
మార్కెట్కు పోటెత్తిన మక్కలు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు 10,516 బస్తాల మక్కలు బుధవారం అమ్మకానికి వచ్చాయి. దీంతో షెడ్లు మక్కల రాశులతో నిండిపోయాయి. ఈ సీజన్లో అత్యధికంగా మక్కలు అమ్మకానికి రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. క్వింటాకు గరిష్ట ధర రూ.2,224, కనిష్ట ధర రూ.2,071లు పలికినట్లు తెలిపారు.
మానుకోట మార్కెట్కు 6,997 బస్తాలు..
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 6,997 బస్తాల మక్కలు విక్రయం జరుగగా గరిష్ట ధర క్వింటాకు రూ.2,191, కనిష్ట ధర రూ.2,076 పలికిందని ఏ ఎంసీ చైర్మన్ సుధాకర్ బుధవారం తెలిపారు.