పోలీసులకు అక్షయ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్లు.. | Akshay Kumar Has Given Fitness Trackers To Mumbai Police | Sakshi
Sakshi News home page

పోలీసులకు అక్షయ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్లు..

Aug 3 2020 11:51 AM | Updated on Aug 3 2020 11:55 AM

Akshay Kumar Has Given Fitness Trackers To Mumbai Police - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన ఉదార‌త‌ను చాటుకున్నారు. క‌రోనా మహమ్మారి పోరులో అవిశ్రాంతంగా ప‌ని చేస్తున్న ముంబై పోలీసులకు ఫిట్‌నెస్‌-హెల్త్‌ ట్రాకింగ్‌ పరికరాలు అందజేశారు. కరోనా పరిస్థితుల్లో అవి పోలీసుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయి, హృందయ స్పందనలును తెలియజేస్తుంది. పోలీసులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయి. శనివారం ఆయన ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు ఫిట్‌నెస్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ పరికారాలు అందజేశారు. అక్షయ్‌ పోలీసులకు చేసిన సాయంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో స్పందించారు. ‘ముంబై‌ పోలీసులకు అక్షయ్‌జీ ఫిట్‌నెస్‌-హెల్త్‌ ట్రాకింగ్‌ పరికరాలు అందజేశారు. కరోనాతో నివారణలో యుద్ధం చేస్తున్న పోలీసులకు ఈ పరికరాలు వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయి, హృదయ స్పందనలను తెలియజేయడంలో ఉపయోగపడతాయి. ఫిట్‌నెస్‌- హెల్త్‌ ట్రాకింగ్‌ పరికరాలను గత నెలలో నాసిక్‌ పోలీసులకు కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని పోలీసులకు అండగా ఉంటున్నారు. దేశంలోని సాయుధ దళాలు, కరోనా కట్టడిలో పోరాడుతున్న పోలీసులపై ఆయనకున్న గొప్ప మనసుకు కృతజ్ఞతలు’ అని అదిత్య ఠాక్రే పేర్కొన్నారు.

అదే విధంగా ఈ ట్రాకర్లను  బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు ఇవ్వడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 56 మంది పోలీసులు కరోనా పాజిటికు‌ గురైనట్లు ఓ అధికారి తెలిపారు. క‌రోనాపై పోరులో కృషి చేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు అక్షయ్‌ తన వంతు సాయంగా రూ.2 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement