
రన్ రాజా.. రన్!
వేలాది మంది క్రీడాకారులకు ఓనమాలు నేర్పడమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. రూ.6.65 కోట్ల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యయి. మట్టి ట్రాక్లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ ప్రతిభ చాటే అవకాశముందని చెబుతున్నారు. – ఖమ్మం స్పోర్ట్స్
పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్
● రూ.6.65కోట్ల నిధులతో పనులు ప్రారంభం ● మూడు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ
మూడు నెలల్లో అందుబాటులోకి..
పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తిచేస్తాం. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రాగానే పనులను అధికారికంగా ప్రారంభి స్తాం. సింథటిక్ అందుబాటులోకి వస్తే అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందుతుంది.
– టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ
జాతీయస్థాయిలో సత్తా...
ఇక్కడ అథ్లెట్లకు సరైన వసతులు లేక జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే ఉత్తమ శిక్షణ అందుతుంది. తద్వారా మన క్రీడాకారులను భారత జట్టులో స్థానం పొందేలా తీర్చిదిద్దుతాం.
– ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్
ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు
ఖమ్మంలో అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తుండగా.. స్టేడియంలో ఇన్నాళ్లు సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడలేదు. జిల్లా క్రీడాశాఖ అధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు చొరవ చూపినా ఫలితం కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ మంజూరు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకా క ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ భావించినా నిధుల లేమి వేధించింది. ఇంతలోనే ట్రాక్ ప్రతిపాదిత స్థలాన్ని క్రికెట్ శిక్షణకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలా రకరకాల అడ్డంకులతో ట్రాక్ నిర్మాణం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది.
పట్టుబట్టడంతో...
గత రెండేళ్లుగా జిల్లా క్రీడల శాఖ, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు సింథటిక్ ట్రాక్ కోసం పట్టుబట్టారు. స్టేడియంలో మట్టిట్రాక్పై శిక్షణ పొందిన అబ్దుల్ నజీబ్ఖురేషి, పవన్కుమార్, సుధాకర్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మరి కొందరు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇక్కడ అకాడమీకి తోడు అనుభవం కలిగిన కోచ్ ఉన్నందున సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందుతుందనే భావనతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ట్రాక్ ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించి నిధుల కేటాయింపునకు సూచనలు ఇచ్చారు. ఈమేరకు ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ట్రాక్ ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావా లనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రన్ రాజా.. రన్!

రన్ రాజా.. రన్!

రన్ రాజా.. రన్!

రన్ రాజా.. రన్!

రన్ రాజా.. రన్!