ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్‌ హీరోయిన్ భర్త! | Jackky Bhagnani's production house Pooja Entertainment's Mumbai office sold out | Sakshi
Sakshi News home page

Jackky Bhagnani: కోట్ల అప్పులు.. కార్యాలయం అమ్మేసిన రకుల్‌ భర్త!

Published Sun, Jun 23 2024 4:06 PM | Last Updated on Sun, Jun 23 2024 4:48 PM

Jackky Bhagnani production house Pooja Entertainments Mumbai office sold out

బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్‌ సింగ్‌ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరుతో బ్యానర్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.

దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్‌కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.

అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్‌కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్‌లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement