ఆన్‌లైన్‌ పెట్టుబడిదారుడి ఇంటి ఎదుట ఆందోళ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పెట్టుబడిదారుడి ఇంటి ఎదుట ఆందోళ

Published Thu, Mar 13 2025 12:26 AM | Last Updated on Thu, Mar 13 2025 12:26 AM

ఆన్‌లైన్‌ పెట్టుబడిదారుడి ఇంటి ఎదుట ఆందోళ

ఆన్‌లైన్‌ పెట్టుబడిదారుడి ఇంటి ఎదుట ఆందోళ

జగిత్యాలక్రైం: జగిత్యాలలో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ఇంటిముందు బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కొడిమ్యాలకు చెందిన కొంతమంది నుంచి సుమారు రూ.70 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టించాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌ పెట్టుబడి వ్యాపారం మూతపడటంతో తమకు తమ డబ్బులు చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. వారికి పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన సదరు వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనస్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే సమయంలో పెట్టుబడి పెట్టించిన సదరు వ్యక్తి రావడంతో బాధితులు అతడితో వాగ్వాదానికి దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement