కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియె ట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగజ్నగర్లోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని గురువారం డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. ప్ర యోగాల తీరును పరిశీలించారు. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్కు జనరల్ విభాగంలో 482 మందికి 452 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 11 మందికి 9 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 352 మందికి 333 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 200 మంది 195 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment