sold
-
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
Maharastra: ఐదు రోజుల శిశువు విక్రయం.. ఆరుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని నాగపూర్లో పసికందును లక్ష రూపాయలకు విక్రయించిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.నాగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్ (ఎహెచ్టీఎస్) ఈ శిశువు అక్రమ విక్రయానికి సంబంధించిన కేసును ఛేదించింది. ఈ ఉదంతంలో డబ్బులు తీసుకున్నవారి, ఇచ్చినవారే కాకుండా లావాదేవీకి మధ్యవర్తిత్వం వహించిన మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఆ తల్లిదండ్రులు తమ నవజాత శిశువును సంతానం లేని దంపతులకు విక్రయించారని తెలుస్తోంది. అయితే వారు శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియను పాటించలేదు. ఈ ఉదంతంలో పోలీసులు బయలాజికల్ తల్లిదండ్రులతో పాటు, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, ఈ డీల్కు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులను కూడా అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితులను సునీల్ అలియాస్ భోండు దయారామ్ గెండ్రే (31), అతని భార్య శ్వేత (27), పిల్లలు లేని దంపతులను పూర్ణిమ షెల్కే (32), ఆమె భర్త స్నేహదీప్ ధరమ్దాస్ షెల్కే (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా థానే జిల్లాలోని బద్లాపూర్కు చెందినవారు. వీరికి సహకారం అందించిన మధ్యవర్తులను కిరణ్ ఇంగ్లే (41), ఆమె భర్త ప్రమోద్ ఇంగ్లే (45)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
ఇంటి స్థలం చదరపు మీటర్కు 8 రూపాయలే..
భూములు, స్థలాల విలువలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కనీసం వంద గజాల ఇంటి స్థలం కొనాలన్నా.. లక్షలకు లక్షలు కావాల్సిందే. కానీ ఒక చోట మాత్రం ఇంటి స్థలాన్ని చదరపు మీటర్కు ఎనిమిది రూపాయల లోపు ధరకే అమ్ముతున్నారు. అంటే రూ.800 పెడితే చాలు.. ఇంటి స్థలం వచ్చేస్తుందన్న మాట. కాకపోతే అలా కొనుక్కోవడానికి మనం స్వీడన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మరి. స్వీడన్లోని గోటెన్ నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్కు 321 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. పాపులేషన్ తగ్గడం, ఆర్థిక సమస్యలతో.. స్వీడన్లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ పాపులేషన్ తగ్గడానికి తోడు సిటీకి కాస్త ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీనితో హౌజింగ్ మార్కెట్కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలా లను అమ్మకానికి పెట్టినట్టు గోటెన్ సిటీ మేయర్ జోహన్ మాన్సన్ ప్రకటించారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా రేటుతో.. మన కరెన్సీలో రూ.7.86 రేటుతో 29 ప్లాట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. -
ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్ హీరోయిన్ భర్త!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు. -
చార్ధామ్లో భక్తుల నిలువు దోపిడీ
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. మరోవైపు కేదార్నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్నాథ్లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు. -
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
రూ. 90 వేలకు పసికందు విక్రయం.. కన్నతల్లిని మభ్యపెట్టి..
ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్లోని రామ్గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రామ్గఢ్ పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు. బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు. తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు. రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్లు రాహుల్ కుమార్ రామ్కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): పుట్టిన నాలుగురోజులకే ఆడ శిశువును అమ్మేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా చూసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగండ్ల గ్రామానికి చెందిన ఆంగోతుసేవ– జ్యోతి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతి గత సంవత్సరం సెపె్టంబర్ 16న నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ఆడపిల్లలను సాకే స్తోమత లేదని పుట్టిన శిశువును అమ్ముతామని ఆదే ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్ ఈసం వరమ్మకు చెప్పారు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న నాంపల్లి మండలం పసునూరుకు చెందిన బత్తుల సైదులు– కవిత దంపతులకు వరమ్మ ఈ విషయాన్ని చేరవేసింది. దీంతో వారు సెస్టెంబర్ 20న సేవ–జ్యోతి దంపతులకు రూ1.50 లక్షలు ఇచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు. కాన్పు తర్వాత పాప కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అంగన్వాడీ టీచర్కు చెప్పారు. ఆమె చైల్డ్ వెల్ఫేర్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సేవ–జ్యోతి దంపతులతోపాటు, ఆడశిశువును కొన్న సైదులు–కవిత దంపతులు, స్వీపర్ వరమ్మను శుక్రవారం అరెస్టు చేశారు. ఆడశిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు. -
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
ఆశావర్కర్ సహకారంతో.. బిడ్డను విక్రయం..! అంతలోనే..
కామారెడ్డి: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది. అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు. -
హృదయాల్ని కదిలించే ఘటన: మళ్లీ ఆడబిడ్డే! రూ.800 తీసుకుని..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రెండవసారి కూడా కూతురు పుట్టడంతో ఆ తల్లి ఆ నవజాత శిశువుకు రూ.800కు అమ్మేసింది. ఈ విషయం ఆ నవజాత శిశువు తండ్రికి తెలియగానే, అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మయూర్భంజ్ జిల్లా ఖూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులియా గ్రామంలో చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఆ తల్లి రెండవసారి కూడా తనకు కుమార్తెనే పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీంతో ఆమె రూ.800కు ఆ శిశువును ఒక దంపతులకు విక్రయించింది. ఈ విషయం తమిళనాడులో ఉంటున్న ఆమె భర్తకు తొలుత తెలియలేదు. తనకు రెండవసారీ కుమార్తెనే పుట్టడంతో ఆ తల్లి ఈ విషయమై ముర్ము అనే వ్యక్తితో చర్చించింది. అతను ఆ నవజాత శిశువును రూ. 800కు విక్రయించేందుకు ఒక దంపతులతో మాట్లాడాడు. ఇంతలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను తమిళనాడు నుంచి వచ్చే సరికి తన చిన్న కుమార్తె ఇంటిలో లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్యను ప్రశ్నించగా జరిగిన సంగతంతా తెలిపిందన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో శిశువును విక్రయించినవారు, కొనుగోలు చేసినవారు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: హనీమూన్లో భర్తకు షాక్.. సినిమా మధ్యలో భార్య పరార్! -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్బైక్ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్బైక్ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి) ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది. ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) -
చుక్కలు తాకిన చెక్క కారు ధర - ఎంతో తెలుసా?
Wooden Citroen 2CV: వాహన ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఇందులో భాగంగా అనేక ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ అది ఏ కారు? ఎంత ధరకు అమ్ముడైందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దాదాపు రెండు కోట్లు.. చెక్కతో తయారైన కారు పేరు 'సిట్రోయెన్ 2సీవీ' (Citroen 2CV). చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 'మిచెల్ రాబిల్లార్డ్' అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. చాసిస్ కోసం పియర్, యాపిల్ చెట్టును.. బోనెట్ అండ్ బూట్ కోసం చెర్రీ చెట్టుని ఉపయోగించినట్లు తెలిపాడు. ఈ వుడెన్ కారుని తయారు చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ కారుని రూపొందించడం 2011లో ప్రారంభించాడు. దాదాపు 5వేల గంటకు కృషి చేసి మొత్తానికి అనుకున్నట్లుగా కారుని తయారు చేసాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో 'జీన్ పాల్ ఫావాండ్' అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియంలో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఈ కారుని తయారు చేసిన మిచెల్ రాబిల్లార్డ్ మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులున్నరాని, ఈ కారు తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు. -
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ అమ్మకం.. కొన్నది ఎవరంటే?
