స్నేహితుడిని కలిసేందుకు వెళుతూ.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడిని కలిసేందుకు వెళుతూ.. విషాదం!

Mar 14 2024 8:20 AM | Updated on Mar 14 2024 2:09 PM

- - Sakshi

సాగర్‌ (ఫైల్‌)

బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతి

మెదక్‌: స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మండలం బల్వంతాపూర్‌ శివారులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన సమచారం మేరకు.. దుబ్బాకకు చెందిన అంబేడ్కర్‌ సంఘం మాజీ అధ్యక్షుడు ఆస చిన్న ముత్యం ఏకైక కుమారుడు సాగర్‌(22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి సాగర్‌ ఇంటికి వచ్చాడు. సిద్దిపేట మండలం మాచాపూర్‌లో తన స్నేహితుడిని కలిసేందుకు మంగళవారం రాత్రి తన తండ్రి బైక్‌ తీసుకొని జీడీ దినేశ్‌ అనే మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి బల్వంతాపూర్‌ ఒడ్డెర కాలనీ సమీపంలో బైక్‌ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గుంతలో పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దినేశ్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.

ఇవి చదవండి: పథకం ప్రకారమే మహిళ దారుణహత్య! చివరికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement