
రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’. వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా వీరాస్వామి జి. మాట్లాడుతూ– ‘‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’ అనే డిఫరెంట్ టైటిల్తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది మా చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ట్విస్టులతో రూపొందింది. ప్రతి మలుపు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్లో ఇటువంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు సినిమా రాలేదు’’ అన్నారు.
తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్కుమార్.
Comments
Please login to add a commentAdd a comment