంట్ రోల్ లభించింది. క్షుద్రపూజల నేపథ్యంలో మిస్టరీ,థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి కాకిని చాలా సన్నివేశాల్లో వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం అనేది సినిమాకి హైలెట్గా నిలిచింది. అలాగే ఇటీవల విడుదలైన నాని తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’లోనూ కాకిని వాడేశారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్కి కాకి సెంటిమెంట్గా మారిపోయింది. మరి ఈ కాకుల కాన్సెప్ట్తో ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. (చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే) -
చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం, 15 ఏళ్లకే పెళ్లి: బలగం నటి
ఒకప్పుడు సినిమాలు యాభై రోజులు, వంద రోజులు, నూట యాభై రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అలాంటిది చిన్న సినిమా బలగం యాభై రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. థియేటర్లోనూ, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమాలో నటీనటులు చాలా సహజంగా నటించారు. హీరోహీరోయిన్లకే కాకుండా ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టుకు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపు వచ్చింది. అందరూ ఆమెను తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా పేరెంట్స్కు మేము ఆరుగురం. నేను మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడు ఎకనామిక్స్ ప్రొఫెసర్కు దత్తత ఇచ్చారు. అలా చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాను. నన్ను పెంచిన తండ్రే నా ప్రపంచం. ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. 15 ఏళ్ల వయసులో నా పెళ్లి జరిగింది. అప్పుడు నా కన్నతల్లి చనిపోయింది. బాల్యంలో ప్రేమకు, బంధుత్వానికి దూరమయ్యాను. నా జీవితంలో ఉన్న ఏకైక సంతోషం మా నాన్న(దత్తత తండ్రి). నాకు 19 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన దూరమయ్యారు. నా జీవితంలో జరిగిన చేదు సంఘటనల వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది రూపలక్ష్మి. -
బలగం బాలి బాలి పాటను గుండెలు పిండేలా పాడిన రవి
-
చిరంజీవి గొప్ప మనసు.. ‘బలగం’ మొగిలయ్యకు సాయం!
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద ఆయన సాయం చేస్తుంటాడు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘బలగం’ మొగిలయ్యకు సాయం చేసి మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి మెగాస్టార్ ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలో బలగం దర్శకుడు వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ సాయం విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. Annayya #Chiranjeevi Personal call to @VenuYeldandi9 about Balagam Mogilaiah Eyes surgery@KChiruTweets said He will help financially for Mogailaiah Surgery#MegastarChiranjeevi pic.twitter.com/t2mwHTuyf1 — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 17, 2023 -
Balagam : కేపీహెచ్బీలో ‘బలగం’ సినిమా నటీనటులు సందడి (ఫొటోలు)
-
ఫొటో తీయకపోవడంతో అలిగి వెళ్లిపోయింది.. మళ్లీ 15 ఏళ్లకు ‘బలంగం’తో...
వరంగల్: మండల పరిధి వనపర్తిలో ఇటీవల ప్రదర్శించిన ‘బలగం’ సినిమా మనస్పర్థలతో దూరమైన అక్కా.. తమ్ముడి కుటుంబాలను కలిపింది. వివరాలిలా ఉన్నాయి. అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మిని అదే గ్రామంలో పప్పు వీరారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రెండు కుటుంబాలు వనపర్తిలోనే ఉంటున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని వివాహవేడుకల్లో లక్ష్మి ఫొటో తీయకపోవడంతో భోజనం చేయకుండా అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి మృతి చెందగా.. అంత్యక్రియల సమయంలో లింగారెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. దీంతో అతడి భార్య వసంత, కొడుకు శ్రీకాంత్రెడ్డి అంత్యక్రియలకు వెళ్లొచ్చారు. అయినా రెండు కుటుంబాలు కలిసిపోలేదు. ఇటీవల సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో బలగం సినిమాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించారు. ఆ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మి హృదయాల్లో మార్పు వచ్చింది. పంతాలు వదిలేసి సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్రెడ్డి సమక్షంలో ఈనెల 15న లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి వెళ్లాడు. దీంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. -
జుట్టుపై పిచ్చ కామెడీ.. నవ్వించి నవ్వించి చంపేస్తావా ఏంటి..
-
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
సక్సెస్ కోసం ఎన్నో అవమానాలు పడ్డాను..
-
ఏంటి లచ్చవ్వ లో ఈ యాంగిల్ కూడా ఉందా..!
-
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
ఒక్క షాట్ కోసం..ఎన్నిరోజులు షూట్ చేసామంటే...
-
చిరంజీవి గారు అలా అనేసరికి నేను చాలా...
-
ఈ సినిమా వల్ల నా భార్య పడ్డ కష్టం...
-
మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి,లక్డీకాపూల్(హైదరాబాద్): మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మొగిలియ్యను మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ నిమ్స్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు మంచి వైద్యం అందించాలని నిమ్స్ డాక్టర్లను ఆదేశించానని మంత్రి తెలిపారు. -
' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ'
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. -
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి
థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది బలగం సినిమా. మార్చి 3న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు పెద్దపెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ, అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను' అంటూ ఎమోషనలైంది విజయ లక్ష్మి. -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
తెలుగు సినిమా లోనే బలగం ఒక చరిత్ర
-
ఆ సార్లకు తలవంచి ధన్యవాదాలు చెబుతున్నా: బలగం మొగిలయ్య
హైదరాబాద్: నిమ్స్లో ‘బలగం’ మొగిలయ్యకు చికిత్స కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు వైద్యనిపుణులు నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఛాతి నొప్పి రావడంతో మెరుగైన చికత్స నిమిత్తం వరంగల్ నుంచి నిమ్స్కు తరలించిన సంగతి తెలిసిందే. ఆయన దీర్ఘకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కంటి చూపునూ కోల్పోయారు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను గురువారం నిమ్స్ పాత భవనంలోని ఎఫ్ బ్లాక్ స్పెషల్ రూమ్కు తరలించి డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మొగిలయ్య ఉన్నాడని ఆయన భార్య కొమురమ్మ కన్నీటి పర్యంతమైంది. అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆయా సార్ల సాయంతో నిమ్స్కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారని.. ఇప్పటికీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, నిర్మాత దిల్ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. -
నా ఇంట్లోనే బలగం షూటింగ్, వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు: ఇంటి ఓనర్
కంటెంట్లో దమ్ము ఉంటే ఎంత చిన్న సినిమా అయినా, ఎటువంటి ప్రచారం లేకపోయినా కేవలం మౌత్ టాక్తో ఆడియన్స్ను థియేటర్కు రప్పిస్తుంది. బలగం సినిమాకు చిత్రయూనిట్ ఎంత ప్రచారం చేసిందో కానీ జనాలు అంతకుమించి పబ్లిసిటీ చేశారు. ఒకసారి సినిమా చూసి వదిలేయకుండా ఇష్టంగా, బాధ్యతగా కుటుంబాన్ని సైతం థియేటర్కు తీసుకెళ్లారు. ప్రేక్షకులే దాన్ని సూపర్ హిట్ చేశారు. బలగం సినిమా షూటింగ్ అంతా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సినిమా సక్సెస్ కావడంతో చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాపులరయ్యాయి. ఆ లొకేషన్స్లో హీరో ఇల్లు కూడా ఉంది. కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో ఉందీ ఇల్లు. తాజాగా ఈ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బలగం సినిమా డైరెక్టర్ వేణుది మా ఊరే. దిల్ రాజుగారు సినిమా ఛాన్స్ ఇచ్చారు.. సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలన్నర రోజులు ఈ ఇంట్లో షూటింగ్ చేస్తే మేము వేరే ఇంట్లో ఉన్నాం. డబ్బులిస్తామన్నారు. కానీ నేనే వేణు దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈ సినిమా ఊహించనంత పెద్ద హిట్టయింది.. సినిమాలో మా ఇల్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ అన్ని వారాలు జరిగింది. కానీ ఏనాడూ దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు, తమ్ముడి కొడుకు మాత్రమే వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది కానీ ఫోన్ చేయలేదు, మేము గుర్తు రాలేదు. అయినా ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా! సినిమా కోసం ఇష్టపడి ఇల్లు ఇచ్చాను. దీని నుంచి ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు' అని చెప్పుకొచ్చాడు. -
హైదరాబాద్ నిమ్స్ కు బలగం మొగిలయ్య తరలింపు..
-
ఆ సినిమాలో వర్కౌట్ అయ్యి ఉంటే నా రేంజ్ వేరేలా ఉండేది..
-
సినిమాలో నటించాలని ఊరి నుంచి పారిపోయి వచ్చి బార్ షాపులో పని చేశా..
-
‘బలగం’ మొగిలయ్యకు నిమ్స్లో చికిత్స
లక్డీకాపూల్: బలగం సినిమాలోని కై ్లమాక్స్ సాంగ్ ‘తోడుగా మాతో ఉండి’ అనే పాటను ఆలపించి అందరినీ ఏడిపించిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య తీవ్ర అవస్థతకు గురైన సంగతి తెలిసిందే. మొగిలయ్య ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. దీంతో మంగళవారం రాత్రి మొగిలయ్యను వరంగల్ నుంచి నిమ్స్కు తరలించారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏఆర్సీయూ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
Balagam Speical Screening Photos: పల్లెల్లో బలగం క్రేజ్.. స్పెషల్ షోలు (ఫొటోలు)
-
చట్టపరమైన చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్పై ఫిర్యాదు
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 'బలగం'. చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా బలగం మూవీ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అంతటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వేణుపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు వేణుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. వారు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత) బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. -
Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత..
-
బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత
ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో ఫేమస్ అయిన మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య వరంగల్ జ్లిలా వాసి. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల విడుదలైన బలగం మూవీ క్లైమాక్స్లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్గా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. -
బలగం లచ్చవ్వ తో సరదా ముచ్చట్లు
-
ఇంత సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసి చూపించాడు: పరుచూరి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సంచలనం సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమెడియన్ వేణు యెల్లండి తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ‘బలగం’ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసి తనకు కూడా కన్నీళ్లాగలేదని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ను ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమాకు ఏది బలమో అదే ఇందులో ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. నిజానికి సినిమా చేసేటప్పుడు ఇంతటి విజయం సాధిస్తుందని దిల్రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే వసూళ్లు రాబట్టింది. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. కథను మాత్రమే నమ్ముకోవాలి. చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెటా? అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా నిలిచింది ఈ బలగం. వేణులో ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అసలు ఇది ఊహించలేదు. ' అని అన్నారు. వేణు గురించి మాట్లాడుతూ.. 'వేణుని ‘జబర్దస్త్’ కమెడియన్గా మాత్రమే చూశా. వేణులో ఇంత గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందా? అనిపించింది. కామెడీ చేసే కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా తీయగలడా అనేది ఊహకందని అంశం. వేణు చేసిన మాయ ఏంటంటే.. సినిమా మొదటి నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా తీయొచ్చు. కానీ అతను అలా చేయలేదు. నవ్విస్తూనే.. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు.' అని అన్నారు. (ఇది చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు) నేను కూాడా కన్నీళ్లు పెట్టుకున్నా పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. ఈ మూవీ చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు మనం కన్నీళ్లు పెడతాం. కానీ ఇందులో కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు భావోద్వేగానికి గురవుతాం. ఇది ఓ అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒక మనిషి చనిపోయాక 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయరు. ఇలాంటి సినిమాలు చూస్తారా? అని భయపడతారు. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు.' అని అన్నారు. -
‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్ ఓ హాస్యనటుడు కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం. -
చిరిగిన బట్టలు వేసుకునేవాడిని, ఎన్నో అవమానాలు: బలగం నటుడు
బంధాల్ని నిలుపుకోవడం, వాటిని కలకాలం కాపాడుకోవడమే బలం అని నిరూపించాడు దర్శకుడు వేణు. బలగం సినిమాతో కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చూపించాడు. ఈ సినిమాలో నారాయణ పాత్రలో మెప్పించాడు మురళీధర్ గౌడ్. తాజాగా ఆయన తన జీవితంలో ఎదురుచూసిన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'మెదక్ జిల్లా రామాయంపేట నా స్వస్థలం. సిద్దిపేటలో చదువుకున్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పనిచేసి రిటైరయ్యాను. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక చెల్లె. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో పది రూపాయలు ఉండేవి కాదు. మా కోసం అమ్మానాన్న పడ్డ కష్టాలు కళ్లారా చూశాను. ఓసారి పది రూపాయలు అవసరమయ్యాయి. అమ్మ ఎవరినీ అడగలేక మా బంధువుల్లో కొంత ధనవంతుల ఇంటికి నన్ను రూ.10 అప్పు తీసుకురమ్మని పంపించింది. నాకేమో వాళ్లు ఇస్తారో, ఇవ్వరోనని భయపడుతూనే వెళ్లి అడిగేవాడిని. మా నాన్న మాకు దూరంలో పని చేసేవాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ పది రూపాయలు వాళ్లకు తిరిగి ఇచ్చేవాడిని. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. ఎగతాళి చేసేవారు. దారుణంగా అవమానించేవారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంతమాత్రమే! నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. -
బలగం చిత్ర బృందాన్ని సన్మానించిన మంచు ఫ్యామిలీ (ఫొటోలు)
-
బలగం సినిమా చూసి 15 ఏండ్లకు ఒక్కటైన కుటుంబం
ఇబ్రహీంపట్నం(కోరుట్ల):బలగం సినిమా చూసి స్పందించిన ఓ కుటుంబం కలహాలు వీడి ఒక్కటైంది. వివరాలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్టనంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. గ్రామస్తులు భారీసంఖ్యలో తరలివచ్చి సినిమా తిలకించారు. సినిమాలోని కొన్ని సన్నివేషాలు చూస్తూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొప్పరతి సంజీవ్, రాజేందర్, జనార్దన్ కుటుంబాలు కూడా సినిమా తిలకించాయి. ఈ మూడు కుటుంబాలు మనస్పర్థలతో 15ఏళ్లుగా మాట్లాడుకోవడంలేదు. వీరి తల్లి బొప్పరాతి తారబాయి మంగళవారం ఉదయం వృద్ధాప్య కారణాలతో మృతి చెందింది. బలగం సినిమాలో మాదిరిగానే ముగ్గురు అన్నదమ్ములు, వారి కుటుంబాలు కలిసిపోయాయి. తల్లి అంతిమయాత్ర నిర్వహించాయి. -
బలగం సినిమాపై దిల్ రాజు పోలీస్ కంప్లైంట్..
-
అలాంటి పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు: బలగం ఫేమ్
ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తోంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం. పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు యెల్దండి. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారిపై టాలీవుడ్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. రూప లక్ష్మి మాట్లాడుతూ..'మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను లెక్చరర్కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను.' అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లి పాత్ర చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించటానికి ఎప్పుడు సిద్ధమే. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బంది లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించటానికి నేనేప్పుడు సిద్ధమే.' అని అన్నారు. కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్రామ్లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు ఏకంగా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మరీ ఆ సినిమాను చూసేస్తున్నారు. (ఇది చదవండి: అదిరిపోయే లుక్తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) -
మేము సినిమాను అడ్డుకోవడం లేదు.. బలగంపై దిల్ రాజు కామెంట్స్
గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనను తాము అడ్డుకోవడం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఉన్న మనస్పర్థలు మరిచిపోయి కలుసుకుంటున్నారని వెల్లడించారు. ఒక నిర్మాతగా తనకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని అన్నారు. ప్రజలు వివాదాలు పక్కనపెట్టి కలుస్తున్నారంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్న మాట అంటేనే తట్టుకోలేను మీరు రాజకీయాల్లో వస్తారన్న ప్రశ్నపై దిల్ రాజు స్పందించారు. నేను రాజకీయాల్లో వస్తానా లేదా అన్నది అప్రస్తుతమని కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డుంకులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్నమాట అంటేనే నేను తట్టుకోలేనని తెలిపారు. అలాంటిది నేను రాజకీయాల్లోకి వస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కాగా.. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన 'బలగం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మానవ సంబంధాలను హృదయాలకు హత్తుకునేలా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ పల్లెల్లో జరిగే సంప్రదాయాలే కథాంశంగా ఈ సినిమాను రూపొందించారు. -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
శుభాల్లో, అశుభాల్లో మేనత్త! అచ్చం ‘బలగం’ సినిమాలో పోచవ్వలాగానే! కరీంనగర్ కోడలు..
ఇప్పుటి సంగతి ఏమోగాని ఒకప్పుడు ప్రతి ఇంట్లో మేనత్తల అజమాయిషీ ఉండేది. శుభాల్లో, అశుభాల్లో మేనత్త వచ్చి దగ్గర ఉండి మంచీ చెడ్డకు నిలిచేది. అనుబంధాల ఆనవాలు చెప్పేది. ‘బలగం’ సినిమా చూసి అందులో మేనత్త పోచవ్వగా నటించిన నటి విజయలక్ష్మిలో అందరూ తమ మేనత్తలను పోల్చుకుంటున్నారు. సురభి ఆర్టిస్టయిన 65 ఏళ్ల విజయలక్ష్మికి ఇదే తొలి సినిమా. ఇంతకాలం గ్రాంథిక సంభాషణలు మాత్రమే పలికిన ఆమె పోచవ్వగా తెలంగాణ నుడికారాన్ని మెరిపించారు. ఆమె గొప్ప హరికథా కళాకారిణి కూడా. విజయలక్ష్మి పరిచయం. ‘తల వెంట్రుకంత అదృష్టమైనా తల చూపాలి కదా’ అన్నారు సురభి విజయలక్ష్మి. 65 ఏళ్లకు ఆమెకు అదృష్టం తల చూపిందనే అనుకోవాలి. సురభి ఆర్టిస్టుగా స్టేజ్ మీద ఎంత పేరున్నా, భాగవత కళాకారిణిగా ఎంత గుర్తింపున్నా ఇప్పుడు ‘బలగం’ సినిమాలో పోచవ్వగా చేసిన పాత్రే ఆమెకు ఎక్కువ పేరు, గుర్తింపు, ఉనికి ఇచ్చింది. పల్లెటూరి పెద్ద వయసు స్త్రీల విసురు, కసురు, మాట విరుపు, ఆర్ద్రత, అన్నింటినీ పోచవ్వ పాత్రలో రక్తి కట్టించడమే కారణం. ఆమె ఉద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘మా సురభి పరివారమంతా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా రంగం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా చాలా కొత్తగా ఉంది’ అన్నారామె. హైదరాబాద్ చందా నగర్లోని సురభి కాలనీలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఒక రకంగా రంగస్థలంపైనే పుట్టారు. ఆమె తల్లి ప్రఖ్యాత నటి కమలాదేవి. తండ్రి నాగభూషణం. అయితే ఆరుగురు అక్కచెల్లెళ్లలో విజయలక్ష్మి మాత్రమే నటిగా స్టేజ్ మీద కొనసాగారు. ‘మూడేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాత్రలు చేశాను. కృష్ణుడు, లోహితాస్యుడు... వయసు వచ్చాక దేవకి, సావిత్రి, అనసూయ, కాంతామతి... ఈ పాత్రలన్నీ పోషించేదాన్ని. సురభిలో ఏ పాత్రైనా ఎవరైనా చేయాలని రూలు. అందువల్ల మగవేషాలు కూడా వేశాను. కృష్ణుడిగా, బాలనాగమ్మలో మాయల పకీరుగా నటించాను’ అన్నారు విజయలక్ష్మి. కరీంనగర్ కోడలు యుక్త వయసు రాగానే కరీంనగర్కు చెందిన బంధువుల కుర్రాడు కేశవరావుతో వివాహం జరిగింది. అతను కూడా నటుడు. భార్యాభర్తలిద్దరూ కలిసి నాటక సమాజం నడిపారు. అయితే పిల్లల చదువుల కోసం సురభీ నటీనటులు వేరే చోట్లకు వెళ్లిపోతుండటంతో అందరూ కలిసి సంచారం చేసే పరిస్థితి పోయింది. ‘నేను చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని. హరికథలంటే ఆసక్తి ఉండేది. హరికథ నేర్చుకుంటే నేనొక్కదాన్నే ప్రదర్శన ఇవ్వొచ్చు. అలా హరికథా కళాకారిణిగా మారాను. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ... ఈ నాలుగు జిల్లాల్లో నేను తిరగని పల్లెటూరు లేదు. మహాభారతాన్ని 18 రోజులు ఒకే ఊరిలో ఉండి చెప్పేదాన్ని. నవరాత్రులొస్తే రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకూ నా హరికథ ఉండేది.’ అంటారామె. తెలంగాణ పలుకుబడి ‘బలగం సినిమాలో పోచవ్వ పాత్ర కోసం ఆర్టిస్టులను వెతుక్కుంటూ దర్శకుడు వేణు సురభి కాలనీకి వచ్చారు. అందరూ ఆడిషన్స్ ఇస్తుంటే నేనూ ఇచ్చాను. ఆశ్చర్యంగా నన్నే సెలెక్ట్ చేశారు. ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో నటించినా నాకంటూ అసలు డైలాగు లేదు. ఇదే తగిన నిడివి ఉన్న మొదటి సినిమా. కాని తెలంగాణ మాండలికం. నేనేమో జీవితమంతా రంగస్థలం మీద, హరికథల్లోనూ గ్రాంథికం మాట్లాడతాను. రోజువారి జీవితంలో కూడా నా భాష గ్రాంథికంలా ఉంటుంది. కాని హరికథలు చెప్పడానికి తెలంగాణ పల్లెలకు వెళ్లినప్పుడు అక్కడి స్త్రీలను గమనించిన అనుభవం నాకు ఉపయోగపడింది. డైలాగులను ఆ స్త్రీలు చెప్పినట్టుగా చెప్పాను. నేను నిజంగా అక్కడి ప్రాంత స్త్రీ అని, ఊరిలోని స్త్రీ చేత ఆ పాత్ర చేయించారని అనుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు’ అని నవ్వారామె. సినిమాలో మేనత్తగా ఆమె ముఖ్యపాత్రల మధ్య వైషమ్యాలు తొలిగేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అందువల్ల చాలామంది విజయలక్ష్మిలో తమ మేనత్తను వెతుక్కున్నారు. ‘మన సమాజంలో మేనత్తకు ఎప్పటికీ ఇంటి ఆడబిడ్డ స్థానం ఉంటుంది. సోదరులు ఆమెను గౌరవించాల్సిందే. వదిన అయినా, మరదలు అయినా ఇంటి ఆడపడుచుకు తల వొంచాల్సిందే. ఆ అధికారం నా పాత్రలో చూపించాను’ అన్నారు విజయలక్ష్మి. సినిమా నటీమణుల్లో శాంతకుమారిని ఇష్టపడే విజయలక్ష్మి ఒక రకంగా కొత్త ప్రయాణం మొదలెట్టారు. ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు జీవితాల్లో స్థిరపడ్డారు కనుక నటనకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారామె. పోచవ్వకు ఆల్ ది బెస్ట్. చదవండి: బంగారంలాంటి ఆలోచన