mumbai police
-
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
సైఫ్పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
సైఫ్ అలీఖాన్పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్ బిల్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నివాసంలో దూరి ఆయన్ను కత్తితో పొడిచింది 30 ఏళ్ల బంగ్లాదేశీ(Bangladesh) అని పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ కాగా.. భారత్ వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు సహాయపడిన మనీ ట్రాన్సెక్షన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిన వెంటనే ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. థానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హీరానందానీ ఎస్టేట్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన వారు 24వ తేదీ దాకా కస్టడీకి తీసుకున్నారు. దీని వెనక అంతర్జాతీయ కుట్రను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయితే, బిజయ్ దాస్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది నెట్టింట వైరల్ అవుతుంది.పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేయడంతో..సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన తర్వాత బిజయ్ దాస్ తన హోటల్ వద్దకు వచ్చినట్లు మహ్మద్ అనే వ్యక్తి పోలీసులుకు చేరవేశాడని తెలుస్తోంది. అతని తీరు కాస్త అనుమానంగా ఉన్నట్లు అతను పోలీసులకు చెప్పాడట. చాలా ఆందోళనగా తన హోటల్ వద్దకు వచ్చి పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, అందుకుగాను యూపీఐ పేమెంట్ చేశాడని మహ్మద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడం ఆపై అతను ఠానేలో ఉన్నట్లు తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపులో దాదాపు 600 పైగానే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది.ఐదు నెలలుగా ముంబైలో... బంగ్లాదేశ్లోని ఝలోకాటికి చెందిన నిందితుడు ఐదు నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో ఉద్యోగం, చిన్నాచితకా పనులు చేస్తున్నాడు. దొంగతనం చేయడమే అతని ఉద్దేశమని ప్రాథమికంగా తేలినట్టు పోలీసులు చెప్పారు. ‘‘తాను దొంగతనానికి వెళ్తున్నది ఓ బాలీవుడ్ స్టార్ ఇంట్లోనని అతనికి తెలియదు. ఏడో అంతస్తు దాకా మెట్ల ద్వారా వెళ్లాడు. తర్వాత పైప్ ద్వారా 12వ అంతస్తుకు పాకి కిటికీ గుండా సైఫ్ ఇంటి బాత్రూంలోకి దూరాడు. అందులోంచి బయటికి రాగానే బయట కనిపించిన సిబ్బందిపై దాడి చేసి రూ.కోటి డిమాండ్ చేశాడు. అతన్ని సైఫ్ ముందు నుంచి పట్టుకున్నాడు. దాంతో సైఫ్ వీపుపై పొడిచాడు. తర్వాత నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేశారు. అతను లోనికి వెళ్లిన దారిలోనే పరారయ్యాడు. ఉదయం దాకా బాంద్రా బస్టాప్లో పడుకున్నాడు. లోకల్ ట్రైన్లో వర్లీకి చేరుకున్నాడు. అతని బ్యాగు నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు స్వాదీనం చేసుకున్నాం’’ అని వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచిన సమయంలో అతని తరఫున వాదించడానికి ఇద్దరు లాయర్లు పోటీ పడటం విశేషం. -
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
-
సైఫ్పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
సైఫ్పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్నంద్గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్నంద్గావ్లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్వరల్డ్ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దయా నాయక్కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్ఫ్రూఫ్గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
32 ఏళ్ల మహిళతో అసభ్య ప్రవర్తన.. నటుడిపై లైంగిక వేధింపుల కేసు!
బాలీవుడ్ నటుడు శరద్ కపూర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ శరద్పై 32 ఏళ్ల మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలంటూ తన ఆఫీస్కి ఆహ్వానించి.. అసభ్యకరంగా తాకాడని, లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదుతో ముంబై పోలీసులు శరద్ కపూర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రీల్స్ గురించి చర్చించాలంటూ నవంబర్ 26న సదరు మహిళను శరద్ తన ఆఫీస్కి ఆహ్వానించాడు. ఆమె ఆఫీస్కి వెళ్లగానే అక్కడి సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లమని చెప్పారు. ఆమె అతని దగ్గరకు వెళ్లగానే బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై శరద్ కపూర్ ఇంతవరకు స్పందించలేదు.శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ రోషన్ ‘లక్ష’ సినిమాలో శరద్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్కాల్ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్రూమ్కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
షారుఖ్కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్గఢ్కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్గఢ్కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
టార్గెట్ సల్మాన్ ఖాన్.. విస్తుపోయే విషయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట. వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్హోస్లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ రచించిందట.కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్కు చెందిన సుమారు 20 మంది పన్వేల్లో ఉన్న సల్మాన్ ఫామ్హోస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్ఖాన్కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Bollywood Celebrities In Umang 2023: ఉమాంగ్ ముంబై పోలీస్ షోలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
ఫేక్ అరెస్ట్ వీడియో.. నటిపై క్రిమినల్ కేసు నమోదు
ఉర్ఫీ జావెద్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి. ఈ మధ్యే ఆమె భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ పాత్ర గెటప్లో ఫోటో షూట్ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. ఏం జరిగింది? తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఓ కేఫ్ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్ చేస్తారా’ అని నెటిజన్స్ ముంబై పోలీసులను ట్రోల్ చేశారు. ఫేక్ వీడియో.. కేసు నమోదు అయితే ఉర్ఫీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు -
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?) మద్యం తాగమని బలవంతం తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది. అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు. 'కుటుంబాన్ని వదిలి షూట్కు రావాలన్నారు' తనను షూటింగ్లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్మెంట్లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది. తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్పై ఉన్నప్పుడు కూడా సెట్లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు) -
నటిపై లైంగిక వేధింపులు.. నిర్మాతపై కేసు నమోదు!
హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) -
అనిల్ను పట్టుకునేందుకు అమృత సాయం!
క్రైమ్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో.. ముంబై పోలీసులు ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్ మధ్య ఛాటింగ్ను సైతం పోలీసులు ఆ ఛార్జ్షీట్తో జత చేశారు. అమృతా ఫడ్నవిస్ను బెదిరించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకు ఫడ్నవిస్ సతీమణి సాయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఛాటింగ్ అమృత: ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్జీతో నేను మాట్లాడుతాను అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్లు రిప్లైగా వచ్చాయి. ఆ తర్వాత అనిల్తో ఫోన్లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. మరోసారి కాల్లోనే: ‘‘ఫోన్లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’ అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు. ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు. కేసు వివరాలివే.. అనిక్ష తనను తాను ఫ్యాషన్డిజైనర్గా అమృతా ఫడ్నవిస్తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్ నంబర్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు. -
అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు
ముంబై నగరం ఎప్పుడూ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ఉంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరాన్ని బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్ చేశారు. ‘ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. తను రాజస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పిఫోన్ కట్ చేశాడు. ఈ ఫోన్ కాల్ను సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్ శాఖకు బెదిరింపు ఫోన్స్ కాల్స్, మెసెజ్లు ఎక్కువగా వన్నాయని పోలీసులు తెలిపారు. తీ క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీ పోలీసులు బందో బస్తు ఉంటుంది. బెదిరింపు ఫోన్లు వస్తే భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. చదవండి: భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్లో సినీ ఫక్కీలో అరెస్ట్ -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
బాలీవుడ్ స్టార్స్ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్ రైడ్పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్ స్పాట్కు వెళ్లేందుకు బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. అయితే బైక్పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్ లేకుండా కనిపించారు. బైక్పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి) మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్పై కనిపించారు. తన బాడీగార్డ్తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్గుప్తా మూవీ కోర్ట్ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్లో కూడా నటించనున్నారు. (ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్ప్రెస్తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. #AnushkaSharma ditches the car and takes a bike ride to travel in the city! pic.twitter.com/jUwiCsyhbJ — Pinkvilla (@pinkvilla) May 15, 2023 We have shared this with traffic branch. @MTPHereToHelp — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) May 15, 2023 -
మోడల్స్తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్స్టిక్ బాక్స్, భోజ్పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
మోడల్స్తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
వైరల్ వీడియో: డ్యాన్స్తో అదరగొడుతున్న ముంబై పోలీస్
-
'ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ను చంపేస్తాం'.. బెదిరింపు ఫోన్కాల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్లోని జోధ్పూర్ అని చెప్పాడట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా సల్మాన్ ఖాన్కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్ను హత్య చేస్తానంటూ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. తాజాగా మరోసారి సల్మాన్ హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రీసెంట్గా సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఓరి నీ వేషాలో.. హీరోల ఇద్దరమ్మాయిలతో బైక్ స్టంట్.. ఆ తర్వాత..
ముంబై: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. రూల్స్ పాటించనందుకు జరిమానాలు విధిస్తున్నా డోంట్ కేర్ అంటూ బైక్లతో స్టంట్స్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారినపడుతూ, ప్రమాదాలకు గురవతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ బైకర్ చేసిన స్టంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ముంబైలో ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్ చేశాడు. ఓ యువకుడు తన బైక్పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేశాడు. బైక్ ముందు భాగాన్ని అమాంతం పైకిలేపి అలానే కొద్ది దూరంపాటు తీసుకెళ్లాడు. ఇలా కొద్ద దూరంగా ముందు టైర్ గాల్లోనే ఉండి.. బైకర్ స్టంట్ను పూర్తి చేశాడు. ఇక, దీన్ని మరో బైక్ మీద వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను పాట్హోల్ వారియర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. ఇక, ఈ వీడియో మహారాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది సదరు సంస్థ. వీడియోతో పాటు బైక్ నంబర్ను కూడా జోడించి ట్విట్టర్ వేదికగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసింది. కాగా, వీడియోపై స్పందించిన పోలీసులు.. బైకర్తోపాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదుచేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వీరి గురించి వివరాలు తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందించాలని ట్రాఫిక్ విభాగం కోరింది. ముగ్గురిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. dangerous Stunt with 2 pillion rider one in front & one at rear, no helmet & doing whilly ! they know that Mumbai roads hv became #PotholesFree now...! pls catch him @MTPHereToHelp bike reg no. is Mh01DH5987 pic.twitter.com/tvYeRMDR39 — @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) March 30, 2023 -
షారుక్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. కేసు నమోదు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంట్లోకి దుండగలు చొరబడ్డారు. ముంబైలోని షారుక్ నివాసం మన్నత్లోకి గురువారం ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది దుండగులను పోలీసులకు అప్పగించారు. విచారణలో వారు గుజరాత్కి చెందిన వ్యక్తులని తేలింది. కేవలం తమ అభిమాన నటుడు షారుక్ ఖాన్ను దగ్గర్నుంచి చూసేందుకే ఇలా ఇంట్లోకి వచ్చామని, వేరే దురాలోచనలు ఏమీ లేవని వారు వారు పోలీసులతో పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
NIA: ముంబైలో 'డేంజర్ మ్యాన్'... పోలీసుల హై అలర్ట్..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎన్ఐఏ హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది. ఇండోర్కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్లో శిక్షణ తీసుకుని వచ్చాడని హెచ్చరించింది. ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్ మిమాన్. ఇతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్ గురించి ఎన్ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్కు చెందిన ముబారక్ ఖాన్ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. చదవండి: సీబీఐ అరెస్ట్పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. -
సీక్రెట్గా నా ఫోటోలు తీశారు.. సరైనా పనేనా?.. అలియా ఫైర్
సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాళ్లు ఎం చేస్తారు? ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అయితే అది కొంతవరకు బాగానే ఉన్నా..ఒక్కోసారి వారిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. వాళ్లకు ప్రైవసీని భంగం కలించినట్లవుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్కు అలాంటి ఘటనే ఎందురైంది.ఆమె లివింగ్ రూమ్లో కూర్చొని ఉండగా.. సీక్రెట్గా ఫోటోలు తీసేందుకు ఇద్దరు ఫోటో గ్రాఫర్లు ప్రయత్నించారు. పక్క బిల్డింగ్ టెర్రస్పై నిలబడి కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా.. సోషల్ మీడియా వేదికగా వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండగా.. ఎవరో నన్ను గమనించినట్లు అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఇద్దరు వ్యక్తులు పక్క బిల్డింగ్పై నుంచి కెమెరాలతో నా ఫోటోలు తీస్తున్నారు. ఇది సరైన పనేనా? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించాలనే విషయం తెలియదా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది. ఇన్స్టా పోస్ట్లో ముంబై పోలీసుకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. నా కూతురి విషయంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఫోటోలను తీయొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా..వారు ఆమె ఫోటోలను నెట్టింట పెట్టారు’అని రాసుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘ఆది అసహ్యమైన చర్య. నా విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాకు తెలియకుండా.. నా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీశారు’చెప్పింది. -
బెయిల్పై బయటికి.. వెంటనే పృథ్వీ షాపై కేసు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో సోషల్ మీడియా స్టార్ సప్నా గిల్ కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా సప్నా గిల్ బెయిల్పై బయటకు వచ్చింది. కాగా మిగతా ఎనిమిది మందిని మాత్రం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే సప్నా గిల్ వచ్చీ రావడంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్పై రివర్స్ కేసు పెట్టడం ఆసక్తి కలిగించింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా గిల్ ఆరోపించింది. తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని.. అందుకే ప్రతిఘటించాల్సి వచ్చిందని సప్నా గిల్ తెలిపింది. దీంతో పృథ్వీ షా, సప్నా గిల్ల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్కు వెళ్లానని, సదరు క్రికెటర్ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడుచేశాడని ఆరోపించింది. తను క్రికెట్ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ సమయంలో పృథ్వీ తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని తెలిపింది. మరోవైపు పృథ్వీషా.. తనపై కేసు పెట్టడంపై కూడా సప్నా గిల్ స్పందించింది. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 చదవండి: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి టీమిండియా క్రికెటర్పై దాడి.. నటి అరెస్ట్ -
యంగ్ హీరో కారుకు ఫైన్.. ఎందుకంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్కు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. ఆయన కారును రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేశారంటూ ముంబయి పోలీసులు చలానా విధించారు. ఈ విషయాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే కారు పార్కింగ్ చేసేటప్పడు కార్తీక్ కారు నడపలేదని తెలుస్తోంది. ఇవాళ ముంబయిలోని సిద్ధి వినాయకస్వామి దేవాలయాన్ని సందర్శించగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలోనే సిద్ధివినాయక ఆలయం వెలుపల పార్క్ చేసిన కార్తీక్ ఆర్యన్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ముంబయి పోలీసు సిబ్బంది చలాన్ జారీ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారు రాంగ్ సైడ్లో పార్క్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని సినిా డైలాగ్స్లోని రెండు సినిమాలను ప్రస్తావించారు. ట్విటర్లో రాస్తూ..'కారు రాంగ్ సైడ్లో పార్క్ చేయబడి ఉంది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించగలడని భావించొద్దు.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో షెహజాదా పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సన్నీ హిందూజా నటించారు. ఆ తర్వాత సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. అనురాగ్ బసుతో ఆషికీ 3, కెప్టెన్ ఇండియా, కబీర్ ఖాన్ చిత్రాల్లో కనిపించనున్నారు. Problem? Problem yeh thi ki the car was parked on the wrong side! Don't do the 'Bhool' of thinking that 'Shehzadaas' can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl — Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023 -
టీమిండియా క్రికెటర్పై దాడి.. నటి అరెస్ట్
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫీ అడిగితే ఇవ్వడం లేదని పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వారిలో సప్న గిల్తో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో లంచ్కి వెళ్లిన పృథ్వీ షా, అతని స్నేహితుడు సురేంద్ర యాదవ్ను సప్న గిల్ గ్యాంగ్ సెల్ఫీ అడుగుతూ ఇబ్బందికి గురి చేసింది. గమనించిన హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సప్న .. షా ప్రయాణిస్తున్న కారును వెంబడించి..అతనిపై దాడికి పాల్పడింది. దీంతో షా,సురేంద్ర యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. సప్న గిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సప్న గిల్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తన డ్యాన్స్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాలో ఆమె 2.20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే పలు ‘కాశీ అమర్నాథ్’, ‘మేరా వానత్’ వంటి భోజ్పురి సినిమాల్లో కూడా నటించింది. Hustle video of #Cricketer #Prithvishaw & #influencer #Sapnagill outside Barrel mansion club in vile parle east #Mumbai, it is said that related to click photo with cricketer later whole fight started. @PrithviShaw @MumbaiPolice @DevenBhartiIPS @CPMumbaiPolice @BCCI pic.twitter.com/6LIpiWGkKg — Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) February 16, 2023 -
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..!
బిగ్బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ పెళ్లి అచ్చం సినిమాలాగే రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు ఆదిల్ దురానీతో పెళ్లయినట్లు ప్రకటించాక టన్నుల కొద్ది ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇటీవలే మరో అమ్మాయితో ఆమె ప్రియునికి సంబంధాలు ఉన్నాయని రాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ సావంత్ అతనిపై ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఓషివారా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదిల్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది రాఖీ సావంత్. ఆదిల్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టును మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అయితే రాఖీ సావంత్ మాత్రం ఆదిల్ను పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాకు తెలిపింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నాటకం కాదు. అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. అతను నన్ను కొట్టి నా వద్ద డబ్బు తీసుకున్నాడు. నిన్నెవరు నమ్ముతారని కొట్టేవాడు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. తన తల్లి మరణానికి కూడా ఆదిల్ కారణం.'అంటూ ఆరోపించింది. కాగా.. రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో తన పెళ్లిని అఫీషియల్గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది జూలైలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Telly Talk (@tellytalkindia) View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు
నిత్యం వివాదాల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కాంబ్లీని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కాంబ్లీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ తన భార్య ఆండ్రియా, కుమారుడితో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లోనే మద్యం తాగిన మత్తులో భార్య ఆండ్రియాతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాన్ హ్యాండిల్తో తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఆండ్రియా తెలిపింది. ఈ క్రమంలో తలకు బలమైన గాయం అయిందని ఆరోపించింది. ఆండ్రియా ఇచ్చిన సమాచారం మేరకు నివాసానికి చేరుకున్న పోలీసులు వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకొని అతని భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు అయితే 51 ఏళ్ల కాంబ్లీకి వివాదాలు కొత్తేం కావు. గతేడాది ఫిబ్రవరిలో తను నివాసముండే హౌసింగ్ సొసైటీలో గొడవ కారణంగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడిపి కారును ఢీకొట్టడంతో మారోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఒక స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు. తనకు సంపాదన లేదని, కేవలం బీసీసీఐ ఇస్తున్న పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని తెలిపాడు. 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్కు మంచి సన్నిహితుడు. అయితే అతని వ్యక్తిగత ప్రవర్తనతో జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. చదవండి: 'తెల్లబంతి పని పట్టా.. ఎరుపు బంతి కోసం వెయిటింగ్' 'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం -
ఉద్ధవ్పై కేసు.. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు) -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
సల్మాన్ ఖాన్కు భద్రత మరింత పెంపు.. ఆ బెదిరింపులే కారణం..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఆయనకు వై+ కేటగిరీలో ముంబై పోలీసులు భద్రత కల్పించారు. గతంలో సల్మాన్ ఖాన్కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను మరింత పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !) సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ఖాన్ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ఈ గ్యాంగ్స్టర్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. లేఖను సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. -
రూ.3.9 కోట్ల విలువైన రణ్వీర్ కారుకు ఇన్సూరెన్స్ లేదా? అందులో నిజమెంత?
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్పై ఓ నెటిజన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ హీరో నడుపుతున్న కారుకు ఇన్సూరెన్స్ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'దయచేసి ముంబై పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోండి' అంటూ కారు ఇన్సూరెన్స్ సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. అందులో జూన్ 28, 2020న బీమా గడువు ముగిసినట్లు ఉంది. అయితే ఆ కారు విలువ దాదాపు రూ.3.9 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రణ్వీర్ ముంబై విమానాశ్రయంలో తన ఖరీదైన ఆస్టన్ మార్టిన్ను నడుపుతూ కనిపించాడు. అయితే కారు ఫోటోలు తీసిన నెటిజన్ ఇన్సూరెన్స్ లేదంటూ ట్విటర్ ద్వారా ఆరోపించాడు. అయితే చివరికి ఆ నెటిజన్కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. రణ్వీర్ సింగ్ నడిపిన కారుకు బీమా ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్కు సంబంధించిన రసీదును మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ కంగుతిన్నాడు. దీంతో నెటిజన్లు ప్రముఖులపై ఫిర్యాదు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. Request @MumbaiPolice , @MTPHereToHelp to take cognisance against actor #RanveerSingh for driving Aston Martin with expired insurance. Insurance Nahi toh Next Time Tumhara Time Aayga" pic.twitter.com/eXqrrvyLw2 — Furkan Shaikh (@Furkanrshaikh) October 18, 2022 -
ఆ ఫోటో నాది కాదు, మార్ఫింగ్ చేశారు.. రణ్వీర్ సింగ్ కొత్త ట్విస్ట్
సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు పెట్టిన వ్యవహారంలో రణ్వీర్ సింగ్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు రణ్వీర్ కొత్త ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో ఒకటి తనది కాదని, ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసినట్లు రణ్వీర్ ఆరోపించారు. ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్వీర్ సింగ్ ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను రణ్వీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్వీర్పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రణ్వీర్పై కేసు నమోదు చేశారు -
KRK Arrest: నటుడు, క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. ఆ ట్వీట్తో వివాదం
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. తనను తాను సినీ క్రిటిక్గా చెప్పుకునే రషీద్ ఖాన్.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ సమా టాప్ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. KRK arrested for below tweets done in 2020 pic.twitter.com/WklfVN8Lzi — Gabbbar (@GabbbarSingh) August 30, 2022 -
చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు
ముంబై: పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండటం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్ డ్రెస్సుల్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్ స్నాచర్లు అనేక దోపీడీలు చేసి పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్లుగా వేషాధారణ మార్చుకొని చాకచక్యంగా వారిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివారాల ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమ్నాథ్ ఘర్గే వివరించారు.. ఇద్దరు చైన్ స్నాచర్లపై కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్లో 3, బంగూర్ నగర్ పీఎస్లో ఓ కేసు నమోదయ్యాయి. వీరిని గాలించేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు 300 సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో దొంగతనం చేసే సమయంలో ఉపయోగించిన బైక్ను రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ బైక్ను తీసుకెళ్లేందుకు వస్తారని పోలీసులు ఖచ్చితంగా భావించారు. చదవండి: ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’ దీంతో కస్తూర్బా పోలీసుల బృందమంతా జొమాటో డెలివరీ బాయ్ల దుస్తులను ధరించి స్టేషన్ వద్ద సుమారు 3 రోజులు వేచి ఉన్నారు. అనంతరం నిందితుల్లో ఒకరు తమ బైక్ను తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యండెడ్గా పట్టుకొని పీఎస్కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్లు, దొంగిలించిన గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఫిరోజ్ నాసిర్ షేక్, జాఫర్ యూసుఫ్ జాఫ్రీగా గుర్తించారు. ఇద్దరూ విఠల్వాడి, అంబివిలి నివాసితులుగా తెలిపారు. ఇద్దరు 20కి పైగా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. -
చిక్కుల్లో రణ్వీర్ సింగ్.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కల్లో పడ్డారు. ఆయన న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్వీర్కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవలె ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రణ్వీర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. -
సల్మాన్ ఖాన్కు తుపాకీ లైసెన్స్.. పోలీసుల నిర్ణయం
Salman Khan Gets Arms License After His Request Citing Death Threats: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు తాజాగా తుపాకీ లైసెన్స్ మంజూరైంది. ఇటీవల సల్లూ భాయ్ని, అతని తండ్రి సలీం ఖాన్ను చంపేస్తామని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని సల్లూ భాయ్కు వచ్చిన లేఖ నేపథ్యంలో ముంబయి పోలీసులను సల్మాన్ ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబానికి వస్తున్న చావు బెదిరింపుల కారణంగా తుపాకీ లైసెన్స్ను మంజూరు చేయాలని పోలీసులకు సల్మాన్ ఖాన్ విన్నవించుకున్నాడు. ఈ విషయంపై విచారించిన తర్వాత సల్మాన్కు తుపాకీ లైసెన్స్ను మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సల్లూ భాయ్కు తుపాకీ లైసెన్స్ జారీ చేసిన ఆతను ఎలాంటి తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. ఆయన రక్షణ కోసం 32 కాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయుధ నిపుణులు సూచించినట్లు సమాచారం. కాగా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. ఇటీవల తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ పార్క్ హయత్ హోటల్లో బస చేయడంతో భారీ బందోబస్తు ఉంచారు. హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని సల్మాన్కు కేటాయించారు. షూటింగ్ల కోసం నగరాల్లో తిరిగేందుకు సల్మాన్ కారుకు ముందు వెనుక ఎస్కార్టు ఏర్పాటు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లోకి సినిమా.. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎందరో అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే ఇలా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడం పోలీసులకు సాహసమనే చెప్పాలి. కానీ ముంబైలోని ఓషివారా పోలీసులు మాత్రం ఓ సైబర్ క్రైమ్ను చేధించి అతి త్వరగా ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు. పలు టీవీ సీరియల్స్లో నటించి ఫేమ్ సంపాందిచుకుంది బుల్లితెర బ్యూటీ అమన్ సంధు (Aman Sandhu). ప్రస్తుతం గోరేగామ్లో నివసిస్తోన్న అమన్ తాజాగా సైబర్ నేరగాళ్ల (Cyber Crime) ట్రాప్లో పడింది. తన తల్లికి డాక్టర్ అపాయింట్మెంట్ కోసమని జుహుకి చెందిన ఆస్పత్రి వెబ్సైట్ కోసం జులై 6న నెట్లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్సైట్లా కనిపించే నకిలీ సైట్లో తన నెంబర్ను నమోదు చేసింది. ఆమె నెంబర్కు కాల్ చేసిన వ్యక్తి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం పంపిన వాట్సాప్ లింక్పై క్లిక్ చేయాలని సూచించాడు. ఆ లింక్పై నటి అమన్ సంధు క్లిక్ చేయగానే తన మూడు ఖాతాల నుంచు రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన అమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య సత్వరమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా ఆ డబ్బును రికవరీ చేశారు. అలాగే కాజేసిన అకౌంట్ను బ్లాక్ చేశామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి అమన్ సంధు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఓషివారా పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. 'నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి. కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు' అని ఇన్స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్.. పెళ్లికి రెడీ అయిన బుల్లితెర బ్యూటీ!.. అతనెవరంటే ? View this post on Instagram A post shared by Aman Sandhu 🧿ਜੱਟੀ (@officialamansandhu) -
Swara Bhaskar: చంపేస్తామంటూ స్వర భాస్కర్కు బెదిరింపు లేఖ
ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖను పంపారు. బెదిరింపు లేఖపై నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చదవండి: (కాలికి గాయం, నడవలేని స్థితిలో నిత్యామీనన్!) -
నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!
ఢిల్లీ: ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల తర్వాత ఢిల్లీ వాసి అయిన నూపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే అదే సమయంలో.. పలు రాష్ట్రాల్లో ఆమెపైనా డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. రజా అకాడమీ అనే ఇస్లాం సంస్థ కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సైతం నూపుర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ముంబై పోలీసుల టీం ఒకటి.. ఢిల్లీకి వెళ్లింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా వాళ్లకు తెలియలేదు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ముంబై పోలీసులు నూపుర్ కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ‘నూపుర్ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. కోల్కతా పోలీసులు కూడా నూపుర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీఎంసీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ఆమె స్టేట్మెంట్ను కోల్కతా పోలీసులు నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈలోపే ఆమెకు బెదిరింపులు రావడంతో.. ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సైతం తెలియదట!. ఓ టీవీ డిబేట్లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో.. ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారామె. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి.. వివరణ, క్షమాపణలు కోరాయి. అయితే వ్యాఖ్యల దుమారం మొదలైన వెంటనే నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. ఇక తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పిన నూపుర్ శర్మ.. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు కూడా. చదవండి: భారత్ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త! -
బోనీ కపూర్ నుంచి లక్షల్లో చోరీ.. పోయినట్టు కూడా తెలియదు
Boney Kapoor Credit Card Misused And Lost Lakhs Of Money: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ నుంచి డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్ బుధవారం (మే 25) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు పేర్కొన్నారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఈ ఐదు ట్రాన్సాక్షన్స్లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్కు తెలియదని.. తర్వాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి పేర్కొన్నారు. చదవండి:👇 త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్కు నవనీత్ సవాల్ -
క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన ముంబైలో వేసవి ఎండలతోపాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. గల్లీల్లో జరుగుతున్న రాజకీయ సభలు, ఆ తర్వాత వివిధ మతాల ఉత్సవాలు, రాజకీయ నేతల హెచ్చరికలు, వివిధ సంఘటనల ఆందోళనల కారణంగా ముంబైలో ఏ క్షణంలోనైనా శాంతి, భద్రతలు అదుపు తప్పే అవకాశాలున్నాయి. దీంతో గత 20 రోజుల నుంచి ముంబైలో జరుగుతున్న నేరాల ను అదుపు చేయడంతోపాటు బందోబస్తు, శాంతి, భద్రతలను కాపాడటం పోలీసులకు నిత్యకృత్యమైంది. దీంతో నగర పోలీసులపై అదనపు పని భా రం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కంటే స్టేట్ రిజర్వుడు పోలీసు ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) బలగాలను మరింత పెంచాల్సి వచ్చింది. వరుసగా పండుగలు..వివాదాలు.. ప్రపంచంలో లేదా దేశంలో ఎక్కడా అల్లర్లు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు, ఇతర ఎలాంటి ఘటనలు జరిగినా ముందుగా ముంబై నగరాన్ని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే లౌడ్స్పీకర్లపై చేసిన ప్రకటన యావత్దేశంలో వివాదాస్పదంగా మారింది. రాజ్ ఠాక్రే చేసిన ప్రకటనతో ముంబై, మహారాష్ట్ర సహా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం నడుస్తుండగానే రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఇంటిపై ఆర్టీసీ ఉద్యోగులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రై డే, హనుమాన్ జయంతి, ఈస్టర్, వచ్చే నెలలో మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఆ తర్వాత 3న రంజాన్ ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు వస్తున్నాయి. మే మూడో తేదీలోపు మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తొలగించాలని రాజ్ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ఎదుట అంతకు రెట్టిం పు లౌడ్స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని హెచ్చరించారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. చదవండి: (హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!) నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముంబైలో గట్టి పోలీసు బందో బస్తూ ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు రికార్డు ల్లో నేర చరిత్ర ఉన్న నేరస్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. మోహళ్ల కమిటీ, శాంతి కమిటీ, సామాజిక సంస్థలు, ఉత్సవ మండళ్ల ప్రతినిధులు, అన్ని మత గురువులతో సమావేశం నిర్వహించారు. నేరశాఖ పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మత ఘర్షణలు సృష్టించే సందేశాలను, పోస్టులను తొలగించారు. కొత్త వివాదానికి తెరలేపిన రాణా దంపతులు శాంతి భద్రతలను అదుపులో ఉంచే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవీ రాణా బాంద్రా కళానగర్లోని మాతోశ్రీ బంగ్లా ఎదురుగా హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి కొత్త వివాదానికి తెరలేపారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం కొనసాతున్న నేపథ్యంలో మరోసారి శాంతి, భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని ముందే గ్రహించిన ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. హనుమాన్ చాలీసా పఠనంపై రాణా దంపతుల పట్టుదల, బీజేపీ నేత కిరీట్ సోమయ్య, మోహిత్ కంబోజ్లపై జరిగిన దాడుల కారణంగా పోలీసులపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. మత ఘర్షణలు, శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే వెంటనే నియంత్రించేందుకు ముంబై పోలీసులకు తోడుగా ఎస్ఆర్పీఎఫ్కు చెందిన 19 కంపెనీలను ముంబైలో నియోగించారు. వీరితోపాటు అల్లర్ల నియంత్రణ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, వివిధ దళాలకు చెందిన బలగాలను అప్రమత్తం చేశారు. -
ఎంపీ నవనీత్కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్
సాక్షి, ముంబై: ఎంపీ నవనీత్కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు హనుమాన్ చాలీసా వివాదంతో మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి ముంబైలోని ఖర్ పోలీస్టేషన్కు సైతం తరలించారు. అయితే పోలీసుల తీరుపై ఆమె సంచలన ఆరోపణలకు దిగారు. స్టేషన్లో పోలీసులు తనను వేధించారని, కులం పేరుతో అవమానించారంటూ ఎంపీ నవనీత్కౌర్, సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. రాత్రిపూట దాహం వేసి నీళ్లు అడిగినా ఇవ్వలేదని, పైగా తాను ఎస్సీ అయినందున వాళ్లు తాగే గ్లాసుల్లో నీళ్లు అస్సలు ఇవ్వలేమంటూ వేధించారంటూ ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్ స్టేషన్లో జంతువుల కన్నా హీనంగా తమను చూశారంటూ పేర్కొన్నారామె. కాబట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో లోక్సభ సెక్రెటేరియట్ ప్రివిలైజ్ అండ్ ఎథిక్స్ బ్రాంచ్.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ నివేదిక కోరింది. అయితే ఈ ఎపిసోడ్లో ఊహించని పరిణామం జరిగింది. ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ పాండే ట్విటర్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. నవనీత్కౌర్, ఆమె భర్త రవి, కూడా ఉన్న యువతి రిలాక్స్గా టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేసిన సీపీ సంజయ్ పాండే.. ఇంత కన్నా ఏమైనా చెప్పాలా? అంటూ క్యాప్షన్ ఉంచారు. Do we say anything more pic.twitter.com/GuUxldBKD5 — Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022 ఇదిలా ఉండగా.. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ నవనీత్కౌర్, ఆమె భర్త రవి రానాలు ఛాలెంజ్ చేసి నగరంలో తీవ్ర ఉద్రిక్తతలను కారణం అయ్యారు. దీంతో విద్వేషాలను రగిల్చే ప్రయత్నం, పోలీస్ ఆదేశాలను ఉల్లంఘించడం, విధుల్లో ఆటంకం కలిగించడం తదితర నేరాల కింద వీళ్లిద్దరిని అరెస్ట్ చేశారు. చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్ 1992’ నటుడు ఆవేదన
Actor Pratik Gandhi Tweet Police Pushed Him By Shoulder: తనని ముంబై పోలీసులు ఘోరంగా అవమానించారంటూ ‘స్కామ్ 1992’ ఫేం, బాలీవుడ్ ప్రతీక్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ముంబై పోలీసుల తీరుపై ఆసహనం వ్యక్తం చేశాడు. నిన్న(ఆదివారం) సాయంత్రం వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే(డబ్ల్యూఈహెచ్) రోడ్డుపై నడుస్తుండగా పోలీసులు కాలర్ పట్టుకుని పక్కకు తోసేశారని ప్రతీక్ తెలిపాడు. చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్ ‘ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ ఎవరో వస్తున్న కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. అదే సమయంలో నేను షూటింగ్ లొకేషన్కి చేరుకోవడానికి రోడ్డుపై అటుగా నడుస్తున్నాను. ఈ క్రమంలో పోలీసులు నా షోల్డర్ పట్టుకుని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏదో మార్బుల్ గోడౌన్లోకి నెట్టారు. నిజంగా ఇది అవమానం’ అంటూ ట్వీట్ ప్రతీక్ ట్వీట్లో రాసుకొచ్చాడు. చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మేరకు పలువురు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా ముంబైలోని కీలకమైన వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రజల రాకపోకలను నిలిపివేశారు. కాగాప్రస్తుతం ప్రతీక్ గాంధీ ‘ఫూలే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రతీక్ ‘జ్యోతి బాఫూలే’గా, పత్రలేఖ ‘సావిత్రి ఫూలే’గా నటిస్తున్నారు. అంతేగాక విద్యాబాలన్, ఇలియానాలు ఫిమెల్ లీడ్రోల్లో ప్రతీక్ గాంధీ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated — Pratik Gandhi (@pratikg80) April 24, 2022 -
రెచ్చిపోవద్దు.. ఊరుకోం! నవనీత్ కౌర్కు హెచ్చరికలు
ముంబై: మహానగరంలో ‘హనుమాన్ చాలీసా’ ఛాలెంజ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఎలాగైనా చేరుకుని హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నగర వ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. చాలెంజ్ ప్రకారం.. ఎలాగైనా మాతోశ్రీని తన అనుచరులతో చేరుకోవాలని ఎంపీ నవనీత్కౌర్, ఆమె భర్త రవి రానాలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నవనీత్ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా శివ సేన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇక ఈ పరిణామాలపై సేన నేత, ఉద్దవ్ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్ రౌత్ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్కౌర్ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు ఎంపీ సంజయ్ రౌత్. అంతేకాదు రాష్ట్రపతి పాలన ప్రస్తావనపై స్పందిస్తూ.. కేంద్రం చర్యలకు బెదిరే ప్రసక్తే లేదంటూ బదులిచ్చాడు. ఆజాన్, లౌడ్స్పీకర్ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్ థాక్రేను హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పఠించాలంటూ సవాల్ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. ఈ తరుణంలో అప్రమత్తమైన శివ సేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట నిరసనలు శనివారం మోహరించారు. దీంతో ఆమె, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వాళ్ల దాడి నుంచి మాతోశ్రీని రక్షించుకునే ప్రయత్నమే తమదని సేన కార్యకర్తలు చెబుతున్నారు. ఓ పక్క ముంబై పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పొలిటికల్ జంటకు శుక్రవారం నోటీసులు జారీ చేయగా.. మరోవైపు కేంద్రం అమరావతి లోక్సభ సభ్యురాలైన నవనీత్ కౌర్కు కేంద్ర సాయుధ కమాండోలతో వీఐపీ భద్రత కలిపించడం విశేషం. చదవండి👉🏼: మేం తగ్గం.. ఆ పని చేసి తీరతాం -
ఎంపీ నవనీత్ కౌర్కు పోలీసుల నోటీసులు
ముంబై: మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు కూడా నోటీసులు అందించారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఇలా స్పందించారు. శుక్రవారం ఉదయం ముంబై నగరం చేరుకున్న రానా దంపతులు.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. వాళ్ల సవాల్ నేపథ్యంలో.. ముంబైకి శివసేన కార్యకర్తలు, ప్రత్యేకించి మాతోశ్రీ దగ్గర గుమిగూడారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కింద వాళ్లకు నోటీసులు జారీ చేశారు జోన్ 9 డీసీపీ మంజునాథ్ షింగే. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే.. దానికి ఈ భార్యాభర్తలే బాధ్యత వహించాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీచేశారు. ఇదిలా ఉంటే.. హనుమాన్ చాలీసా పఠించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రేకు సవాల్ విసిరాడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమెల్యే రవి రానా. అది జరగని పక్షంలో తాను, తన భార్య నవనీత్ కౌర్ .. అనుచరగణంతో పాటు మాతోశ్రీ బయట హానుమాన్ చాలీసా పఠిస్తామని పేరొన్నారు. ఈ నేపథ్యంలో ఈ జంటను.. శివ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో రైలు మార్గం గుండా ముంబైకి చేరుకోవాలనుకున్న జంట.. విమానంలో వచ్చింది. ఆపై నందగిరి గెస్ట్కు చేరుకోగా.. అక్కడికి చేరుకున్న శివ సైనికులు హనుమాన్ చాలీసాతో హోరెత్తించారు. ఈ వ్యవహారంలో రానా దంపతులు వెనక్కి తగ్గారా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సుమారు 500 మంది అనుచరులతో వాళ్లు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు. చదవండి: కుష్బుకు రాజ్యసభ బెర్తు దక్కేనా? -
లైంగిక వైధింపుల కేసు: ప్రముఖ కొరియోగ్రాఫర్పై చార్జ్షీట్
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్జ్షీట్ దాఖలైంది. అతనితో పాటు ఆయన అసిస్టెంట్పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. కాగా 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని ఆరోపించింది. ఫిర్యాదులో ఏమందంటే..'గణేష్ మాస్టర్ నన్ను చాలా రకాలుగా వేధించాడు. అంతేకాకుండా మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని గణేష్ మాస్టర్ బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడు. అయనప్పటికీ తాను నిరాకరించడంతో 6నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో సభ్యత్వం రద్దు చేయించారు. అలాగే మాస్టర్ తన అసిస్టెంట్స్తో నాపై దాడి చేయించాడు. ఆ మహిళా అసిస్టెంట్లు నాన్ను కొట్టి దుర్భాషలాడారు.. నా పరువు తీశారు. ఇవన్నీ జరిగాక నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్ని సంప్రదించాను' అని సదరు మహిళ వెల్లడించింది. కాగా రీసెంట్గా 'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావ సాంగ్'కు గణేష్ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. -
కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్.. ఎలా అంటే ?
Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore: బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్కు చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్ జతిన్ వ్యాస్ను అంధేరిలోని జిమ్లో కలిసినట్లు రిమీ సేన్ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని పేర్కొంది. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్ వ్యాస్ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్పై ఐపీసీ సెక్షన్లు 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. రౌనక్ జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్. -
శ్రీవల్లి సాంగ్తో అదరగొట్టిన ముంబై పోలీసులు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్లు, కవర్ సాంగ్స్తో వీడియోలు రూపొందిస్తున్నారు. చదవండి: 'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్లో అందులో ముఖ్యంగా 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్పై కవర్ సాంగ్స్ చేస్తూ అనేకమంది నెటిజన్స్ అలరించారు. 'తగ్గేదే లే..' అంటూ శ్రీవల్లి సాంగ్లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేస్తూ అదరగొట్టారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ఇప్పుడు తాజాగా ఈ పాటను సంగీత వాయిద్యాలతో ట్యూన్ చేశారు ముంబై పోలీసులు. ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసులు తమలోని మరో కళను బయటపెట్టారు. బ్యాండ్తో శ్రీవల్లి సాంగ్ను కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇవే కాకుండా సినిమాల్లోని పలు హిట్ సాంగ్స్ను ట్యూన్ చేస్తున్నారు ఈ పోలీసులు. అలాగే మహిళల రక్షణ కోసం పలు వీడియోలు చేసి తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తున్నారు. చదవండి: శ్రీవల్లి పాటకు 100 మిలియన్ల వ్యూస్ -
చిక్కుల్లో ఫడ్నవీస్.. మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు
ముంబై: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన కేసులో తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు బీజేపీ నేత, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్ను ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్స్టేషన్లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. నోటీసులు అందిన అనంతరం ఆయన వీటిని ట్వీటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు అందాయి. అయినా తాను ఇలాంటి వాటికి భయపడనని ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీల కుంభకోణాన్ని తాను బయటపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఫడ్నవీస్ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది. -
తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్చల్.. హీరోయిన్ అరెస్ట్
టాలీవుడ్ హీరోయిన్ కావ్యా థాపర్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(గురువారం) అర్థరాత్రి తాగి కారు నడిపి యాక్సిడెంట్కు కారణమైన ఆమెను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ మాయ పేరేమిటో, ఏక్ మిని కథ చిత్రాలతో కావ్యా థాపర్ టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబైలో ఉంటున్న ఆమె గురువారం రాత్రి ఓ పార్టీకి హజరైంది. ఈ నేపథ్యంలో బాగా తాగిన ఆమె అర్థరాత్రి కారు నడుపుతూ ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడుతూ లేడీ కానిస్టేబుల్స్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించింది. చదవండి: భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ! మహిళ పోలీసుల కాలర్ పట్టుకుని వారిని అసభ్యకర పదజాలంతో దూషణకు దిగింది. అర్థరాత్రి రోడ్డుపై కావ్యా గొడవ పడుతూ రచ్చ రచ్చ చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను జూహు పోలీసు స్టేషన్కు తరలించారు. అంధేరి కోర్టులో శుక్రవారం ఆమెను హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో హీరోయిన్ హల్చల్ అంటూ సినీ ఇండస్ట్రీలో కావ్యా థాపర్ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. -
కోటిన్నర సంపాదన గుర్తుందా? ఆ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు
‘బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జీతం ఎంతో తెలుసా?’ ‘తెలిస్తే షాకవుతారు’, ‘మీ దిమ్మ తిరిగిపోతుంది’ అంటూ ఆమధ్య వచ్చిన మీడియా కథనాలు.. అతగాడి కొంపముంచాయి. ఏకంగా కోటిన్నర రూపాయలు వెనకేసుకుంటున్నాడని వచ్చిన కథనాలతో ఆ ముంబై పోలీస్ హెడ్ కానిస్టేబుల్ని అమితాబ్ భద్రతా పేషీ నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ షిండే మళ్లీ సస్పెన్షన్ వేటుతో వార్తల్లో నిలిచాడు. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ బ్రాంచ్లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర షిండేను బిగ్బీ అమితాబ్ బచ్చన్కు బాడీగార్డుగా నియమించింది ముంబై పోలీస్ శాఖ. బిగ్బీ అమితాబ్కు 2015 నుంచి 2021 ఆగష్టు(కథనాలు వచ్చేదాకా) బాడీగార్డుగా పని చేశాడు. అయితే ఈ పని చేస్తూనే అతను ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా సంపాదించాడంటూ కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణలను సీరియస్గా పరిగణనలోకి తీసుకున్న ముంబై కమిషనర్ హేమంత్ నగరలే ఆ సమయంలో షిండేను అమితాబ్ సెక్యూరిటీ విభాగం నుంచి తప్పించి.. హడావిడిగా డీబీ మర్ పోలీస్టేషన్కు బదిలీ చేశారు. అయితే ఈ ఘరానా కానిస్టేబుల్పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. పైఅధికారుల అనుమతి లేకుండా దుబాయ్, సింగపూర్లకు ట్రిప్ల మీద వెళ్లాడని, లగ్జరీగా లక్షలు ఖర్చుపెట్టాడని(వీటికి లెక్కలు లేవు).. పైగా రూల్స్ విరుద్ధంగా వ్యవహరించాడన్న ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వేటుపడినా.. షిండేపై అవినీతిపై దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని వెల్లడించారాయన. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్కు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ కింద నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను మొత్తం రెండు షిప్ట్ల వారీగా అందిస్తోంది ముంబై పోలీస్ శాఖ. గతంలో అమితాబ్కు బాడీ గార్డు విభాగంలో పని చేసే సమయంలో.. జితేంద్ర షిండే తన భార్య ద్వారా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని తెరిపించాడు. ఆ ఏజెన్సీ ద్వారా బచ్చన్ కుటుంబ సభ్యులకు సేవలందిస్తూ లక్షలు గడించాడు. అయితే ఆ డబ్బంతా ఆ భార్య అకౌంట్లోకి కాకుండా.. షిండే అకౌంట్లోకి జమ కావడంతోనే ఈ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ప్రైవేట్గా డబ్బు సంపాదించడంపై ముంబై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ఇదేకాకుండా లెక్కల్లో చూపించని కోట్ల రూపాయలతో అక్రమ ఆస్తుల్ని సైతం కొనుగోలు చేసినట్లు షిండే మీద ఆరోపణలు వినిపించాయి. షిండే అవినీతి ఆరోపణల వ్యవహారంపై ముంబై సౌత్ అదనపు కమిషనర్ దిలీప్ సావంత్ నేతృత్వంలోని ఓ కమిటీతో దర్యాప్తు నడుస్తోంది కూడా. -
బుల్లీ బాయ్’ కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి హైదరాబాద్: ఓ వర్గం వారిని టార్గెట్ చేసుకుని అశ్లీల, అభ్యంతరకర పోస్టులు చేస్తున్న, ఫొటోలు పొందుపరుస్తున్న ‘బుల్లీ బాయ్’ వ్యవహారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి టోలిచౌకికి చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ముంబై పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ అధికారులు సోమవారం బెంగళూరుకు చెందిన విద్యార్థిని అరెస్టు చేయడంతో అతడి వ్యవహారాలను ఆరా తీస్తోంది. గిట్హాబ్ అనే సోషల్మీడియా ప్లాట్ఫామ్లో గతంలో ‘సు.. డీల్స్’ పేరుతో ఖాతా నిర్విహించిన వారే దాన్ని బుల్లీ బాయ్గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ముంబై, ఢిల్లీల్లోనూ కేసులు నమోదయ్యాయి. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు సోమవారం బెంగళూరులో దాడులు చేశారు. ఈ ఖాతా నిర్వాహకుడిగా అనుమానిస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ ఝానును అరెస్టు చేశారు. ఇప్పటికే ముంబై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న సిటీ సైబర్ క్రైమ్ అ«ధికారులకు మంగళవారం ఈ విషయం తెలిసింది. దీంతో అతడికి సిటీలో నమోదై ఉన్న కేసుకు మధ్య సంబంధాలపై ముంబై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే విశాల్ను పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకురానున్నారు. మరోపక్క అత్తాపూర్ ప్రాంతానికి చెందిన మరో మహిళ కూడా ఇలాంటి నేరం బారినపడినట్లు తెలిసింది -
Maharashtra: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు..
సాక్షి, ముంబై, బెంగళూరు: మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్ రాజపుత్గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ విభాగం పోలీసులు అరెస్ట్చేసి ముంబైకి తీసుకెళ్లారు. కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్ ఫోన్ చేశాడు. మంత్రి ఫోన్ తీయకపోవడంతో రాజపుత్ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ -
ముంబై పోలీసుల విచారణకు హాజరైన కంగనా రనౌత్
-
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
గతంలో చోటా రాజన్ ఇంట్లో రూ.9 కోట్లు చోరీ.. ముంబైలో చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు సలీమ్ హబీబ్ ఖురేషీ... బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 49 ఏళ్ల వయస్కుడైన ఇతడిపై దేశ వ్యాప్తంగా 300 కేసులు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన గౌస్ షేక్ ను అనుచరుడిగా మార్చుకుని పంజా విసురుతున్న ఇతగాడిపై తెలంగాణలోనూ 65 కేసులు ఉన్నాయి. ఆఖరుసారిగా 2012లో రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. ఇతడిపై రాష్ట్రంలోని అనేక పోలీసుస్టేషన్లలో నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడ్ల్యూ) పెండింగ్లో ఉన్నాయి. గత నెల 18న ముంబయ్లోని పొవాయ్ ఠాణా పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులో అక్కడి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సలీం, గౌస్లతో పాటు తౌఫీఖ్ అనే మరో అనుచరుడినీ పట్టుకున్నారు. ►ముంబయ్లోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్లో ఉన్న డియోనార్ బుచ్చర్ హౌస్కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్ళల్లో ముంబయ్లో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ►2001లో ముంబయ్లోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్ ఓ ఇంటిని టార్గెట్గా చేసుకుంది. అదే రోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీంకు తాము చోరీ చేసింది మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. ►కొన్నాళ్ల తరవాత బాంబే సలీం అరెస్టు చేసిన ముంబయ్ పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో బెయిల్పై వచ్చిన వెంటనే రాజన్ అనుచరుల్ని కలిసిన సలీం జరిగింది చెప్పి ముంబయ్ వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. ►ముంబయ్ నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ... గ్యాంగ్ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించే వాడు. ఇతడి కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. ►సలీం జాబితాలో కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబయ్ పోలీసుల కళ్లు కప్పడం కోసం సలీం హైదరాబాద్లో కొంతకాలం షెల్టర్ తీసుకున్నాడు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదారాబాద్ వచ్చి వేర్వేరు ఇళ్ళు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టి కొన్నాళ్లు నడిపాడు. ►ఇది నష్టాలు రావడంతో నగరవాసి గౌస్తో కలిసి మళ్లీ చోరీల బాటపడ్డాడు. చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సరూర్నగర్, శివరామ్పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్పేట్, ఇబ్రహీంపట్నంల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబయ్ తదితర నగరాలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చాడు. ►ఈ రకంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 300కు పైగా నేరాలు చేశాడు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడకు మకాం మార్చాడు. రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు సుదీర్ఘకాలం సలీంపై నిఘా ఉంచి 2012 ఫిబ్రవరి 28న పట్టుకుని రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ►సలీం 2012 తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. స్టార్ హోటల్స్లో బస చేసే ఇతగాడు ఖరీదైన కార్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొని వినియోగిస్తుంటాడు. గత నెల 18న ముంబయ్లోని జల్ వాయు విహార్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో తన ఇద్దరు అనుచరులతో కలిసి చోరీ చేశాడు. ►దీనిపై కేసు నమోదు చేసుకున్న పొవాయ్ ఠాణా అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బెంగళూరులో ఉన్న అనుచరులను ఈ నెల 2న పట్టుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సలీంను శుక్రవారం అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇతడితో పాటు గౌస్పై తెలంగాణలో కొన్ని ఎన్బీడ్ల్యూలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. -
సీబీఐ డైరెక్టర్కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్కు తాజాగా సమన్లు పంపారు. -
'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
Shilpa Shetty Says I don't know Raj Kundra Work: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్షీట్లో చేర్చారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్లో పేర్కొంది. 'నేను షూటింగ్స్లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ల గురించి కూడా నాకు తెలియదు' అంటూ శిల్పా చెప్పిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 1400పేజీల చార్జ్షీట్ను పోలీసులు ఫైల్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్షాట్స్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది. అంతేకాకుండా పోర్న్రాకెట్ను గట్టుచప్పుడు కాకుండా నడిపించిన రాజ్కుంద్రా ఇందుకు గాను వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్షీట్లో నమోదు చేవారు. మరోవైపు గత జులై19నుంచి రాజ్కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. చదవండి : బిగ్బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్?! -
జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ వాయిస్తున్న ముంబై పోలీసులు
-
వ్యూస్ కోసం డేంజర్ స్టంట్స్.. పోలీసుల ట్విస్ట్ అదిరింది
సాక్షి, ముంబై: బైక్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం కొంతమంది యువకుల్లో ఫ్యాషన్గా మారుతోంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ మరీ యువకులు స్టంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరు పెట్టిన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో, తామేమీ తక్కువ లేమంటూ మరికొందరు పోటీపడి మరీ స్టంట్లు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వారిలో 18–30 ఏళ్ల వయసు యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు. చిత్రీకరించిన వీడియోలను వాట్సాప్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, వీరు స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తలకు హెల్మెట్ పెట్టుకోరు. బైక్ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం, నడుస్తున్న బైక్పై నుంచి దిగడం, మళ్లీ ఎక్కడం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలేస్తున్నారు. అది కూడా ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేదని కారణాలు చూపుతూ తక్కువ జరిమానా విధిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు బైక్పై స్టంట్ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ యొక్క లిరిక్స్ను మార్చి తమ రోడ్డు భద్రతా విషయాన్ని వెల్లడించారు.‘ బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈవీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కాగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారి లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. View this post on Instagram A post shared by Mumbai Police (@mumbaipolice) కాగా స్టంట్ మాస్టర్లు స్టంట్లు చేసేందుకు రాత్రివేళల్లో వాహనాలు, జనాల సంఖ్య తక్కువగా ఉండే రోడ్లను ఎంచుకుంటారు. ప్రధానంగా మలాడ్, దిండోషీ, కాల్బాదేవి, వర్లీ సీఫేస్, మాహీం, దాదర్, ఘాట్కోపర్, చెంబూర్, కుర్లా, బాంద్రా, సహార్, కాందివలి, దహిసర్, వాకోలా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి స్టంట్లు చేస్తారు. ఈ స్టంట్ మాస్టర్ల నిర్వాకంవల్ల రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో స్టంట్ మాస్టర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు గాయాల పాలవుతున్నారు. -
మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ముంబై పోలీస్.. వీడియో వైరల్
Mumbai cop dance Video: పోలీస్.. ఈ పేరు వినగానే తెలియకుండానే ఎంతో మంది ఒంట్లోకి ముందుగా భయం పుట్టుకస్తుంది. పేరుకు తగ్గట్లే పోలీసులు కూడా నిత్యం హత్యలు, దొంగతనాలు, అరెస్టులు, కేసులు, విచారణలు.. వీటితోనే బిజీగా ఉంటుంటారు. అయితే కొంతమంది పోలీసులు మాత్రం ఎంతో సరదాగా, చిలిపితనంతో ఉంటారు. అలాంటి కోవలోనే మహారాష్టకు చెందిన పోలీస్ అధికారి తనకున్న ఓ టాలెంట్తో తాజాగా వార్తలెకెక్కాడు. ముంబైలోని అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే 38 ఏళ్ల పోలీస్ అధికారికి చెందిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పోలీస్ అయినప్పటికీ పర్ఫెక్ట్ డ్యాన్స్ స్టెప్పులతో అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు. అమోల్ యశ్వంత్ కాంబ్లేకు నైగావ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగంతోపాటు కాంబ్లేకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే విధులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా తరుచూ డ్యాన్స్ చేయడం ఇతనికి అలవాటు. ఇలా తన డ్యాన్స్కు సంబంధించిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. ‘అప్పు రాజా’ సినిమాలోని ఆయా హై రాజా పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్తో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవ్వడంతో వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని కాంబ్లే తెలిపారు. డ్యూటీలో ఉన్న ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్తో ఈ డ్యాన్ చేశామని, ఉద్ధేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని వెల్లడించారు. కాగా మాహిమ్ ప్రాంతంలో నివాసముంటున్న కాంబ్లే 2004 లో పోలీస్ శాఖలో చేరాడు. అయితే ఇతనికి చిన్నతనం నుంచే డ్యాన్స్పై అమితమైన పిచ్చి. ఎన్నో స్టేజులమీద ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తన డ్యాన్ అభిరుచిపై కాంబ్లే స్పందిస్తూ..‘ మా అన్నయ్య కొరియోగ్రాఫర్.. పోలీస్ ఉద్యోగంలో చేరేముందు తనతో కలిసి కొన్ని డ్యాన్స్ షోలు చేశాను. ఇప్పుడు కూడా వీక్లీ ఆఫ్లు, ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుంటాను.’ అని తెలిపాడు. -
మరో పోర్న్ యాప్ గుట్టు రట్టు..నిర్మాతపై కేసు నమోదు
సాక్షి,ముంబై: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అరెస్ట్ బీటౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓవైపు విచారణ కొనసాగుతుండగానే, మరో పోర్నో రాకెట్ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్పై కేసు నమోదైంది. అసభ్యత, అశ్లీల కంటెంట్తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 కింద ఈనెల 4న కేసు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్లోని స్టోర్ రూమ్లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు. కాగా 2013లో బాత్ బాన్ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్..డాన్స్ బార్ సినిమాతో పాటు మరికొన్ని వెబ్సిరీస్లను నిర్మించారు. ఆ తర్వాత 2019లో ఉల్లూ యాప్ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్,భోజ్పురి,తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్పై ఆరోపణలు ఉన్నాయి. Maharashtra | Police have registered a case against Vibhu Agrawal, the CEO of film production company Ullu Digital Pvt Ltd for allegedly sexually harassing a woman, under Section 354 of IPC in Mumbai. Anjali Raina, the company's country head has also been booked: Mumbai Police — ANI (@ANI) August 5, 2021 -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
‘అరెస్ట్ కాకుండా మీకెంత కావాలి? పోలీసులకు హీరోయిన్ ఆఫర్
ముంబై: ఈ ఏడాది ప్రారంభం నుంచి బాలీవుడ్ను పలు కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసు బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అశ్లీల వెబ్సిరీస్, సినిమాలు తీశారనే ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్ను షేక్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ ఆనవాళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉన్నాయి. పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఓ హీరోయిన్ పోలీసులకు లంచం ఇవ్వజూపారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ గెహన వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ‘నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాల్నో చెప్పండి’ అని పోలీసులకే ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరగా రూ.15 లక్షలు ఇస్తాను అని గెహన పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే లంచం పోలీసులే డిమాండ్ చేశారని గెహన ఆరోపిస్తోంది. ఈ కేసు విషయంలోనూ ఇద్దరితో వాట్సప్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారే యశ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై చాటింగ్ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిపి రూ.8 లక్షల వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్న వ్యాపారవేత్త కాస్త నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉంది. -
పోలీసులకు ఫిట్నెస్ ప్రోగ్రాం
సాక్షి, ముంబై: కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని కోల్పోయిన ముంబై పోలీసు శాఖ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఈ మేరకు ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తమ పోలీసులు ఫిట్గా ఉండేలా చూసుకునేందుకు ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పోలీసులకు ఫిట్నెస్పై అవగాహన, కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే వెల్లడించారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు స్వయంగా ఆయనే చొరవ తీసుకుంటున్నారు. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కోసం వీరు ద ఇండియన్ న్యూట్రిషన్ కోచ్ అనే సంస్థతో కలిసి పనిచేయనున్నారు. ఈ సంస్థను ప్రస్తుతం పోలీసు విభాగంలోనే ఎస్సైగా పనిచేస్తున్న ఒకరి కూతురు నడుపుతోంది. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ముంబైలోని పోలీసు స్టేషన్లలో ఎంత మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..? వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి..? 45 ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు..? తదితర వివరాలు సేకరిస్తారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారిని, 45 ఏళ్ల పైబడిన వారిని మొదటి గ్రూపులో చేరుస్తారు. వారికి ఒక్కొక్కరిగా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారు ఎలాంటి ఆహారం తినాలి, ఏది తినవద్దు, ఫిట్గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు చేయాలి, రోజువారీ దినచర్య ఎలా ఉండాలి తదితర అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం ఒక్కో పోలీసుపై రూ. 3 వేల వరకు అదనంగా ఖర్చు చేయనుంది. ఇలా నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం దశలవారీగా సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఫిట్నెస్పై శిక్షణ ఇస్తారు. ప్రస్తుతానికి ఘట్కోపర్, పంట్ నగర్, ఆర్సీఎఫ్, శివాజీ నగర్, ట్రాంబే పోలీసు స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్ నుంచి 20 మంది చొప్పున 100 మందితో తొలి బ్యాచ్ను జూలై 19న ప్రారంభించారు. కరోనాతో 122 మంది పోలీసుల మృతి కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు విశ్రాంతి లేకుండా అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తున్నారు. సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి లేక, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. దీర్ఘకాలిక సెలవులు, వారాంతపు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో విశ్రాంతి అనేది లేకుండా వారు విధులు నిర్వర్తించారు. 24 గంటలు నాకా బందీలు, తనిఖీలు, కాలక్షేపానికి బైక్లపై తిరుగుతున్న యువతను అడ్డుకోవడం, అనవసరంగా రోడ్లపై తచ్చాడుతున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకోవడం లాంటి పనులు చేపట్టారు. ఫలితంగా కరోనా సోకి 2020లో ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న 19 మంది పోలీసులు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 122కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 122 మంది పోలీసులు కరోనా కాటుకు బలికావడాన్ని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలీసు సిబ్బందిలో ఫిట్నెస్పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వెంటనే ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టారు. అంతేగాక, పోలీసు శాఖలో అనేక మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు భారీ పొట్ట ఉంది. వీరేం పరుగెడతారు..? దొంగలను ఎలా పట్టుకుంటారు...? అంటూ ప్రజలు వీరిపై జోకులు వేస్తున్నారు. ఇలాంటి వారివల్ల పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. అంతేగాక బానెడు పొట్ట వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో ఇలాంటి వారిని కూడా ఎంపిక చేసి పొట్ట తగ్గించేందుకు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలో కూడా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా నేర్పించనున్నారు. -
రాజ్ కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ముంబై: పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులే కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. నీలిచిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల దగ్గర వెల్లడించడంతో కుంద్రా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఆయన ఉంటారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులోఆదివారం నాడు టెలివిజన్ నటి, మోడల్ గెహానా వశిష్ట్తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపినప్పటికీ వారు విచారణకు హాజరు కాలేదు. -
పోర్న్ కాదు... శృంగారమే తీస్తారు: శిల్పా శెట్టి
ముంబై: ఓటీటీలో పోర్న్ సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంలో పొడుగు కాళ్ల సుందరి తన భర్తకి అండగా నిలిచింది. తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని ముంబై పోలీసుల ఎదుట వెల్లడించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించింది. శుక్రవారం రాత్రి దాటేదాకా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు బృందం శిల్పను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫారమ్లో వచ్చేవన్నీ ఎక్కువగా కుంద్రా బావగారు ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్న్ సినిమాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప చెప్పినట్టు తెలిపాయి. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. ఆది నుంచీ వివాదాలే కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. ఐపీఎల్ బెట్టింగ్, బిట్ కాయిన్ ట్రేడింగ్లో ఆయన ప్రమేయంపై ప్రకంపనలు రేగాయి. పంజాబ్ నుంచి బ్రిటన్కు వలస వచ్చిన కుటుంబంలో 1975 నవంబర్ 9న లండన్లో కుంద్రా జన్మించారు. నేపాల్లో తొలుత శాలువాల వ్యాపారాలు చేశారు. బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పాల్గొన్న అనంతరం శిల్ప ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లినప్పుడు 2007లో లండన్లో కుంద్రాను కలుసుకున్నారు. రెండేళ్లపాటు డేటింగ్ చేశాక 2009లో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరూ ఐపీఎల్ రంగంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్లో పెట్టుబడి పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న కుంద్రాపై సుప్రీంకోర్టు కమిటీ జీవితకాల నిషేధం విధించింది. 2018లో రాజ్ని బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. -
నా భర్త అమాయకుడు: శిల్పాశెట్టి
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో విచారణను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వహణ లండన్లో ఉన్న రాజ్కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేర రిజిస్ట్రర్ అయిన యస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కంటెంట్ ద్వారా వచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్కు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసులో ఏ క్షణమైనా శిల్పాశెట్టి అరెస్ట్!
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది. ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్పాశెట్టి..వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలె అంధేరి వెస్ట్లోని వియాన్ కార్యాలయానిపై దాడిచేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోల డేటాను సేకరించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్ యాప్కు 20 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
శిల్పాశెట్టి ఇంటికి ముంబై పోలీసులు .. ప్రశ్నించే అవకాశం!
-
భర్త అరెస్ట్పై తొలిసారి స్పందించిన శిల్పాశెట్టి
ముంబై : అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే భర్త అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు మాట్లాడని శిల్పాశెట్టి ..తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 'కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తుతను చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు' అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను శిల్పా హైలేట్ చేస్తూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా రాజ్కుంద్రా 2009లో శిల్పాశెట్టిని రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు బిజినెస్మెన్ కూతురు కవితను వివాహం చేసుకున్న ఆయన 2006లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రాజ్కుంద్రా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. వివాదాలతో రాజ్కుంద్రా పేరు మసకబారింది. ఇప్పుడు నీలి చిత్రాల వ్యవహారంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. భర్త వైఖరిపై తన నిర్ణయం స్పష్టంగా చెప్పకపోయినా రాజ్కుంద్రాకు శిల్పా అండగా నిలబడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ముంబై పోలీస్ మాజీ బాస్పై అక్రమ వసూళ్ల కేసు
ముంబై: ముంబై పోలీస్ మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి పరంబీర్సింగ్, ఐదుగురు పోలీస్ అధికారులతోపాటు మరో ఇద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బిల్డర్పై ఉన్న కేసులను మాఫీ చేయించేందుకు వీరు రూ.15 కోట్లు డిమాండ్ చేశారని అధికారి ఒకరు గురు వారం వెల్లడించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ జైన్, సంజయ్ పునామియా అనే ఇద్దరు బిల్డర్లను అరెస్ట్ చేశామ న్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో సచిన్ వాజే అనే పోలీస్ అధికారి అరెస్ట్ అనంతరం మార్చిలో ముంబై పోలీస్ కమిషనర్గా ఉన్న పరంబీర్సింగ్ను హోం గార్డ్ విభాగానికి డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అకోలా పోలీస్ ఇన్స్పెక్టర్ బీఆర్ ఘడే ఫిర్యాదు మేరకు పరంబీర్పై ఏప్రిల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అనిల్ దేశ్ముఖ్కు హైకోర్టులో చుక్కెదురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాక రించింది. ఇదే కేసులో తీర్పుపై స్టే ఇచ్చి, అప్పీల్కు అవకాశమి వ్వాలన్న వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ పిటిషన్ ‘కొట్టివేయదగినది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై జయశ్రీ పాటిల్ అనే లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు జరి పిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఏప్రిల్ 24వ తేదీన కేసు నమోదు చేసింది. -
పోలీసులకు రాజ్కుంద్రా భారీ లంచం? ఎందుకంటే..
ముంబై: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లీలలు.. అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్కుంద్రా భారీగా లంచం ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యశ్ ఠాకూర్ పోలీసులకు పంపిన ఓ మెయిల్లో ఆరోపించారు. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా రాజ్ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మార్చిలోని ఏసీబీకి పంపిన ఈమెయిల్లో తెలిపారు. తాజాగా ఈమెయిల్ను ఏసీబీ పోలీస్ కమిషనర్కు పంపింది. అయితే ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందించడం లేదు. ఈ ఆరోపణలతోనే అంధేరిలోని రాజ్కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్ మూవీస్ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్త కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఇదే కేసులో అప్పట్లో రాజ్కుంద్రా అరెస్ట్ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్ చేయమని ఓ పోలీస్ రాయబారం చేసినట్లు ఈమెయిల్లో అరవింద్ తెలిపారు. మరిన్ని విషయాలపై సుదీర్ఘ లేఖ ఈమెయిల్ ద్వారా పంపారు. వాటి వివరాలు బయటకు రాలేదు. -
పోర్నోగ్రఫీ కేసు: వాట్సాప్ చాటింగ్తో బయటపడ్డ నీలి వ్యవహారం
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్లో తన బంధువులతో కలిసి రాజ్ కుంద్రా నీలి చిత్రాల దందా చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్, ఈ మెయిల్ ద్వారా ఈ చీకటి వ్యవహారం గుట్టును బయటపెట్టారు. బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను టార్గెట్గా చేసుకుని వారిని పోర్న్ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్లలో అప్లోడ్ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు.ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసునమోదైందని ముంబై పోలీసు కమిషనర్హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో తెలిపారు. -
Raj Kundra: ఈజీ మనీ కోసం కక్కుర్తి!
Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై: లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు. ఆ లింక్తో.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్లో మదా ఐల్యాండ్లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd — MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021 ఈజీ మనీ కోసం.. లైవ్ స్రీ్టమింగ్ యాప్లు, ఐపీఎల్లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్షాట్స్, హాట్హిట్మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. శాలువా బిజినెస్ నుంచి.. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా. -
కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్
ముంబై: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతిని(అంబర్గ్రిస్) పెద్దమొత్తంలో అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు మాజీ పోలీస్ కూడా ఉండడం విశేషం. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్గ్రిస్ను వాడుతుంటారు. విషయంలోకి వెళితే.. ముంబైలోని లోవర్ పారెల్ ప్రాంతంలో గురువారం ఎస్యూవీ కారులో ఇద్దరు వ్యక్తులు తిమింగళం వాంతి(అంబర్గ్రిన్)ని తీసుకెళుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్థారణ చేసుకున్న పోలీసులు సీతానగరం మిల్స్ వద్ద వారిని అడ్డుకొని 7.75 కోట్లు విలువ చేసే తిమింగళం వాంతిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులలో ఒకరు మాజీ పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించాడు. 2016లో అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. తాజాగా రాయ్గడ్ జిల్లాలోని అలీబాగ్ తీర ప్రాంతంలో తిమింగళం వాంతి పదార్థాన్ని దొంగలించినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం -
బాలీవుడ్ లవ్ బర్డ్స్పై కేసు: హీరో తల్లి ఏమందంటే?
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్ ప్రేమజంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు. దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది. 'టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది. In the ongoing ‘War’ against the virus, going ‘Malang’ on the streets of Bandra cost dearly to two actors who have been booked under sections 188, 34 IPC by Bandra PStn . We request all Mumbaikars to avoid unnecessary ‘Heropanti’ which can compromise on safety against #COVID19 — Mumbai Police (@MumbaiPolice) June 3, 2021 చదవండి: దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
అంబానీ ఇంటి వద్ద కలకలం కేసు: సచిన్ వాజేకు షాక్
ముంబై: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే ఇక మాజీ పోలీస్ అధికారిగా మారిపోయాడు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ముంబై పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్కు గురైన అతడిని తాజాగా మంగళవారం పోలీస్ శాఖ నుంచి పంపించేశారు. పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా సచిన్ వాజే పేరు ప్రఖ్యాతులు పొందారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల నిలిపి ఉన్న కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలతో పట్టుబడిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే.. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా శాఖపరమైన చర్యలు ముంబై పోలీసులు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్పై చేతులెత్తేసిన ఢిల్లీ చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
Daya Nayak: ఎన్కౌంటర్ స్పెషలిస్టుపై బదిలీ వేటు
సాక్షి, ముంబై: ఎన్కౌంటర్ స్పెష్టలిస్టుగా పేరొందిన ముంబై పోలీసు శాఖకు చెందిన దయా నాయక్ను విదర్భలోని గోందియా జిల్లాకు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేసినట్లు అప్పర్ పోలీసు డీజీపీ కుల్వంత్ సారంగల్ తెలిపారు. ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తుల గుండెళ్లో దడ పుట్టించిన నాయక్పై తరుచూ బదిలీ వేటు పడేది. ఒక్కచోట కూడా ఏడాది లేదా ఏడాదిన్నర కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించలేదు. ఓ సారి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో సస్పెండ్ వేటు కూడా పడింది. విచారణ పూర్తయిన తర్వాత విధుల్లోకి చేరిన నాయక్ ఇప్పటికీ ఏ పోలీసు స్టేషన్లో నిలకడగా విధులు నిర్వహించలేదు. మొన్నటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక శాఖ (ఏటీఎస్) బృందం జుహూ యూనిట్లో సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఏడాదిన్నర క్రితమే ఆయన్ను ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్ శాఖ నుంచి జుహూ యూనిట్కు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ గోందియాకు బదిలీ చేయడం గమనార్హం. ఏటీఎస్లో ఉత్తమ ప్రతిభ ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్లో విధులు నిర్వహిస్తుండగా నాయక్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనేక కీలక కేసులను ఛేదించారు. డ్రగ్స్ మాఫియా ఆటలు సాగనివ్వలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్, మాతోశ్రీ బంగ్లాకు బెదిరింపు ఫోన్లు చేసిన ఆగంతుకున్ని నాయక్ తన సహచర బృందంతో కలిసి కోల్కతాలో పథకం ప్రకారం అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. గోందియా జిల్లాలో పోలీసుల కులధ్రువీకరణ పత్రాలను పరిశీలించే విభాగానికి బదిలీ చేశారు. అదేవిధంగా థానే జిల్లా బలవంతపు వసూళ్ల నిరోధక శాఖ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కోథమిరేను గడ్చిరోలికి బదిలీ చేశారు. చదవండి: ఆన్లైన్లో బీర్ ఆర్డర్ చేసి లక్షన్నర పోగొట్టుకున్నాడు! సన్యాసం తీసుకున్న ముఖేశ్ అంబానీ స్నేహితుడు -
లాక్డౌన్లో లవర్ని ఎలా కలవాలి.. పోలీసుల ఫన్నీ రిప్లై
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కోవిడ్ తాకిడికి కకావికలం అయ్యింది. బెడ్స్ లేక.. తగినంత ఆక్సిజన్ లభించక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం నేటి నుంచి మే 1 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. పోలీసులు కేవలం అత్యవసర, నిత్యవసరాల కోసమే ప్రజలను బయటకు వదులుతున్నారు. పనిలేకుండా బయట తిరిగితే లాఠీలకు పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఓ వింత కోరిక కోరాడు. ‘‘నా లవర్ని మిస్ అవుతున్నాను. లాక్డౌన్ కాలంలో ఆమెను కలిసేందుకు బయటకు వెళ్లాలి అనుకుంటున్నాను. ఇందుకు నా వాహనం మీద ఏ రంగు స్టిక్కర్ వాడాలి?’’ అని ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు. దీనిపై కాప్స్ స్పందిస్తూ.. ‘‘మీకు ఇది ముఖ్యమైనదని మేం అర్థం చేసుకోగలం. కానీ, ఇది మా నిత్యవసర లేదా అత్యవసర జాబితాలో లేదు. దూరం బంధాలను మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం. ఇది చాలా చిన్న అడ్డంకి. త్వరలోనే ముగుస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. ముంబై పోలీసులు ఇచ్చిన ఈ సమాధానానికి కొందరు నెటిజనుల హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ఇలాంటి పనికిమాలిని వాటికి వెంటనే రిప్లై ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. We understand it’s essential for you sir but unfortunately it doesn’t fall under our essentials or emergency categories! Distance makes the heart grow fonder & currently, you healthier P.S. We wish you lifetime together. This is just a phase. #StayHomeStaySafe https://t.co/5221kRAmHp — Mumbai Police (@MumbaiPolice) April 22, 2021 చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1 వరకు -
‘అమ్మ.. మాస్క్ రెండూ కాపాడేవే’
ముంబై: దేశవ్యాప్తంగా కరోనావైరస్ చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వారాంతపు కర్ఫ్యూలు, కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి. కాగా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ముంబై పోలీసులు సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సోషల్ మీడియాలో మాస్క్కు ఉన్న ప్రాముఖ్యం తెలియజేస్తూ ఓ ఫొటో విడుదల చేశారు. మాస్క్, అమ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. అమ్మ మనకు జన్మనించి నవమాసాలు మోసి, తన పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూస్తుంది. అలాగే ప్రతి ఒకరు విధిగా మాస్క్ ధరిస్తే అది కూడా మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడుతుందనే సందేశం ఆ ఫొటో ద్వారా తెలిపారు. కాగా ఆ ఫొటోలో ‘మా’ అనే హిందీ పదానికి ఎస్కే అక్షరాలను జోడించి మాస్క్ అని అర్ధం వచ్చేలా చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముంబై పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. What do moms and masks have in common?#TakingOnCorona pic.twitter.com/lHRFZCzaiL — Mumbai Police (@MumbaiPolice) April 19, 2021 చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
60 వేల రెమిడెసివిర్ వయల్స్ విదేశాలకు..
ముంబై: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో రెమిడెసివిర్ టీకాకు డిమాండ్ అదేస్థాయిలో పెరుగుతోంది. కరోనా చికిత్సలో రెమిడెసివిర్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఈ టీకా కొరత వేధిస్తోంది. కొరత నేపథ్యంలో టీకా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, డామన్కు చెందిన బ్రూక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 60,000 రెమిడెసివిర్ వయల్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు తరలించినట్లు మంబై పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ డైరెక్టర్ రాజేశ్ డొకానియాను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం రాజేశ్ డొకానియా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్రూక్ ఫార్మా సంస్థ రెమిడెసివిర్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారీ సంఖ్యలో వయల్స్ను విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బ్రూక్ ఫార్మా డైరెక్టర్ను పోలీసులు ప్రశ్నించడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని అధికార శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించింది. రాజేశ్ డొకానియాను తరలించిన పోలీసు స్టేషన్కు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తోపాటు బీజేపీ నేతలు చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. బ్రూక్ ఫార్మా కంపెనీతో మాట్లాడి, మహారాష్ట్రకు రెమిడెసివిర్ టీకాలు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బ్రూక్ ఫార్మా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అత్యవసరమైన టీకాలను విదేశాలకు అక్రమంగా తరలించిన ఫార్మా కంపెనీ డైరెక్టర్ను పోలీసులు విచారిస్తే బీజేపీకి అభ్యంతరం ఎందుకో చెప్పాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీశాయి. రాజేశ్ డొకానియాను పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. -
దొంగలతో వీరోచిత ఫైటింగ్, ముంబై పోలీసుల అభినందనలు
భిక్కనూరు: మహారాష్ట్రలోని నివసిస్తున్న భిక్కనూరుకు చెందిన బూర్ల నగేశ్ను ముంబై పోలీసులు అభినందించారు. వివరాలు.. భిక్కనూరుకు నగేష్15 ఏళ్లుగా ముంబైలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం జోగేశ్వర్ ఈస్ట్ ఏరియాలోని శాటిలైట్ ఏస్టేట్లో ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆయన పక్క ఫ్లాట్లో డాక్టర్ రమేశ్ యాదవ్ దంపతులు ఉంటున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం తన పక్క ఫ్లాట్లోకి దొంగలు చొరబడి ఓ మహిళను కత్తితో హతమార్చబోగా నగేశ్ వారితో తలబడ్డాడు. మహిళను కాపాడిన నగేశ్ను అక్కడి పోలీసులు అభినందించారు. నగేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కొరియర్ పేరిట అపార్టుమెంట్లోకి చొరబడి మహిళను తల్వార్తో హతమార్చేందుకు యత్నించారన్నారు. ఆమె అరవడంతో తాను వెళ్లి దొంగలతో పోరాడనని చెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. రెండో వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారని చెప్పారు. చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్తో కొట్టి హత్య -
No Mask: ‘కప్ప నడక’.. బాల్య స్మృతుల్లోకి పారిశ్రామిక దిగ్గజం
ముంబై: మళ్లీ ముదనష్టపు మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తోంది. అయినా కూడా ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ కరోనా జాగ్రత్తలు తీసుకునేలా పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మాస్క్లు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. అలా మాస్క్ లేదని కనిపించిన కొందరికి ముంబై పోలీసులు ‘కప్ప నడక’ శిక్ష విధించారు. ముంబైలోని సముద్రపు ఒడ్డున మాస్క్ లేకుండా వెళ్తున్న యువతను గుర్తించిన పోలీసులు కప్ప మాదిరి కొన్నిసార్లు గెంతాలని చెప్పారు. దీంతో ఆ యువత మాస్క్ ధరించకపోవడంతో కప్ప నడక చేశారు. అయితే ఈ ఘటన పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్ సంస్థ యజమాని ఆనంద్ మహేంద్ర కంటపడింది. వామ్మో అనుకున్నారు. తన జ్ఞాపకాల నిధిని ఈ ఘటన గుర్తు చేసిందని ట్వీట్ చేశారు. తాను చిన్నప్పుడు పాఠశాలలో ఇలాంటి కుప్పి గంతులు శిక్షగా వేశానని గుర్తు చేసుకున్నారు. ఇది నవ్వు తెప్పించేదే కానీ.. శారీరక శ్రమ అని పేర్కొన్నారు. ఇకపై తాను తప్పనిసరిగా మాస్క్ ధరిస్తానని ఆనంద్ మహేంద్ర ఆ వీడియోను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా పోలీసులు వేసిన శిక్ష ఆనంద్ మహేంద్ర దృష్టికి రావడం.. ఆయన బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. “Face mask rule violators at Marine Drive in Mumbai being made to do a “Murga” walk as punishment by Mumbai Police” Received on my ‘SignalWonderbox.’ A common punishment in the boarding school I attended. Comical, but physically taxing.I certainly won’t forget my mask!! pic.twitter.com/GnVY6NfasV — anand mahindra (@anandmahindra) March 30, 2021 -
ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు..
ముంబై: సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కారు ముగ్గురు యువకులు. అశ్లీల ప్రాంక్ వీడియోలు చిత్రీకరిస్తూ కోట్లు ఆర్జించారు. దీనిపై కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేష్ గుప్త(29), జితేంద్ర గుప్త(25), కుమార్ సవ్(23) యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ అందించేవారు. దీంతోపాటు సొంతంగా 17యూట్యూబ్ ఛానళ్లను నడిపేవారు. ఇవన్నీ కూడా పోర్న్కు సంబంధించినవే. ఈ ఛానళ్లకు 20 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాగా, ఒక మహిళతోపాటు, ముగ్గురు మైనర్ బాలికలు ప్రాంక్ వీడియో చేస్తే కావల్సినంత డబ్బులిస్తామని ఆఫర్ చేశారు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించి, వారి ప్రైవేట్పార్ట్స్ను తాకాలని చూశారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితురాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 4 మొబైల్ ఫోన్లు, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోక్సో, అశ్లీల నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులు లాక్ డౌన్ సమయంలో 300ల వరకు అశ్లీల వీడియోలు వారి యూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేసి రూ.2కోట్ల వరకు ఆర్జించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ముఖేష్ విద్యార్థులకు చదువు చెప్పేవాడని, అతని దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఈ వీడియోలతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’ -
ముంబై: ‘ఆపరేషన్ ఆలౌట్’.. దడ మొదలైంది!
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 39 మంది నేరస్తులను ముంబై పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నగరంలోని అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 951 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబై పోలీసులు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ‘ఆపరేషన్ ఆలౌట్’ పథకం సత్పలితాలనిస్తోంది. ఈ కూంబింగ్ ఆపరేషన్లో స్థానికంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్ లేని ఆయుధాలతో తిరుగుతున్న నేరస్తులు కూడా ఇందులో పట్టుబడుతున్నారు. దీంతో కరుడుగట్టి నేరస్తులతోపాటు ఇళ్లల్లో దాక్కున్న సాధారణ నేరస్తుల్లో దడ మొదలైంది. ముంబై సీపీ నేతృత్వంలో.. శివ్ (శివాజీ) జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్ చేపట్టారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్, విశ్వాస్ నాంగరే–పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ల మార్గదర్శనంలో కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. తమ తమ పోలీసుస్టేషన్ల హద్దులో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు 259 చోట్ల కూంబింగ్ నిర్వహించారు. అందులో పరారీలో ఉన్న 39 మంది నేరస్తులను పట్టుకోగా లైసెన్స్ లేకుండా అక్రమంగా ఆయుధాలతో తిరుగుతున్న 37 మందిపై, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నివాసముంటున్న వారిపై కూడా ఈ ఆపరేషన్లో చర్యలు తీసుకున్నారు. అందులో హోటళ్లు, ముసాఫిర్ ఖానా, లాడ్జింగులు, గెస్ట్ హౌస్లు తదితర అద్దె నివాస గృహాలలో 951 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ఆలౌట్లో భాగంగా రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్ లక్ష్యమే. సిగ్నల్స్ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా ముంబై పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లేదా నగరాన్ని తిలకించేందుకు వచ్చి తప్పిపోయి తిరుగుతున్న లేదా ప్రేమలో మోసపోయి ఇంటికి వెళ్లలేక ఇక్కడే తిరుగుతున్న పిల్లలన్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో అనేక మంది పిల్లలు రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్పాత్లపై లభించారు. వీరి చిరునామా సేకరించి ఇళ్లకు పంపించడంతో అనేక పేద కుటుంబాలు ఉపరి పీల్చుకున్నాయి. అంతేగాకుండా ఈ పథకం చేపట్టినందుకు ముంబై పోలీసులు వివిధ రంగాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఉత్తరాఖండ్: మూడేళ్ల కొడుకును వదిలి -
సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇంకా విచారణ సాగుతోంది. విచారణలో భాగంగా సోమవారం అతడి సోదరి మీటు సింగ్కు బెయిల్ లభించింది. అయితే మరో సోదరి ప్రియాంక సింగ్కు మాత్రం షాక్ తగిలింది. ఆమెకు బాంబే హైకోర్టు క్లీట్ చిట్ ఇవ్వలేదు. ఆమె పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయ పడింది. సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి ఓ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇద్దరు సోదరిలు మీటు సింగ్, ప్రియాంక సింగ్పై రియా కేసు నమోదు చేయించింది. ఈ కేసుపై బాంబే హైకోర్టు తన తీర్పులో మీటూ సింగ్కు ఊరట కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సతీశ్ మనేశ్ షిండే, ఎంఎస్ కార్నిక్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విచారణ చేపట్టింది. రియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్లను సుశాంత్ సోదరిలు కొట్టివేయాలని కోర్టును కోరారు. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో సోదరి ప్రియాంక సింగ్పై కొన్ని ప్రాథమిక అనుమానాలు ఉన్నాయని, ఆమెను విచారణకు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు తన పేర్కొన్నది. దీంతో మీటుకు ఊరట లభించగా ప్రియాంకకు షాక్ తగిలింది. అయితే నటి రియా డాక్టర్ తరుణ్ కుమార్పై కూడా కేసు నమోదు చేయించింది. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రియా చక్రవర్తి సత్యం కోసం కృషి చేస్తుందని.. ఆమె వేదనంతా అదేనని న్యాయమూర్తి సతీశ్ మనేశ్ షిండే పేర్కొన్నారు. హీరోయిన్ మెహ్రీన్కు కాబోయే భర్త ఎవరో తెలుసా..? లైవ్లో ఏడ్చేసిన హీరోయిన్ -
జైల్లో వేసిన నకిలీ ట్వీట్
సాక్షి, ముంబై: సినిమా థియేటర్లో బాంబు ఉందని నకిలీ ట్వీట్ పోస్ట్ చేసిన ఓ యువకున్ని ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని హరియాణాకు చెందిన బన్వారి సింగ్గా గుర్తించారు. వివరాలు.. జనవరి చివరి వారంలో ‘మేడం చీఫ్ మినిస్టర్’ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్లో బాంబు పేలుస్తామని బన్వారి సింగ్ ట్వీట్ చేశాడు. అందుకు బన్వారీ కమాండో సింగ్ పేరుతో ట్విటర్లో అకౌంట్ తెరిచాడు. అదే పేరుతో బాంబు పేలుస్తామనే సందేశాన్ని పోస్టు చేయడంతో ముంబై సైబర్ క్రైం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఆ సినిమా థియేటర్లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ సందేశం హరియాణా నుంచి కమాండో సింగ్ పేరుతో బన్వారి ట్విట్ చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. బన్వారీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! -
అర్నాబ్ గోస్వామిపై పరువు నష్టం దావా
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి రిపబ్లిక్ మీడియా అధినేత అర్నాబ్ గోస్వామి, అతని భార్య సమ్యబ్రతా రే గోస్వామిలపై ముంబై జోన్-9 డీసీపీ అభిషేక్ త్రిముఖే పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మిస్టర్ అండ్ మిసెస్ గోస్వామిలపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశానని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా దాఖలు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది జూన్ 14న బాంద్రాలోని ఫ్లాట్లో సుశాంత్ అనుమాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
టీఆర్పీ స్కాం: అర్నబ్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఛీప్ అర్నబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్గుప్తా పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. (టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్ ) ‘2004 నుంచే అర్ణబ్ నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తర్వాత 2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ పలు ప్రణాళికల గురించి నాతో అనేకసార్లు చర్చించేవాడు. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్ణబ్కు బాగా తెలుసు. ఇందుకు బదులుగా భవిష్యత్తులో నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్ టీవీకి నంబర్1 రేటింగ్ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశాను. 2017 నుంచి 2019 వరకు ఇది కొనసాగేది. ఇందుకుగానూ అర్నబ్ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నాను' అని దాస్గుప్తా తెలిపారు. టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్షీట్ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్ను కూడా పొందుపరిచారు. వీరిద్దరి మధ్యా 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే పార్థోదాస్కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం. (టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట) Mumbai Police releases 500 pages WhatsApp chat between Arnab Goswami and Partho Das Gupta ( Ex CEO of BARC) pic.twitter.com/C3wnxjRi0N — Abhijeet Dipke (@abhijeet_dipke) January 15, 2021 -
‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !!
ఆమె ఓ గాయని, బతుకుదెరువు నిమిత్తం ముంబై నుంచి నగరానికి వలస వచ్చి క్లబ్లు, ఈవెంట్లలో పాటలు పాడుతూ జీవనం సాగించేది. క్లబ్బుల్లో క్యాబరేలను ప్రభుత్వం నిషేధించడంతో చోరీలవైపు దృష్టి సారించింది. దేశంలోని పలు నగరాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ల్లో మహిళలకు చెందిన హ్యాండ్ బ్యాగులు, విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్న ‘చోర్ సింగర్’ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమెకు గతంలో నగరంలో జరిగిన మూడు చోరీ కేసుల్లోనూ సంబంధం ఉన్నట్లు తేలింది. సాక్షి, హైదరాబాద్: విమానాల్లో తిరుగుతూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ మాల్స్కు వచ్చే మహిళలను టార్గెట్గా చేసుకుని బ్యాగ్ చోరీలకు పాల్పడుతూ గత నెలలో ముంబై పోలీసులకు చిక్కిన సింగర్ మున్మూన్ హుస్సేన్ సిటీ పోలీసులు వాంటెడ్గా ఉన్నట్లు తేలింది. ఈమెపై గతంలో సైఫాబాద్ అబిడ్స్ ఠాణాల్లో మూడు కేసులు నమోదై ఉన్నాయి. ► పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్మూన్ హుస్సేన్ కొంతకాలం పాటు కోల్కతాలో సింగర్గా పని చేసింది. ఆపై హైదరాబాద్కు మకాం మార్చి బార్ అండ్ రెస్టారెంట్స్లో క్యాబరే సింగర్గా మారింది. చదవండి: ఔరా.. ముగ్గురేనా? ►మరో పక్క గణేష్ ఉత్సవాలు, వివాహాల్లోనూ పాటలు పాడేది. నగరంలో క్యాబరేను నిషేధించడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వివాహాలు, గణేష్ ఉత్సవాలు సీజనల్ కావడంతో చోరీల బాట పట్టిన మున్మున్ మహిళల హ్యాండ్ బ్యాగ్స్ చోరీ చేసేది. ► చెన్నైలోని అన్నానగర్లో నివసించే హీరో విశాల్ తల్లి జానకీదేవి 2009 జూన్లో నగరంలో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. అదే నెల 15న సాయంత్రం ఆమె పట్టు చీరలు కొనేందుకు బషీర్బాగ్లోని ధర్మవరం సిల్క్ శారీస్ షోరూమ్కు వెళ్లారు. ►తన హ్యాండ్ బ్యాంగ్ను పక్కన పెట్టి చీరలు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అరగంట తర్వాత ఆమె తన బ్యాగు కోసం చూడగా అది కనిపించలేదు. దీంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.65 వేల నగదు, రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ఫోన్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ►బ్యాగు పోయిన దుకాణం అప్పటికే చాలా పాతది కావడంతో అందులో సీసీ కెమెరాలు లేవు. దీంతో కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాగులు చోరీ చేసే పాత నేరస్తుల వివరాలు ఆరా తీశారు. చోరీ జరిగింది చీరల దుకాణంలో కావడంతో ఈ తరహా చోరీలు చేసే మహిళలపై దృష్టి సారించారు. ► ఫలితంగా చిక్కడపల్లి సూర్యనగర్లో నివసించే మున్మూన్హుస్సేన్ అలియాస్ మున్మూన్ బౌరా అలియాస్ రచన పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు 2009 ఆగస్టు 12న అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది. ► దీంతో మున్మూన్ను అరెస్టు చేసి ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. రూ.65 వేల నగదు మాత్రం ఖర్చయిపోవడంతో రికవరీ కాలేదు. ► 2010 మే 13న మున్మూన్ మరో నేరం చేసింది. కుందన్బాగ్కు చెందిన ఓ బాధితురాలు ఆదర్శ్నగర్లోని బాలాజీ గ్రాండ్ బజార్కు వచ్చింది. అక్కడకు వెళ్లిన ఈ చోర్ సింగర్ ఆమె బ్యాగ్ను తస్కరించింది. అందులో రూ.20 వేల నగదు, తులం బంగారం ఉన్నాయి. ► ఈ కేసులోనూ సైఫాబాద్ పోలీసులు మున్మూన్ను అరెస్టు చేశారు. దీనికి ముందే అబిడ్స్ ఠాణా పరిధిలోనే ఆమె ఓ నేరం చేసింది. ఇక్కడి పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చింది. విమానాల్లోనే తిరుగుతూ పంజా విసరడం మొదలెట్టింది. ► కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ల్లో వరుస చోరీలకు పాల్పడింది. తాజాగా గత నెల 17న ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చిక్కింది. ఈమెపై నగరంలో కొన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో ఇక్కడి పోలీసులకూ వాంటెడ్గా మారింది. -
ఐర్లాండ్.. ముంబై.. ధులే..!
ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన ఐర్లాండ్ లోని ఫేస్బుక్ అధికారులు వెంటనే ముంబై పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించి, యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అంతా 50 నిమిషాల్లోపే పూర్తయింది. ధులే పోలీస్ ఠాణాలో హోంగార్డ్గా చేస్తున్న వ్యక్తి కుమారుడు(23) ఆదివారం చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీనిని ఐర్లాండ్లోని ఫేస్బుక్ సిబ్బంది గమనించి వెంటనే ముంబైలోని సైబర్ క్రైం పోలీస్ డిప్యూటీ కమిషనర్ రశ్మి కరండికర్కు ఫోన్ చేసి తెలిపారు. ఆమె వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తంచేశారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు రాత్రి 9 గంటలకల్లా ధులేలోని భోయి సొసైటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో గాయపడి ఉన్న బాధిత యువకుడిని గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. సోమవారం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్పీ చిన్మయ్ పండిట్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్
ముంబై : టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్ఫ్లై క్లబ్లో జరిగిన దాడుల్లో రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాతో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ సహా మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వెంటనే వారిని బెయిల్పై విడుదల చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో ముంబై క్లబ్కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు.(చదవండి : ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఇంటికి వచ్చి) కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసి కేసు నమోదు చేశామని.. వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ తెలిపింది. అనంతరం నిందితులను బెయిల్పై విడుదల చేశారు. క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 34 మందిపై ఐపిసి సెక్షన్ 188, 269, 34, ఎన్ఎండిఎ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంతో పాటు ముంబైలో డిసెంబర్ 22 నుండి జనవరి 5 వరకు ప్రజా కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : బ్రాడ్మన్ క్యాప్కు అరుదైన గౌరవం) -
ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్షా
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్ అరెస్ట్ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) ‘కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దాడిని వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన పత్రికపై దాడిగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని మనమందరం ఖండించాలి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
పోలీసుల విచారణకు రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓ
ముంబై: టీఆర్పీ స్కామ్కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఈఓ వికాస్ ఖాన్చందానీ, సీఓఓ హర్‡్ష భండారి ఆదివారం ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిలో సీఈఓ వికాస్ను 9 గంటల పాటు, హర్‡్షను 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఏ విధమైన ఒత్తిడికైనా తలొగ్గబోమని ఈ సందర్బంగా రిపబ్లిక్ టీవీ ప్రకటించింది. ‘ఈ రోజు మా సీఈఓ, సీఓఓ, డిస్ట్రిబ్యూషన్ టీమ్ సీనియర్ సభ్యుడిని పోలీసులు సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ఈ స్కామ్కు సంబంధించి హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిపబ్లిక్ టీవీ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచి సంపాదించిందనే ప్రశ్ననే వారు అడిగారు’ అని పేర్కొంది. అది ఎడిటోరియల్ విషయమని వారికి సీఈఓ జవాబిచ్చారని తెలిపింది. ‘హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఎలాంటి ఆరోపణ లేదు. ఇండియా టుడే చానెల్ పేరునే ఆ ఫిర్యాదులో హంస ఏజెన్సీ ప్రస్తావించింది. ఫిర్యాదు కాపీ లో ఉన్న విషయాన్ని అక్టోబర్ 10 వ తేదీననే రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది’ అని వివరించింది. -
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
-
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ టీర్పీ రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్లో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్ కమిషనర్ పరయ్ బీర్ సింగ్.. టీవీ రేటింగ్స్ స్కాం వివరాలను గురువారం వెల్లడించారు. బార్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్ టీర్పీ రేటింగ్ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం టెలివిజన్తో పాటు, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కాంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ యజమాని కూడా ఉన్నాడని సమాచారం. -
అనురాగ్ కశ్యప్కు సమన్లు
ముంబై: సినీనటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్పై ముంబై పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని అనురాగ్ కశ్యప్కు సమన్లు జారీ చేశారు. గురువారం వెర్సోవా పోలీసు స్టేషన్కు రావాలని పేర్కొన్నారు. అనురాగ్పై సెప్టెంబర్ 22న పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన తనపై 2013లో తనను వేధించాడని పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. అనురాగ్ను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
లైంగిక వేధింపులు: దర్శకుడికి సమన్లు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనురాగ్పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?) ఇప్పటికే అనురాగ్పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్పై కేసు నమోదు) -
బచ్చన్ ఫ్యామిలీకి మరింత భద్రత
ముంబై: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ రాజ్యసభలో ప్రస్తావించిన అనంతరం ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బచ్చన్ల ఇంటికి సెక్యూరిటీ మరింత పెంచారు. జుహూలోని బచ్చన్స్ ఐకానిక్ బంగ్లా అయిన జల్సా వెలుపల అదనపు భద్రత కల్పించారు. సుశాంత్సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధించి బాలీవుడ్పై వస్తోన్న ఆరోపణలపై జయాబచ్చన్ మంగళవారం రాజ్యసభలో ప్రసంగించించారు. ఆమె ప్రసంగంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా ట్రోల్స్ వచ్చిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. దీనికి జయా బచ్చన్ స్పందిస్తూ.. కొంతమంది వ్యక్తుల కారణంగా బాలీవుడ్ ప్రతిష్టను కించపర్చడం సరి కాదు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు' అంటూ జయాబచ్చన్ మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం పార్లమెంటులో జయాబచ్చన్ తీసుకున్న వైఖరికి శివసేన మద్దతుగా ముందుకు వచ్చింది. రవికిషన్ ఆరోపణలపై శివసేన అనుబంధ పత్రిక సామ్నా సంపాదకీయంలో 'అలాంటి వాదనలు చేసేవారు కపటవాదులని.. వారి ప్రకటనలు ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉంటాయని పేర్కొంది. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
నాలుగంచుల ఖడ్గం
కంగనకు ముంబై రోడ్లు బ్లాక్ అయి ఉన్నాయి. లోపలికి రానివ్వం అంటున్నారు శివసైనికులు. ‘క్వీన్’లో ఇలాగే ఆమె పెళ్లి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఆత్మాభిమానం అనే ఖడ్గాన్ని తీస్తుంది. ఇప్పుడూ.. సేమ్ అదే.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయుధం. మూవీ మాఫియా.. సోషల్ మీడియా... ముంబై పోలీసులు.. స్టార్లు, కో–స్టార్లు.. వీళ్లందరిపై.. ఒంటరిగా యుద్ధం చేస్తోంది. నాలుగంచుల ఖడ్గంగా రీమేక్ అవుతోంది. రేపు ముంబై బయల్దేరాలి కంగనా రనౌత్. రేపు బయల్దేరితేనే ఎల్లుండికి ముంబైలో ఉంటారు. ఏమిటి అంత అత్యవసరం? ఆమె చాలెంజ్ చేశారు. ‘తొమ్మిదిన ముంబైలో దిగుతున్నాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అని. ఆ ఛాలెంజ్ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్కి! ‘మూవీ మాఫియా కన్నా డేంజర్ ముంబై పోలీసులు అన్నావు కదా. అయితే ముంబై రాకు’ అన్నారాయన. కంగన ఛాలెంజ్ శివసేన ఎంపీకి కూడా. ‘ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్నావు కదా.. అయితే నువ్వెలా ముంబైలోకి అడుగుపెడతావో చూస్తాను’ అన్నారు ఆయన. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం తర్వాత కంగన చాలామందిని చాలానే అన్నారు. అలా అనడంలో ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడూ ఒంటరిగానే మనాలి నుంచి క్యాబ్లోనో, బస్లోనో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో ముంబై వెళుతున్నారు! కొన్నాళ్లుగా కంగన హిమాచల్ ప్రదేశ్లో తను ఇల్లు కట్టుకున్న మనాలిలో తల్లితో కలిసి ఉంటున్నారు. ముంబై చిత్రసీమలోని బంధుప్రీతి మీద, అక్కడి డ్రగ్ ముఠాల మీద, మీడియా మాఫిమా మీద, ముంబై పోలీసుల మీద ధైర్యంగా మాట్లాడగలిగిన అమ్మాౖయెతే కాదు కంగన. కానీ మాట్లాడుతున్నారు! ఆ ధైర్యం ముంబై ఇచ్చిందే. అవతలి వ్యక్తిలో తప్పు కనిపిస్తే వచ్చే ధైర్యం అది. ముంబైలో ఒక తప్పు కాదు, వంద తప్పులు కనిపించాయి కంగనకు. ముంబై చేసిన మొదటి తప్పు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెను ఆక్రమించుకోవడం. చివరి తప్పు (ఆమె మనాలి వెళ్లే ముందు వరకు) సుశాంత్ ఎలా చనిపోయాడో తెలియనివ్వకుండా చంపేయడం. తక్కిన బయటి తారల్లా ముంబై తనకు సంబంధం లేని విషయం అనుకోవడం లేదు కంగన. ముంబై ఆమెకు ఎంత ఇచ్చిందో కానీ, ఆమె దగ్గర్నుంచి చాలానే తీసేసుకుంది! ముఖ్యంగా ఆమె అమాయకత్వాన్ని. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా ఉన్నారు కంగన. 2014 లో వచ్చిన ఆమె చిత్రం ‘క్వీన్’ లోని రాణీ మెహ్రాలా.. కోమలంగా, లాలిత్యంగా. ‘క్వీన్’ సినిమాలో సగటు పంజాబీ అమ్మాయి కంగన. ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. తండ్రిది మిఠాయి దుకాణం. పెళ్లికి ఏర్పాట్లు అవుతుండగా అప్పుడు చెబుతాడు ఆమెకు రాజ్కుమార్రావ్.. ‘నీకూ నాకూ అసలేదీ కలవదు.. ఐయామ్ సారీ. నేన్నిన్ను పెళ్లి చేసుకోలేను. చేసుకుని నా లైఫ్స్టెయిల్తో నిన్ను బాధించలేను’ అని! విదేశంలో కొంతకాలం ఉండొస్తాడు అతడు. అదీ స్టెయిల్. ఆమె వెంటపడి వెంటపడి ప్రేమించినప్పుడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించినప్పుడు, ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినప్పుడు, పెళ్లయ్యాక హనీమూన్కి పారిస్, ఆమ్స్టర్డ్యామ్ టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పుడు అతడికి తన లైఫ్స్టెయిల్ గుర్తుకు రాదు. పెళ్లి ఆగిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకోడానికి కసిగా.. తనొక్కటే తల్లిదండ్రులను ఒప్పించి ప్యారిస్ వెళ్లిపోతుంది కంగన. అక్కడి నుంచి ఆమ్స్టర్డ్యామ్. ఆ కొన్నాళ్ల ఒంటరి జీవితం ఆమెకు అనేక అనుభవాలను ఇస్తుంది. స్వేచ్ఛానుభూతులను మిగులుస్తుంది. ఒక తొలిముద్దును కూడా. ఓరోజు పల్చటి డ్రెస్ వేసుకుని తీసుకున్న సెల్ఫీని కంగన పొరపాటున రాజ్కుమార్ రావ్కి షేర్ చేస్తుంది. అది చూసి కంగనను వెతుక్కుంటూ ఆమ్స్టర్డ్యామ్ వస్తాడు. సారీ చెప్తాడు. తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తాడు. ‘నువ్వెళ్లు. ఢిల్లీ వచ్చాక కలుస్తాను’ అంటుంది. కళ్లలో ఆశలు పెట్టుకుని, ఆమె కోసం మనసులో దీపాలు వెలిగించుకుని అతడు వెళ్లిపోతాడు. ఢిల్లీలో దిగాక కంగన నేరుగా రాజ్కుమార్ రావ్ ఇంటికి వెళ్లి, హ్యాండ్బ్యాగ్లో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి అతడి చేతిలో పెట్టి, ‘థ్యాంక్యూ’ చెప్పి వచ్చేస్తుంది. ఆమె ముఖంలో పెద్ద రిలీఫ్. ‘క్వీన్’ చిత్రం మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రధానంగా అమ్మాయిలు ఆ సినిమాతో ‘రిలేట్’ అయ్యారు. ‘రాణిలా చూసుకుంటా..’ అనే మాట వినిపిస్తుంటుంది.. ప్రేమల్లో, పెళ్లిళ్లలో! ఎవరూ చూసుకోనవసరం లేదు. ఆత్మాభిమానమే ఆడపిల్లను రాణిని చేస్తుంది. ఆ ఆత్మాభిమానమే ఇప్పుడు నాలుగు భాషల్లోకి రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’. క్వీన్ తమన్నా. తమిళ్లో ‘పారిస్ పారిస్’. క్వీన్ కాజల్. మలయాళంలో ‘జామ్ జామ్’. క్వీన్ మంజిమ. కన్నడంలో ‘బటర్ఫ్లై’. క్వీన్ పరుల్ యాదవ్. ముగ్గురు వేర్వేరు దర్శకులు రీమేక్ చేస్తున్న ఈ నాలుగు సినిమాలను మను కుమరన్ ఒక్కరే నిర్మిస్తున్నారు. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా కోమలంగా ఉన్నారని కదా అనుకున్నాం కంగన గురించి. ముంబైకి ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలూ తమ అసలు స్వరూపం చూపించి కంగనని క్రూరమైన రాణిగా రాటుదేల్చాయి. ఇప్పటికీ ఆమే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం డిమాండ్ చేయగల బయటి తార. టాలెంట్ ఉంది. దాంతో పాటు ధర్మాగ్రహం ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. బాలీవుడ్ నలు చదరపు బంధుగణాల క్లబ్బులలో ఇమడని నికార్సయిన గుండ్రటి షాంపేన్ గ్లాస్ కంగనా రనౌత్. రాణి వెడలుతున్నారు. చూడాలి.. ముంబైలో బుధవారం రిక్టర్ స్కేలు ఎంత చూపిస్తుందో. తెలుగు క్వీన్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా; తమిళ్ క్వీన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ మలయాళీ క్వీన్ ‘జామ్ జామ్’లో మంజిమ; కన్నడ క్వీన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ -
రియా చక్రవర్తికి భద్రత కల్పించనున్న పోలీసులు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం ముంబై పోలీసులకు లేఖ రాసింది. రియాతోపాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉన్న క్రమంలో సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డిమాండ్ మేరకు డీఆర్డీఓ అతిథి గృహం నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో రియా చక్రవర్తికి భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. అయితే గురువారం రియా చక్రవర్తి ఇంటి ముందు మీడియా వ్యక్తులు తనను వేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని రియా ముంబై పోలీసులను కోరారు. కొంతమంది మీడియా వ్యక్తులు తన బిల్డింగ్ కాంపౌండ్లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం రియా ఆమె సోదరుడు షోవిక్లు సీబీఐ దర్యాప్తు కోసం డీఆర్డీఓ కార్యాలయానికి బయలు దేరే ముందే వారికి రక్షణ కల్పించేందుకు ముంబై పోలీసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. కాగా సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను సీబీఐ అధికారులు శుక్రవారం 10 గంటలకు పైగా విచారించారు. ముఖ్యంగా రియా, సుశాంత్ మధ్య ఉన్న సంబంధం గురించి వారు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. -
అలా బయటకు కనిపిస్తారా?
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి దర్యాప్తుపై ముంబై పోలీసులను తప్పుపట్టడం న్యాయం కాదని నటి స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై పోలీసులను నమ్మకపోవడానికి ఎలాంటి కారణాలు లేవు. సీబీఐ తన పని తాను నిష్పాక్షికంగా చేస్తుందని నేను నమ్ముతున్నాను అని పేర్కొంది. కోర్టులు, న్యాయవ్యవస్థ లాగానే పోలీసులు కూడా వారి పని చేసుకునేందుకు అనుమతించాలి. అనవసరంగా నిందలు వేయడం కరెక్ట్ కాదు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా 'సుశాంత్ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? అతను ఎప్పుడూ డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించలేదు అని కొందరు ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నట్లు బయటకు కనిపిస్తారా? సుశాంత్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కాబట్టి మనం ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. మానసిక ఆరోగ్యానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాల’ని పేర్కొన్నారు. (ముంబై పోలీసులకు శివసేన ఎంపీ కితాబు) సుశాంత్ కేసును సీబీఐ విచారించడాన్ని స్వాగతిస్తూనే నటి ఇలా రెండు విధాలుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొదటినుంచి సుశాంత్ మరణం కేసు విచారణలో ముంబై పోలీసులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు సాగకుండానే సుశాంత్ డిప్రెషన్ వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని, అతను బై పోలార్ డిసీస్తో బాధపడుతున్నాడని ముంబై పోలీసులు చెప్పడం తీవ్ర దుమారాన్నిరేపిన సంగతి తెలిసిందే. అనేక మలుపుల మధ్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై విచారణను పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’) -
‘సుశాంత్పై మానసిక రోగి ముద్ర వేశారు’
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై విచారణకు సంబంధించి, తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ర్పచారంపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. సుశాంత్కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని శివసేన పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాసిన సంపాదకీయం అనంతరం ఈ లేఖను సుశాంత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నటుడకి తాము చాలా సన్నిహితులమని చెబుతూ కొందరు మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని ఈ లేఖలో సుశాంత్ కుటుంబం మండిపడింది. నటి రియా చక్రవర్తి పేరును ప్రకటనలో ప్రస్తావించకపోయినా సుశాంత్ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది. సుశాంత్పై మానసిక రోగి ముద్ర వేసి, మృతదేహం ఫోటోలను బహిర్గతం చేసి తమకు సంతాపం తెలిపేందుకూ సమయం ఇవ్వలేదని పేర్కొంది. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించింది. తమ కుటుంబం పోలీసులను ముందుగానే సంప్రదించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖ సూటిగా ప్రశ్నించింది. సుశాంత్ నలుగురు అక్కలతో పాటు తండ్రినీ బెదిరిస్తున్నారని, తమ కుటుంబం ప్రతిష్ట మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుశాంత్ జ్ఞాపకాలకూ కళంకం ఆపాదిస్తున్నారని మండిపడింది. ఇక సుశాంత్ ఆయన సోదరిల గురించి లేఖలో ప్రస్తావిస్తూ పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటారని, రెండో కుమార్తె జాతీయ క్రికెట్ టీమ్లో ఆడారని, మూడో కుమార్తె లా చదవగా, నాలుగో కుమార్తె ష్యాషన్ డిజైనింగ్లో డిప్లమో చేశారని ఈ ప్రకటన పేర్కొంది. ఐదో సంతానంగా సుశాంత్ తన తల్లికి గారాల బిడ్డని తెలిపింది. తమ కుటుంబం ఏ ఒక్కరి నుంచి ఏమీ ఆశించలేదని, ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టం చేసింది. చదవండి : సుశాంత్ కేసు : ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు -
సుశాంత్ కేసు : ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఫోరెన్సిక్ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి. టాక్సికాలజీ, గోళ్ల నమూనాలు వంటి పలు రిపోర్ట్స్తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను ముంబై పోలీసులు మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుశాంత్పై విషప్రయోగం జరగలేదని సుశాంత్ సైతం తనకు తానుగా విషం సేవించలేదని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. సుశాంత్ మరణించే క్రమంలో ఎలాంటి పెనుగులాట జరగలేదని గోళ్ల నమూనా నివేదిక పేర్కొంది. సుశాంత్కు ఎలాంటి గాయం కాలేదని కూడా ఈ నివేదికల్లో స్పష్టమైంది. ఇక జులై 27న ముంబై పోలీసులకు అందిన సుశాంత్ కీలక అవయవాల నివేదిక (విసెరా రిపోర్ట్) కూడా ఆయన మరణంలో ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని తోసిపుచ్చింది. పోస్ట్మార్టం నివేదిక సైతం సుశాంత్ ఉరివేసుకోవడంతో ఊపిరాడక మరణించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు ఫోరెన్సిక్ బృందం సభ్యులను విచారించారు. ఫోరెన్సిక్ బృందంతో మాట్లాడిన అనంతరం ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలనూ ముంబై పోలీసులు గుర్తించలేదు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ మృతి కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోంది. చదవండి : అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం -
ఎఫ్బీ అలర్ట్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ సాయం, పోలీసుల కృషి 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడాయి. కొద్ది క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తిని రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా కృషి చేసి పట్టుకొని అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ 27 వ్యక్తి కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో పంచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఫేస్బుక్ సిబ్బంది ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ అన్యేష్ రాయ్కి మెయిల్ ద్వారా తెలియజేసింది. రాత్రి 8గంటల ప్రాంతంలో మెయిల్ రావడంతో అప్రమత్తమైన డీసీపీ... ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి అడ్రస్ కనుకున్నారు. (చదవండి : తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య; అల్లుడి అరెస్ట్) అయితే అక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. ఆ నెంబర్ తన భర్తది అని ఓ మహిళ తెలియజేసింది. తనతో గొడవపడి భర్తతో ఎక్కడికో వెళ్లాడని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆమె చెప్పింది. ఆయన నెంబర్ను తాను వినియోగిస్తున్నానని, అతనికి మరో నెంబర్ ఉందని అది వారికి ఇచ్చింది. గతంలో ఆయన ముంబైలోని ఓ చిన్న హోటల్లో కుక్గా పనిచేసేవాడని పేర్కొంది. దీంతో ఢిల్లీ డీసీపీ వెంటనే ముంబై డీసీపీ రష్మి కరాండికర్ను సంప్రదించారు. కొత్త ఫోన్ నెంబర్ను వారికి ఇచ్చి ట్రేస్ చేయాలని కోరారు. ముంబై పోలీసులు ఆ నెంబర్కు ఫోన్ చేయగా.. కలవలేదు. వెంటనే ముంబై పోలీసులు అతని తల్లిని సంప్రదించారు. ఆమెకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసినట్లు గుర్తించి ఆ నెంబర్ను ట్రేస్ చేశారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ముంబై పోలీసులు అతని అడ్రస్ కనుగొన్నారు. అతన్ని ఫోన్ చేసి మాటల్లో పెట్టిన ముంబై పోలీసులు.. లోకేషన్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. -
డబ్బులిచ్చి వ్యూస్ కొనుక్కున్న ర్యాపర్!
సామాజిక మాధ్యమాల్లో సినీ తారలను ఎంతమంది అనుసరిస్తున్నారనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వారే పాపులర్. మొన్నామధ్య ట్విటర్ నకిలీ ఖాతాలను తొలగించినప్పుడు సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల అత్యధికంగా బిగ్బీ అమితాబ్ బచ్చన్ 4,23,966 మంది ఫాలోవర్లను పోగొట్టుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఖాతాలో 3,62,382 మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. ఈ విషయంపై అమితాబ్ ట్విటర్పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడో కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు కావాలనే నకిలీ ఫాలోవర్లను సృష్టిస్తున్నారా? వారి పాపులారిటీ పెంచేందుకు దొంగచాటు మార్గాలను ఎంచుకుంటున్నారా? ఏమో? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే అవుననే అంటారేమో! బాలీవుడ్ ర్యాపర్ బాద్షా నకిలీ ఫాలోవర్స్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆయన తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు డబ్బులిచ్చి మరీ వ్యూస్ను కొనుగోలు చేశారని ముంబై పోలీసులు అంటున్నారు. దీనిపై అతనికి సమన్లు కూడా జారీ చేశారు. నిజానికి యూట్యూబ్లో తన వీడియో రిలీజ్ చేసిన తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించి ప్రపంచ రికార్డ్ బద్ధలు కొడుదామనుకున్నాడు బాద్షా. అనుకున్నట్టుగానే అతని "పాగల్ హై" సాంగ్ వీడియోకు తొలి రోజే అత్యధికంగా 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. (ఆ కళాకారుడికి బాలీవుడ్ సింగర్ సాయం..) దీంతో తొలి 24 గంటల్లో అత్యధిక వీక్షణలు సంపాదించిన కొరియన్ బ్యాండ్ బీటీఎస్ వీడియో రికార్డును తుడిచిపెట్టుకుపోయిందని ర్యాపర్ చెప్పుకొచ్చారు. కానీ ఈ వార్తను గూగుల్ ఖండించడం గమనార్హం. మరోవైపు డీసీపీ నందకుమార్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. "యూట్యూబ్లో తన వీడియో ద్వారా ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాలనుకున్నాడు. 7.2 కోట్ల వ్యూస్కు గానూ సదరు కంపెనీకి రూ.72 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు అతని మిగతా పాటలను, దాని వ్యూస్ను కూడా పరిశీలిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే వీటన్నింటినీ బాద్షా తోసిపుచ్చారు. తను ఎప్పుడూ ఇలాంటి పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. (నేను ఉరేసుకుని కనిపిస్తే: హీరోయిన్) -
సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో డీఐజీ గగన్దీప్ గంభీర్, జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్దీప్, జేడీ మనోజ్ గుజరాత్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. సుశాంత్ స్వరాష్ట్రమైన బిహార్లో ఇప్పటికే పోలీసులు సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు రియా చక్రవర్తి, బాలీవుడ్ దర్శకులు ఆదిత్యచోప్రా సహా మొత్తం 56 మందిని విచారించారు. -
వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి దిశ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరి మరణాలకు ఏదైనా సంబంధం ఉండవచ్చని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిశ తండ్రి సతీష్ సలియాన్ మహారాష్ట్రలోని మాల్వాని జిల్లా అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ యాదవ్కు లేఖ రాశారు. (సుశాంత్ కేసు: ‘దిశాది ఆత్మహత్య కాదు హత్యాచారం’) తమ కుటుంబంపై జరుగుతున్న మానసిక వేధింపుల గురించి, మరణించిన కుమార్తెకు సంబంధించి మీడియా, పాత్రికేయులు వ్యవహరిస్తున్న తీరు గురించి దిశ తండ్రి ఈ లేఖలో తెలిపారు. ఈ వ్యక్తులు తమకు ముంబై పోలీసుల పట్ల గల నమ్మకాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాక తమ కుమార్తె మరణానికి సంబంధించి అన్యాయంగా ఎవరిని బాధ్యులను చేయవద్దని గతంలోనే పోలీసులను కోరామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా.. ఆధారాలు దొరికినా ఆ వివరాలు తమకు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (సుశాంత్ కేసు: ప్రెస్ నోట్ విడుదల) సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ (28) జూన్ 8న ముంబైలోని మలద్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దిశ మృతిపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ను నమోదు చేసిన మల్వానీ పోలీసులు దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దిశ మరణంపై సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ చానెళ్లలో పలు కథనాలు ప్రచారం అయ్యాయి. దాంతో ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ కథనాలను పరిశీలిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ సమాచారమైనా ప్రజలు తమతో పంచుకోవచ్చని తెలిపారు. మరోవైపు దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
సుశాంత్ మాజీ మేనేజర్ మృతి : దర్యాప్తు ముమ్మరం
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసిన వారు ఎవరైనా తమకు ఆ వివరాలు అందచేయాలని పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ (28) జూన్ 8న ముంబైలోని మలద్ ప్రాంతంలో బహుళఅంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్వాని పోలీసులు దిశ మృతిపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ను నమోదు చేసిన మల్వానీ పోలీసులు దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దిశ మరణంపై సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ చానెళ్లలో పలు కథనాలు వెల్లడవడంతో ఈ కేసులో మరింత సమాచారం కోసం ఈ కథనాలను పరిశీలిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసును నిగ్గుతేల్చేందుకు ఉపకరించే ఏ సమాచారమైనా ప్రజలు తమతో పంచుకోవచ్చని తెలిపారు. మరోవైపు దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల మరకలున్నాయని పోస్ట్మార్టం నివేదికలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక జూన్ 14న బాంద్రా నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ రాజ్పుత్ మరణం కలకలం రేపుతోంది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు సుశాంత్ మరణంపై దర్యాప్తు చేపట్టేందుకు ముంబై చేరుకున్న తమ పోలీసులు దిశ మృతిపై కూడా విచారణ చేపడతాయని బిహార్కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. చదవండి : రియా చక్రవర్తి ఎక్కడుందో తెలియదు.. -
సుశాంత్ కేసు: ప్రెస్ నోట్ విడుదల
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగు చుస్తున్నాయి. అయితే సుశాంత్ కేసును సీబీఐకి దర్యాప్తుకు ఆదేశించాలన్న బీహార్ ప్రభుత్వ సిఫారస్సుకు సుప్రీం కోర్టు ఇవాళ (బుధవారం) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం సుశాంత్ మరణం వెనక ఉన్న నిజాలు బయటపడాలని సీబీఐని సూచించింది. దీంతో సుశాంత్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ మేనేజర్ దిషా సాలియన్ మృతి కేసు కూడా వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు వారం ముందు దిషా సాలియన్ కూడా ఆత్మహత్య చేసకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్, దిషా ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఎదైన సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు దిషా ఆత్మహత్యపై ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తప ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు ఎవరికైన తెలిస్తే తమను వెంటనే సంప్రదించాలని ముంబై పోలీసులు ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: ‘రియాపై ఒత్తిడి పెంచి.. వారిద్దరిని విడదీయండి’) అయితే సుశాంత్కు ప్రాణహాని ఉందని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుశాంత్ తండ్రి ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై డీసీపీ పరమ్జిత్ ఎస్ దహియా స్పందించారు. ఆయన మాకు సుశాంత్ భద్రతపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే ‘తన కొడుకు భద్రతపై తనకు ఆందోళనగా ఉందని, మిరాండా అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ఆయన మాకు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశాడు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ఆయనకు అప్పుడే స్పష్టంగా చేశాం. కానీ మాకు ఆయన నుంచి ఫిబ్రవరి ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. అంతేగాక రియా సుశాంత్తో ఆత్మహత్యకు ప్రేరెపించేలా ప్రవర్తించిందని, సుశాంత్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆయన ఆరోపించినట్లను చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న రియా కనిపించడం లేదని డీజీపీ వెల్లడించారు. (చదవండి: రియా చక్రవర్తి ఎక్కడుందో తెలియదు : డీజీపీ) -
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి బదిలిచేయడాన్ని మహారాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వాస్తవానికి ఈ కేసు దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులకై అధికారం ఉందని తెలిపింది. బీహార్ పోలీసులు కొందరు రాజకీయ నేతల ప్రోద్భలంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా సుశాంత్ తండ్రి మహారాష్ర్టలో ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషేష్ రాయ్ నేతృత్వంలో బుధవారం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ముంబై పోలీసుల చర్యను సుప్రీం తప్పుబట్టింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ నుంచి ముంబై వచ్చిన పోలీస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించింది. కేసు విచారణను నిజాయితీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. (‘ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు’) సుశాంత్ మృతికి సంబంధించిన దర్యాప్తు వివరాలను రికార్డులో ఉంచాలని మహారాష్ర్ట ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. నిజాలు బయటకు రావాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాదారాలను నాశనం చేశారంటూ ఆరోపించిన సుశాంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, అన్ని సాక్ష్యాలను జాగ్రత్తగా చూసుకునేలా చర్యలు తీసుకుంటామంటూ జస్టిస్ రాయ్ హామీ ఇచ్చారు. ఇక సుశాంత్ అనుమానస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. (సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ) -
‘ముంబై మానవత్వం కోల్పోయింది’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ ముంబై నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై తన మానవత్వాన్ని కోల్పోయిందన్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే దర్యాప్తు విషయంలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య కోల్డ్ వారికి దారితీసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే జీవించడానికి ముంబై మహానగరం సురక్షితం కాదనిపిస్తోందన్నారు. (నొప్పి లేకుండా చనిపోవడం ఎలా?.. గూగుల్లో సుశాంత్ సెర్చ్) ‘సుశాంత్ సింగ్ కేసులో పోలీసులు వ్యవహిరిస్తున్న తీరు చూస్తే ముంబై మానవత్వం కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యలను శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ తప్పు పట్టారు. రాష్ట్ర బీజేపీ నాయుకులు రాజకీయం చేస్తూ ముంబై పోలీసులను నిందిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులను నిందించే వారు తమ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్ పోలీసులను నిందించటం సిగ్గుచేటన్నారు. -
‘అప్పుడే ముంబై పోలీసులను అప్రమత్తం చేశా’
ముంబై : తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులను సంప్రదించినట్లు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ పేర్కొన్నారు. తన కుమారుడి ప్రాణానికి ప్రమాదం ఉందని ఫిబ్రవరి 25న ముంబై పోలీసులను అప్రమత్తం చేసినట్లు వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ. ‘ఫిబ్రవరి 25 న బాంద్రా పోలీసులకు సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని తెలియ జేశాను. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులపై చర్య తీసుకోమని నేను వారిని కోరాను. సుశాంత్ జూన్ 14న మరణించాడు. తను మరణించిన 40 రోజుల తరువాత కూడా ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నేను పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాను. వాళ్లు వెంటనే స్పందించారు’. అని పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం నడుస్తోంది. (సూసైడ్ ముందు సుశాంత్ ఏం సెర్చ్ చేశాడంటే..) #WATCH: #SushantSinghRajput's father in a self-made video says, "On Feb 25, I informed Bandra Police that he's in danger. He died on June 14 & I asked them to act against people named in my Feb 25 complaint. No action taken even 40 days after his death. So I filed FIR in Patna." pic.twitter.com/tnn9XN1XlB — ANI (@ANI) August 3, 2020 అంతేగాక సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను వెలికి తీయడంలో పట్నా పోలీసులు సాయం చేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కూడా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేకే సింగ్ తన ఫిర్యాదులో.. సుశాంత్ ముంబై బ్యాంక్ ఖాతా నుంచి రూ .15 కోట్లను అక్రమంగా స్నేహితురాలు రియా చక్రవర్తికి బదిలీ చేసినట్లు, తనను మానసికంగా వేధించినట్లు ఆరోపించారు. కాగా చనిపోవడానికి ముందు సుశాంత్ .. మరణం గురించి ఇంటర్నెట్లో వెతికినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం ముంబై పోలీస్ చీఫ్ పరంవీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి చట్ట విరుద్ధంగా డబ్బును బదిలీ చేశారనే వాదనలకు ఆధారాలు లేవన్నారు. (రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం) -
సూసైడ్ ముందు సుశాంత్ ఏం సెర్చ్ చేశాడంటే..
ముంబై : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. చనిపోవడానికి ముందు సుశాంత్ .. మరణం గురించి ఇంటర్నెట్లో వెతికినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అలాగే తన పేరును కూడా గూగుల్లో సెర్చ్ చేశాడని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన వివరాలను సోమవారం ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. (చదవండి : రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం) నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? అని సుశాంత్ గూగుల్లో సెర్చ్ చేసినట్లు తెలిపారు. మాజీ మేనేజర్ దిషా సాలియన్ ఆత్మహత్యకు, తనకు లింక్ ఉందనే తరహా కథనాలు సుశాంత్ చదివేవాడని కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటలకు ముందు సుశాంత్ అతని పేరునే గూగుల్ చేశాడని.. ఈ విషయాలన్నీ కూడా తన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ద్వారా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయని పరమ్ బీర్ చెప్పారు . అతను చాలా మానసికంగా కృంగిపోయినట్లు కమిషనర్ తెలిపారు. (చదవండి : సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో ) కాగా, సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై సుశాంత్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడన్నారు. చివరి క్షణాల్లో తన స్వంత పేరునే సుశాంత్ ఇంటర్నెట్లో పలుమార్లు సెర్చ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు -
పోలీసులకు అక్షయ్ ఫిట్నెస్ ట్రాకర్లు..
ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా మహమ్మారి పోరులో అవిశ్రాంతంగా పని చేస్తున్న ముంబై పోలీసులకు ఫిట్నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనా పరిస్థితుల్లో అవి పోలీసుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృందయ స్పందనలును తెలియజేస్తుంది. పోలీసులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయి. శనివారం ఆయన ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్కు ఫిట్నెస్ హెల్త్ ట్రాకింగ్ పరికారాలు అందజేశారు. అక్షయ్ పోలీసులకు చేసిన సాయంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్లో స్పందించారు. ‘ముంబై పోలీసులకు అక్షయ్జీ ఫిట్నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనాతో నివారణలో యుద్ధం చేస్తున్న పోలీసులకు ఈ పరికరాలు వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందనలను తెలియజేయడంలో ఉపయోగపడతాయి. ఫిట్నెస్- హెల్త్ ట్రాకింగ్ పరికరాలను గత నెలలో నాసిక్ పోలీసులకు కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని పోలీసులకు అండగా ఉంటున్నారు. దేశంలోని సాయుధ దళాలు, కరోనా కట్టడిలో పోరాడుతున్న పోలీసులపై ఆయనకున్న గొప్ప మనసుకు కృతజ్ఞతలు’ అని అదిత్య ఠాక్రే పేర్కొన్నారు. Earlier today, @akshaykumar ji handed over fitness- health tracking devices to @MumbaiPolice . It gives a constant reading of oxygen, body temp and heart rate, helpful in Covid battle. Last month, Akshay ji gave it to @nashikpolice . (1/n) pic.twitter.com/rgWh2LfbIW — Aaditya Thackeray (@AUThackeray) August 1, 2020 అదే విధంగా ఈ ట్రాకర్లను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్కు ఇవ్వడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 56 మంది పోలీసులు కరోనా పాజిటికు గురైనట్లు ఓ అధికారి తెలిపారు. కరోనాపై పోరులో కృషి చేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్కు అక్షయ్ తన వంతు సాయంగా రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
సుశాంత్ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. జూన్లో ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ వ్యవహారానికి నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించడంపై సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారించగలరు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ కేసును నిర్వహించడంలో ముంబై పోలీసుల విశ్వసనీయతను బీజేపీ నాయకుడు అనుమానించారని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్పై ఠాక్రే విరుచుకుపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవరిదగ్గర అయినా ఉంటే నిరభ్యంతరంగా ముంబై పోలీసులకు సంప్రదిస్తే.. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా ఉపయోగించవద్దు. ఇది చాలా దుర్భరమైన విషయం" అని ఆయన అన్నారు. మేము 30 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాము. కానీ వారు మమ్మల్ని విశ్వసించలేదు. అయితే 30 ఏళ్లుగా మాతో రాజకీయ విభేదాలు ఉన్నవారు మమ్మల్ని విశ్వసించారు అని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం గురించి ఠాక్రే పేర్కొన్నారు. ఈ కేసును ముంబై పోలీసులు చేధించగలరని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇటీవల అన్నారు. కాగా.. జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్పుత్ కుటుంబం, అతని కుక్తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. (సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు) -
సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని సుశాంత్ కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని అతడి స్నేహితుడు, క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పిథాని ఆరోపించాడు. (రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత) ఈ విషయంపై బాంద్రా పోలీసులకు ఈ మెయిల్ చేసిన పిథాని మాట్లాడుతూ జూలై 22న సుశాంత్ సోదరి మీతు సింగ్, ఆమె భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓపి సింగ్ నుంచి తనకు కాన్ఫరెన్స్ కాల్ వచ్చిందని తెలిపాడు. రియా, సుశాంత్ కలిసి ముంబైలోని మౌంట్ బ్లాంక్లో నివాసం ఉన్న సమయంలో ఆమె ఖర్చుల గురించి పలు ప్రశ్నలు అడిగారని, దీనికి సంబంధించి రియాకు వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలిపాడు. వాస్తవానికి రియాకు సంబంధించిన విషయాలపై పెద్దగా తెలియదని చెప్పినా వాళ్లు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు సంచలన విషయాలు బయట పడుతున్నాయి. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో రియా ముందస్తు బెయిల్ సంప్రదించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసు విచారణను బిహార్ నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. (సుశాంత్ బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తున్న ఈడీ) -
సుశాంత్ కేసులో మరో మలుపు.. సుప్రీంకు రియా
ముంబై : బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని రియా లాయర్ సతీష్ మీడియాకు వెల్లడించాడు. కాగా, ఈ కేసులో రియా పాత్రపై విచారణ చేపట్టాలని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇటీవల పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు సరిగ్గా 6 రోజుల ముందు డబ్బు, నగలతో ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారు.(సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు) కేకే సింగ్ ఫిర్యాదుతో బిహార్ పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైకి నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపారు. అలాగే సుశాంత్ అకౌంట్ నుంచి రియాకు రూ. 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రియాను విచారించడంతోపాటుగా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.(రియాపై ఫిర్యాదు.. అంకిత స్పందన) కాగా, సుశాంత్ ఆత్మహత్య పాల్పడం మొదటి నుంచి పలు అనుమానాలు కేంద్ర బిందువుగా నిలిచింది. బాలీవుడ్లో నెలకొన్న బంధుప్రీతి వల్ల ఆయన ఆత్మహత్యకు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు ఆరోపించారు. మరికొందరు ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఇన్ని రోజులు ఈ కేసుకు ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్ కుటుంబసభ్యులు రియాతో పాటుగా మరికొందరిపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేసిన రియా.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుశాంత్ ఆత్మహత్య వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. -
సుశాంత్ సింగ్ కేసు.. నటికి సమన్లు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి ఇండస్ట్రీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్ మరణించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ మరణించిన నాటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. అందుకోసం ఎంత దూరమైన వెళ్తానని కంగనా స్పష్టం చేశారు. సుశాంత్ మరణించిన తర్వాత ఓ వీడియో విడుదల చేసిన కంగనా, ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్ను నాశనం చేశాడని ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ కేసులో ప్రశ్నించేందుకు కంగనాకు సమన్లు జారీ చేశారు. నటి లాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) అంతేకాక మార్చి 17 నుంచి కంగనా మనాలీలో ఉన్నారని.. ఓ బృందాన్ని అక్కడకు పంపి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్లు కంగనా లాయర్ తెలిపారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారని, అయితే తన స్టేట్మెంట్ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని కంగనా గతంలోనే తెలిపారు. అంతేకాక ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు 39మందిని విచారించారు. వీరిలో కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) చైర్మన్ ఆదిత్య చోప్రా, వైఆర్ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ ఉన్నారు. (‘ఇక చాలు.. రాజీనామా చేస్తున్నాను’) -
ఈ ఎమోజీల అర్థమేమిటో?
ముంబై: కరోనా భూతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎక్కువగా ఆధారపడే సోషల్ మీడియాలోనూ వారిని చైతన్యం చేసే పోస్టులు చేస్తున్నారు. తాజాగా ముంబై పోలీసులు ఓ పజిల్ను పోస్ట్ చేశారు. దాన్ని పరిష్కరించి అందులో ఉన్న అర్థాన్ని కనుక్కోండి.. అంటూ నెటిజన్లు చాలెంజ్ విసిరారు. ఇదేమంత కఠినం కాదని సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ముంబైవాసులకు ఇదేంటో తప్పకుండా తెలుస్తుందని పేర్కొన్నారు. (ఇందులో మాస్కు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించండి) ఆ పోస్ట్లో ఎమోజీలను ఓ క్రమ పద్ధతిలో పేర్చి అందులో అర్థవంతమైన సందేశాన్ని ఇనుమడింపజేశారు. ఇంతకీ మీకు అర్థమైందా? లేదా? లేక అర్థమయూ.. కానట్టు ఉందా? ఇప్పటికీ దాని అసలు అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఇది చదివేసేయండి. "ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనికి వెళ్లండి, ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు ఇంట్లోనే ఉండండి." పోలీసుల ఆలోచన అదిరింది కదూ! కరోనా బారిన పడకుండా ఈ నియమాన్ని పాటించమని చెప్పకనే చెప్తున్నారు. పోలీసులు సందేశాన్ని ఇచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!) -
సుశాంత్ నివాసంలో 5 డైరీలు స్వాధీనం!
ముంబై : యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్నే కాకుండా దేశ ప్రజలను షాక్కు గురిచేసిన సంగతి తెలిసిందే. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్.. ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సుశాంత్ నివాసంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : సుశాంత్ అస్థికలు గంగలో నిమజ్జనం) ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ నివాసం నుంచి 5 పర్సనల్ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
సుశాంత్ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు
సాక్షి, ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మానసిక స్థితితో పాటు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా డిప్రెషన్తో చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల సుశాంత్ బాంద్రాలో ఓ విలాసవంతమైన ఫ్లాట్కు మారినట్లు తెలుస్తోంది. నెలకు రూ.4.5 లక్షలు ఫ్లాట్ అద్దె చెల్లిస్తున్నటుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పనివాళ్లతో కలిసి సుశాంత్ బాంద్రా ఫ్టాట్లో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం జ్యూస్ తాగి బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సుశాంత్.. ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య సమయంలో ఫ్లాట్లో పనివాళ్లతో పాటు స్నేహితులు ఉన్నారు. ఆయన చివరిగా తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలలుగా సుశాంత్ డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆయన నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కొన్ని మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. మరోవైపు సుశాంత్ ఫ్యామిలీ డాక్టర్తో పాటు, ఆయన స్నేహితుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. (చదవండి : సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన) ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం చెప్పగలం. ఆయన గదిలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులను కనుగొనలేదు. సూసైడ్ నోట్ లభించలేదు, కానీ డిప్రెషన్ తగ్గడానికి వాడే మందులు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. సుశాంత్ వ్యక్తిగత డాక్టర్ను సంప్రదించి, అతని మానసిక పరిస్థితి ఏంటి, ఏ రకమైన రుగ్మతతో బాధపడుతున్నాడు, తదితర విషయాలు అడిగి తెలుకుంటాం’ అని ముంబై జోన్ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. కాగా, సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు అంటున్నారు. లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య) మరోవైపు సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. కెరీర్లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది. ఈ వార్త తమకు షాక్కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. -
సుశాంత్ ఆత్మహత్యకు అదే కారణమా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర వార్త విన్న బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటు అభిమానులు ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక సుశాంత్ అభిమానులు అత్యంత శోకాతప్త హృదయాలతో ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. (సుశాంత్ మరణం: షాక్లో సినీ ఇండస్ట్రీ) ఇక సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్లో ఉన్నారని అటు పోలీసులు, ఇటు స్నేహితులు పేర్కొంటున్నారు. ఇక సుశాంత్ నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కొన్ని మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి కొంత మంది స్నేహితులతో సుశాంత్ గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక సుశాంత్ పార్థీవదేహాన్ని ఆయన నివాసం నుంచి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. (బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య) -
సోనూసూద్ను అడ్డుకున్న పోలీసులు
ముంబై: లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నటుడు సోనూ సూద్. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, భవిష్యత్తులోనూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఉత్తర ప్రదేశ్కు శ్రామిక్ రైలులో వెళ్లనున్న వలస కార్మికులను కలిసేందుకు నటుడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడిని స్టేషన్లోనికి పంపించకుండా బయటే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ ) దీనిపై స్పందించిన ముంబై పోలీసులు నటుడిని అడ్డుకున్నది తాము కాదని, రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్ బలగాలు) అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా నటుడి సాయాన్ని ఉటంకిస్తూ అతను బీజేపీకి కొమ్ము కాస్తున్నాడని, కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడంటూ 'సామ్నా' ఎడిటోరియల్ వేదికగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం సోనూసూద్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో భేటీ అయి రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాడు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ) -
కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్ఐలు మృతి
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా విధుల్లో ఉన్న 19 మంది కానిస్టేబుల్స్ మృతి చెందగా.. తాజాగా కరోనా క్షణాలతో ముంబైలో మరో ఇద్దరు ఏఎస్ఐలు మరణించారు. ధారావిలోని షాహూనగర్ పోలీస్టేషన్లో ఏపీఐగా విధులు నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతూ.. మరణించారు. మరో ఏఎస్ఐ కూడా శనివారం తెల్లవారుజామున బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిఉండటంతో సియోన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. టెస్టుల కోసం శాంపిల్స్ను పంపగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ముంబై పోలీసుల ఎంటీ విభాగం అదనపు కమిషనర్ అతుల్ పాటిల్ ఏఎస్సై మరణాన్ని ధృవీకరించారు. మరణించిన ఏఎస్సైని 15 రోజుల కిందటే సెలవుపై పంపించామని చెప్పారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన పోలీసుల సంఖ్య 21కు చేరుకుందని అధికారులు తెలిపారు. చదవండి: కరోనా: ప్రకాశం జిల్లా అరుదైన రికార్డ్ మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,140 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడగా.. వీరిలో 949 మంది కానిస్టేబుల్ హోదాకు చెందినవారేనని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6,564 మంది కోలుకోగా.. 1,068 మంది మరణించారు. 21,467 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే. చదవండి: మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..! -
రెడ్జోన్లో పోలీసులపై దాడి
ముంబై: ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వస్తూ, లాక్డౌన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించిన పోలీసులపై దాడికి దిగారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన గురువారం ముంబైలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ గురువారం 15 మంది వ్యక్తులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని గమనించిన పోలీసులు కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (టార్గెట్ ‘ఆర్మీ’ !) ఫేస్ మాస్క్ కూడా ధరించకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెంటనే ఆవేశంతో దుండగులు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు దీనికి కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) -
మూడేళ్ల పిల్లోడు @ రూ.50 వేలు
ముంబై: వయసు చిన్నదే, కానీ మనసు పెద్దది, ఆశయం అంతకన్నా పెద్దది. ఇంకేముందీ.. తన చిట్టి చిట్టి చేతులతో కుకీస్ తయారు చేశాడు. వాటిని అమ్ముతూ పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాడు. అనంతరం వచ్చిన సొమ్మునంతటినీ ముంబై పోలీస్ ఫౌండేషన్కు అందించాడు. ముంబైలోని కబీర్ అనే ఓ మూడేళ్ల బాలుడు కప్ కేకులు తయారు చేశాడు. కేకులు తినే వయసులో వాటిని తయారు చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. దాని వెనక పెద్ద సంకల్పమే ఉంది. తను సొంతంగా తయారు చేసిన కేకులను అమ్ముతూ కరోనా వ్యతిరేక పోరుకు తాను సైతం అంటూ విరాళాలు సేకరించాడు. (ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు) రూ.10 వేలు లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంచనాలను మించి రూ.50 వేల వరకు వచ్చాయి. దీంతో ఎంతగానో సంబరపడిపోయిన కబీర్ యాభైవేల రూపాయల చెక్కును తన తల్లిదండ్రులు కరీష్మా, కేశవ్లతో కలిసి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్కు అందించాడు. అంతేకాక లాక్డౌన్లో అలుపెరగకుండా పోరాటం చేస్తున్న పోలీసుల నోరు తీపి చేస్తూ స్వీట్లు కూడా పంచాడు. బుడ్డోడి ఆరాటానికి ముచ్చటపడిన పోలీసులు అతడి గురించి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కబీర్ను చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. "ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద ఆలోచనో" అంటూ పొగుడుతున్నారు. (మాస్టర్ చెఫ్కి యాక్షన్ హీరో అవార్డ్) -
ఫ్రెండ్తో కలిసి పట్టుబడ్డ నటి
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే, ఆమె స్నేహితుడిపై ముంబై పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై ఈ చర్య తీసుకున్నారు. వారి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి తర్వాత విడిచిపెట్టారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి ఆదివారం రాత్రి 8.05 గంటల సమయంలో బిఎమ్డబ్ల్యూ కారులో తిరుగుతున్నట్టు గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ స్నేహితుడిని బాంద్రా (వెస్ట్)లో నివాసం ఉంటున్న చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే(46)గా గుర్తించారు. పూనమ్ పాండే, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్సింగ్ నిశందర్ ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. (టాప్లో ప్రియాంక... సల్మాన్!) అయితే పూనమ్ పాండేకు వివాదాలు కొత్త కాదు. గతంలో సంచలన ప్రకటనలతో ఆమె వార్తల్లో నిలిచారు. తన నటనతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు. 2011లో టీమిండియా వన్డే క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి మొదటిసారి ఆమె వెలుగులోకి వచ్చారు. తర్వాత కూడా చాలాసార్లు వివాదాస్పద ప్రకటనలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. నాషా, లవ్ ఈజ్ పాయిజన్, మాలిని అండ్ కో, ఆగయా హీరో, ది జర్నీ ఆఫ్ కర్మ తదితర సినిమాల్లో ఆమె నటించారు. కాగా, కొంతకాలంగా పూనమ్, సామ్ అహ్మద్ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్లో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. -
కరోనాపై పోరు: విరుష్కల మరో విరాళం
సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పోలీసులు నిర్విరామ కృషి చేస్తున్నారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తూ జనాలు అనవసరంగా రోడ్లపై రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న నిస్వార్థ సేవకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు పోలీసులకు తమ వంతు సహాయంగా శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు అందిస్తున్నారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లి అయన సతీమణి అనుష్క శర్మ పోలీసుల సంక్షేమం కోసం తమ వంతు సాయం ప్రకటించారు. ముంబై పోలీసుల సంక్షేమ నిధికి చేరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ముంబై పోలీసు శాఖకు విరుష్క దంపతులు విరాళమిచ్చినట్లు నగర కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ట్వీట్ చేశారు. విరుష్క దంపతులు రూ.5 లక్షల చొప్పున విరాళమిచ్చినందుకు కృతజ్ఞతలు కమిషనర్ తెలిపారు. కరోనా పోరులో ముందుండి నడుస్తున్న పోలీసుల రక్షణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా పోరులో భాగంగా విరుష్క దంపతులు పీఎం కేర్స్కు విరాళాన్ని ప్రకటించారు అయితే ఎంత విరాళం ప్రకటిచారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. Thank you, @imVkohli and @AnushkaSharma for contributing Rs. 5 lacs each towards the welfare of Mumbai Police personnel. Your contribution will safeguard those at the frontline in the fight against Coronavirus.#MumbaiPoliceFoundation — CP Mumbai Police (@CPMumbaiPolice) May 9, 2020 చదవండి: మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం ‘సెహ్వాగ్ వేరే దేశానికి ఆడుంటే..’