పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత
వేములవాడ: వేములవాడలోని ఆలయ వసతిగదిలో ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించి పారిశుధ్య కార్మికురాలు నిజాయితీ చాటుకుంది. మహాశివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు పార్వతీపురంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఖాళీ చేయగా.. శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుధ్య సిబ్బందికి బంగారు గొలుసు కనిపించింది. ఆ గొలుసును ఆలయ అధికారులకు అప్పగించారు.. వారు ఆ భక్తుడికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికురాలిని ఈవో వినోద్రెడ్డి, ఆలయ అధికారులు అభినందించారు.
నిజాయితీ చాటుకున్న పారిశుధ్య సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment