Young Woman Committed Suicide After Being Cheated By Her Boyfriend In Mysore - Sakshi

Mysore Crime: ప్రియుడు​​​​​​​ మరో యువతితో తిరుగుతున్నాడని...

Jul 24 2023 1:10 AM | Updated on Jul 24 2023 8:52 AM

- - Sakshi

కొన్నిరోజులుగా ప్రియుడు పట్టించుకోక పోవడంతో పాటు మరో యువతితో కలిసి తిరగడం చూసిన నిసర్గ మోసపోయానని కుమిలిపోయింది.

మైసూరు: ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన మైసూరు జిల్లాలోని కేఆర్‌ నగర తాలూకాలోని గౌడెనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిసర్గ (20) అనే అమ్మాయి కేఆర్‌ నగరలో డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతోంది. ఈమె , సుమారు 4 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీకి చెందిన సుహాస్‌ రెడ్డి అనే యువకుడు ప్రేమలో ఉన్నారు. సినిమాలకు, షికార్లకు తిరిగారు.

మరో యువతితో తిరుగుతున్నాడని
కొన్నిరోజులుగా ప్రియుడు పట్టించుకోక పోవడంతో పాటు మరో యువతితో కలిసి తిరగడం చూసిన నిసర్గ మోసపోయానని కుమిలిపోయింది. సుహాస్‌ రెడ్డి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెబితే వారు మందలించి పంపించారు. శనివారం ఇంట్లో డెత్‌నోట్‌ రాసిపెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి సుహాస్‌ రెడ్డి, అతని తండ్రి గోపాలకృష్ణ కారణమని, వారికి కఠిన శిక్ష పడాలని లేఖలో రాసింది. కేఆర్‌ నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement