● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం ● సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు ● నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం ● సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు ● నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

Published Sat, Mar 15 2025 12:18 AM | Last Updated on Sat, Mar 15 2025 12:18 AM

● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం,

● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం,

హక్కులు,

బాధ్యతలు ఉన్నాయి

వినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు త మ హక్కులు పొందేలా అవగాహన ఉండా లి. మా సంస్థ తరఫున మోసపోయిన విని యోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం.

– టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంస్థ.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్‌ అందడం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మార్కెట్‌లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మోసం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవా రు. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జుమర్‌ కమిషన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు వినియోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ, పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది.

ప్రశ్నిస్తేనే న్యాయం

వినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడవు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్‌ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్‌లైన్‌లోనూ సెంటర్‌ అండర్‌ కన్జూమర్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ (సీసీసీ), ఈ జాగృతి వెబ్‌సైట్‌, హెల్ప్‌లైన్‌ 1915కు కాల్‌ చేయెచ్చు.

అవగాహనే శ్రీరామ రక్ష..

ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీసం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. నచ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వాటి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అభిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు వినియోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement