Fitness
-
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదయం వాకింగ్ ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం పూట వాకింగ్సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాకింగ్తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చుగాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు. -
Visakhapatnam: ఓటమిని అంగీకరించని ఫర్జానా బేగం
ఎన్ని మేఘాలొచ్చినా..ఆకాశం కదలదు..ఎన్ని తుఫానులైనా..సముద్రం నిలిచిపోదు.. ఎదురయ్యే బాధలన్నీ..ఎగసి పడే తరంగాలే..ఆపదల గాలి ఎంత వేగంగా వీచినా, దృఢమైన మనసు చలించదు. కోల్పోయినవేమీ కన్నీటి కథలవ్వవు..ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా ధైర్యం చేతిలో తలవంచక తప్పదు..నీ ధైర్యమే నీ గెలుపు పతాకం..తట్టుకొనే శక్తి ముందు, ఏ గెలుపైనా తక్కువే. వాడిపోయిన పువ్వుల్లా రాలిపోతాయి..కష్టానికి పూచే పూలే నిజమైన..విజయాలై వికసిస్తాయి. అచ్చం ఫర్జానా బేగంలా..క్యాన్సర్ వచ్చిందని ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఆనందంగా..ఆరోగ్యకరంగా సాగుతున్న జీవితం. శారీరక వ్యాయామ, పోషకాహార నిపుణురాలిగా అందరికీ సూచనలిచ్చే వ్యక్తి. ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా సాగుతున్న కుటుంబం. ఒక్కసారిగా ఆమె శరీరంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించింది. భయపడిన ఆమె వైద్యులు చెప్పిన మాట విని అంతలోనే తేరుకుంది. మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. క్యాన్సర్ను ధైర్యంగా ఎదుర్కొంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగింది. కాన్సర్ బారిన పడి దానిని అధిగమించి నూతన జీవితాన్ని పొందాలనేవారికి స్ఫూర్తిగా నిలిచారు..నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం.ఆనందంగా సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్గా నిర్ధారించారు.కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని భావించి, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.ధైర్యం కోల్పోలేదుతొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్నెస్ జిమ్లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు. వారే నా ధైర్యం క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు. -
బుమ్రా ఫిట్గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్నెస్పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్నెస్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
Jasprit Bumrah: ‘విజయావకాశాలు 35% తగ్గుతాయి’
దుబాయ్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్తో చివరి వన్డే ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి. భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో మొహమ్మద్ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్నెస్కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్ అభిప్రాయ పడ్డాడు. -
బోసు బాల్తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్ర్సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్పై ఎలాంటి ఎక్స్ర్సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
స్వీట్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గింది..!
బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారాన్ని త్యాగం చేయడమే. ఒకవేళ నచ్చింది తినాలనిపించినా.. మనస్పూర్తిగా తినలేక డైట్ని మధ్యలోనే వదిలేయలేక ఎంతలా తిప్పలు పడతారో చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే వెయిట్ లాస్ జర్నీలో నోరుని కట్టేసుకుని మరీ కఠినమైన డైట్లు, వర్కైట్లపై దృష్టిసారిస్తారు. అధికంగా వ్యాయమాలు చేసి తీపి పదార్థాలు దరిచేరనివ్వకుండా ఉంటేనే బరువు తగ్గుతారనేది చాలమంది అభిప్రాయం. అయితే వాటన్నింటిని కొట్టిపారేసేలా ఈ మహిళ వెయిట్ లాస్ జర్నీ ఉంది. పైగా తీపి పదార్థాలు తింటూనే బరువు తగ్గిందంట. అది నిజమేనా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆమె చెబుతున్న వెయిట్ లాస్ టిప్స్ వింటే నమ్మకుండా ఉండలేరు.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కార్లా విసెంటిన్ వెయిట్ లాస్ జర్నీ చాలా విభిన్నంగా కొత్తగా ఉంది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం కాదని అంటోంది క్లారా. తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను ప్రతిరోజు ఇష్టమైన స్వీట్స్ని తింటూనే బరువు తగ్గానని నమ్మకంగా చెబుతోంది. అలా స్వీట్లు తింటూనే తన బరువు వ్యూహాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. తనకు వెయిట్లాస్ జర్నీలో హెల్ప్ అయిన చిట్కాలను కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..వ్యాయామం ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదని అంటోంది క్లారా. కేలరీలను తగ్గించే డైట్ తోపాటు మంచి కదిలకలతో కూడిన శారీరక శ్రమతోనే బరువు తగ్గుతారని అంటోంది. దాహం ఆకలి మారువేషంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకలితో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి తరుచుగా నీరు తాగుతూ ఉండండి. ప్రతిరోజు ఒకే ఆహారం తినడం వల్ల కేలరీలు తీసుకోవడం, ట్రాక్ చేయడం సులభం అవుతుంది. అదీగాక భోజనం త్వరగా సిద్ధం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. చిన్న ప్లేటుల్లో తింటే..ఎక్కువ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. అలాగే నెమ్మదిగా తినడం తెలియకుండానే వస్తుందట. వ్యాయామం చేసే ముందు మంచి డిటాక్స్ వాటర్ని తీసుకుంటే జిమ్కి వెళ్లేలా బాడీ సిన్నద్ధం అవుతుందట. అంతేగాదు ఉత్సాహంగా వ్యాయమాలు చేయగలుగుతారు. నచ్చిన ఆహారం వదులుకోకుండా హాయిగా తినాలంటే..కేలరీలను తగ్గించుకునే యత్నం చేయాలి. ఇక్కడ క్లారాకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ తప్పనిసరిగా తినే అలవాటు ఉందట. అందుకుని తనకు నచ్చిన స్వీట్ని హాయిగా తినేసి అదనపు కేలరీలు తీసుకోకుండా చూసుకుంటుందట. ఇలా చేస్తే తినాలనే పిచ్చికోరిక అదుపులో ఉంటుందని చెబుతుంది. స్వీట్స్ అధికంగా తినాలనిపించినా లేదా ఆకలిగా అనిపించినప్పుడల్లా చక్కెర లేని గమ్ నమలాలని సూచిస్తోంది.అలాగే మనల్ని మనం ఇష్టపడితేనే తొందరగా బరువు తగ్గకలుగుతామని అంటోంది.చివరగా అన్నింటికి సానుకూల దృక్పథంతో ఉండాలి అప్పుడే చక్కటి మార్పులు సాధ్యమవుతాయని నమ్మకంగా చెబుతోంది క్లారా.ఇక్కడ పాజిటివ్ ఆటిట్యూడ్ తోపాటు మనల్ని మనం ప్రేమించుకుంటేనే చక్కటి రూపం సొంత చేసుకోగలమని క్లారా కథే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Carla Visentin (@carlavisentin_)(చదవండి: 'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..శాశ్వతంగా కంటి రంగు మారిపోతుంది..!) -
50 నిండినా వన్నె తగ్గని అందం, ఫ్యాషన్కి, పిట్నెస్కి పెట్టింది పేరు (ఫోటోలు)
-
ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!
ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోతే ఇట్టే బరువు పెరగడం, కొలతలు సరిలేక, అందం తగ్గడం సాధారణ సమస్యలుగా మారిపోతున్నాయి. తినే తిండి, ఎక్కువ సమయం కూర్చునే వర్క్ చేయడం, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో, చాలామందికి ఫిట్నెస్ దూరమవుతోంది. అయితే జిమ్లో చేసుకున్నట్లే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి ఈ ’ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్’ చక్కగా పని చేస్తుంది.ఈ రోప్తో వర్కౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్ని భంగిమల్లోనూ వ్యాయామం చేయడానికి, శారీరక శ్రమను కలిగించి, కొవ్వును తగ్గించడానికి సహకరిస్తుంది. మన్నికైన ఈ రోప్.. వీపు, నడుము, పొట్ట, తొడలు, చేతులు వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి వినియోగించొచ్చు. దీంతో వ్యాయామం చేస్తే కండరాలు బలపడి, శరీరం దృఢంగా తయారవుతుంది.వ్యాయామ సమయంలో దీన్ని ఎలా కావాలంటే అలా సులభంగా, బలం ఉపయోగించి సాగదీయొచ్చు. సాగదీసే క్రమంలోనే గ్రిప్ తప్పి లేని నొప్పులు వస్తాయేమోనన్న భయం అవసరం లేదు. సౌకర్యవంతమైన పట్టును అందించగల ఈ సాగే తాడు.. చేతులకు, కాళ్లకు అలసట కలిగించదు. ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్తో రూపొందిన ఈ రోప్ కొత్తగా వ్యాయామం ప్రారంభించే వాళ్లకు కూడా అనువుగానే ఉంటుంది. దీని ధర 14 డాలర్లు (రూ.1,286) మాత్రమే! -
కిక్ బాక్సింగ్తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్ని విజృంభించి పంచే హీరోయిన్స్లో టాప్లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్లు, డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్మిల్పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్లోని సెలబ్రిటీస్ లిస్ట్లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్కి కేరాఫ్ అడ్రస్లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
అందంలో మన్మథుడు...యువ సామ్రాట్ నాగర్జున డైట్ సీక్రెట్ ఇదే..!
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో అవార్డులను, సత్కారాలను పొందారు. ఒకప్పుడు అమ్మాయిల క్రేజీ హీరో, కలల మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. అయినా అదే అందం, గ్లామర్తో యువ హీరోలకు తీసిపోని విధంగా ఫిట్గా ఉంటాడు. వయసుతో సంబంధం లేకుండా అంతలా యవ్వనంగా ఫిట్గా బాడీ మెయిటైన్ చేసేందుకు నాగార్జున ఏం చేస్తుంటాడో తెలుసుకుందామా..!నాగార్జునని చూడగానే అందరూ సార్ ఇప్పటికీ అలానే అంతే అందంగా ఎలా మెయిటైన్ చేస్తారు అని అడుగుతారట. అందరికీ ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని కుతుహలమే. ఆ సందేహాలకు చెక్పెట్టేలా ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కూడా అవేంటంటే..తన రోజుని వ్యాయమాలతోనే ప్రారంభిస్తాడట. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తారట. ఒకవేళ జిమ్కి వెళ్లకపోతే కనీసం వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తారట. అంతే తప్ప ఏ వ్యాయామాన్ని మిస్ చేయానని చెబుతున్నారు నాగ్. వర్కౌట్లు చేయడమే తన తొలి ప్రాధాన్యత అని అంటున్నారు. కచ్చితంగా వారానికి ఐదు రోజులు వ్యాయామాలు చేస్తానని చెప్పారు. ఒక గంట 45 నిమిషాలు వ్యాయమాలకే కేటాయిస్తారట. అదే తన బాడీ ఆకృతి సీక్రెట్ అంటున్నారు. మన శరీరం షేప్అవుట్ అవ్వకూడదంటే ఇవి తప్పనసరి అని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ఓ చిట్కాను షేర్ చేశారు. క్రమ తప్పకుండా సక్రమంగా వ్యాయామాలు చేయాలంటే ఫోన్లు వంటి గాడ్జెట్లు తీసుకెళ్లొద్దని అన్నారు. శక్తితో కూడిన వర్కౌట్లు చేస్తూ..హృదయస్పందన రేటు 70% ఉండేలా చూడండి. ఇది మీ ఏకగ్రతను పెంచి, రోజంత జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందని అన్నారు. ఇదే తన ఫిట్నెస్మంత్ర అని దృఢంగా చెబుతున్నారు. దీంతోపాటు తగినంత నిద్ర, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయాలన్నారు.అందంగా కనిపించేందుకు..మంచి డైట్ని తీసుకుంటారట. అదే తన ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ్గా ఉంచుతాయని నమ్ముతానన్నారు. ఆరోగ్యకరమైన అల్పహారం, లంచ్, డిన్నర్లు తీసుకుంటే ఎవ్వరైనా అందంగానే ఉంటారని చెప్పారు. రాత్రి ఏడు లేదా ఏడున్నర లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారట నాగ్. పాల సంబంధిత పదార్థాలకు నిర్ధిష్ట వయసు వచ్చేటప్పటికీ తీసుకోవడం మానేస్తేనే బెటర్ అని అన్నారు. నాగ్ కచ్చితంగా 12 గంటలు తిని 12 గంటలు ఉపవాసం ఉంటారట. ఆయన అడపాదడపా ఉపవాసం కూడా ఉంటారట. అప్పడప్పుడు చీట్ మీల్స్ కూడా ఉంటాయని నవ్వుతూ చెబుతున్నారు. ఎప్పుడు నోరుని కట్టేసుకుని స్ట్రిక్ట్గా ఉండనవసరం లేదని అంటున్నారు. ఆదివారం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినవి మొహమాటం లేకుండా తినేస్తా వర్కౌట్లతో అదనపు కేలరీలు కరిగించేస్తా అంటున్నారు. ఒకవేళ నచ్చింది తినాలనుకుంటే..అమ్మో డైట్ అని ఆలోచించను అది తినేదైనా..తాగాలనుకున్నా మందైనా.. ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఆయనకు స్వీట్లంటే మహా ఇష్టమట. ముఖ్యంగా చాక్లెట్లు తినకుండా ఉండరట. అయితే వర్కౌట్లు చేసినంత కాలం హాయిగా అవి తీసుకోవచ్చని అంటున్నారు. అలాగే గోల్ఫ్ తప్పనిసరిగా ఆడతారట. ఇది తన మనసుకు చక్కటి వ్యాయామంలా ఉండి తనకొక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ఈత యవ్వనంగా ఉండేందుకు ఉపకరిస్తుందట. ఇది ఒక అద్భుతమైన వ్యాయమం అట. మొత్తం ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు.(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..) -
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్నెస్కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్నెస్కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్ను గిఫ్ట్గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్లు 28 ఇంచ్ల నుంచి 39 ఇంచ్ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. -
బౌన్స్ బ్యాక్..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‘చందమామ’
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్స్టాలో తెలిపింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) "బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్. ఈ ప్రయాణంలో ఫిట్నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్కింగ్స్ కో ఓనర్గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్ఫుల్గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..) -
75 ఏళ్ల వయసులోనూ ఫిట్గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!
మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్నెస్ మంత్ర ఏంటో ఇన్స్టా థియోబ్లిక్స్లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్లో బెంచ్ ప్రెస్లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్లు చేయడమం మంచిదన్నారు. ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. మలి వయసులో అవి తప్పనిసరి..ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు. శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by Obliques24 (@obliques24_) (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
అనన్య పాండేలాంటి నాజూకు నడుము కావాలంటే...!
బాలీవుడ్ నటి అనన్య పాండే ఫిట్నెస్ ప్రియురాలు. యోగా నుండి పైలేట్స్ వరకు, వివిధ రకాల వ్యాయామాలతో చెక్కిన శిల్పంలా తన శరీరాన్ని మల్చుకుంటుంది. తన వర్కౌట్స్కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇటీవల ఆమె ఫిట్నెస్ శిక్షకురాలు , ప్రెండ్ అయిన నమ్రతా పురోహిత్ వర్కవుట్ ( పైలేట్స్) చేస్తున్న ఫోటోను షేర్ చేసి,ఆమెపై ప్రశంసలు కురిపించింది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనన్య లాగా, నాజూకైన నడుము కావాలనుకుంటున్నారా? అయితే ఆమె చేసే పైలేట్ష్తోపాటు కొన్ని రకాల యోగాసనాలనూ ఇక్కడ చూద్దాం.సైడ్ ప్లాంక్ ట్విస్ట్: నడుముకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. పక్కకు పడుకుని, తలను ఒక చేతితో పట్టుకుని, ఆపై నడుము భాగం కదలకుండా, పాదాల మధ్య ఎడం ఉంచి, మరొక చేతిని నిలువుగా పైకి లేవాలి. కొద్ది సేపు ఈ స్థితిలో ఉండి, తరువాత యథాస్థితికి రావాలి. అలాగే బోర్లా పడుకుని, మోచేతులపై భారం వేసి, బొటన వేళ్లపై బాడీని కొద్దిగా పైకి లేపాలి. ఇదేస్థితిలో బాడీని రెండు వైపులా మెల్లిగా ట్విస్ట్ చేయాలి. ఇలాంటి రిక్లైనింగ్ మోకాలి ట్విస్ట్, సిజర్స్ క్రిస్ క్రాస్ లాంటి కొన్ని వ్యాయామాలతో మాత్రమే కాదు, కొన్ని రకాల యోగసనాల ద్వారాకూడా నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు.త్రికోణాసనం..త్రికోణాసనం నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువును కంట్రోల్లో ఉంచడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. త్రికోణాసనం వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.నౌకాసనంనౌక మాదిరిగా ఈ ఆసనం ఉంటుంది గనుక దీనికి ఆపేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి. తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్ మీద బరువు నిలుపుతూ ,నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉంటే మంచిది. మధ్యలో స్వల్ప విరామం తీసుకుని మళ్లీ దీన్ని రిపీట్ చేయాలి.మత్స్యాసనంమత్స్యాసనం వేయండానికి ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కాళ్లను తిన్నగా చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్డ్గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ రిలాక్స్గా ఉంచుతూ ఈ పోజ్లో కొంతసేపు ఉండండి.ధనురాసనంయోగా మ్యాట్పైన బోర్లా పడుకొని, రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొత్తికడుపు, పొట్ట మీద ఒత్తిడి మనకు తెలుస్తుంది. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. తొందరగా ఫలితం కనబడాలంటే.. రోజులో రెండు సార్లు ఒక గంట పాటు , ఆసనానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటూ నిదానంగా ఈ ఆసనాలను వేయాలి. నోట్ :యోగాసనాలు ఎపుడూ కూడా హడావిడిగా చేయకూడదు. శ్వాసనిశ్వాసలను నియంత్రణలో ఉంచుకుంటూ నిదానంగా చేయాలి. అలాగే యోగసనాలను ప్రారంభించే ముందు యోగా నిపుణుల సలహాలను తీసుకోవాలి. -
వర్కవుట్స్ డైట్... డౌట్
శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసం వర్కవుట్లు చేయాలని సలహా ఇస్తుంటారు అందరూ. అయితే కేవలం ఎక్సర్సైజ్ చేయడంతోనే సరిపోదు, వ్యాయామం చేయక ముందు, చేసిన తర్వాత తీసుకునే ఆహారాలను బట్టి కూడా దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒక క్రమపద్ధతిలో చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.ఏ వయసువారికైనా ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవడం అవసరం. అందువల్ల వ్యాయామం చేసే ముందు, తర్వాత ఏం తినాలి..? అనేదానిని ఇక్కడ చూద్దాం.వర్కౌట్స్కు ముందు..?ఎక్సర్సైజ్లు చేయడానికి కొద్దిసేపటి ముందే ఏదైనా తినడం మంచిది కాదు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల తిన్న వెంటనే వర్కవుట్స్కి దిగకుండా కొంత గ్యాప్ ఇవ్వాలి. వ్యాయామానికి కనీసం అరగంట నుంచి గంట ముందు అల్పాహారం పూర్తి చేయాలి. అలాగే కసరత్తులు చేసిన తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. ఇక వ్యాయామం ముగిసిన తర్వాత బాడీ అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం. అదే సమయంలో కసరత్తుల వల్ల ఖర్చైపోయిన శక్తిని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా నీళ్లు తాగొచ్చు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడానికి ముందు సుమారు 2 నుంచి 3 కప్పుల నీళ్లు తాగాలి. ఇక అయిపోయిన తర్వాత కూడా అంతే పరిమాణంలో తాగాలి. కసరత్తులు చేస్తున్నప్పుడు..హెవీ వెయిట్లు లేపడం, ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేస్తే.. ప్రతి అరగంటకు 50 నుంచి 100 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనికోసం తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష లేదా అరటి పండు తీసుకోవాలి. -
ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్గా శక్తికపూర్..!
72 ఏళ్ల శక్తి కపూర్ తన ఫిట్నెస్ రహాస్యాన్ని ఇటీవల తెలియచేశాడు. రోజుకు 35 వేల అడుగులు నడవడం తన ఆరోగ్య రహస్యం అన్నాడు. నడక వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసినా.. 70 ఏళ్ల తర్వాత కూడా నడక మంచిదేనని వైద్యులు అంటున్నారు. రోజూ 7 వేలతో మొదలుపెట్టి కనీసం 10 వేల వరకూ నడిస్తే మంచిది అంటున్నారు. నడవని వారు గుండెకు చేటు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. మీరెంత నడుస్తున్నారు?వందలాది సినిమాల్లో నటించిన శక్తి కపూర్ 72 ఏళ్ల వయసులో కూడా చలాకీగా, ఫిట్గా ఉంటారు. ఇటీవల ఒక టీవీ షోలో మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటని అడిగితే ‘రోజూ కనీసం 35000 అడుగులు నడవడమే‘ అని చెప్పాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాను... తిరిగి మొదలుపెట్టాను అని చెప్పాడు. నటన అంటే రకరకాల పాత్రలు చేయాలి. పరిగెత్తడం, డాన్స్.. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. చాలామంది రకరకాల వ్యాయామం చేస్తారు. అయితే శక్తికపూర్ నడకే తన ఫిట్నెస్కు కారణం అని తెలియచేశాడు.నడక మంచిదిఈ విషయం గురించి ఢిల్లీలోని సికె బిర్లా హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ నరేంద్ర సింఘ్లా ఏమన్నారంటే ‘రోజుకు 35 వేల అడుగులు నడవడం ఎవరికైనా మంచిది... ముఖ్యంగా వయసు మళ్లిన వారి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని అడుగులు నడవడం వల్ల 2000 నుంచి 2500 కేలరీలు బర్న్ అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల పెద్ద వయసు వారిలో రక్తప్రసరణ క్రమబద్దీకరణ జరిగి బ్లడ్ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నడక బరువును అదుపు చేస్తుంది. వయసు మళ్లాక బరువు పెరిగితే స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు తోడవుతాయి. వాటిని నివారించాలన్నా బరువు పెరగకుండా చూసుకోవాలన్నా వయసు పెరిగే కొద్దీ నడకను పెంచాలి’ అన్నారాయన.మానసిక ఆరోగ్యానికి...ఎక్కువ అడుగులు నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. నడక మెదడుకు స్పష్టతనిచ్చి ఎంచుకున్న పనిపై ఏకాగ్రతను కలిగిస్తుందని వారు అంటున్నారు. అయితే 70 ఏళ్లు దాటాక 35 వేల అడుగుల నడక చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.ముందు నుంచి అలవాటు లేకపోతే. కాని 7000 అడుగుల నుంచి శక్తి, ఓపికను బట్టి 10 వేల అడుగుల వరకూ నడవాలని వారు అంటున్నారు. నడకకు అనువైన షూస్, పోష్చర్, తగినంత నీరు తాగి బయలుదేరడం... ఈ జాగ్రత్తలతో క్రమం తప్పకుండా నడిస్తే ఆరోగ్యం ఓ భాగ్యంలా తోడు ఉంటుందని అంటున్నారు వారు. నడవడమే బాకీ. -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్ని బట్టి..) -
ఈమె ఫేమస్ హీరోయిన్.. 49 ఏళ్లంటే మీరు నమ్ముతారా? (ఫొటోలు)
-
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!
ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 ఫీవరే నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డుని సృష్టించి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ప్రభాస్ల పేరు మీదున్న రికార్డుని బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఆయన డైలాగులు, ఆహార్యం, ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ స్టెప్పులు, ఫిజికల్ అపీరియన్స్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా హై ఎనర్జీతో కూడిన పెర్ఫార్మెన్స్కి ఎవ్వరైనా.. ముగ్గులైపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన నటన. మరి చూడటానికి ఆకర్షణీయంగా, ఆజానుబాహుడిలా ఉండే మన పుష్ప2 హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!పుష్ప మూవీలో డైలాగ్ మాదిరిగా.. "అల్లు అర్జున్ డైట్ అంటే నార్మల్ అనుకుంటివా అత్యంత హెల్తీ". ఆయన చెప్పే డైలాగులు..స్టెప్పులు అత్యంత వేగంగా ఉంటాయి. ప్రేక్షకుడిని అటెన్షన్తో వినేలా చేస్తాయి. అంతలా శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైన డైట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందుకోసం హీరో అల్లు అర్జున్ ఈ ఎనిమిది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తారట. అవేంటంటే..బన్నీ రోజు.. వ్యాయామాలు, వర్కౌట్లతోనే ప్రారంభమవుతుందట. అందువల్ల ఉదయాన్నే హై ప్రోటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్నే తీసుకుంటారట. దీని కారణంగానే ఆయన రోజంతా చురుకుగా ఉంటారుతప్పనిసరిగా అల్పాహారంలో గుడ్లు ఉండాల్సిందేనట. కండలు తిరిగిన దేహానికి అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇవి కండరాలను బలోపతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఇక లంచ్లో తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్ ఉండాల్సిందే. దీనిలోని లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా డైట్లో చేర్చకుంటారు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మ సంరక్షణకు, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడతాయి. హైడ్రేటెడ్గా ఉండేలా ఫ్రూట్ జ్యూస్లు, సలాడ్లు, షేక్లు కూడా తీసుకుంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్లు అందుతాయి. డిన్నర్ దగ్గరకి వచ్చేటప్పటికీ చాలా తేలికైన ఆహారమే తీసుకుంటారు. బ్రౌన్రైస్, కార్న్, గ్రీన్ రైస్ , సలాడ్లు ఉండేలా చూసుకుంటారు. చివరగా అల్లు అర్జున్లా మంచి పిట్నెస్తో ఉండాలంటే..వ్యాయమాలను స్కిప్ చేసే ధోరణి ఉండకూడదు. సమతుల్యమైన డైట్ని తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం నిబద్ధతతో ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకునేలా డైట్ని అనుసరిస్తే.. పుష్ప హీరోలాంటి లుక్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.(చదవండి: ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?) -
అద్భుతమైన ‘5’ టిప్స్తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. స్విస్ బాల్లో ప్రోన్ రివర్స్ హైపర్ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్లో ఎక్స్ర్సైజ్లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్కు ఇచ్చేసింది. అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! ) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!
బరువు తగ్గడం అంటే.. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలు అనే అనుకుంటాం. అందుకే చాలామంది బరువు తగ్గడం విషయమై చాలా భయపడుతుంటారు. కొందరూ ప్రయత్నించి మధ్యలోనే అమ్మో..! అని చేతులెత్తేస్తారు. సెలబ్రిటీలు, ప్రముఖులు, మంచి ఫిట్నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వెయిట్ లాస్ అవ్వగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఇక ఆ భయాలేమి వద్దంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్, ఫోర్త్ లెవెల్ 4 సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుప్రతిమ్ చౌదరి. ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించాల్సిన పని లేకుండానే తొందగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!.ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్కు ఇన్స్టాలో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోవడమే గాక తన ఫాలోవర్లకు ఈజీగా బరువు తగ్గే చిట్కాలను గురించి చెబుతుంటారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) ఇటీవలే తన వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 20 కిలోల బరువు వరకు ఎలా తగ్గాననేది కూడా హైలెట్ చేశారు. ఆయన అందుకోసం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదని ఈ అమూల్యమైన ఐదు రూల్స్ని పాటిస్తే చాలు తొందరగా బరవు తగ్గిపోతారని అన్నారు. ముందుగా తాను ఎలాంటి నియమాలు పాటించారో వివరించారు. ఆ తర్వాల ఎలాంటి డైట్ లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ వివరించారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) మొదటిది: రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ ముగించటం.. రెండు: ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగాలి.మూడు: ప్రతిరోజూ 50 శాతం తక్కువగా తినడానికి ప్రయత్నించండి నాలుగు: ప్రతిరోజూ 30-40 నిమిషాలు చాలా సాధారణ వ్యాయామలు ఐదు: ఒత్తడి లేకుండా ఉండటంఈ నియమాలను అనుసరించే తాను బరువు తగ్గగలిగానని సోషల్మీడియాలో పేర్కొన్నారు. అలాగే మరొక వీడియోలో ఎలాంటి కఠిన ఆహార నియమాలు లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ తెలిపారు. దానికి కూడా ఐదు రూల్స్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. అవేంటంటే.. ఎలాంటి డైట్ లేకుండా.. మొదటిది: ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.రెండు: భోజన సమయాలను సరి చేయండిమూడు: భోజనంలో అన్ని రకాల మాక్రోన్యూట్రియెంట్లను జోడించాలి(ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, గ్రీన్ సలాడ్లు ఉండాలి)నాలుగు: ఒక్కసారే వడ్డించుకోండి మరోసారి తీసుకునే యత్నం చెయ్యొద్దుఐదు: తినే సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దుఅలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చిప్స్, కుకీలు, ఫాస్ట్ఫుడ్కి దూరంగా ఉండమని సూచించారు ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..) -
తొమ్మిది పదుల వయసులోనూ ఫిట్గా, ఆరోగ్యంగా..
ఈ బామ్మ ఫిట్నెస్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఈ ఏజ్లోనూ ఎంతో చలాకీగా వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెస్ట్ తీసుకునే వయసులో తనకు వీలైన విధంగా సింపుల్ వ్యాయామాలు చేస్తున్నారు. అదికూడా ఏ రోజు స్కిప్ చేయకుండా చేస్తుందట. ఫిటనెస్ పట్ల ఆమె కనబరుస్తున్న నిబద్ధతకు సలాం కొట్టకుండా ఉండలేరు. వృద్ధాప్యంలోనూ మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?. ఈ బామ్మలా చలాకీగా వ్యాయమాలు చేయాలంటే..ఫిట్నెస్కి నిజమైన స్ఫూర్తి 90 ఏళ్ల జే. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వ్యాయామాలు చేస్తుంది. చాలా చురుకుగా తన దినచర్యను పూర్తిచేస్తుంటుంది. జే 30 స్క్వాట్లు (సపోర్ట్ కోసం ఫ్రిజ్ని పట్టుకుని మరీ..) 25 సిట్-అప్లు, 30-సెకండ్ ప్లాంక్ , పదివేల అడుగులు నడవడం తదితరాలన్నింటిని చేస్తుంది. మాములుగా అయితే ఎవ్వరైనా ఓ రెండు, మూడు రోజులు చేసి వదిలేస్తారు. కానీ ఈ బామ్మ అలాకాదు. ప్రతిరోజూ చక్కగా వ్యాయామాలు చేస్తుంది. ఇలా ఫిట్గా ఉండేందుకు వర్కౌట్లు చేయడం ముఖ్యం అని చేతల్లో చూపించింది జెనీ బామ్మ. వృద్ధాప్యంలో కూడా జే బామ్మలానే చక్కగా వీలైనన్నీ వ్యాయామాలు చేస్తే అనారోగ్యం బారిన పడరు, పైగా హాయిగా చివరి రోజులు సాగిపోతాయి. ఈ సందర్భంగా వృద్ధులు ఈజీగా వేయగలిగే సింపుల్ వ్యాయామాలను చూద్దామా..!. చైర్ స్క్వాట్లు: కాలు కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యతకు స్క్వాట్లు మంచివి. ఇవి లేచి నిలబడి, కూర్చీలోంచి నెమ్మదిగా కూర్చవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఉండదు. పైగా సులభంగా చేయగలుగుతారు. వాల్ పుష్-అప్స్: ఇవి ఎగువ శరీర బలాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వృద్ధులు నేలకు బదులు గోడను ఆసరా చేసుకుని చెయ్యొచ్చు. కూర్చునే మార్చింగ్: కూర్చీలో కూర్చొని ఆర్మీ మాదిరిగా మార్చింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపరడటమే గాక కాలు కండరాలు బలోపేతమవుతాయి.లైట్ వెయిట్స్తో ఆర్మ్ రైజ్లు: భుజం ఎత్తుకు చేతులు ఎత్తడం వల్ల భుజాల పైభాగంలో ఉన్న కండరాలు బలపడతాయి. చీలమండల భ్రమణాలు: కూర్చీలో కూర్చొని మడమలను ముందుకు వెనుకకు సవ్య-అపసవ్య దిశల్లో తిప్పడం వల్ల కాళ్లో చక్కటి రక్తప్రసరణ జరిగి.. అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు) -
కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..
తాను నృత్యకారిణిగా కొనసాగాలని, తన కూతురిని కూడా గొప్ప కళాకారిణిగా చూడాలని ఓ కన్నతల్లి ఆరాటం.. మూడేళ్ల వయసులోనే కూతురికి శిక్షణ.. చదువుల వేటలో మార్గాలు వేరుపడినా.. వేర్వేరు రంగాల్లో రాణింపు.. అయినా కూతురితో కలిసి ప్రదర్శన ఇవ్వాలనే ఆ తల్లి ఆశ మాత్రం చిరంజీవిగా ఉండడం.. చివరకు ఆ ఆకాంక్ష జయించడం.. బహుశా కీర్తిశేషులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఉండి ఉంటే ఇదో భావోద్వేగ భరిత వెండితెర కథగా మారి ఉండేదేమో.. హైదరాబాద్ నగరంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లు కలిసి సమర్పించనున్న సంప్రదాయ నృత్య ప్రదర్శన నేపథ్యం ఆసక్తికరమైనదిగా మారింది.. ‘ఇది అమ్మ చిరకాల ఆకాంక్ష. నాతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని తను ఎప్పటి నుంచో ఆశపడుతోంది’ నగరంలో ఒక మోడల్గా, ఫిట్నెస్ ట్రైనర్గా, ఈవెంట్ మేనేజర్గా చిరపరిచితమైన అభిమానిక.. మన హైదరాబాద్కి చెందిన అమ్మాయే. ఆమె అకస్మాత్తుగా నృత్యకారిణిగా మారడం వెనుక కారణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. హైదరాబాద్కి చెందిన అభిమానిక అమ్మతో కలిసి అడుగులు..ప్రస్తుతం హైకోర్ట్లో సీనియర్ లాయర్గా ఉన్న దువ్వూరి వత్సలేంద్రకుమారి తొలి అడ్వకేట్ జనరల్ దువ్వూరి నరసరాజు కుమార్తె.. తను మూడేళ్ల వయసు నుంచే నటరాజు రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. న్యాయవాదిగా మారినా నాట్యాభిరుచిని కొనసాగించారు. తన కూతురు అభిమానిక కూడా తనలాగే గొప్ప నాట్యకారిణి కావాలని మూడేళ్ల వయసులోనే ఆమెకు కూడా తానే గురువుగా మారి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కూడా ప్రదర్శనలు ఇస్తుంటే తన ఆకాంక్ష నెరవేరుతోందని మురిసిపోయారు. అయితే ఆ తల్లి ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలచింది. చదువుల వేటలో అభిమానిక నాట్యపిపాస అటకెక్కింది. బీటెక్ టాపర్గా నిలిచినా.. వ్యక్తిగత అభిరుచి మేరకు ఫిట్నెస్ ట్రైనర్గా మోడల్గా, ఈవెంట్ మేనేజర్గా విజయవంతంగా కొనసాగుతున్నారు అభిమానిక.. ఇప్పుడు తల్లి ఆకాంక్షకు తలొగ్గారు. పాతికేళ్ల తర్వాత.. మారిన ప్రయాణం‘నేను నాట్యానికి పాతికేళ్లుగా దూరమైనా అమ్మ తన ఆశకు మాత్రం దూరం కాలేదు. తరచూ నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అమ్మ పట్టుదలతో కొన్ని రోజుల్లోనే మళ్లీ నా చిన్ననాటి నాట్య పిపాస తిరిగి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఇష్టంతో నెలల తరబడి కఠినమైన సాధన ద్వారా అమ్మతో కలిసి ప్రదర్శనకు సిద్ధమవుతున్నా.. నిజం చెప్పాలంటే అమ్మ నాట్యానికి నేనో అభిమానిని’ అంటూ భావోద్వేగంతో చెప్పారు అభిమానిక. ‘నృత్యకారిణిగా, న్యాయవాదిగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చాను. ఎందరినో శిష్యురాళ్లుగా, నృత్యకారిణులుగా తయారు చేశాను. 2017లో పేరిణిలో తొలి మహిళా నృత్యకారిణిగా ప్రదర్శన ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాను. వ్యక్తిగతంగా ఎన్ని సాధించినా.. నా కూతురుతో కలిసి నాట్య ప్రదర్శన ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ’ అన్నారు వత్సలేంద్ర కుమారి. వయసు పైబడకుండానే.. ‘కేవలం కలిసి నృత్యం చేయడమే కాదు తనతో ధీటుగా చేయాలి కదా.. అందుకే వయసు మరీ పైబడకుండానే చేయాలని అనుకున్నా. ఏమైతేనేం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది’ అంటూ ఆనందంగా చెప్పారు వత్సలేంద్ర కుమారి.. ఇప్పటిదాకా తల్లీ కూతుర్లు కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వడం అనేది లేదని, అది తామిద్దరూ సాధించనుండడం గర్వంగా ఉందన్నారు. కూచిపూడి, భరతనాట్యం మేలు కలయిక లాంటి ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ ప్రారంభించారని, ఇటీవల అంతగా ప్రాభవానికి నోచుకోని ఈ నాట్యాన్ని అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by ABHIMANIKA 🇮🇳 Fashion & Fitness Coach (@abhimanika) (చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్నెస్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
ఐదుపదుల వయసులోనూ స్లిమ్గా మలైకా..శరీరాకృతి కోసం..!
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామరస్గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్నెస్తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.మలైకా అరోరా ఫినెస్కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ మాత్రం ఫిగర్ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్లు, జంపింగ్ జాక్లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది. ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్ఫాస్ట్గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్విచ్లు తీసుకుంటుంది. లంచ్లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది. తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!. (చదవండి: ఆఫీస్లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?) -
‘ఫిట్లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
ట్రామ్ పోలిన్ పిల్లలాటతో ఫిట్గా..
కొన్నిపార్కుల్లోనూ, మాల్స్లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్ అందుబాటులోకి వచ్చింది.పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్లో రొటీన్గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.అనేక ప్రయోజనాలు...⇒ ట్రామ్ పోలిన్పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి. ⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి. ⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.మొదట్లోనే జంపింగ్లు వద్దు...ట్రామ్ పోలిన్ వర్కౌట్లలో స్క్వాట్ జంప్లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు.ప్రమాదం.. నివారణఫిట్నెస్లో ట్రామ్ పోలిన్ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి. ⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి. ⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి. ⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు. సమస్యలు ఉంటే.. ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనండెస్క్ జాబ్లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు డెస్క్ జాబ్లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్నెస్ ట్రైనర్ -
ప్రపంచ చాంపియన్షిప్ లక్ష్యం
సొనెపట్: కొత్త సీజన్ను వంద శాతం ఫిట్నెస్తో ప్రారంభిస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో టాప్–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్ను ఘనంగా ముగించాడు. హరియాణాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్స్–2036’ పాల్గొన్న నీరజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్ ముగిసింది. కొత్త సీజన్పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్తో కొత్త సీజన్ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్ బయోమెకానిక్ నిపుణుడైన క్లాస్ బార్టొనిజ్తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్లో పాల్గొంటున్నానని వివరించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే పారాలింపిక్స్లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో నీరజ్ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్ అందజేశాడు. -
Zumba Dance: జుంబా హాయిరే..
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్ను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గేందుకు.. నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్సైజ్లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.హార్ట్కు మాంచి ఎక్సర్సైజ్.. జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మరెన్నో లాభాలు.. జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ.. గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. – ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో ఆహ్లాదం.. ఆరోగ్యం.. బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్టైన్మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు. – బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా -
ఏడుపదుల వయసులోనూ చలాకీగా మోదీ.. అలా ఎలా?
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్నెస్ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!యోగా..యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) యోగా నిద్ర లేదా సమాధి స్థితి..ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా. తప్పనిసరిగా వాకింగ్..ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్ని ఇస్తుందని అంటారు మోదీ.అల్పాహరం, భోజనంగా..ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు. ఆయర్వేదానికే ప్రాధాన్యత..మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!) -
రామ్ చరణ్ కొత్త సినిమా.. అప్పుడే మొదలెట్టేశాడు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే మరో సినిమాకు రామ్ చరణ్ సిద్ధమైపోయాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఆర్సీ16 చిత్రంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్గా నిర్వహించారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా)అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ప్రముఖ ఫిట్నెస్ కోట్ శివోహంతో కలిసి సాధన మొదలెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మెగా హీరో. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న చిత్రం కావడంతో అథ్లెట్ లుక్ కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఫిట్నెస్ ట్రైనర్ రామ్ చరణ్తో పాటు అమితాబ్ బచ్చన్, జాక్వెలిన్ లాంటి స్టార్స్కు సైతం కోచ్గా పనిచేశారు. Beast mode on 🔥#RC16 loading… @Shivohamshivfit pic.twitter.com/6Oz3bXpySp— Ram Charan (@AlwaysRamCharan) September 16, 2024 -
సమంత రోజు ఎలా గడుస్తుందంటే...???
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన నటి సమంత రూత్ ప్రభు. మోడల్ నుంచి మొదలై స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతే దృఢంగా నిలబడుతోంది. ఆరోగ్యం సహకరించక పోయినా అచంచల విశ్వాసంతో తన కలల సాకారంకోసం నిబద్ధతగా సాగుతోంది. పురుషాధిక్య సినీ ప్రపంచంలో హీరోయిన్గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎపుడూ టచ్లో ఉంటూ అనేక ఆరోగ్య విషయాలను పంచుకోవడం సమంతాకు అలవాటు. ఈ క్రమంలో తన దినచర్య వివరాలను పంచుకుంది. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, క్రీడలతోపాటు, వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటోంది అనే ‘ది డే ఇన్ మే లైఫ్’ అనే చిన్న వీడియోలో షేర్ చేసింది. ఆరోగ్యాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తన అభిమానులకు చెప్పకనే చెప్పేసింది. ఆరోగ్యం పట్ల సమంత తీసుకుంటున్న శ్రద్ధకు, ఫిటె్నెస్కు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మీరు స్టార్. చాలా స్ఫూర్తి దాయకం! అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)కాగా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ ఫీనిక్స్ పక్షిలో తనను తాను నిరూపించుకుఉంటోంది. ఈక్రమంలోనే ప్రతిష్టాత్మక “సిటాడెల్” సిరీస్తో బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా కొత్త ప్రయాణం ప్రారంభించినట్టు సమంత స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫిట్ టెక్నిక్.. హిట్ ఫిజిక్!
సాక్షి, సిటీబ్యూరో: సరిగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానా? ఒక చేతితో చేసిన రిపిటీషన్స్ స్థాయిలో రెండో చేతితో చేయలేకపోతున్నానెందుకు? ట్రెడ్మిల్ మీద ఫుట్ వర్క్ సరిగానే ఉందా? డైట్లో మార్పు చేర్పులెలా చేయాలి? ఒకటా రెండా.. జిమ్లో ఎక్సర్సైజెస్తో పాటు ఎన్నో డౌట్స్ కూడా వెంటాడుతాయి. వీటన్నింటికీ సమాధానాలు వర్కవుట్ చేసే మిషన్ చేతే చెప్పిస్తూ.. వినియోగించే టాప్ ఎక్విప్మెంట్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లి నుంచి సూపర్స్టార్ మహేష్బాబు దాకా అందరూ వినియోగించే ఎక్విప్మెంట్ని దక్షిణాదిలోనే అతిపెద్ద హైటెక్ ఫిట్నెస్ సెంటర్.. ఐ జిమ్లో అందుబాటులోకి తెచ్చారు.పరుగు/నడక చేసే క్రమంలో బర్న్ అవుతున్న కేలరీలు, అధిగమిస్తున్న దూరాలు, హార్ట్ బీట్.. వంటివి చూపించే ట్రెడ్మిల్ ఫిట్నెస్ లవర్స్కి తెలుసు. కానీ ఆ టైమ్లో మనం చేస్తున్న తప్పులేంటి?సరిచేసుకునే చిట్కాలేంటి? అది కూడా ట్రెడ్మిల్ స్వయంగా తానే చెబుతూ మన వాక్, జాగ్, రన్లో లోపాలు చూపించే/సరిచేయించే ట్రెడ్మిల్? తెలుసా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన జిమ్ ఎక్విప్మెంట్ తయారీ బ్రాండ్ టెక్నో అందించే అద్భుతాల్లో అదో చిరు ఉదాహరణ మాత్రమే. ఇటీవల నగరంలోని గచ్చిబౌలిలో ఏర్పాటైన అత్యాధునిక ఐజిమ్.. టెక్నో పరికరాల టెక్నికల్ వండర్స్కు అద్దం పడుతోంది.ఐ జిమ్లో వర్కవుట్ చేస్తున్న మిస్టర్ యూనివర్స్ 2023 బ్రాంకో టియోడోరోవిక్..మరెన్నో అత్యాధునిక ఫీచర్లు..పారిస్ ఒలింపిక్స్లో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ విలేజ్లో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా జిమ్ కూడా సెట్ చేశారు. ఆ జిమ్లో అత్యాధునిక హైటెక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానమైన ఈ జిమ్ దాదాపుగా 15వేల చదరపు అడుగుల్లో దక్షిణాదిలోనే అతిపెద్ద జిమ్ కమ్ కేఫ్ ఇది. ఈ జిమ్లో పరికరాలకు ఇంటర్నెట్తో పాటు ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ కూడా అనుసంధానించారు. వాకింగ్ చేస్తూ ఇష్టమైన వెబ్సిరీస్ చూడటం దగ్గర్నుంచి చాట్ చేయడం దాకా అన్నీ వర్కవుట్ మెషిన్లతోనే కానిచ్చేయవచ్చు. దాదాపుగా మెషిన్లన్నీ మన శరీరంతో కనెక్ట్ అవుతాయి. వర్కవుట్లో మంచి చెడుల్ని విశ్లేíÙస్తాయి. చేస్తున్న విధానంలోని తప్పొప్పులు చెబుతాయి.. ఉదాహరణకు ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తుంటే.. మన లెఫ్ట్ లెగ్ బాగా పనిచేస్తోందా? లేక రైట్ లెగ్ బాగా పనిచేస్తోందా? నీ స్టెప్ లెంగ్త్ ఎంత? ఫుట్ వర్క్ కరెక్ట్గా పడుతుందా లేదా అనే సూక్ష్మస్థాయి అంశాలు కూడా తెలియజేస్తాయి. మిషన్కు అమర్చిన స్క్రీన్లో ఒక మనిషి వర్కవుట్ చేస్తూ మనతో చేయిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.. మరెన్నో అత్యాధునిక ఫీచర్లు వీటి సొంతం.జిమ్లో ఏదైనా వర్కవుట్ కోసం ఒక మిషన్ మీద కూర్చునే ముందు దాన్ని మన హైట్కు తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని మిషన్స్ మనం కూర్చోగానే వాటికవే మన హైట్కు తగ్గట్టు హెచ్చుతగ్గులు సెట్ చేసుకుంటాయి.మనకు ఓ పార్క్లోనో, గ్రౌండ్లోనో రన్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంటే.. ఈ జిమ్లో ట్రెడ్మిల్ మీద మీరు వాక్, రన్ చేస్తుంటే.. అచ్చం అదే పార్క్ లేదా గ్రౌండ్లో చేసినట్టే ఫీల్ వస్తుంది. అక్కడ ఎత్తు పల్లాలతో సహా ఇక్కడా అదే విధమైన ఫీల్ వస్తుంది.మిషన్స్కి మొబైల్ ఫోన్లోని ఒక యాప్కి అనుసంధానం చేసి ఉంటుంది. ఆ యాప్లో రోజువారీగా మన వర్కవుట్ విశ్లేషణతో పాటు వారానికి, నెలకోసారి కూడా వర్కవుట్ ఎనాలసిస్ మనకు అందుతుంది. తద్వారా మన వ్యాయామ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? మజిల్ స్ట్రెంగ్త్లో వచి్చన మార్పులు, లోపాలు, బలాలు అన్నీ తెలుస్తాయి.డైటీషియన్స్ కూడా నిత్యం యాప్ ద్వారా టచ్లో ఉంటారు. మనం ఏ టైమ్కి ఏం తినాలి ఏం తింటున్నాం అనేది పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ సూచించిన డైట్ని మనం ఏ రోజైనా ఏ కారణం చేతనైనా ఫాలో అవలేకపోతే దానికి ప్రత్యామ్నాయం కూడా అందిస్తారు. కంట్రీలోనే బెస్ట్..సిటీలో పెద్ద పెద్ద జిమ్స్లో నేను వర్కవుట్ చేశాను. ఆ అనుభవంతోనే అన్నింటికన్నా ది బెస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నా. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని చాలా టైమ్ తీసుకుని దీన్ని తీర్చిదిద్దాను. బయోమెకానిక్స్, బాడీ మైండ్ కనెక్షన్ వంటి ఫీచర్లతో దేశంలో ఎక్కడా ఇలాంటి జిమ్ లేదని ప్రశంసలు అందుకుంటోంది. ఇండియాలో చూడడానికి కూడా కనపడని ఏఐ ఆధారిత మెషిన్లను ఇటలీలో నెలల తరబడి అన్వేషించి తీసుకొచ్చాం. మిస్టర్ యూనివర్స్ బ్రాంకో మన సిటీకి వచ్చి మా జిమ్లో వర్కవుట్ చేసి, మాది బెస్ట్ జిమ్ అని ప్రశంసించారు. – వంశీరెడ్డి, ఐ జిమ్ఇవి చదవండి: Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..! -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్లోనూ ఆడి కెరీర్కు గుడ్బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్కు ముందు స్విట్జర్లాండ్లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్లో ఇలా వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్లో బ్రిటన్తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్ప్రీత్ డిఫెండర్గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
‘ప్రతిసారి దూకుడు పనికిరాదు.. సూపర్ ఫిట్గా ఉండాలి’
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో 22 ఏళ్ల ఈ షట్లర్ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్నెస్ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు. ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు. ఫిట్నెస్ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ముఖ్యమే. నెట్ గేమ్పై పట్టు సాధించాలంటే సూపర్ ఫిట్గా ఉండాలి’అని విమల్ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్ సూపర్–500, చైనా ఓపెన్ సూపర్–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. -
అక్కడే నిలబడకోయ్.. కాస్త ఉరకవోయ్..
పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అంటారు పెద్దలు. అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ప్రస్తుతం భాగ్యనగరంలో రన్నింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు రావడం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో అనేక రకాల అరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్తో ఒళ్లు కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనలు, ఫిట్నెస్ ట్రైనర్స్ సలహాల మేరకు నగర వాసులు పరుగులు పెడుతున్నారు..ఈ నేపథ్యంలో దీని గురించి పలు ఆసక్తికర అంశాలు... ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోతోంది. బుర్రనిండా ఆలోచనలతో గజిబిజి గందరగోళాల నడుమ ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారు నగరవాసులు. అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య విషయాలపై నగర ప్రజల్లో అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ ట్రెండ్ కాస్తా హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒక్కో సమస్యపై అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ నిర్వహించి పలువురిని భాగస్వాములను చేసుకుంటున్నాయి.సమస్యలపై అవగాహన కలి్పస్తూ.. యువతలో ప్రస్తుతం అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి వాటిపై అవగాహన లేక వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు నగరంలో తీవ్రతరం అవుతున్నాయి. మత్తుకు బానిసలవుతూ యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. సిగరెట్, గుట్కాలు తింటూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఇలాంటి సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకోసమే పలు ఆస్పత్రులు, సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.సాఫ్ట్వేర్ కంపెనీల్లో.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నైట్ డ్యూటీలు, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్తో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి తగ్గించేందుకు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు మారథాన్ నిర్వహిస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు తోటి ఉద్యోగులతో సరదాగా ఉంటూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. వ్యాధులపై ప్రచారానికి.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు జీవన శైలి వ్యాధులపై అవగాహన కలి ్పంచేందుకుకు నగరంలోని చాలా ఆస్పత్రులు మారథాన్ నిర్వహిస్తున్నాయి. మారథాన్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నాయి. ఇదే దారిలో చాలా సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ చారిటీ చేస్తున్నాయి. దీంతో రెండు రకాలుగా మారథాన్ ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు కూడా అప్పుడప్పుడూ మారథాన్ నిర్వహిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. డ్రగ్స్పై అవగాహన కలి ్పంచేందుకు ఇటీవల తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. దీనిద్వారా కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు కాళాశాలలు మారథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు పలు అంశాల గురించి వివరిస్తున్నారు.రన్నింగ్తో ఎన్నో లాభాలు రన్నింగ్ చేస్తే శారీరక, మానసిక లాభాలు ఎన్నో ఉన్నాయి. 2010లో ఆర్మీలో చేరాను. పుణేలో ఉన్నప్పుడు మా కోచ్ సలహాతో మారథాన్లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. 2013 నుంచి మారథాన్లో పాల్గొంటూ వస్తున్నా. దేశ, విదేశాల్లో ఎక్కడ మారథాన్ జరిగినా వెళ్లి పాల్గొంటా. ఇటీవల ముంబైలో జరిగిన మారథాన్లో గోల్డ్ మెడల్ సాధించా. ఢిల్లీలో జరిగిన మారథాన్లో సిల్వర్ పతకం వచి్చంది. రేపు జరగబోయే హైదరాబాద్ మారథాన్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చాను. మారథాన్లో పాల్గొనేందుకు రోజూ కనీసం 30 కిమీ చొప్పున వారానికి 160– 180 కిమీ పరుగెడుతూ సాధన చేస్తుంటాను. రన్నింగ్తో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. – శ్రీను బుగత, బంగారంపేట, విజయనగరంఎన్నో పాఠాలు నేరి్పస్తుంది.. మారథాన్ అనేది పరుగు మాత్రమే కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాలు తెలుస్తాయి. సవాళ్లను స్వీకరించడం ఎలాగో తెలియజేస్తుంది. నలుగురితో కలిసి జీవిస్తే వచ్చే ప్రయోజనాలను గురించి నేరి్పస్తుంది. భారత్లో గత పది, పదిహేనేళ్ల నుంచి మారథాన్ ట్రెండ్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల్లో కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీన్నొక సామాజిక పండుగలా సంబరంగా జరుపుకొంటున్నారు. – రాజేశ్ వెచ్చా, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఫౌండర్ అద్భుతమైన అనుభూతి.. మారథాన్లో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి ఉంటుంది. తోటి ఉద్యోగులతో మారథాన్లో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పటివరకూ దాదాపు 10 మారథాన్లలో పాల్గొన్నాను. రన్నింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ కూడా వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది. – మహేశ్రెడ్డి మోదుగు, ఐటీ ఉద్యోగి -
Health: వర్క్లెస్.. మోర్ ఫిట్..!
ఉరుకులు, పరుగుల నగరజీవితంలో శరీరానికి శ్రమలేకుండా పోతోంది. దీంతో శరీరంలో భారీగా కొవ్వులు పేరుకుపోతున్నాయి. వీటిని కరిగించేందుకు రకరకాల ఉత్పత్తులూ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఓ వైపు సహజ సిద్ధమైన వ్యాయామ పరికరాలు, రకరకాల ఫుడ్ అండ్ డైట్ ప్లాన్స్, న్యూట్రిషన్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లూ వెలసినా.. వాటిని అనుసరించడానికి తీరిక, ఆరి్థక స్థోమత లేక పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారి కోసమే మార్కెట్లోకి ఎలక్రి్టకల్ మజిల్ స్టిమ్యులేటర్స్ వస్తున్నాయి.. వీటిని షార్ట్ కట్లో ఏఎమ్ఎస్ అంటారు. వీటిని నగరంలోని అనేక జిమ్లు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఏఎమ్ఎస్ అంటే ఏమిటి? ఇది నిజంగా శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందా? ఇది సురక్షితమేనా? దీని ద్వారా తక్కువ శ్రమతో కండలు తిరిగిన శరీరాన్ని పొందగలదా? మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. – సాక్షి, సిటీబ్యూరోఇది సైన్స్.. – ఆధారిత వ్యాయామ పద్ధతి. సాధారణంగా పట్టించుకోని కండరాలను సైతం ఉత్తేజపరిచేందుకు తక్కువ–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని ఉపయోగించడం ద్వారా పూర్తి స్థాయి శిక్షణా సెషన్కు ఇది సమానమైంది. స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న వారు మల్టీ్టపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు వారి చలనశీలతను తిరిగి పొందేందుకు అనేక రకాల వైద్యపరమైన రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సహాయం చేయడానికి వైద్యులు చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అదే కొద్దిపాటి మార్పు చేర్పులతో ప్రస్తుతం జిమ్స్లో చేరింది. పర్యవేక్షణ తప్పనిసరి.. వినియోగదారులు ఓ మెషీన్కు అనుసంధానించిన పూ ర్తి ఎలక్ట్రోడ్లను తప్పనిసరిగా ధరించాలి. ఆ మెషీన్ విద్యుత్ తరంగాలను వైర్లు ,ఎలక్ట్రోడ్ల ద్వారా శరీరంలోని కండరాల్లోకి పంపుతుంది. దీని కోసం ప్రత్యేకమైన సూట్లు, పొట్టి చేతుల టాప్ షార్ట్లు అవసరం అవుతాయి. పూర్తిగా సమర్ధత కలిగిన శిక్షకుడి పర్యవేక్షణలో మాత్రమే ఈ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. లాభాలూ.. జాగ్రత్తలూ... గతంలో ఫిజియోథెరపిస్ట్ల వద్ద మాత్రమే ఉండే ఈ పరికరాలు ఇప్పుడు వ్యాయామ ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కండర ఉద్దీపనలో సహాయపడే అనేక పోర్టబుల్ పరికరాలు. వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామాల కోసం వేడెక్కడానికి లేదా గాయమైతే పునరావాస దశలో సహాయపడతాయి. ఈ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. వీటితో అదనపు కండరాల పునరుద్ధరణ లభిస్తుంది. కానీ, అధిక వినియోగం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆరంభంలో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.ఐరోపా నుంచే... ఫిట్నెస్ మార్కెట్లో ఎలక్ట్రో కండరాల ప్రేరణ అనే తాజా సాంకేతికత ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. కండరాల సంకోచాలను ప్రేరేపించడానికి వివిధ రకాల విద్యుత్ ప్రవాహాలను ఇది ఉపయోగిస్తుంది. దీని ద్వారా శరీరం అంతటా రక్త ప్రసరణ పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. –సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ రామోనా బ్రాగంజాహాలీవుడ్ సెలబ్రిటీలు సైతం.. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం. హెడీ క్లమ్, ఎలిజబెత్ హర్లీ మడోన్నా వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ టెక్నిక్ను ఉపయోగించారు. ఇది చెమట పట్టకుండా కండరాలను నిరి్మంచడానికి సులభమైన మార్గం. – ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా20 నిమిషాల సూట్.. 90 నిమిషాల వర్కవుట్!‘‘ఫిట్నెస్ పరిశ్రమలో ఇదో ఉత్తేజకరమైన మార్పు. దీని సూట్లు ఫిట్నెస్ ఔత్సాహికుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సూట్లో 20 నిమిషాల పాటు వర్కవుట్ 90 నిమిషాల సాంప్రదాయ వర్కవుట్కి సమానం. ఈ ఏఎమ్ఎస్ సూట్లు సెకనుకు 85 కండరాల సంకోచాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన కండరాల సమూహాల ద్వారా 98% కంటే ఎక్కువ కండరాలను కదిలేలా చేస్తాయి. కండరాల సడలింపు, పునరుద్ధరణ, చలనశీలతను పెంచడం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం, బిగించడం, టోనింగ్ చేయడం, శక్తి స్థాయిలు, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఫిట్నెస్కు మాత్రమే కాకుండా ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, స్నాయువు, నడుము నొప్పి, దీర్ఘకాలిక కటి నొప్పి, మధుమేహం సంబంధిత నరాలవ్యాధి, పరి«దీయ ధమని వ్యాధి వంటి అనేక సమస్యల చికిత్సలో ఉపయోగించబడుతుంది. – ఫిట్నెస్ నిపుణులు, మీనాక్షి మొహంతి -
ఉదయం ఐదింటికి నిద్ర.. ఒక్కపూట భోజనం..!
పెరిగే వయసును దాచిపెట్టడం చాలా కష్టం.. కానీ కొందరు హీరోలను చూస్తుంటే వయసు వెనక్కు వెళ్లిపోతుందేమో అనిపించక మానదు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఈ కోవలోకే వస్తాడు. 58 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్గా, యంగ్గా కనిపించే ఈ హీరో తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టాడు.అర్ధరాత్రి 2 గంటలకు..అమెరికన్ నటుడు మార్క్ వాలబర్గ్ నిద్రలేచే సమయానికి నేను నిద్రపోతాను. అంటే ఉదయం ఐదింటికి మంచంపై వాలిపోతాను. ఉదయం 9 లేదా 10 గంటలకు నిద్ర లేస్తాను. త్వరగా రెడీ అయిపోయి షూటింగ్స్కు వెళ్తాను. మళ్లీ అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకుంటాను. అప్పుడు స్నానం చేసి, అరగంట పాటు వర్కవుట్స్ చేసి హాయిగా నిద్రపోతాను అని చెప్పాడు. అలాగే రోజులో ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తాడట.వంటలు నేర్చుకున్నాఆ మధ్య కరోనా వచ్చినప్పుడు జీవితం స్థంభించిపోయింది. ఏం చేయాలో కూడా తోచలేదు. ఇటాలియన్ వంటలు నేర్చుకున్నాను. శరీరాన్ని నాకు నచ్చినట్లు మలుచుకున్నాను. నాలుగేళ్లపాటు స్క్రీన్పై కనిపించకపోయేసరికి జనాలు నన్ను మిస్సయ్యారు. అప్పటిదాకా తరచూ ఏదో ఒక సినిమాతో వెండితెరపై కనిపించిన నేను ఏళ్లపాటు కనబడకపోయే సరికి నాకోసం ఆతృతగా వెయిట్ చేశారు అని చెప్పుకొచ్చాడు.సినిమా..జవాన్, డుంకీ, పఠాన్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడి కూతురు సుహానా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల జరిగిన లొకార్నో ఫిలిం ఫెస్టివల్లో షారూఖ్ ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. -
క్రికెటర్ కోహ్లీ ఫాలో అయ్యే డైట్ ఇదే..!
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ చూడటానికి బాలీవుడ్ హీరోల మాదిరిగా స్లైలిష్గా ఉంటాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వెళ్లితే సిక్సర్లతో చెలరేగిపోతాడు. చూసేందుకు గాంభీర్యంగా, కూల్గా కనిపిస్తున్నా..క్రికెట్కి సంబంధించి ఎలాంటి ఒత్తిడిని భావోద్వేగ రూపంలో వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి లుకింగ్ స్టైల్ని మార్చేస్తుంటాడు. అలాంటి ఈ యంగ్ క్రికెటర్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఎలాంటి డైట్ ఫాలో అవుతాడు వంటి వాటి గురించి తెలసుకోవాలని ఆరాట పడుతుంటారు అభిమానులు. ఇంతకీ అతడి ఫిట్నెస్, ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే.. 35 ఏళ్ల క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన డైట్ని, ఫిట్నెస్ని అనుసరిస్తాడు. అంతేగాదు ఐపీఎల్ వంటి సీజన్లలో కేవలం బేక్ చేసిన చికెన్, ఆవిరి మీద ఉడికించిన కూరగాయ ముక్కలతో ఫిట్నెస్ కాపాడుకున్నాడు. ఆహారం వద్ద చాలా స్ట్రిక్ట్ డైట్ని ఫాలో అవుతాడని అతడని జిమ్ కోచ్ తెలిపారు. కోహ్లీ ఆహారంలో రుచి కన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇస్తాడు. అంతేగాదు అతడు తన శరీరానికి అవసరమయ్యే పోషకాల అవసరాన్ని అనుసరించే తీసుకుంటాడు.ప్రయాణ సమయంలో ఉండేవి ఇవే..విమాన ప్రయాణలో కోహ్లీ వెంట బ్యాగులో కాఫీసెట్, ప్రోటీన్ బార్, కొన్ని నెట్స్, తదితరాలు ఉంటాయి. వాటిని సమయాన్ని కేటాయించుకుని మరీ తింటాడు. చెప్పాలంటే..అరగంటకోసారి తింటాడట. కోహ్లీ డైట్ సీక్రెట్..కోహ్లీ అనుసరించే డైట్, ఫిట్స్ సూత్రాలు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని హెల్తీగా, ఫిట్గా ఉండొచ్చు. అవేంటంటే..స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు, బలం, ఫ్లెక్సిబిలిటీని పెంచే హై ఇంటెన్సీటీ వ్యాయామాలువిరాట్ కోహ్లీ చేస్తాడు. సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా ట్రైనింగ్ షెడ్యూల్ను కోహ్లీ పాటిస్తాడు. స్కిప్ చేయకుండా స్ట్రిట్గా డైట్ ఫాలో అవ్వడమే అతడి ఫిట్నస్ సీక్రెట్.క్రమశిక్షణే అతని ఫిట్నెస్కు మూల కారణం. విరామం సమయంలో కూడా వర్కవుట్ చేయడం వదిలిపెట్టడు.అతని వర్కౌట్ ట్రైనింగ్, క్రికెట్ మ్యాచ్లకు తగ్గట్లుగా ప్లాన్ ఉంటుంది. కావాల్సిన శక్తి అందేలా, దానికి తగ్గట్లుగా ఆహార నియమావళి పకడ్బంది వ్యూహంతో వ్యక్తిగత నిపుణలు సెట్ చేస్తారు.ఎక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా పోషకాలపై దృష్టిపెడతాడు కోహ్లీ. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటాడు.ఎప్పుడూ శరీరం హైడ్రెటెడ్గా ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన ఆటకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాడు.(చదవండి: గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!) -
యోగం: విల్లులా వంచుదాం!
వెన్నెముక కండరాలను బలోపేతం చేయడంలోనూ, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలోనూ.. ఎన్నో ప్రయోజనాలను అర్ధచక్రాసన ద్వారా పొందవచ్చు. ఈ ఆసనం విల్లు భంగిమను పోలిఉంటుంది. అర్ధ చక్రం (హాఫ్ వీల్ ఆసన) అంటే సగం చక్రం అన్నమాట.చురుకైన కండరాలు..దీనిని సాధన చేయడానికి మ్యాట్పైన నిటారుగా నిల్చోవాలి. చేతులను, తలను భుజాల నుంచి వెనక్కి తీసుకుంటూ నడుమును వంచాలి. దీని వల్ల వెన్ను భాగం సాగుతుంది. ఎంత వీలైతే అంతగా నడుము భాగాన్ని ముందుకు, తల భాగాన్ని వెనక్కి వంచుతూ కాళ్లను నిటారుగా ఉంచాలి. దీంతో కండరాలన్నీ పూర్తి చురుగ్గా అవుతాయి. వెనుకకు వంగేటప్పుడు దీర్ఘ శ్వాస పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. అదే విధంగా యధాస్థితికి చేరుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. మూడు నుంచి ఐదు సార్లు..సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు సమతుల్యతను కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలి. మూడు నుంచి ఐదు సార్లు ఈ భంగిమను తిరిగి చేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక నొప్పి తీవ్రత తగ్గుతుంది. కడుపుపై ఒత్తిడి పెరిగి, అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఊబకాయంపై ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయ స్పందన రేటును సమర్థంగా నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్స్టా్రగామ్ ఫాలోవర్స్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్ను లేదా ఫ్రిస్బీ ప్లేట్ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
నీరజ్ చోప్రా ఫిట్నెస్ రహస్యం ఇదే..!
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం గెలుచుకోవడం విశేషం. గతంలో టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుందామా..!నీరజ్ చూడటాని చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయం ఉంటాడు. అతడు ఆడే జావెలిన్ త్రోలో ఎన్నో గాయలు అవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని విశ్వవేదిక వద్దకు చేరుకోవడం వెనుక మాటలకందని కఠోర శ్రమ ఉంటుంది. అందుకోసం వారు ఆహర్నిశలు ఫిట్నెస్పై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నీరజ్ చోప్రా మంచి ఫిట్నెస్ ఔత్సాహికుడు, అభ్యాసకుడు అని ఆయన పిట్నెస్ ట్రైనర్ ఇషాన్ మార్వాహా చెబుతున్నారు. అతను ఫిట్నెస్ శిక్షణలో చాలా చురుకుగా ఉంటాడు. ఇతర అథ్లెట్ల కంటే భిన్నంగా ఆలోచిస్తాడు, అంకితభావంతో కృషి చేస్తాడనిన్నారు. ఆయన నీరజ్ ఫిట్నెస్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు అవేంటంటే..అతడివ్యాయామ దినచర్య ఎగువ, దిగువ శరీర బలాన్ని మెరుగుపరచడంపై దష్టిసారిస్తూ ప్రారంభిస్తాడని అన్నారు. తన చేతులు, మోచేతులు ఆకృతిలో ఉంచేందుకు మెడిసిన్ బాల్స్, కేబుల్పుల్ వ్యాయామాలపై దృష్టిపెడతాడని అన్నారు. అలాగే బరువు నిర్వహించేందుకు బరువున్న బంతితో వర్కౌట్లు చేస్తాడని చెప్పారు. జావెలిన్ త్రోయర్లకు అత్యంత అవసరమైన వ్యాయామం అని తెలిపారుతన ఆటకు ఉపయోగపడే స్క్వాట్స్, స్నాచ్, వెయిటెడ్ లంగ్స్, టైమ్ సర్క్యూట్ల వంటి ఇతర వ్యాయామాలతో కండరాలను నిమగ్నం చేస్తాడు. వీటి తోపాటు డంబెల్ ఫ్రంట్ మరియు సైడ్ రైజ్లు, ఏటవాలు క్రంచెస్, స్విస్ బాల్ క్రంచెస్, లెగ్ రైజ్లు కూడా చేస్తాడు. ఇవి అతని కోర్ బాడీ స్ట్రెంగ్త్ను పెంచుతాయని వివరించారు. అయితే టోక్యో 2020 ఒలింపిక్స్ తర్వాత, నీరజ్ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి టబాటా వ్యాయామంతో చేసినట్లు తెలిపారు. దీన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్(హెచ్ఐఐటీ) వ్యాయామం అంటారు. మొత్తం విభిన్నవ్యాయామాల వర్కౌట్ 20 సెకన్లలో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐస్ బాత్లు, కాంట్రాస్ట్ బాత్లతో విశ్రాంతి తీసుకుంటాడని అన్నారునీరజ్లా బాడీ ఉండాలంటే..నీరజ్లాంచి చక్కటి శరీరాకృతి కావాలనుకుని యువకులకు నీరజ్ ఫిట్నెస్ని ఫాలో అయితే మంచి ఫలితాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నీరజ్లా అనుభవజ్ఞుడైన ఫిటెనెస్ ప్రొఫెషనల్ సలహాలు సూచనలతోనే ఇవి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఈ హెచ్ఐఐటీని 30, 40లలో ఉన్న పురుషుల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇవి హృదయ ఆర్యోగాన్ని పెంచడమే గాక జీవక్రియను మెరుగుపరుస్తాయి. పైగా కొవ్వులనే ఈజీగా కరిగించేస్తుంది.ఈ వ్యాయామం కండర ద్రవ్యరాశిని తగ్గించి, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడు పదుల వయసులో ఉన్న పురుషులకు మంచి దేహ సౌష్టవాన్ని పొందేందుకు ఇవి ఉపయోగపడతాయి. అలాగే 40, 50లలో ఉన్నవారికి ఎగువ శరీర బలాన్ని పెంపొందించుకునేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ కోసం క్రీడాకారుల ఫిట్నెస్ చిట్కాలు ఎంతగానో ఉపకరిస్తాయి. సమర్థవంతమైన ఫిట్నెస్ సాధించేందుకు ఉపయోగాపడతాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: స్పేస్లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్ స్పేస్ ఫుడ్స్ ఇవే..!) -
బిడ్డకు తల్లయినా అంతే గ్లామర్గా ఆలియా! ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎంత గ్లామరస్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్నెస్తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్ చేస్తుంది. అలియా తన ఫిట్నెస్ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్బెల్తో బరువున్న హిప్ థ్రస్ట్లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.అలాగే ఆలియా ఫిట్నెస్లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్ టెక్నీక్లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.ఇవన్నీ పాటించాలంటే..ఆలియా భట్ మాదిరిగానే ఫిట్నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం. మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేయాలి. అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి. View this post on Instagram A post shared by alia💓shukria (@aliabhatt_love28) (చదవండి: అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?) -
వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చని ఫిట్నెస్ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్కు తగ్గట్టుగా వర్కవుట్ని డిజైన్ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్కు అనుగుణంగా వర్కవుట్ డిజైన్ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్నెస్ ఫ్రీక్లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోవర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్నెస్ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్ వర్కవుట్స్పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...సమయానికి తగినట్లు..– స్పాట్ జాగింగ్ చాలా తక్కువ స్పేస్లో కదలకుండా చేసే జాగింగ్ ఇది. అవుట్డోర్లో జాగింగ్కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్బాడీకి వర్కవుట్ ఇవ్వొచ్చు. – జంపింగ్ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్ చాప్స్ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.– స్కిప్పింగ్ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్ సూన్ వర్కౌట్. రోప్ స్కిప్పింగ్ లేదా జంపింగ్ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది అన్ని సీజన్లలోనూ చేయవచ్చు. – వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. – సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.– ఆన్లైన్లో లేదా ఫిట్నెస్ యాప్ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ఇచ్చే డ్యాన్స్ వీడియోలను అనుసరించాలి. – ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ల్యాప్లు లేదా ఆక్వా ఏరోబిక్స్ క్లాస్లలో పాల్గొనాలి.– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మార్పు చేర్పులు అవసరం..ఎండలు ఉన్నాయని కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా జిమ్స్కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్ విధానం కూడా. ఈ సీజన్లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలనే మూడ్ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్ వర్కవుట్స్ చేశాక జిమ్కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్డోర్లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్డోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. వర్షాకాలం వర్కవుట్స్..ఈ వాతావరణం హెవీ వెయిట్/ రిపిటీషన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఎక్కువ టైమ్ కేటాయించాలి. వైరల్ ఫీవర్స్ ఫ్లూ వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్కి ముందు వార్మ్ అప్కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్లో చాలా ఉపయుక్తం.– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్స్టైల్ కోచ్ -
మొక్కలను కాపాడే స్మార్ట్ కుండీ ఇదే!
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!పిల్లల కోసం ఫిట్నెస్ వాచీ..రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్టీఈ’ పేరుతో ఈ ఫిట్నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!నానోబాక్స్ మినీ డ్రమ్స్..మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.‘రాజ్మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్కు ఉన్న టచ్స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే! -
నా ఫిట్నెస్ రహస్యం ఇదే!
మనిషికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇది సినీ తారలకు మరీ ముఖ్యం. అందుకు వ్యాయామం వంటి కసరత్తులతో పాటు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. కొందరు అందుబాటులో ఉన్నవి కదా అని అన్నీ తినేస్తుంటారు. దీంతో భారీ కాయంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాగా చాలా మంది కథానాయికలు వయసు పరంగా 40లో పడినా చాలా ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఒకరు అగ్రనటి నయనతార. జవాన్ చిత్రంలో ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిన ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ తరగని అందాలతో నిగ నిగలాడుతున్న ఈ భామ ఫిట్నెస్ రహస్యమేమిటో? అని చాలా మంది ఆశ్యర్యపోతుంటారు. ఆ రహస్యాన్ని నయనతారనే ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. అందులో డైట్ అంటే ఇష్టమైన వన్నీ భుజించకూడదని, తాను ఇంతకు ముందు వరకూ భావించానన్నారు. అయితే అది కరెక్ట్ కాదని తన వైద్యురాలి ద్వారా తెలుసుకున్నానన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేయించుకుని, భుజిస్తున్నానని చెప్పారు. వాటిని ఆస్వాదిస్తూ తినడంతో జంక్ పదార్థాలపై కోరిక పుట్టడం లేదన్నారు. అలా తన ఆహారపు అలవాట్లే మారిపోయాయని పేర్కొన్నారు. మన లైఫ్ స్టైల్ బట్టే మన జీవన విధానం ఉంటుందని నయనతార అన్నారు. కాగా ప్రస్తుతం ఈ లేడీ సూపర్స్టార్ తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క నిర్మాతగా, వ్యాపారవేత్తగా, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ పలు విధాలుగా సంపాదిస్తున్నారు. -
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా..!
-
30 మినిట్స్... మీకోసం
వాకింగ్ లాంజెస్, బర్పీస్, జంప్ స్క్వాట్స్, సైడ్ కిక్స్, హై నీస్, స్టెయిర్స్, జంపింగ్ జాక్స్, మౌంటెయిన్ క్లైంబర్స్... మొత్తం ఎనిమిది ఎక్సర్సైజ్లు. ఒక్కో ఎక్సర్సైజ్కి ఒక్క నిమిషం. ‘రోజుకో అరగంట కేటాయించండి చాలు. దేహం ఫిట్గా ఉంటుంది’ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాట. ఫిట్నెస్ అనేది మగవాళ్లకు మాత్రమే కాదు మహిళలకు కూడా అవసరమే. మచిలీపట్నంలో మహిళలకు ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు సౌమ్యారావు. ‘‘మహిళ కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమిస్తుంది. కానీ తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనే ధ్యాస ఉండదు. దేహాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి రోజుకో అరగంట తన కోసం తాను కేటాయించుకునే వెసులుబాటు కూడా ఉండడం లేదు. ఈ విషయంలో నగరాలు ఒక అడుగు ముందున్నాయి. పట్టణాలు, గ్రామాలు మాత్రం మహిళ ఫిట్నెస్ గురించి మాట్లాడడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి. ఆ అయిష్టతను తొలగించానికి సౌమ్యారావు చేస్తున్న ప్రయత్నమిది. బందరమ్మాయి! మాది మచిలీపట్నం. పూణేలో ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఏరోబిక్స్ మీద ఆసక్తి కలిగింది. ఇంజినీరింగ్ చేస్తూనే ఏరోబిక్స్లో కోర్స్ చేసి, ట్రైనర్గా పార్ట్టైమ్ జాబ్ చేశాను. అమ్మాయిలు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలని చెప్పేవారు నాన్న. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని మచిలీపట్నం రావడం, అదే ఏడాది మా ఊరి అబ్బాయితోనే పెళ్లీ జరిగిపోయాయి. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే మన పని ్ర΄ారంభించాలనుకున్నాను. అలా 2007లో మూడు లక్షల పెట్టుబడి తో మచిలీపట్నంలో ఏరోబిక్స్ సెంటర్ పారంభించాను. అప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి ఇద్దరు మాత్రమే పేరు నమోదు చేసుకున్నారు. నెల తిరిగేసరికి యాభై మంది ఎన్రోల్ అయ్యారు. రెండు నుంచి యాభైకి... మధ్య మచిలీపట్నంలో ఉన్న ప్రతి డాక్టర్నీ సంప్రదించాను. ఏరోబిక్స్ని ఫిట్నెస్ అనే ఒక్కకోణంలో చూడకుండా, దేహం అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్కీ అవసరమైనట్లు కస్టమైజ్డ్గా డిజైన్ చేయాల్సిన అవసరాన్ని సూచించారు. సిజేరియన్ తర్వాత దేహం తిరిగి పటుత్వాన్ని సంతరించుకోవడం, ఒబేసిటీ, పీసీఓడీ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు డిజైన్ చేశాను. మన సమాజం నిర్లక్ష్యం చేసే మరో సమస్య మెనో΄ాజ్. ఈ దశ తర్వాత మహిళల దేహం చాలా వేగంగా శక్తిని కోల్పోతుంది. ఈ దశలో ఫిట్నెస్ని పరిరక్షించుకోవడం ఎంత అవసరమో తెలియచేస్తున్నాను. అలాంటి వాళ్లకు సెల్ఫ్కేర్ గురించి కౌన్సెలింగ్తో΄ాటు ఉచితంగా ఫిట్నెస్ శిక్షణనిస్తున్నాను. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే యాభై దాటినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ దశను ఆరోగ్యకరంగా దాటగలిగితే మహిళలు అరవై, డెబ్భైలలో నాణ్యమైన జీవితాన్ని సాగించగలుగుతారు. అలాగే మిడిల్ ఏజ్లో మహిళలకు ఎదురయ్యే డిప్రెషన్, మెంటల్ ట్రామాలకు కూడా ఫిట్నెస్ యాక్టివిటీ మంచి పరిష్కారం. ఏరోబిక్స్ శిక్షణ కోసం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ క్లాసులు తీసుకుంటున్నాను. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియాల్లో ఉన్న మా మచిలీపట్నం వాళ్లే ఎక్కువ మంది. ఆవేదన తప్పడం లేదు కొంతమంది భర్తలు ‘నీకిప్పుడు ఫిట్నెస్ అవసరమా, డబ్బు తగలేస్తావా’ ఇలా రకరకాలుగా అంటారట. ఆ మాటలకు భయపడి ముందడుగు వేయని వాళ్లు కొందరైతే, రహస్యంగా నేర్చుకోవాలనుకునే వాళ్లు కొందరు. ఇరవై ఒకటో శతాబ్దం కూడా మహిళల విషయంలో ఇలా ఉండడం ఏమిటో అని ఆవేదన కలుగుతుంటుంది. చైతన్యవంతం కావాల్సింది మహిళలు మాత్రమే కాదు మగవాళ్లు కూడా’’ అన్నారు సౌమ్యారావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిపిల్లల డైలీ రొటీన్ పిల్లలకు బ్రష్ చేయడం దగ్గర్నుంచి తగినన్ని నీళ్లు తాగడం వరకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పిస్తాం. కానీ ఫిట్నెస్ కోసం సమయం కేటాయించడం మన ఇండియన్ పేరెంటింగ్ డిక్షనరీలో కనిపించదు. స్కూళ్లలో ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ లేదా జుంబా డాన్స్ వంటి ఏదో ఒక వ్యాయామ ప్రక్రియ ప్రవేశ పెడితే పిల్లలకు డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ ఒక భాగంగా మారుతుంది. ఇప్పుడున్న విద్యావిధానం విద్యార్థుల్లో ఒత్తిడిని పెంచుతోంది. ఆ ఒత్తిడిని తొలగించే మార్గం ఫిజికల్ ఎక్సర్సైజ్. కనీసం మూడు నిమిషాల ్ర΄ాక్టీస్ చాలు. నేనే స్వయంగా స్కూళ్లకు వెళ్లి ఉచితంగా నేర్పిస్తానని ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ ΄ాఠశాల యాజమాన్యాలకు తెలియచేశాను. – సౌమ్యారావు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, మచిలీపట్నం -
డ్యాన్స్ చేస్తే ఆ వ్యాధులు రావు! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జిమ్కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్నెస్ కోసం నృత్యానికి మించిన వర్కౌట్ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్కి, కొన్ని స్టెప్లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్ చేస్తారు. ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి చెక్ పెడుతుంది..డ్యాన్స్ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్ మూవ్మెంట్లు డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్ డ్యాన్స్. రెగ్యూలర్ డ్యాన్స్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ ఉండేందుకు ఉపకరిస్తుంది. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(చదవండి: రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
మాస్ మహారాజ ఫిట్నెస్
-
ఇంకొంచెం ఇస్మార్ట్గా...
అటు ఫ్యాషన్ని, ఇటు ఫిట్నెస్ని... మిళితం చేసి ఫ్యాషనబుల్ ఫిట్నెస్ డివైజ్లపై ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. స్మార్ ్టరింగ్స్ నుంచి ఫిట్నెస్ ట్రాకర్ల వరకు ఎన్నో డివైజ్లను ఇష్టపడుతున్నారు యువత.యువతరంలో పెరుగుతున్న సెల్ఫ్–ట్రాకింగ్ కల్చర్, బయోఫీడ్ బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు ఫిట్నెస్ డివైజ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి...బాలీవుడ్ నటి ఆలియా భట్ను ఫిట్నెస్ డివైజ్ల గురించి అడిగితే బోలెడు విషయాలు చెబుతుంది. ఆమెకు ఇష్టమైనది ఒరా రింగ్. ఫిన్ల్యాండ్లో తయారైన ఈ సెన్సర్–లోడెడ్ టైటానియమ్ రింగ్కు యువతరంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తన బయో–ట్రాకింగ్ సామర్థ్యంతో ‘ఒరా’కు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్, శాంసంగ్లాంటి టెక్ దిగ్గజాలు తమదైన సొంత వెర్షన్ను సిద్ధం చేస్తున్నాయి.స్మార్ట్ రింగ్లకు యువతంలోని క్రేజ్ను గమనించి నాయిస్, అల్ట్రాహ్యుమన్, పై రింగ్లాంటి ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ‘మా స్మార్ట్రింగ్స్ లాంచ్ అయిన 24 గంటల్లోనే అమ్ముడు అయ్యాయి’ అంటున్నాడు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కో–ఫౌండర్ అమన్ గురై.వివిధ కంపెనీల స్మార్ట్రింగ్లు హార్ట్రేట్ నుంచి ఆక్సిజన్ ఫ్లో వరకు మానిటర్ చేస్తాయి.నాయిస్, అల్ట్రాహ్యుమన్, పీ రింగ్లాంటి కంపెనీలు అందుబాటు ధరల్లో ఉండే స్మార్ట్ రింగ్స్, గ్లూకోజ్ మానిటరింగ్ డివైజ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మన దేశంలో యువతరాన్ని భయపెడుతున్న వ్యాధి డయాబెటిస్.మన దేశంలో యువతరంలో డయాబెటిస్ పెరుగుతున్న నేపథ్యంలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ను దృష్టిలో పెట్టుకొని అల్ట్రాహ్యూమన్, కంటూర్ ప్లస్లాంటి గ్లూకోజ్ మానిటర్ డివైజ్లు వచ్చాయి.‘వ్యక్తిగత ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరిగినప్నుడు హెల్త్కేర్ టూల్స్కు ప్రాధాన్యత పెరగడం అనేది సహజ విషయం’ అంటున్నాడు అమన్ గురై.ఫిట్నెస్ టూల్స్ గురించి యూత్లో ఆసక్తి పెరగడం ఆహ్వానించదగిన పరిణామం అంటుంది నేషనల్ ఫుట్బాల్ టీమ్ గోల్కీపర్, షీ కిక్స్ ఫుట్బాల్ అకాడమీ వ్యవస్థాపకురాలు అదితి చౌహాన్.‘వ్యాయామ సమయంలో నా శరీరం పనితీరును, నిద్రను పర్యవేక్షించడానికి నేను యాపిల్ వాచ్ను ఉపయోగిస్తాను. సమయానికి నిద్రపోవడం లాంటి వాటిని ఇది సూచిస్తుంది’ అంటుంది అదితి.స్టెప్స్, ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేసే ఫిట్నెస్ వాచ్లను ధరించడానికి యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది.‘ఒకప్పుడు నాకు ఆరోగ్య విషయాలపై శ్రద్ధ ఉండేది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత నాలో మార్పు వచ్చింది. బయోఫీడ్ బ్యాక్పై ఆసక్తి పెరిగింది. దీంతో రకరకాల గ్యాడ్జెట్స్ను వాడుతున్నాను’ అంటుంది బెంగళూరుకు చెందిన ఎంసీఏ స్టూడెంట్ సజిత.హెల్త్గ్యాడ్జెట్స్ను ప్రేమించేవారితో ΄ాటు వాటి అతి వినియోగాన్ని విమర్శిస్తున్న వారు కూడా యూత్లో ఉన్నారు.‘పందశాతం కచ్చితత్వం కోసం సర్టిఫైడ్ టూల్స్ మాత్రమే వాడాలి. లేక΄ోతే అనవసర ఆందోళనకు దగ్గర కావాల్సి వస్తుంది. గ్యాడ్జెట్ల వాడకంలో ఆచితూచి వ్యవహరించాలి’ అంటున్నారు నిపుణులు.‘వెల్నెస్ వేరబుల్ టెక్నాలజీదే భవిష్యత్’ అనే మాట వినిపిస్తున్నప్పటికీ వేలం వెర్రి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యువతరంపై ఉంది. -
ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు..
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు.. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ, అధికబరువును నియంత్రించేలా చేస్తుంది బద్ధకోణాసనం. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు ఉంటాయి. కాబట్టి బటర్ఫ్లై ఆసనంగా కూడా దీనికి పేరు. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిమిషాలు ఈ బటర్ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.కంప్యూటర్తో పని చేసేవాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైన సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.20 నుంచి 30 సార్లు..ముందుగా నేల మీద సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి, చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకొని, శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ ఐదుసార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. తర్వాత కళ్లు తెరిచి, కాళ్లను మెల్లగా పైకి, కిందకు 20 నుంచి 30 సార్లు కదుపుతూ ఉండాలి.రోజూ ఉదయం ఇలా చేస్తుంటే వెన్నెముక దృఢంగా అవుతుంది. లోయర్ హిప్స్, బ్యాక్ కండరాల బలం పెరుగుతుంది. ΄÷ట్ట కండరాలలోనూ మార్పులు వస్తాయి. ఒత్తిడి తగ్గి మైండ్, బాడీ విశ్రాంతి పొందుతాయి. కాళ్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. రక్తసరఫరా మెరుగై వెన్ను, మెడ, తలనొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!
బరువు తగ్గడం గురించి పలు రకాల డైట్లు వెలుగులోకి వచ్చాయి. ఓమాడ్ డైట్, కీటో డైట్, మొక్కల ఆధారిత డైట్ అంటూ పలు రకాలు మొన్నటి వరకు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఫిట్నెస్ ట్రెండ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే 'సెవెన్ సెకండ్ కాఫీ రూల్'. మరీ కాఫీని మితంగానే తీసుకోవాలని చెబుతుంటారు కదా..! ఇదెలా బరువుని అదుపులో ఉంచుతుంది..?. అసలు కెఫిన్ బరువు నియంత్రణకు ఎలా దోహదపడుతుంది అనే కదా సందేహం. ఇంకెందుకు ఆలస్యం ఏంటీ ఫిట్నెస్ మంత్ర చకచక తెలుసుకుందాం రండి..ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ప్రతి విషయం నిమిషాల్లో ట్రెండ్ అయ్యిపోతోంది. బరువు తగ్గడంలో ప్రధానంగా నియంత్రించాల్సింది ఆకలి సమస్య. ఆకలి నియంత్రణలో ఉంటే బరువు తగ్గడం చాలా సులభం. మరీ ఇంతకీ ఏంటీ సెవెన్ సెకండ్ కాఫీ అంటే..నిమ్మ, దాల్చిన చెక్క వంటి పదార్థాలతో ఏడు సెకన్లలలో తయారు చేసే బ్లాక్ కాఫీ అట. దీన్ని సేవిస్తే ఆకలి బాధలు నియంత్రించొచ్చట. బరువు తగ్గడానికి సులభమైన పద్ధతి అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ దీంతో నిజంగా బరువు తగ్గుతారా? అని చెప్పేందుకు పరిశోధన పూర్వకమైన ఆధారాలు లేవు అనే విషయం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం.ఎంత వరకు పనిచేస్తుందంటే..ఈ కాఫీ గురించి చెబుతున్న వ్యక్తుల అభిప్రాయం ప్రకారం..బ్లాక్ కాఫీ తాగడం వల్ల డోపమైన్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి ఆకలిని తాత్కాలికంగా అణిచివేస్తాయి. ఆకలి హార్మోన్లు, కెఫిన్ మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఇది కొద్దిసేపు ఆకలిని నియంత్రింగలదు కాబట్టి వాళ్లు సూచించడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వేగంగా బరువు తగ్గే సులభమైన మార్గాలుగా చెబుతున్నారే గానీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. చాలామంది ఇలాంటి బరువు తగ్గిపోయే సులభమైన మార్గాలను అనుసరించిట మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ఏ డైట్ అయినా మన శరీరతత్వం, వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి ఫాలో అయితే ఎలాంటి సమస్య ఉండదనేది గుర్తించడం మంచిది. (చదవండి: అనంత్ అంబానీ ఇష్టపడే ఆంధ్ర పెసరట్టు..ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకంటారో తెలుసా..!) -
ఆర్మీ ఆఫీసర్ ఏకబిగిన 25 పుల్-అప్లు : నెటిజన్లు ఫిదా
మంచి రోగ నిరోధక శక్తి, శారీరక దృఢత్వం కావాలంటే నిరంతర వ్యాయాయం చాలా కీలకం. దీనికి వయసుతో సంబంధంలేదు. అందులోనూ సైన్యంలో పనిచేసేవాళ్లకి ఫిట్నెస్ చాలా అవసరం. భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఇదే నిరూపించారు. ఈయన్ ఫిట్నెస్కు ముగ్ధుడైన మాజీ సైనికాధికారి ఎక్స్లో షేర్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్గా మారింది.మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్-అప్లు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ సోధి షేర్ చేశారు. ‘ఆయన ఫిట్నెస్కి సెల్యూట్..2022, అక్టోబరులో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట శక్తిగా జర్మన్ ప్రచురణ స్టాటిస్టా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. భారత సైన్యానికి గర్వకారణం... జై హింద్’ అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ చేశారు. దీంతో యువ ఆర్మీ అధికారులు, నెటిజన్లు జోషి ఫిట్నెస్పై ప్రశంసలు కురిపించారు. ‘సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్కు వెళ్లేలా ప్రేరేపించింది’ అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రసన్న జోషి శారీరక దృఢత్వం భారత సైన్యం అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. ఆయన అంకితభావం, దేశానికి చేసిన సేవకు వందనం చేస్తున్నామంటూ మరో యూజర్ రాహుల్ థాపా పేర్కొన్నారు.Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024 -
జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!
గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ఫిట్నెస్ జర్నీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. జిమ్కి వెళ్లకుండా, ఫ్యాన్సీ డైట్ని అనుసరించకుండానే 10 నెలల్లో 23 కిలోల బరువు తగ్గించు కున్నాడు. దీంతో అంతకుముందు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాస్త, నాజూగ్గా మారిపోయాడు.వ్యాపారవేత్త నీరజ్ బరువు తగ్గేందుకు ఎలా నియమాలు పాటించింది వరుస పోస్ట్ల ద్వారా ఫిట్నెస్ కన్సల్టెంట్, సతేజ్ గోహెల్ వివరించారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. గోహెల్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తింటూ, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ నీరజ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగాడు.వృత్తి రీత్యా బిజీగా ఉండే నీరజ్ మొదట తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. తరువాత కూడా అనుభవం లేక జిమ్కి వెళ్లడానికి సంకోచించేవాడు. దీంతో అతని కోసం ఇంట్లో వినియోగించుకునేలా డంబెల్స్ తయారు చేసి ఇచ్చాడు గోహెల్. అలాగే ఇంటి ఫుడ్ సాధారణ నడక అలవాటు చేశాడు. మొదట్లో నీరజ్ 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడే వాడు. కానీ ఆ తరువాతికాలంలో నడక అలవాటుగా మారిపోయింది.ఫలితంగా 10 నెలల్లో నీరజ్ 23 కేజీల బరువు తగ్గాడు. 91.9 కేజీల నుంచి 68.7 కేజీలకు ఆయన బరువు దిగివచ్చింది. ఆహారంలో పనీర్, సోయా చంక్స్, పప్పు, ఇతర శాఖాహార ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడట. దీంతోపాటు చక్కెర పదార్థాలను బాగా తగ్గిం చేశాడు. ఇది పూర్తిగా టీం వర్క్, వారం వారం అతనితో టచ్లో ఉంటూ, అతనికిష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వర్కౌట్లు ప్లాన్ చేసినట్టు గోహెల్ తన పోస్ట్లో వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్టు భిన్నంగా స్పందించారు. నీరజ్ సంకల్పాన్ని కొందరు ప్రశంసించగా, ఫిట్నెస్ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉందంటూ మరొకరు విమర్శించారు.ముఖ్యంగా ‘‘నో నూట్రిషనిస్ట్, నో వర్కౌట్..నో నాన్ వెజ్ ..గురూ..(పోషకాహార నిపుణుడు లేడు, వర్కౌట్లు లేవు, మాంసాహారం లేదు గురు) డైటింగ్ అస్సలే లేదు.. కేవలం చురుకైన నడక, సైక్లింగ్, రోజువారీ 900-1000 కిలోల కేలరీలు బర్నింగ్ అని మరో యూజర్ ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం. -
మనస్ఫూర్తిగా జీవించే యోగం కోసం...
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడి, ఆర్థికపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఓ అర గంటయినా శారీరక శ్రమ చేయాలంటారు నిపుణులు. అందుకు యోగా చక్కని మార్గం. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది. చాలామందికి, వారి అస్తవ్యస్తమైన, బిజీ జీవితాల నుండి యోగా ఉపశమనాన్ని ఇవ్వగలదు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. భంగిమను మెరుగుపరుస్తుంది. మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది. యోగా ఒక శక్తిమంతమైన మైండ్ఫుల్నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యోగా సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు. కానీ శరీరానికి మంచి అనుభూతి అందించడం, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతాయి. యోగ అభ్యాసం వలన కలిగే ప్రయోజనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చాయి. యోగాలో చాలా రకాలు ఉన్నాయి, హఠ (అనేక శైలుల కలయిక) అత్యంత ప్రాచుర్యం పొందిన శైలులలో ఒకటి. హఠ యోగం ప్రాణాయామాలపై (శ్వాస నియంత్రిత వ్యాయామాలు) దృష్టి పెడుతుంది. వీటి తర్వాత వరుసలో ఆసనాలు (యోగా భంగిమలు) ఉంటాయి. అవి శవాసనంతో (విశ్రాంతి కాలం) ముగుస్తాయి. యోగశాలల్లో సాధారణంగా అద్దాలు ఉండవు. సాధకులు తమను చుట్టుపక్కల వ్యక్తులు ఎలా చూస్తారనే దాని కంటే ముఖ్యంగా తమ పట్ల తమకు ఏకాగ్రత అవసరం. యోగా సాధన చేయని వ్యక్తుల కంటే యోగా సాధన చేసేవారికి తమ శరీరాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యోగాసనాలు వేసేవారు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. తమ శరీరాలపై తక్కువ ఫిర్యాదులు చేశారు. అందుకే సానుకూల శరీర ఆకృతి, ఆత్మగౌరవాలను ప్రోత్సహించే కార్యక్రమాలు యోగా చికిత్సలో భాగం అవుతున్నాయి.యోగాను అభ్యసించడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలోని ఇతర రంగాలలో కూడా అవగాహన మెరుగవుతుంది. తినే రుగ్మతలను యోగా పోగొడుతుంది. బుద్ధిపూర్వకంగా తినడం, శారీరక భావోద్వేగ అనుభూతులను అవగాహనకు తెచ్చుకోవడంలో యోగా సాయపడుతుంది. విచారంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు పరధ్యానంగా తింటారు. అదే యోగాను అభ్యసించే వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారం మనస్ఫూర్తిగా భుజిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యోగా సాధన ఉత్తమం. బుద్ధిపూర్వకంగా తినేవారు తమ శరీరాన్ని ఆరోగ్యాంగా చూసుకుంటారు. యోగా సాధన చేసేవారిలో కండరాల బలం, స్థితప్రజ్ఞత, ఓర్పు, కార్డియో–రెస్పిరేటరీ ఫిట్నెస్ మెరుగవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యోగా, మంచి ఆహార అలవాట్లు మనిషి మనుగడను మెరుగుపరుస్తాయి. మనిషి ప్రశాంతతకు, ఆనందమయ జీవితానికి యోగా మంచి ఉపకరణం.– డా‘‘ ఎం. అఖిల మిత్ర ‘ ప్రకృతి వైద్యులు(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
ఆరోగ్యమే ఆనందం..
అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం అని ఒక సినిమా పాట ఉంది. అదెంత నిజమో ఆరోగ్యమే ఆనందం అనడం కూడా అంతే నిజం. ఇంకా చెప్పాలంటే అందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారో లేదో చెప్పలేం కానీ, ఆరోగ్యంగా ఉండేవాళ్లు మాత్రం ఆటోమాటిగ్గానే అందంగా కనిపిస్తారు. అందం మన శరీర ఆకృతి మీద ఆధారపడితే, ఆకృతి అనేది శరీర పోషణ మీద, ఆహారపు అలవాట్లమీద, జీవన శైలి మీదా ఆధారపడి ఉంటుంది. శరీర పోషణ మీద తగిన శ్రద్ధ చూపిస్తూ, క్రమబద్ధం గా వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తారు. అదెలాగో చూద్దాం.ఆహారం విషయంలో... శరీరాకృతి విషయంలో క్రమశిక్షణను పాటిస్తే దీర్ఘకాలం పాటు ఎవరికి వాళ్లు మేలు చేసుకున్న వాళ్ళవుతారు. ముందు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జబ్బులేమీ జోలికిరావు. మీరు ఏమి తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్నదాని మీద మీరు ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఫీలవుతున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా వుంటే ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.మీ శరీరపు బ్యాటరీని రీఛార్జ్ చేయటానికి, మీ కండరాలలో శక్తిని పెంపొందించటానికి, జబ్బుల్నుంచి దూరంగా ఉండటానికి పెద్దగా కష్టపడిపోవాల్సిన పనేం లేదు. కొద్దిపాటి ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా?తీసుకునే ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం, ఎక్సర్సైజుల్ని చేయటానికి సమయాన్ని కేటాయించటం, జీవితపు వొత్తిడిల నుంచి రిలాక్స్ కావటానికి ప్రయత్నించటం వంటివి చాలు.ఆరోగ్యంగా తినాలి..మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కొవ్వు కూడా అవసరమే. అయితే మనలో చాలామంది శరీరానికి అవసరమైన దానికంటే 30 శాతం కొవ్వును అధికంగా కలిగి ఉంటున్నారని ఒక అంచనా. అలాంటి హెచ్చుతగ్గుల్ని నివారించటం కోసం ఆహారంలో సమతుల్యాన్ని పాటించటం చాలా అవసరం. ఇందుకోసం...– రోజూ మీరు తీసుకునే కాయగూరల్లో, ఆకుకూరల్లో వైవిధ్యాన్ని పాటించాలి.– కాఫీ, టీ వంటి వాటి విషయంలో మితాన్ని పాటించడం.– తాగ గలిగినన్ని మంచినీళ్ళను తాగాలి.– రోజుకు 900 కాలరీల లోపుగల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఫిట్నెస్కి ప్రాధాన్యత..శరీరం తగినంత ఫిట్నెస్లో ఉంటే అనారోగ్యం తొందరగా దరిచేరదు. బాడీ అలా ఫిట్నెస్తో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఎక్సర్సైజుల మూలంగా గుండె కండరాలు బలపడతాయి. శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. రక్తంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. శరీరం బరువు ఉండాల్సిన రీతిలో ఉంటుంది.ఇవన్నీ టెన్షన్ తగ్గించే అంశాలు. ఎక్సర్సైజులంటే – నడక, సైకిలింగ్, ఈత మొదలైనవి ఏవైనా సరే. దీనిని మాత్రం ్రపోగ్రామును నిదానంగాప్రారంభించాలి. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అంతే తప్ప తొందరపడిప్రారంభంలోనే అతిగా చేయకూడదు.పోషకవిలువలు..శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 13 ముఖ్య విటమిన్లు, 25 ఖనిజ లవణాలు మనం తీసుకునే ఆహారంలో తగు పరిమాణంలోలభించాలి కాబట్టి సమీకృత ఆహారాన్ని తీసుకోవాలి.ధూమపానం, మద్యపానాలకు స్వస్తి.. పొగ తాగేవాళ్ళకు, మద్యం సేవించే వాళ్లకు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు రావటానికి రెట్టింపు అవకాశాలున్నాయి కాబట్టి ఈ రెండు అలవాట్లూ ఉన్న వాళ్లు వాటిని మానుకోవటం మంచిది.ప్రారంభంలో కొంచెం కష్టం కావచ్చు గాని గట్టిగా సంకల్పించుకుంటే అసంభవం మాత్రం కాదు కదా...మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి..రోజుకి అరగంట కాలాన్ని మనస్సు ప్రశాంత పరచుకోవటానికి కేటాయించాలి. మంచి పుస్తకాన్ని చదవటం, ధ్యానం, సంగీతం వినడం వంటి వాటి ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, అపజయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథంతో వర్తమానంలో జీవించాలి.శరీరం చెప్పేది వినాలి.. ఆఖరుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం చెప్పే దానిని వినాలి. శరీరం ఏ ఇబ్బందికి గురవుతున్నా – అంటే అస్వస్థతలకు గురవుతున్నా మనకు కొన్ని సూచనలను అందిస్తుంది. జ్వరం, నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలు, ఇలాంటి లక్షణాల ద్వారా శరీరంఅనారోగ్య సూచనలను వెలువరిస్తుంటుంది. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు శరీరాన్ని కండిషన్లోకి తెచ్చుకోవడం ఎవరికి వారు అనుసరించి తీరాల్సిన కర్తవ్యం. -
తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్, ప్రైవేట్ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్లను పరిశీలిస్తున్నారు. ఫిట్గా లేని బస్సులు, వ్యాన్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్ డ్రైవ్ పేరిట చెకప్ లిస్ట్ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్నెస్ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. -
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్తో పాటు కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు.‘టైమ్ జోన్కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్తో భారత్ ఆడుతుంది. ‘నంబర్వన్’ ర్యాంక్తో ప్రపంచకప్లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్వన్ ర్యాంకర్గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను వెస్టిండీస్ 3–0తో క్లీన్స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్లో నిలిచింది. -
ఫిట్నెస్ ఫ్రీక్,స్టార్ కిడ్ కృష్ణ ష్రాఫ్: క్రేజీ ఫోటోస్
-
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్లాగా సినిమాలను కరిర్గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్తో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
ఫిట్నెస్ విత్ బ్యూటీ : సమంతా లేటెస్ట్ ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఒడి దుడుకులు, భర్తతో విడాకులు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడటం లాంటి కారణాలరీత్యా తన ఫిట్నెస్కు ఇచ్చే ఇంపార్టెన్స్ మరింత పెరిగింది. దీనికి సంబంధించి అనేక వీడియోలను, ఫోటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)తాజాగా కండలు తిరిగి భుజాలతో కూడిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసింది. అంతేకాదు మరిన్ని ట్రైసెప్స్ డిప్స్ రాబోతున్నాయనే హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సుమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా సమంతా ఫిట్ బాడీని ఫిదా అయిపోయింది. ‘నీ ఫిట్నెస్లో సగమైనా సాధించాలని ఆశపడుతున్నాను’ అంటూ కమెంట్ చేయడం గమనార్హం. -
బరువు తగ్గాలని రైస్కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు ఫాలో అవుతాం. ముఖ్యంగా రైస్ని దూరంగా ఉంచుతారు. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాల మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి నచ్చిన కూర ఉన్న కూడా బరువు విషయం గుర్తించి భారంగా దూరం పెట్టేస్తాం రైస్ని. ఇంతకి రైస్ వల్లే బరువు పెరిగిపోతామా? దీనిపై ఫిట్నెస్ కోచ్లు ఏమంటున్నారంటే..చాలామంది బరువు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అన్నంతో బరువు ముడిపడి ఉందని నమ్ముతుంటారు. అందువల్ల అన్నం తినడం తగ్గించేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గే యత్నంలో అన్నంకి దూరంగా ఉంటారు. అయితే ఇది ఎంతమాత్ర నిజం కాదని తేల్చి చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. బరువు తగ్గడంలో రైస్ని హాయిగా తింటూనే ఎలా నియంత్రించవచ్చో వివరించారు. ఎలాంటి చింత లేకుండా హాయిగా రైస్ని ఆస్వాదిస్తూ తినొచ్చని చెబుతున్నారు. అందుకోసం చేయాల్సింది ఏంటో వెల్లడించారు. భోజనం తినడానికి కనీసం 10 నుంచి 12 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని హాయిగా తీసుకోండి. తర్వాత మంచి సలాడ్ కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత నచ్చిన భోజనం హాయిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అలాగే పెరుగు అన్నం కూడా స్కిప్ చెయ్యొద్దు మంచిగా లాగించేయండని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. అంతేగాదు అన్నం తినడం వల్ల మధుమేహం రాదని, కేవలం అతిగా తినటం వల్ల వస్తుందని చెప్పారు. అలాగే యాక్టివ్గా ఉండేందుకు యత్నించండి, సమతుల్య ఆహారం బాగా తినండి, కాస్త కామన్ సెన్స్తో వ్యవహరిస్తూ నెట్టింట్లో చెప్పే ప్రతి చిట్కాను ఫాలో అవ్వకండి అని చెబుతున్నారు. అన్న తినడం వల్ల బరువు పెరుగుతాం అనే భావనను వదిలించుకోండి. శరీరం హెల్తీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా అన్నం తినాలనే విషయాన్ని గ్రహించండి. (చదవండి: కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!) -
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్ప్లాన్లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!) -
ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు..కానీ అతను..!
పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే యువతను హెచ్చరిస్తుంటారు. అదీగాక పిజ్జా, బర్గర్లాంటివి ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే సమస్య ఎక్కువ కూడా. కానీ ఈ వ్యక్తికి పిజ్జాలంటే విపరీతమైన పిచ్చి. అతనికి అవంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. రోజంతా పిజ్జా ఉంటే చాలు వాటితోనే లంచ్, డిన్నర్లు కానిచ్చేస్తాడు మనోడు. ఇలా ఆరేళ్లుగా లాగించేస్తున్నాడట పిజ్జాలని. మరీ ఇంతలా తింటున్నాడు కదా అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుందా..? అనే కదా సందేహం. అతడెలా ఉంటాడంటే..?అమెరికాకు చెందిన కెన్నీ వైల్డ్స్కి పిజ్జా అంటే మహా ఇష్టం. ఈ ఇటాలియన్ వంటకం అంటే కెన్నీకి ఎంతగా ఇష్టమంటే కనీసం రోజులో ఒక్కస్లేసు పిజ్జా లేకుండా గడవదు. అంతేగాదు అతడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో పిజ్జా ఉంటే చాలు హాయిగా దానితోనే గడిపేస్తాడు. అతనికి అది అస్సలు బోరుగా అనిపించందట. ఈ విషయంలో అతడి భార్య కూడా సపోర్ట్ చేయడం విషయం. ఆమె కూడా అతడికి ఇష్టమైన పిజ్జాలు అతడి భోజనంలో ఉండేలా చూస్తుందట. ఆఖరికి ఆఫీస్లో కూడా పిజ్జాలు ఉండాల్సిందేట. చాలామంది తనలా పిజ్జాలు ఇంతలా తినలేరని ఛాలెంజ్ విసురుతున్నాడు కూడా. అంతేగాదు ఇన్కేస్ ఏదైనా కారణం చేత కేఫ్లు క్లోజ్ అయితే తన ఇంటికి చాలా దూరంలో ఉండే కేఫ్లు వద్దకు వెళ్లి మరీ పిజ్జాలు తింటాడట. ఇంతలా పిజ్జాలు లాగించేస్తున్న కెన్నీ చూడటానికి మాత్రం అ స్సలు లావుగా ఉంటాడు. మంచి స్మార్ట్గా ఫిట్నెస్గా కనిపిస్తాడు. ఇలా అతడు ఆరేళ్ల నుంచి పిజ్జాలను పిచ్చి పిచ్చిగా తినేస్తున్నా.. తాను ఫిట్గా హెల్తీగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవట. వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదూ!. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఇతడి విషయంలో పనికిరానిదిగా ఉంది కదా..!. నచ్చిందని అతిగా తింటే శరీరం అంగీకరించక పలు సమస్యలు రావడం జరగుతుంది. ఇతడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం అనేది నమ్మలేని నిజంలా ఉంది. కొన్ని సర్వేల్లో కూడా మనిషి ఇష్టమైన ఆహారం ఆరోగ్య రీత్యా సరిపడనిది అయినా ఏం చేయదని విన్నాం. బహుశా ఇదే కెన్నీ విషయంలో జరుగుతుందేమో..!.(చదవండి: వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!) -
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్ని మెయింటెయిన్ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్ హీరోలా లుక్ మెయింటెయిన్ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్ చేయడం కుదరదు. అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్ తర్వాత షర్ట్ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్ అబ్రహం తన ఫిజిక్ని మెయింటెయిన్ చేస్తాడు. బ్రిటిష్-పాకిస్తానీ నటుడు అలీఖాన్ జాన్ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్నెస్ సీక్రెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్నెస్ సీక్రెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్. ఇక జాన్ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్ స్టయిల్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జాన్. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్ మెయిటెయిన్ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్. వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్ డ్రింక్స్ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్. అంతేగాదు సిగరెట్ కంటే పాయిజన్ చక్కెరే అని జాన్ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్ కదూ..!(చదవండి: ఐస్క్రీమ్తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్) -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్స్టా పోస్ట్తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్లో జరగనుంది. -
61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
మనుషులు ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా వయసును దాచడం సాద్యం కాదు. వయసు రీత్యా వచ్చే మార్పులను కూడా ఆపలేం. కానీ ఇక్కడొక వ్యక్తి తాతా వయసులో ముప్పై ఏళ్ల కుర్రాడిలా అదిరిపోయే ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతడి ఆరోగ్య రహస్యం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఇలా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారా..? అనుకుంటారు. వివరాల్లోకివెళ్తే..యూఎస్లోని మిచిగాన్కు చెందిన 61 ఏళ్ల డేవ్ పాస్కో 38 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరోగ్య, దీర్ఘాయువు కోసం కఠిన జీవన శైలిని అనుసరించేవాడు దేవ్ . తనని తాను బయోహ్యాకర్గా అభివర్ణించుకుంటాడు. ఆహారం, వ్యాయామం పట్ల కనబర్చిన శ్రద్దే జీవసంబందమైన వయస్సును 38 ఏళ్లకు మార్చిందని దేవ్ చెబుతున్నారు. అంతేగాదు తన రోజువారి దినచర్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను సూర్యోదయానికి ముందే లేచి ఆరుబయట గడపటం, వ్యాయమాలు చేయడం వంటివి చేస్తానని తెలిపారు. అలాగే నిర్థిష్ట ఆహార నియమాలను పాటిస్తానని, ప్రతిరోజూ దాదాపు 158 సప్లిమెంట్లను తీసుకుంటానని అన్నారు. తన లక్ష్యం కేవలం తన వయసు తక్కువగా చూపించేలా ఉండటం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటమేనని తెలిపారు. అంతేగాదు తనకు 90 లేదా 110 ఏళ్లు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా జీవించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు దేవ్. ఎన్నీ అర్జెంట్ పనులు, అవాంతరాలు వచ్చినా.. తన రోజువారి దినచర్య పూర్తి అయ్యిన తర్వాతే ఏదైనా చేస్తానని తేల్చి చెప్పారు. తన విలువై సమయాన్ని ఇతరులతో గడిపేందుకు ఇవ్వనని, ఒంటిరిగానే ఉంటానని అంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడూ తనతో తాను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడట దేవ్. మిగతా సమయం అంతా వ్యాయామాలు, ఆవిరి సెషన్లతో గడిచిపోతుందట. అలాగే అతడు చాలా అరుదుగా భోజనం చేస్తాడట. అంతేగాదు సేంద్రియ గడ్డి తినే గొడ్డు మాంసం, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా చేపలు డిన్నర్లో తీసుకుంటాడట. ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు, వెల్లుల్లి, తప్పకుండా ఉండేలా చూసుకుంటాడట. అయితే ఇక్కడ దేవ్ బరువు పెరగకపోవడానికి కారణం.. కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడమేనని చెబుతున్నాడు. ఇక్కడ దేవ్ బయోహ్యాకింగ్ పద్ధతుల్లో సక్రమైన జీవనశైలితో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసి కుర్రాడిలా ఫిట్నెస్గా మారాడు. ఇటీవలకాలంలో ఈ బయోహ్యాకింగ్ ఉద్యమం ఒక ట్రెండ్గా మారింది. అంటే ఆరోగ్యంగా ఉండేలా వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వివిద పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు మాత్రం దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని, పైగా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
‘శ్రీ రాముడి’ కోసం రణ్బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్బెల్స్, జిమ్ రోప్లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
సిక్సర్ల బ్యాటర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్ర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్గా ఈ హిట్మ్యాన్కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..! క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..! డైట్.. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అవ్వుతాడు. తన డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. మధ్యాహ్నాం లంచ్లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు. రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు వర్కౌట్లు.. ఫిట్గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్లు చేస్తుంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్నెస్లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్నెస్పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్నెస్గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్వెజ్ తీసుకోక తప్పలేదు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్ బోర్డు మెంబర్గా, ఐపీఎల్లో ముంబై ప్రాంచైజ్ ఓనర్గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్ ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్లు వేసుకోవాలి..? ఈవెంట్ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్ అంబానీనే చెప్పారు కూడా. 54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్నెస్గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్నెస్ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా. అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్నెస్గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్లో అద్భుతమైన డిటాక్స్లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫ్క్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్ విమెన్గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. (చదవండి: ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..) -
ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!
ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్ ప్లాన్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్ వెయిట్ లాస్ ఫిట్నెస్ కొచ్చ్ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!. జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్లో ఎక్కువ వర్కౌట్లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్ వ్యాయామాలు జోష్ఫుల్గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట. దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్లో ఒక్కో ఫ్రూట్ వెరైటీని యాడ్ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది. కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. పైగా స్పీడ్గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..! View this post on Instagram A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee) (చదవండి: ఆ ఒక్క ఎక్క్ర్సైజుతో..అధిక బరువుకి చెక్ పెట్టిన నర్సు!) -
శాస్త్రీయ నృత్యంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భరత నాట్యం నుంచి కూచిపూడి వరకు భారతీయ శాస్త్రీయ నృత్యాలలో వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. నృత్య సాధనతో ఫిట్నెస్ను సొంతం చేసుకుంటుంది. ముంబైలో ఎంబీఏ చేస్తున్న శివానీ దీక్షిత్కు ఏ చిన్న పనిచేయాలన్న బద్దకంగా అనిపించేది. దీని వల్ల చదువు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. తన కజిన్ సలహా ప్రకారం అయిష్టంగానే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం భరతనాట్యంపై దీక్షిత్లో అంతకంతకూ ఇష్టం పెరుగుతూపోయింది. ‘నేను ఎప్పుడూ వ్యాయామాలు చేయలేదు. అయితే భరతనాట్యం వల్ల ఎన్నో వ్యాయామాలు ఒక్కసారే చేస్తున్నట్లుగా అనిపించింది. బద్దకాన్ని వదిలించుకున్నాను. మనసు తేలిక అయినట్లుగా ఉంది’ అంటుంది శివానీ దీక్షిత్. ‘అధిక బరువుతో బాధ పడుతున్న నాకు కథక్ నృత్యం కాంతి కిరణంలా కనిపించింది. కథక్ నృత్య సాధనతో బరువు తగ్గడం సంతోషంగా ఉంది. కథక్ డ్యాన్స్ అనేది మచ్ మోర్ దెన్ ఏ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనేది నా అభిప్రాయం. బరువు తగ్గడానికే కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల విషయంలోనూ కథక్ ఉపయోగపడుతుంది’ అంటుంది కోల్కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నయనిక. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒడిస్సీ, జాజ్, కాంటెంపరీ వెస్ట్రన్ డ్యాన్స్లను కలిపి ఒక డ్యాన్స్ ఫామ్ రూపొందించినట్లు తెలుసుకున్న నయనిక ప్రస్తుతం ఆ సమ్మేళన నృత్యరూపం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ‘కేవలం బరువు తగ్గడానికే కాదు ఏకాగ్రతను పెంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో శాస్త్రీయ నృత్యాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నృత్యసాధన ద్వారా స్వయంగా తెలుసుకున్నాను. శాస్త్రీయ నృత్యకదలిలకు చేతులు, కళ్ల మధ్య సమన్వయం అవసరం. ఇది ఆటోమెటిగ్గా ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బెంగళూరు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ సందేష్ సృజన్. శివానిక్ దీక్షిత్, నయనిక, సందేశ్ సృజన్ల మాటలు శాస్త్రీయ నృత్యాల పట్ల యువతరం చూపుతున్న ఆసక్తికి అద్దం పడతాయి. ‘మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాల జాబితా పెద్దది. ప్రతి నృత్యానికి తనదైన వేషధారణ, అలంకరణ, సంగీతం ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకునే విధానం చాలా కఠినమైనది. దీనికి తగిన సమయం, శక్తి అవసరం. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకితభావం చాలా ముఖ్యం, నృత్యం అనేది శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. శాస్త్రీయ నృత్య రూప శైలి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అభ్యాస ప్రక్రియ కండరాలను బలోపేతం చేస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టంలాంటి శాస్త్రీయ నృత్యరూపాలను సాధన చేయడం ద్వారా మజిల్ ఇంప్రూమెంట్ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ శరీరంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది’ అంటుంది ప్రోఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్ కీర్తి దివాకరన్. కేరళ కొచ్చీలోని వైనవి నృత్యకళాక్షేత్రం వ్యవస్థాపకురాలు కీర్తి.‘డ్యాన్సింగ్ అనేది న్యూరో–మస్క్యులార్ బ్యాలెన్స్ను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అంటుంది క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్, కోజికోడ్లోని గౌరీశంకరం క్లాసికల్ డ్యాన్స్ థెరపీ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రియా మేనన్. శాస్త్రీయ నృత్యరూపకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అప్లైడ్ రిసెర్చ్ పేపర్ ప్రకారం... ఏదైనా వర్కవుట్ పదినిమిషాల ఒడిస్సీ డ్యాన్స్తో సమానం. డ్యాన్స్లో భాగంగా కాళ్ల నుంచి మెడ వరకు అన్నీ కదులుతాయి. గంట ఒడిస్సీ నృత్యం 250 కేలరీలు ఖర్చు కావడానికి కారణం అవుతుంది. ‘సైన్స్ అండ్ జర్నల్’లో ప్రచురితమైన రిసెర్చ్ పేపర్ ప్రకారం నాన్–డ్యాన్సర్లతో పోల్చితే కథక్ డ్యాన్సర్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్... మొదలైన వాటికి సంబంధించి బాడీ కంపోజిషన్ మెరుగ్గా ఉంటుంది. కథక్ డ్యాన్స్లోని క్విక్ ఫుట్ వర్క్ వల్ల ఒత్తిడి మాయం అవుతుంది. వ్యాయమాలతో కూడిన డ్యాన్స్ అనగానే ఒకప్పుడు జాజ్, లైన్ డ్యాన్స్, హిప్ హప్, సల్సా... మొదలైన వెస్ట్రన్ డ్యాన్స్లు మాత్రమే గుర్తొచ్చేవి. ‘ఎక్కడి దాకో ఎందుకు మన దగ్గరే బోలెడు శక్తిసంపద ఉంది’ అని గ్రహించిన యువతరం మన శాస్త్రీయ నృత్యాలకు దగ్గరవుతోంది. సాధన చేస్తోంది. ఆరోగ్య భాగ్యానికి చేరువ అవుతోంది. బాడీ బయో మెకానిక్స్ బాడీ బయోమెకానిక్స్ను బాగా అర్థం చేసుకోవడం డ్యాన్సర్ కమ్యూనిటీకి ముఖ్యం అంటుంది మధుమతి బెనర్జీ. భరతనాట్య కళాకారిణీ అయిన బెనర్జీ ఎన్నో దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియన్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్లో కూడా ప్రావీణ్యం సాధించింది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని యువతరానికి ఇస్తోంది. నృత్యం ధ్యాన సాధనం.. ‘రోల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పేరుతో రిమ్లీ భట్టాచార్య ఒక ఆర్టికల్ రాసింది. ‘భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగంలో కావాలి. ఇది మన సంస్కృతికి సంబంధించిన శక్తిరూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మూమెంట్స్తో శారీరక దృఢత్వం కలుగుతుంది. శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. అంతర్గత భావాలను వ్యక్తీకరించే పద్ధతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి’ అంటుంది రిమ్లీ భట్టాచార్య. మెకానికల్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన రిమ్లీ ఎంబీఏ చేసింది. కార్పోరేట్ సెక్టార్లో పనిచేసింది. మానసిక ఆరోగ్యంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ‘ఏ బుక్ ఆఫ్ లైట్’ పేరుతో పుస్తకం ప్రచురించింది. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!
ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!. 32 ఏళ్ల సుస్మితా దాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు. అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్ లీడ్ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్నెస్గా ఉండాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. ఫిట్నెస్ కమ్యూనిటీలో ఓ మెంబర్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్తో బాధపడే మహిళలకు మంచి ఫిట్నెస్ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. (చదవండి: మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?) -
‘ట్రంప్కు భార్య పేరు కూడా గుర్తులేదు’
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఉన్న వయసు ప్రభావం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో ఆయనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై వయసుకు సంబంధించి వస్తోన్న విమర్శలను మరోసారి తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారుడైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సైతం తప్పులు చేస్తున్నారని తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన రిపోర్టును ప్రస్తావించారు. విత్ సేథ్ మేయర్స్ షోలో పాల్గొన్న బైడెన్ ట్రంప్పై విమర్శలు చేశారు. ‘మీరు అవతలి వ్యక్తి( డొనాల్డ్ ట్రంప్)ని గమనించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే ఉంటుంది. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు’ అని బైడెన్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఆలోచనలన్నీ కూడా కాలం చెల్లినవని అన్నారు. ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేదా తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అనే దానిపై స్పష్టత మాత్రం లేదు. అధ్యక్షుడు బైడెన్ వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక రిపోర్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్కు జ్ఞాపకశక్తి చాలా తగ్గిందని ఆ రిపోర్టు వెల్లడించింది. జీవితంలోని పలు కీలక విషయాలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని పేర్కొంది. తన కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ ఆయనకు గుర్తులేదని తెలిపింది. ఆయన యూఎస్కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని పేర్కొంది. అయితే ఆయనపై వెలువడిన ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల విమానం మెట్లు ఎక్కుతూ.. అయన తూలిపడిపోబోయారు. గతంలో ఓ వేదికపై ఎటువైపు నుంచి దిగాలో తెలిక తడబడిపోయారు. ఇటువంటి ఘటనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ ఘటనలు అన్నీ.. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆయనకు, డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా వీటినే రిపబ్లికన్ పార్టీకి ప్రచారానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే క్రమంలో బైడెన్.. ట్రంప్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
IPL 2024- MI: ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్
Hardik Pandya Frustrated Over Unhealthy Food: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ఫిట్నెస్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే ఇలాంటి భోజనం పెట్టడం ఏమిటని అతడు ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ సమయంలో పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీలమండ నొప్పి కారణంగా అప్పటి నుంచి అతడు దూరమయ్యాడు. ఫిట్గా మారడం కోసం జిమ్లో కఠిన వర్కౌట్లు చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఐపీఎల్-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరంలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్తో కలిసి కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్కు సంబంధించిన ఓ యాడ్ షూట్లో పాండ్యా పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Ishan Kishan (@ishankishan23) ఇందులో మధ్యాహ్న భోజన సమయంలో పాండ్యాకు ఢోక్లా, జిలేబీ వంటి గుజరాతీ సంప్రదాయ వంటకాలు వడ్డించారు. దీంతో చిర్రెత్తిపోయిన ఈ ఆల్రౌండర్ సిబ్బందిపై మండిపడ్డాడు. ‘‘అసలు ఏంటిది? నేను ఢోక్లా, జిలేబి ఎలా తినగలను? భయ్యా.. నేను ఫిట్నెస్ కాపాడుకోవడం ముఖ్యం! ఇలాంటివి ఎలా తింటాననుకున్నావు? ఈ ఆహార పదార్థాలను ఎవరు పంపించారు?’’ అని హార్దిక్ పాండ్యా భోజనం వడ్డించిన వ్యక్తిని ప్రశ్నించాడు. ఇందుకు అతడు.. ‘‘ఈ ఒక్కరోజుకు సర్దుకోండి సర్’’ అని బదులిచ్చాడు.దీంతో పాండ్యా కోపం నషాళానికి అంటింది. ‘‘భయ్యా.. అడ్జస్ట్ చేసుకోవడం అస్సలు కుదరదు. నా చెఫ్, న్యూట్రిషనిస్ట్ ఎక్కడ? ఇలాంటివి నేను తినలేను. ఇదంతా వర్కౌట్ కాదని డైరెక్టర్కు చెప్పండి’’ అని పాండ్యా అతడితో అన్నాడు. No cheat meals for Hardik Pandya in this leaked clip from the Star Sports IPL film shoot. pic.twitter.com/7Td02ecl8m — Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2024 ఇందుకు స్పందిస్తూ.. ‘‘సర్.. ప్లీజ్ ఏదో ఒకటి తినండి. లేదంటే మీ స్టామినా తగ్గిపోతుంది’’ అని పాండ్యాతో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా.. ‘‘భయ్యా.. నేను ఈ ఫుడ్ తిన్నానంటే నాకు శక్తి రావడం కాదు.. ఉన్నది కూడా పోతుంది’’ అని పాండ్యా బదులిచ్చాడు. ఇక వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇదంతా యాడ్ షూట్లో భాగమేనని.. బహుశా ఫిట్నెస్ ప్రాధాన్యాన్ని వివరించే క్రమంలో ఇలా చిత్రించి ఉంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఇదంతా ప్రచారం కోసమేనని.. అందుకే ఇలాంటి వీడియోలు లీక్ చేస్తారని పాండ్యా తీరును విమర్శిస్తున్నారు.