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే ముంబై మహానగరంలో లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ఖరీదైన సౌత్ ముంబై మలబార్ హిల్స్ రెసిడెన్షియల్ టవర్స్లోని ఫ్లాట్లను ఫ్యామీకేర్ అధినేత జేపీ తపారియా రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సూపర్ లగర్జీ ట్రిపుల్ ఎక్స్ అపార్ట్మెంట్లోని 26, 27, 28 ఈ మూడు ఫ్లోర్లను తపారియా సొంతం చేసుకున్నారు. 1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు అరేబియా సముద్రం, హాంగింగ్ గార్డెన్స్ రెండింటినీ తాకుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రిపుల్ ఎక్స్ ఏరియా 27,160స్కైర్ ఫీట్లతో ఉండగా.. ఒక్కో స్కైర్ ఫీట్ను రూ1.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక స్టాంప్ డ్యూటీ కింద తపారియా కుటుంబం రూ.19.07 కోట్లు చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నీరజ్ బజాజ్ సైతం బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్, మలబార్ హిల్ ప్రాంతంలో మూడంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్మెంట్ని రూ.252.5 కోట్లతో కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సొంతం చేసుకున్నారు. 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్ ప్యాలెసెస్లో 29, 30, 31 అంతస్తుల్లో నీరజ్ బజాజ్ బుక్ చేసుకున్న ఈ ట్రిప్లెక్స్కు 8 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ ఇంటికి స్టాంప్ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. -
నైజాంలో రికార్డు దరకు ప్రభాస్ ప్రాజెక్ట్ - కే రైట్స్
-
165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే!
పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్ కంపెనీ తయారుచేసిన జీన్స్ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి. చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్.. -
విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు
ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు కొంత మంది కలిసి తలా ఇంత సొమ్ము సర్దడం, ఆ మేరకు వారందరికీ వాటాలు ఉండటం కామనే. కానీ ఓ వ్యక్తి తనను తానే వాటాలు వేసి అమ్మేసుకుంటే..?డబ్బులిచ్చి వాటాలు తీసుకున్నవారు చెప్పినట్టుగా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే..? ఇదేదో చిత్రంగా ఉంది అనిపిస్తోందా.. మరి ఈ కథేమిటో తెలుసుకుందామా.. కంపెనీ ఎందుకు.. తానే ఉండగా..! ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం.. తన జీవితాన్ని ఓ లక్ష షేర్లుగా మార్చి, ఒక్కో షేర్కు ఒక డాలర్ రేటు నిర్ణయించాడు. ఈ విషయాన్ని మిత్రులకు, బంధువులకు చెప్పాడు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశాడు. చదవండి: అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టి మరీ.. తన జీవితం షేర్లను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ వెబ్సైట్ కూడా పెట్టాడు. కీలక విషయాల్లో తాను ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ వెబ్సైట్లోనే ప్రశ్నలు పెడతాడు. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు దేనికి ఓటేస్తే.. ఆ నిర్ణయం తీసుకుంటాడన్న మాట. ఆ రోజు తాను ఏ డ్రెస్సు వేసుకోవాలన్న దగ్గరి నుంచి ఉద్యోగంలో ఉండాలా, మానేయాలా అనే దాకా చాలా నిర్ణయాలు షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకే తీసుకుంటాడు. తాను వెజిటేరియన్గా మారాలనుకుంటే షేర్ హోల్డర్లు ఓకే చేశారు. నిద్ర సమయాలు మార్చుకోవాలనుకుంటే ఓకే చేశారు. చిత్రంగా తాను వేసెక్టమీ చేయించుకుంటానంటే మాత్రం ‘నో’చెప్పారు. ఇష్టంలేకున్నా చేయాల్సి వస్తోంది! ‘‘నన్ను నేను షేర్లు చేసి అమ్మేసుకున్నాక.. షేర్ హోల్డర్లు చెప్పినట్టే చేయాలి. చాలాసార్లు నాకు ఇష్టం లేకున్నా.. వారు చెప్పినట్టు చేయాల్సి వస్తోంది. అయితే ప్రతిసారీ దానివల్ల మంచే జరుగుతోంది..’’అని మైక్ మెరిల్ చెప్తున్నారు. రేటు పెరుగుతూ.. తగ్గుతూ.. 2008లో మైక్ మెరిల్ ఇలా జీవితాన్ని షేర్లలా అమ్ముతున్న ప్రకటన చేసినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి పది రోజుల్లో బంధువులు, స్నేహితులు సరదాకి షేర్లు కొన్నారు. అలా మొత్తం లక్ష షేర్లకుగాను.. 929 షేర్లు మాత్రమే అమ్మాడు. సాధారణంగా ఎక్కువ షేర్లు ఉన్నవారికి నిర్ణయాల్లో ఎక్కువ హక్కు ఉంటుంది. 99శాతం వాటా తన వద్దే ఉండటంతో మైక్ మెరిల్ పద్ధతి మార్చాడు. తన దగ్గర ఉన్న వాటాకు ఓటింగ్ హక్కులు తొలగించుకున్నాడు. బయటివారి వద్ద ఉన్న షేర్ల సంఖ్య లెక్కనే.. వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మెల్లగా ఆ నోటా ఈ నోటా మీడియాలో పడి అప్పట్లో వైరల్గా మారింది. దీనితో మైక్ మెరిల్ లైఫ్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు బయటి వ్యక్తులు 14,924 షేర్లు కొన్నారు. ఒక సమయంలో షేర్ ధర 18 డాలర్లు దాటింది. అంటే మైక్ మెరిల్ విలువ ఆ రోజున 12 లక్షల డాలర్లకు చేరినట్టుగా లెక్కించారు. మన కరెన్సీలో రూ.9.94 కోట్లు అన్నమాట. ఆయన గురించిమీడియాలో వైరల్గా మారినప్పుడల్లా కొందరు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధర పెరగడం.. తర్వాత అమ్మేయడంతో ధర తగ్గడం జరుగుతూ వస్తోంది. అంటే మైక్ మెరిల్ ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటోంది. ప్రస్తుతం మైక్ మెరిల్ షేర్ ధర ఐదారు డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. -
ఈ చేప చాలా కాస్ట్లీ గురూ.. రేటు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
సాక్షి, కవిటి(శ్రీకాకుళం జిల్లా): మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు. ఈయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చదవండి: నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై.. -
అన్నంత పని చేసిన ఎలన్మస్క్.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?
ప్రపంచం కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతు చిక్కని వ్యూహాలు అమలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన మరోసారి తన శైలిలోనే ప్రవర్తించారు. టెస్లా కంపెనీలో తన షేర్లలో కొన్నింటినీ అమ్మకానికి పెట్టారు. అడిగి మరీ సెలబ్రిటీ బిలియనీర్ ఎలన్ మస్క్కి ట్విట్టర్లో భారీ ఫాలోయింగ్ ఉంది. సుమారు 63 మిలియన్ల మంది అతని అకౌంట్ని ఫాలో అవుతున్నారు. ఈ నెల మొదటి వారంలో అకస్మాత్తుగా తన కంపెనీ షేర్లలో పది శాతం అమ్మాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. అమ్మాలా ? వద్దా చెప్పాలంటూ తన ఫాలోవర్లు కోరాడు. సుమారు 3.5 మిలియన్ల మంది ఈ ఓటింగ్లో పాల్గొనగా.. సుమారు 58 శాతం మంది యూజర్లు షేర్లు అమ్మేయాలంటూ సూచించారు. అమ్మేశాడు ట్విట్టర్ పోల్లో వ్యక్తమైన అభిప్రాయాన్ని అనుసరిస్తూ నిజంగానే తన షేర్లను అమ్మకానికి పెట్టారు ఎలన్ మస్క్. ఈ మేరకు అమెరికా స్టాక్ మార్కెట్లో షేర్ల అమ్మకానికి సంబంధించి ఫారమ్ 4ని దరఖాస్తు చేశారు. సుమారు 1.10 బిలియన్ డాలర్ల విలువ చేసే 9,30,000 షేర్లు నవంబర్ 8న అమ్మేశారు. అంతేకాదు మరో 2.15 షేర్లు సైతం అమ్మేందుకు రెడీ అయ్యారు. టెస్లాలో ఎలన్ మస్క్కి ఏకంగా 3.6 మిలియన్ షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలకు మేజర్ షేర్ హోల్డర్గా ఉన్న ఎలన్ మస్క్ సంపద ఫోర్బ్స్ జాబితా ప్రకారం 300 బిలియన్ డాలర్లుగా ఉంది. BREAKING: Tesla has filed a Form 4 for Elon Musk with the SEC. Link: https://t.co/Cbuqk59AaF pic.twitter.com/YbQW3xG8nZ — Sawyer Merritt 📈🚀 (@SawyerMerritt) November 10, 2021 కారణం అదేనా ఇటీవల వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి:పేరు మార్చుకున్న ఎలన్మస్క్.. కారణం ఇదేనా? -
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
స్విట్జర్లాండ్కు ‘యాక్ట్’ అమ్మేసుకుంది
ముంబై: బ్రాడ్బ్యాండ్ సంస్థ ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్)లో నియంత్రణ వాటాలను స్విట్జర్లాండ్కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పార్ట్నర్స్ గ్రూప్ దక్కించుకుంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లెక్కగట్టి, ప్రస్తుత షేర్హోల్డర్లయిన ఆర్గాన్, టీఏ అసోసియేట్స్ తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఆర్గాన్ పూర్తిగా నిష్క్రమిస్తుండగా, టీఏ పాక్షికంగా వాటాలను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. దేశంలోని 19 నగరాల్లో 20 లక్షల మంది వినియోగదారులకు యాక్ట్ సంస్థ ఇంటర్నెట్, టీవీ, డేటా, ఇతర బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీలో 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా యాక్ట్ నాలుగో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్గా ఉందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు. 2008 జూన్లో యాక్ట్లో ట్రూ నార్త్ ఫండ్ త్రీ నియంత్రణ వాటాలు కొనుగోలు చేసింది. అటుపైన 2016లో ఇండియం వి (మారిషస్) హోల్డింగ్స్ సంస్థ.. ఆర్గాన్, టీఏల ద్వారా ఆ వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా వాటినే స్విస్ సంస్థకి విక్రయిస్తోంది. -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి..
లక్నో: కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోడలిని 80వేలకు అమ్మేశాడు ఓ కసాయి మామా. ఈ దారుణ ఘటన యూపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో 40వేలు అడ్వాన్స్గా తీసుకుని అందులో 20000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని అడగగా, ఏదోలా నచ్చచెప్పి.. ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారబంకిలో ఉంటున్న తండ్రి దగ్గరకు పంపాడు. జూన్ 5 సాయంత్రం చందరామ్ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు. అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపాతాడని కోడలితో నమ్మబలకడంతో ఆమె బ్రోకర్తో వెళ్లింది. తన సమీప బంధువు ద్వారా తండ్రి నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలితో కలిసి గుజరాత్కు వెళ్లేందుకు బారబంకి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి -
దారుణం: 30 వేల కోసం కన్న కొడుకునే..
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి డబ్బుల కోసం రెండు నెలల తన కొడుకును విక్రయించాడు. ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎంఎం పహాడిలో నివాసం ఉంటున్న సయ్యద్ హైదర్, షహానా బేగం దంపతులకు రెండు నెలల చిన్నారి ఉన్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి బాబును అమ్మి ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని సయ్యద్ తన భార్యతో గొవడ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం తండ్రి సయ్యద్ తన చిన్నారిని విక్రయించాడు. తల్లి షహానా బేగం నమాజ్కు వెళ్లిన సమయంలో సయ్యద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి కనిపించక పోవడంతో భర్తపై అనుమానంతో భార్య షహానాబేగం పోలీసులను ఆశ్రయించారు. తన భర్త రూ.30వేల కోసం, ఇంట్లోకి వస్తువుల తీసుకోవడానికి బాబును అమ్మేశాడని భార్య రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని షహానా బేంగం పోలీసులను కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా -
నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్ఈఎల్.. ఎల్లుండి సింగరేణి
బంజారాహిల్స్ (హైదరాబాద్): నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్ఈఎల్.. ఎల్లుండి సింగరేణి.. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ అమ్మకానికి పెడుతుందని, భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ సర్కార్ ప్రైవేట్పరం చేసేలా ఉందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం 100 శాతం అమ్మే ప్రయత్నం చేస్తోందని, తాము అక్కడి ప్రజలకు అండగా ఉంటామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖకు వెళ్లి మద్దతు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నెక్లెస్రోడ్డులోని జలవిహార్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై.. మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేట్పరం కాకుండా చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నైతికంగా సంఘీభావం పలుకుతామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే ఏపీ ప్రజలు కూడా మాతో కలిసి రావాలని కోరారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారన్నారు. అన్నీ అమ్మిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేయండని అంటారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చింది సున్నా.. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కేంద్ర పెద్దలు.. విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు నోరు ఎందుకు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో లెక్కలతో సహా చూపించామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నేతలను పట్టభద్రులు గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ విద్యాసంస్థలు, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్, ట్రైబల్ వర్సిటీ, ఇలా ఎన్నో అడగడంతోపాటు లేఖలు రాసినా.. చివరికి కేంద్రం చేసింది గుండు సున్నా అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టండి.. రాష్ట్రంలో 15 వేల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. విదేశాల్లో చదువు కోసం పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలు, 25 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 650 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిది ప్రశ్నించే గొంతు కాదని.. పరిష్కరించే గొంతు అవుతుందన్నారు. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ వాణీదేవికి మద్దతు ప్రకటించింది. -
ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఇది 2019 లో ఫేస్బుక్లో లీక్ అయిన ఒక పాచ్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మదర్బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమైనాయి. ఇందులో సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్ నెంబర్లు చోరీకి గురయ్యాయి. యూజర్కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయింది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్ల విక్రయిస్తున్నట్టు మదర్బోర్డు రిపోర్ట్ చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలకు ఫేస్బుక్ వినియోగదారులు ప్రభావితమయ్యారని అలోన్ వెల్లడించారు. బల్క్గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ డేటా బేస్ విక్రయం చాలా అందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. డేటా కొంచెం పాతదే అయినప్పటికీ, ఇప్పటికే ఫోన్ నంబర్లు చోరీ అయినవారి సైబర్ సెక్యూరిటీ , గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే యూజర్లు తమ ఫోన్ నంబర్లను చాలా అరుదుగా మారుస్తారనీ, సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో మార్చే అవకాశం లేదని ఆయన గుర్తుచేశారు. మరోవైపు అటు ఫేస్బుక్ గానీ, ఇటు టెలిగ్రామ్ గానీ ఈ నివేదికపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాగా వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ విధానంపై యూజర్లు మండిపడున్నారు. మరోవైపు వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్బుక్ను దేశంలో నిషేధించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో పలు దేశాలు అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. వినియోగదారుల డేటా విక్రయంపై ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్కు తాజా పరిణామంతో మరిన్ని చిక్కులు తప్పవు. In early 2020 a vulnerability that enabled seeing the phone number linked to every Facebook account was exploited, creating a database containing the information 533m users across all countries. It was severely under-reported and today the database became much more worrisome 1/2 pic.twitter.com/ryQ5HuF1Cm — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) January 14, 2021 -
అద్దెకు తీసుకున్న కార్లు అమ్ముకున్న కేటుగాల్లు
-
నా భార్యను సౌదీ సేట్కు అమ్మేశాడు..
కడప రూరల్: నమ్మించి మోసగించిన గల్ఫ్ ఏజెంట్ తన భార్యను సౌదీ సేట్కు అమ్మేశాడని ఓబులవారిపల్లె మండలం జీవీ పురం ఎస్సీ కాలనీకి చెందిన భర్త సాల్వ వెంకటరమణ ఆరోపించారు. తన భార్య ప్రాణాపాయ స్ధితిలో ఉందని ఆమెను ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. శనివారం సాయంత్రం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరుకు చెందిన గల్ఫ్ ఏజెంట్ తమను నమ్మించి మోసగించాడని ఆరోపించారు. తన భార్యను 2017 ఆగస్టు 4వ తేదీన సౌదీ దేశ సేట్కు అమ్మేశాడని ఆరోపించారు. అక్కడ తన భార్యను సేట్ కుటుంబ సభ్యులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇండియాకు రప్పించాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కన్నీటి పర్యంతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తమను మోసగించిన ఏజెంట్పై చర్యలు చేపట్టాలని కోరారు. -
జాబ్స్ ఫర్ సేల్ @ ఏపీ సెక్రటేరియట్
-
సీఎం ఆఫీసు సాక్షిగా ఉద్యోగాల అమ్మకం!
-
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేశారు
-
అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలు అమ్మకానికి..
-
భార్యాపిల్లలు అమ్మకానికి..
సాక్షి, నంద్యాల : చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్నగర్కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో.. రెండో కుమార్తె(13)ను రూ.1.50 లక్షలకు తన దూరపు బంధువుకు అమ్మేశాడు. అంతటితో ఆగకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని జులాయిగా తిరుగుతూ సుమారు రూ.15 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి తన భార్యను సైతం రూ.5 లక్షలకు తన చిన్నన్నకు అమ్మకానికి పెట్టాడు. ‘నువ్వు సంతకం చేస్తే మా అన్న నాకు డబ్బులు ఇస్తాడు’ అంటూ భార్యను వే«ధించసాగాడు. దీంతో ఆమె కోవెలకుంట్ల నుంచి నంద్యాలలోని తన తల్లి వద్దకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినా మద్దిలేటి పిల్లలను తన వెంట పంపించాలని వేధించసాగాడు. దీంతో బాధితురాలు వెంకటమ్మ, ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారదకు విషయం తెలిపింది. తన రెండో కుమార్తెను బంధువులకు అమ్మాడని, ఆ పత్రాలు బుజ్జి అనే వ్యక్తి వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పించాలని బాధితురాలు కోరింది. ఈ మేరకు బాధితురాలితో రాత పూర్వకంగా రాయించుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేష్బాబు మాట్లాడుతూ పదిరోజుల క్రితం తన భర్త, బావ వేధిస్తున్నారని వెంకటమ్మ ఫిర్యాదు చేసిందని, ఈ విషయం ఫ్యామిలీ కౌన్సెలింగ్లో ఉందని చెప్పారు. బాధితురాలి భర్త, బావలను పిలిపించి విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ట్విటర్ కూడా అమ్మేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ ఆందోళన యూజర్లను ఇంకా వీడకముందే..తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టించాయి. ట్విటర్కు చెందిన యూజర్ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థకు విక్రయించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విటర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది. బ్లూంబర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2015లో, జీఎస్ఆర్ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్పై వన్టైం యాక్సెస్ ఇచ్చామని ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నేడేటా లీక్ అయ్యిందని గుర్తించినట్టు వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు మరోసారి తీవ్ర దుమారం రేగింది. -
భారీగా ఫేస్బుక్ షేర్ల విక్రయం: ఎవరు?ఎందుకు?
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్బర్గ్ భారీ ఎత్తున షేర్లను విక్రయించారు. ఫేస్బుక్లోని సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన (రూ. 31,443 కోట్ల) షేర్లను అమ్మేశారు. డిసెంబర్ 2015లో తన భార్య ప్రిన్సిల్లా చాన్ ఏర్పాటు చేసిన ఫౌండేషన్ చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్(సీజెడ్ఐ) కు విరాళాలు అందించే నిమిత్తం జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయిటర్స్ లెక్కల ప్రకారం జుకర్బర్గ్ ఫిబ్రవరి చివరి మూడు రోజుల్లో 125.4 మిలియన్ డాలర్ల విలువైన 685,000 షేర్లను విక్రయించారు. దీంతో మొత్తం ఫిబ్రవరిలో 482.2 మిలియన్ డాలర్ల విలువైన 2.7 మిలియన్ షేర్లను ఆయన విక్రయించినట్టుగా గురువారం నాటి సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నిధుల ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఫౌండేషన్ నిర్వహించే అనేక దాతృత్వ, స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించనున్నామని సీజెడ్ఐ ప్రతినిధి చెప్పారు. కాగా రాబోయే 18 నెలలో దాదాపు 35 నుంచి 75 మిలియన్ ఫేస్బుక్ షేర్లను విక్రయించనున్నట్టు గత సంవత్సరం సెప్టెంబర్లోనే జుకర్బర్గ్ ప్రకటించిన సంగతి విదితమే. అంతే కాదు... 99 శాతం (44 బిలియన్ డాలర్లు) ఫేస్బుక్ షేర్లను కూడా అమ్మేసి ఈ సంస్థ కోసం కేటాయించనున్నట్లు మార్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అతని భార్య మెలిండా గేట్స్ , బిలియనీర్ వారెన్ బఫెట్ స్థాపించిన బఫెట్ ఫౌండేషన్ లాంటివాటికి సమానమైనది జకర్బర్గ్ ఫౌండేషన్ కూడా. -
అమ్మకానికి ఎయిర్ ఇండియా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను నష్టాలు వస్తున్నాయనే కారణంతో విక్రయించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రుణ భారంతో ఉన్న ఎయిర్ లైన్స్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు దేశంలోని టాప్ థింక్-ట్యాంక్ నితి ఆయోగ్ సిఫార్సు చేసింది. సీనియర్ అధికారులు సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) కు సమర్పించిన సిఫారసులలో ఎయిర్ ఇండియాలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో దేశీయ, ప్రైవేట్ ఎయిర్లైన్స్ కు అవకాశం కల్పించాలని కోరింది. ఎయిర్ ఇండియాకు రూ.30 వేల కోట్ల రుణాల రైట్ ఆఫ్ సహా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సిఫారసుకు మద్దతుగా వివిధ అంతర్జాతీయ ఉదాహరణలకు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్ లైన్స్, ఆస్ట్రియన్ ఎయిర్ లో ఆయా ప్రభుత్వాలు మొత్తం వాటాలను విక్రయించినట్టు సూచించారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీతి ఆయోగ్ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై హింట్ ఇచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత వారంలో ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా 14 శాతం మార్కెట్ వాటాతో ,రూ 50 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు వ్యాఖ్యానించారు. మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్లైన్స్పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఒప్పందం ద్వారా రూ. 70,000 కోట్ల విలువైన 111 బోయెంగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా మరింత అప్పుల ఊబిలోకి కూరకుపోయిందని సీబీఐ ఆరోపించింది. దీనికి సంబంధించి విమానయాన శాఖ, ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై కేసలు నమోదు చేసింది. సిబిఐ విచారణకు సహకరిస్తామని పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్ గజపతి ప్రకటించారు. కాగా ఎయిర్ ఇండియా మొత్తం అప్పులు రూ. 60వేల కోట్లు. అందులో రూ. 21,000 కోట్ల విమానాల సంబంధిత రుణాలు, రూ .8 వేల కోట్ల మూలధన పెట్టుబడి ఉన్నాయి. -
పండే కదా అని తినేస్తే...!
-
అంగట్లో ఆడశిశువు
► అమ్మాయి పుడితే విక్రయిస్తున్న వైనం ►కొన్నిచోట్ల ఐసీడీఎస్కు అప్పగింత ► చెత్తకుప్పల్లో పడేసేందుకు, చంపేందుకూ యత్నం ► అంగన్వాడీలు, అధికారులు గుర్తిస్తేనే వెలుగులోకి.. ► వారసుడి కోసమంటూ వరుసగా గర్భం దాలుస్తున్న మహిళల ఆరోగ్యానికి ముప్పు ► నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అధికం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాట్రావత్ తండాకు చెందిన ఓ మహిళ మగ సంతానం కోసం ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది. మార్చి 28న కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. దాంతో ఆ ఇంట్లో పండుగ చేసుకున్నారు. భారీగా ఖర్చు చేసి బంధువులందరినీ పిలిచి విందు ఇచ్చారు. వారిది ఆర్థికంగా బాగున్న కుటుంబం కాదు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలే. రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితి. అయినా మగ పిల్లాడు పుట్టడంతో పండుగ చేసుకున్నారు.. అదే ప్రాంతానికి చెందిన మరో దంపతులకు వరుసగా నలుగురు ఆడపిల్లలు జన్మించారు. దీంతో వారందరినీ తాము పోషించలేమంటూ చివరగా పుట్టిన ఆడ శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అప్పగించారు సరే.. కానీ మగ పిల్లాడు పుడతాడేమోనన్న ఆశతో మరోసారి ప్రయత్నించేందుకు ఆ దంపతులు సిద్ధమయ్యారు. ఆడపిల్లలపై వివక్ష, వారసుడి కోసం గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దారుణమిది. నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, మహబుబాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మగ సంతానం కోసం వరుసగా పిల్లలను కనడంతోపాటు ఆడ శిశువులు జన్మిస్తే ఏకంగా వారిని అమ్మేసేందుకు ఒడిగడుతున్నారు. లేదంటే పోషించలేమంటూ శిశు సంక్షేమ అధికారులకు అప్పగిస్తున్నారు. గిరిజనుల మూఢాచారాలు, అవగాహన లేమి, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ పాటించకపోవడంతోపాటు వారిలో అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం ఈ దుస్థితికి కారణం. ఆడ శిశువా.. ఏం చేద్దాం..? పేద కుటుంబాలు.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లల పోషణ కష్టమే. దాంతో రెండో కాన్పు తర్వాత ఆడ పిల్లలు పుడితే వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుని ఆడ శిశువును అమ్మేస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది ఈ వ్యవహారాన్ని పసిగట్టే పరిస్థితి ఉంటే.. తమకు పోషించే స్థోమత లేదంటూ ఆడపిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించేస్తున్నారు. అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో అప్పటికి ఇంటిబాట పడుతున్నా.. ఇంటికి వెళ్లాక తిరిగి పరిస్థితి మొదటికి వస్తోంది. కొన్ని సందర్భాల్లో శిశువులను చెత్తకుప్పల్లో పడేసేందుకు, చివరికి చంపేందుకూ వెనుకాడని దుస్థితి కూడా నెలకొంది. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలో గత మూడున్నరేళ్ల కాలంలో 67 మంది ఆడ శిశువులను శిశు సంక్షేమ అధికారులకు అప్పగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గణాంకాల సేకరణలో యంత్రాంగం వారసుడి కోసం కుటుంబ నియంత్రణ పాటించని సందర్భాలు గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రెండో సంతానం తర్వాత ఆడశిశువు పుడితే వారిని పోషించలేమంటూ ఐసీడీఎస్కు అప్పగిస్తున్న ఘటనలు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, మహబుబాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో ఇలాంటి ఘటనలు నమోదవుతుండడతో రాష్ట్రవ్యాప్తంగా వీటిపై స్పష్టమైన గణాంకాలు లేవు. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని ప్రాజెక్టుల నుంచి స్పష్టమైన వివరాలు సేకరిస్తోంది. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు త్వరలో ‘మా ఇంటి లక్ష్మి’కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గణాంకాలపై స్పష్టత వస్తే ఆయా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారసుడు ఉంటేనే అప్పు! ఇప్పటికీ అత్యధిక గిరిజన తండాల్లో మగ సంతానం ఉన్న కుటుంబానికే గౌరవం దక్కుతుంది. అది ఎంతగా అంటే.. అత్యవసర పరిస్థితిలో అప్పు కావాల్సి వస్తే.. మగ సంతానమున్న వారికే ఇస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు అప్పు దొరకదు. కనీస గౌరవం కూడా ఉండదు. అంతే కాదు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా మగ పిల్లలు ఉండాల్సిందే! గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల్లో ముందుగా మగపిల్లలున్న కుటుంబాలకే ప్రాధాన్యమిస్తారని అక్కడి మహిళలు చెబుతున్నారు. ‘‘నాకు నలుగురు ఆడపిల్లలు. వచ్చే కాన్పులో అయినా వారసుడు పుడతాడని ఆశిస్తున్నా.. మగ పిల్లాడు లేకుంటే ఇజ్జత్ ఉండదు..’’అని నేరేడుగుమ్మ మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ గిరిజన మహిళ చెమర్చిన కళ్లతో వాపోవడం గమనార్హం. మగాడు పిల్లాడు పుట్టాలి.. దూండ్ చేయాలి! చాలాచోట్ల గిరిజన ప్రాంతాల్లో మగ పిల్లాడు పుడితే ఆ ఇంట్లో పెద్ద పండుగే. హోలీ పండుగ సమయంలో దూండ్ పేరిట ఈ పండుగ చేస్తారు. భారీగా ఖర్చు చేసి బంధువులకు విందు ఇస్తారు. దేవరకొండ సమీపంలోని తండాల్లో పలు ఇళ్లలో ఈ పండుగ కనిపిస్తోంది. అది జరగని ఇళ్లు అసలు ఇళ్లే కావని భావన ఉంది ఇక్కడ. వరుసగా ఆడపిల్లలు జన్మించిన కుటుంబంలో ఇల్లాలి పరిస్థితి ఆందోళనకరమే. మగపిల్లాడు పుట్టకపోవడంతో భర్తకు మరో పెళ్లి సైతం చేసే ఘటనలు కనిపిస్తున్నాయి. అత్తామామల ఒత్తిడితో సదరు ఇల్లాలు సైతం ఒప్పుకోవలసి వస్తోంది. సాకలేక శిశు గృహాలకు.. వరుసగా ఆడపిల్లలు పుట్టిన దంపతులు వారి పోషణ భారం భరించలేకపోతున్నారు. వరుసగా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన దంపతులు వారిని సాకలేమంటూ స్థానిక అంగన్వాడీ టీచర్ల ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. అధికారులు ఆ శిశువులను జిల్లా కేంద్రంలోని శిశు గృహాలకు, హైదరాబాద్లోని శిశువిహార్కు తరలిస్తున్నారు. నేరేడుగుమ్మ మండలం పలుగుతండాకు చెందిన ఆటోడ్రైవర్ తిరుపతినాయక్కు వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడంతో చివరి శిశువును ఇటీవల ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహంలో ఉన్న పిల్లల్లో 85 శాతం దేవరకొండ డివిజన్కు చెందినవారే. కుటుంబ నియంత్రణ మాటే ఉండదు పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రోత్సాహకాలు సైతం ఇస్తోంది. సంక్షేమ పథకాలను సైతం ఇద్దరు పిల్లలకే పరిమితం చేస్తోంది. అయినా గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ అమలు సంతృప్తికరంగా లేదు. చాలావరకు రెండో కాన్పు తర్వాత కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం లేదు. మగ పిల్లాడు కావాలనే కోరికే దానికి కారణం. దీంతో ఒక్కో ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉంటున్నారు. అధికారులే కాదు స్థానికంగా అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, ఆశ కార్యకర్తల వంటివారు సైతం కుటుంబ నియంత్రణపై పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదనే అభిప్రాయముంది. గిరిజనుల్లో సరైన అవగాహన లేకపోవడం, పెద్దగా చదువుకోకపోవడం కూడా అందుకు కారణమే. ‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ఎంత చెప్పినా వినరు. ఒత్తిడి చేస్తే ఎదురుదాడికి దిగుతారు..’అని నేరేడుగుమ్మ మండలం బచ్చాపురం ఆశ కార్యకర్త అలివేలు, అంగన్వాడీ సహాయకురాలు కవిత అంటున్నారు. ‘అమ్మ’ఆరోగ్యం సతమతం వరుస కాన్పులతో తండాల్లోని మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. కాన్పు తర్వాత అంతరం పాటించకపోవడం, సరైన పోషకాహారం అందకపోవడం, అదే సమయంలో పిల్లలకు పాలిస్తూ.. తిరిగి గర్భం దాల్చడం వంటివి జరుగుతున్నాయి. దీంతో మహిళలతోపాటు పుట్టే శిశువులూ బలహీనంగా ఉంటున్నారు, ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు మరింతగా చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు గర్భంలోనే శిశువు చనిపోతుండగా.. మరికొన్నిసార్లు పుట్టిన ఆర్నెల్లలోపు శిశువులు మరణిస్తున్నారు. ఈ విషయంలో తగిన అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. అసలు గిరిజన తండాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉంది. పదుల సంఖ్యలో చిన్నారులున్నట్లు రికార్డులు చూపితే.. వాస్తవానికి ఆయా కేంద్రాలకు వచ్చే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. పౌష్టికాహార పంపిణీ సైతం నామమాత్రంగానే జరుగుతోంది. మగ సంతానం లేకుంటే చిన్నచూపే.. ‘‘మగ పిల్లాడు కావాలనే ఒత్తిడి కుటుంబ పెద్దల నుంచే వస్తుంది. ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఆ ఇల్లాలును చిన్నచూపు చూస్తారు. దీంతో మగ పిల్లాడు కావాలనే ప్రయత్నం కొనసాగుతుంది. పేదరికం కారణంగా ఒకరిద్దరు పిల్లల్ని పెంచేందుకే ఇబ్బందులు పడుతున్నాం. కానీ పెద్దలు, బంధువుల ఒత్తిడి, చుట్టాల్లో పరువు కోసం మగ పిల్లాడి కోసం ప్రయత్నించాల్సి వస్తోంది..’’ – నేనావత్ చందూనాయక్, చన్నంపల్లి, నాగర్కర్నూల్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం.. ‘‘ఆడ, మగ సమానమనే నినాదంతో గిరిజన తండాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆడపిల్ల పుట్టిందని అమ్మేయడం, చెత్తకుప్పలో పారేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఎంసీటీఎస్ (మదర్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టం)ను అభివృద్ధి చేశాం. మహిళలు గర్భంతో ఉన్నప్పటి నుంచి కాన్పు వరకు నిఘా పెడతాం. డెలివరీ తర్వాత కూడా శిశువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. శిశు విక్రయాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నాం. ప్రస్తుతం పరిస్థితి కొంత ఆశాజనకంగా మారుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తరఫున త్వరలో ‘మాఇంటి లక్ష్మి’కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆడపిల్లలకు అందిస్తున్న లబ్ధిపై విస్తృత అవగాహన చేపడతాం..’’ – సక్కుబాయి, సీడీపీఓ, దేవరకొండ, నల్లగొండ జిల్లా -
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
-
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశీయ ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా బీఎస్-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యమని సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది. ఏప్రిల్ తరువాత బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.2 లక్షల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఉందని సియామ్ డేటాలో తేలింది. వాహనాల కేటగిరీ ప్రకారం దీనిలో బీఎస్-3 కమర్షియల్ వెహికిల్స్ 96వేలు, టూ-వీలర్స్ 6 లక్షలు, త్రీ-వీలర్స్ 40వేలు ఉన్నాయి. తాజా సుప్రీం ఆదేశాలకు ఇవన్నీ ప్రభావితం కానున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఆటో కంపెనీలకు ఇది భారీ వెనకడుగు అని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఆటో కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్పొ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు సుప్రీం ఆదేశాలపై సియామ్ మాజీ అధ్యక్షుడు శాండిల్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందన్నారు. పొల్యూషన్ సమస్య దీనివల్ల తీరదని మండిపడ్డారు. ఆటో పరిశ్రమ వల్ల కేవలం పొల్యుషన్ 2శాతం మాత్రమే అన్నారు. దీనిపై ఆటో పరిశ్రమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అమ్మకాలపై నిషేధం విధించడం వినియోగదారులకు తీరని నష్టమని పేర్కొంది. -
హిట్లర్ అరుదైన ఫోటోలకు భారీ ధర
లండన్: జర్మనీ నియంత, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్కు సంబంధించిన అరుదైన ఫోటోలను వేలంలో ఉంచగా అనూహ్యమైన స్పందన లభించింది. వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి ఊహించని విధంగా.. 41,000 డాలర్లు(సుమారు 27 లక్షలు) చెల్లించి ఆ ఫోటోలను సొంతం చేసుకున్నాడు. హిట్లర్ చివరి రోజుల్లో గడిపిన 'ఫ్యూరర్ బంకర్'లో దొరికిన ఫోటోలను ఇటీవల సీ అండ్ టీ అనే సంస్థ వేలంలో ఉంచింది. బ్రిటన్లోని రాయల్ టన్బ్రిడ్జ్వెల్స్లో నిర్వహించిన ఈ వేలంలో.. హిట్లర్ చైర్లో కూర్చొని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఫోటోతో పాటు.. చిన్నారులతో ఉన్న ఫోటోలతో కూడిన ఆల్బంకు భారీ మొత్తం పలికింది. హిట్లర్ దంపతుల మరణానంతరం.. హిట్లర్ భార్య ఇవా బ్రాన్ బెడ్ రూంలో ఓ రష్యన్ సైనికుడికి 1945లో దొరికిన ఈ ఆల్బం తరువాతి కాలంలో ఓ ఫోటో గ్రాఫర్ చేతికి వెళ్లింది. 1945 ఎప్రిల్ 29న ఇవా బ్రాన్ను పెళ్లాడిన హిట్లర్.. మరుసటి రోజు భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
ఇక జెనరిక్ షాపుల్లో ఆయుర్వేద మందులు
న్యూఢిల్లీ: ఆయుష్ మందులు ఇకమీదట జెనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఆయుర్వేద మందులను ఆరోగ్యమంత్రిత్వ శఖ ఆధ్వర్యంలో నిర్వహించే జెనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్సభలో వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నట్టు అని శుక్రవారం లోక్సభకు అందించిన సమాచారంలో తెలిపారు. పురాతన ఆయుర్వేద నాడీ వ్యాధి నిర్ధారణ కోర్సును కూడా వైద్య విద్య జాబితాలో చేర్చనున్నట్టు కూడా ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఈ పురాతన నైపుణ్యాన్ని అందించే దిశగా ఆయుర్వేద కౌన్సిల్ తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రజారోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉండనున్నారని ఇందుకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే "డేంజర్ జోన్" లోఉన్న ఔషధ మొక్కలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఫ్లిప్కార్ట్లో ఆ ఫోన్కు భలే గిరాకి
రెడ్ మి నోట్ 3తో మొబైల్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న షియోమి, కొత్త సంవత్సరంలో రెడ్ మి నోట్ 4తో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ను నేటి(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో, మి.కామ్లో షియోమి అందుబాటులో ఉంచింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై దీన్ని ప్రవేశపెట్టిన ఒక్కటే ఒక్క నిమిషంలో ఈ ఫోన్కు భలే గిరాకి వచ్చిందట. ఒక్క నిమిషంలోనే నోట్ 4 స్టాక్ అంతా అయిపోయిందట. మూడు వేరియంట్లలో దీన్ని షియోమి ప్రవేశపెట్టింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నేటి నుంచి గోల్డ్, డార్క్ గ్రే రంగుల ఫోన్లే అందుబాటులో ఉండనున్నాయి. మేట్ బ్లాక్ కలర్ వేరియంట్ కొన్ని వారాల తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు.... 2.5డి కర్వ్డ్ గ్లాస్తో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ కెమెరా 85 డిగ్రీల వైడ్ యాంగిల్తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ ఆండ్రాయిడ్ మార్ష్మాలో, మిఐయూఐ 8.0 ఆండ్రాయిడ్ నోగట్ 7.0 టెస్టింగ్ 4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎస్ కింది వైపు డ్యూయల్ స్పీకర్స్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాముల బరువు కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై: డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీ పతనంపై కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. డాలర్ మారకపు విలువలో రోజు రోజుకు క్షీణిస్తున్న దేశీయ కరెన్సీని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం సుమారు రూ.68.80 మార్కుకు పడిపోయిన రూపాయికి మద్దతిచ్చేందుకు భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేసింది. దీంతో కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది. 68.80 స్థాయినుంచి రీబౌండ్ అయ్యి 11 పైసల నష్టంతో రూ.68.67 వద్ద ట్రేడవుతోంది. సుమారు 500 మిలియన్ డాలర్లను ఆర్బీఐ విక్రయించిందని ట్రేడర్లు తెలిపారు. ఆర్ బీఐ జోక్యంతో రికార్డు స్థాయిని కనిష్టానికి పడిపోయిన రూపాయి కోలుకుందని చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు వంటివి డాలర్ను 13 ఏళ్ల గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అంతర్జాతీయ కరెన్సీలు డాలర్తో పోలిస్తే మరింత బలహీనతను నమోదుచేస్తున్నాయి. మరోవైపుదేశీయ మార్కెట్లు, బంగారం, వెండి ధరలుకూడానేల చూపులు చూస్తున్నసంగతి తెలిసిందే. . -
రూ. 10 వేలకు ఆడశిశువును అమ్మేశారు
వేములపల్లి : పేదరికంతో మగ్గుతున్న ఆ దంపతులు మరో ఆడపిల్లను పోషించలేక అమ్మకానికి పెట్టారు. పదిహేను రోజుల శిశువును రూ. 10 వేలకు విక్రయించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తాజాగా నాలుగోసారి కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. 15 రోజుల పసికందును పాములపాడుకు చెందిన వారికి రూ. 10 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్ కోస్టాలో వాటా విక్రయం!.
♦ విదేశీ ఎయిర్లైన్స్తో చర్చలు ♦ కొత్త విమానాలకై త్వరలో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా వాటా విక్రయానికి రెడీ అయింది. గల్ఫ్ ప్రాంతానికి చెందిన విమానయాన సంస్థలతో సహా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 26 శాతం వాటా విక్రయానికై ఖతర్ ఎయిర్వేస్, ఎయిర్ కోస్టా మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయానికి ఇరు సంస్థలు రానట్టు తెలుస్తోంది. ఎయిర్ కోస్టాలో ఎమిరేట్స్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్లలో ఏదో ఒక కంపెనీ వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విమానాలను నడిపేందుకు ఎయిర్ కోస్టాకు ఈ నెల 3న డీజీసీఏ లెసైన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాటా విక్రయానికి ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్త లెసైన్సుతో సంస్థ విలువ పెరగడం ఇందుకు కారణం. ఇప్పటి వరకు ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్కోస్టా హైదరాబాద్సహా 8 నగరాలకు సర్వీసులను నడిపింది. మరిన్ని విమానాలకై.. ప్రస్తుతం ఎయిర్ కోస్టా వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. ఈ నెలలోనే మరో విమానం తోడవుతోంది. కొత్తగా ఆరు ఎయిర్క్రాఫ్ట్స్ కోసం సింగపూర్కు చెందిన జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్తో అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. 2017 జనవరి నుంచి కంపెనీలోకి వీటి రాక ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా సంస్థ చేతిలో ఎంబ్రార్ ఇ-190 రకం 10 విమానాలు ఉండనున్నాయి. రెండేళ్లలో మొత్తం 18 నగరాల కు సర్వీసులను అందించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త నగరాలను జోడించనుంది. -
ఒక్కరోజులోనే లక్ష ఫోన్ల అమ్మకం
రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్తో బ్యాటరీ ఫోకస్డ్గా వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్ మోటో ఈ3 పవర్కు భారత మార్కెట్లో అనూహ్య స్పందన వస్తోంది. గత సోమవారం విడుదలైన ఈ ఫోన్, కేవలం ఒక్కరోజులోనే లక్ష ఫోన్లు విక్రయించినట్టు కంపెనీ హర్షం వ్యక్తంచేసింది. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి వచ్చింది. విడుదలైన ఒక్కరోజులోనే లక్ష యూనిట్లను విక్రయించామని దేశీయ మోటోరోలా మొబిలిటీ జనరల్ మేనేజర్ అమిత్ బోనీ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తమ టీమ్స్ ఫ్లిప్కార్ట్, మోటో-ఐఎన్డీలు చరిత్ర సృష్టించాయని, కేవలం ఒక్కరోజులోనే 1,00,000 మోటోఈ3 పవర్ స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోయినట్టు బోనీ ట్విట్టర్ ద్వారా వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పాడు. రూ.7,999లతో మోటో ఈ3 వపర్ స్మార్ట్ఫోన్ను కంపెనీ గత సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్తో పాటు రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ కంపెనీ అందిస్తోంది. ప్రవేశ ఆఫర్ కింద ఈ ఫోన్ ధరపై రూ.1,000 తగ్గింపును కంపెనీ ఒక్క రోజు చేపట్టింది. మోటో ఈ3 వపర్ స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సెల్ రెజుల్యూషన్ 1గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్ డ్యుయల్ సిమ్ సపోర్టు బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్ -
80 శాతానికి పైగా టికెట్లు అమ్మేశారు
రియో డీ జనీరో: జికా వైరస్ సృష్టించిన కలకలం, అనవసరపు ఖర్చు అంటూ స్వదేశంలో తీవ్ర ఆందోళనలు రియో ఒలంపిక్స్పై పెద్దగా ప్రభావం చూపలేదు. విశ్వక్రీడా సంబరానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న రియో ఒలంపిక్స్ కోసం.. అందుబాటులో ఉంచిన 80 శాతానికి పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని నిర్వాహకులు శనివారం వెల్లడించారు. టికెట్ల కోసం అభిమానులు 320 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు వారు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యంలో ఇది 96 శాతం అని రియో 2016 ఒలంపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలంపిక్స్ నిర్వహణకయ్యే మొత్తం వ్యయంలో.. 16 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా వస్తుందని ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ఒలంపిక్స్ సన్నాహకాలు అంతా సవ్యంగా సాగుతున్నాయని రియో 2016 ప్రెసిడెంట్ కార్లోస్ నుజ్మన్ తెలిపారు. -
పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు
ముంబై: ముంబైలో ఓ 14 ఏళ్ల బాలిక దీనపరిస్థితిలో పోలీస్స్టేషన్కు చేరింది. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. మంచి జాబ్ అని నమ్మించి ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చి.. ఓ మహిళకు రూ. 50 వేలకు అమ్మేశాడని ఫిర్యాదు చేసింది. ఇంట్లో పనికోసం తనను కొనుగోలు చేసిన మహిళ దాడికి పాల్పడుతోందని వాపోయింది. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసుల చెంతకు చేరినట్లు తెలిపింది. ప్రాధమిక విచారణలో బాలికను ఉత్తర ప్రదేశ్లోని బెనారస్కు చెందినట్లు గుర్తించారు. అక్కడి ఓ అనాధశరణాలయం నుంచి తీసుకొచ్చి తనను పెళ్లి చేసుకున్నాడని.. అయితే పెళ్లి ఢిల్లీలో జరిగిందా లేక ముంబైలో జరిగిందా అనే విషయం కూడా తనకు తెలియదని బాలిక వెల్లడించింది. భర్త తనను కొట్టేవాడని వాపోయింది. బాలిక వెల్లడించిన వివరాల ఆధారంగా బాలల అక్రమరవాణా కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ దేవన్ వెల్లడించారు. -
10 మంది అమ్మాయిలను అమ్మేశారు..
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి 12 మంది మైనర్ బాలికలను వారి తల్లిదండ్రుల నుంచి కొనుక్కుని బానిసలుగా మార్చేశాడు. లీ కప్లన్(51) తనను ప్రతి రోజు శారీరకంగా వేధిస్తున్నాడంటూ 14 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లీ ని అరెస్టు చేశారు. లీ ఇంటిపక్కనే ఉండే జెన్ బెట్జ్ అనే ఆవిడ అమ్మాయిలను వేధించడం చూసి చలించిపోయేది. ఈ విషయాన్ని తన భర్తతో పదేపదే చెప్పిన అతను పట్టించుకోలేదు. దీంతో ఆవిడే ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు లీ ఇంటికి చేరుకుని పరిశీలించగా అక్కడ డజను మంది 6 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న అమ్మాయిలున్నారు. వారిలో ఒక అమ్మాయి తనని లీ అక్కడకు 14 ఏళ్ల వయసు లో తీసుకొచ్చాడని ఇప్పుడు తన వయసు 16 ఏళ్ల నాలుగు నెలలని చెప్పింది. లీ ప్రతిరోజు తనను శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసుల ఆమె తల్లిదండ్రులను పిలిపించారు. వారిని విచారించగా లీ వద్ద ఉన్న మిగతా తొమ్మిది మంది కూడా తమ బిడ్డలనే పోలీసులకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అధికారులు సాక్ష్యాల కోసం ఆరాతీశారు. తమ దగ్గర ఎలాంటి పత్రాలు లేవని చెప్పడంతో సోషల్ సెక్యూరిటీ కార్డును పరిశీలిస్తామని అన్నారు. మిగతా పిల్లల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బాలికలను వేధించినందుకు గాను దాదాపు 1 మిలియన్ డాలర్ల పరిహారాన్ని నిందితుడు చెల్లించాల్సిన అవకాశం ఉంది. -
టాపర్స్ స్కాం: సర్టిఫికేట్కు ఐదు లక్షలు!
పాట్నా:బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ అధికారులు పురోగతి సాధించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ స్కాంతో సంబంధమున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. డబ్బు చెల్లించిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకుండానే సర్టిఫికేట్లు పొందినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్ధులు ఏదైనా కాలేజీ నుంచి కనీసం అడ్మిషన్ కూడా తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. ఈ స్కాంలో పాత్రధారులుగా భావిస్తున్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లోకేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన సతీమణి, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాల ప్రమేయంపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
ప్లేబోయ్ భవంతిని అమ్మేశారట..!
లాస్ ఏంజెల్స్ : ప్లే బోయ్ భవంతి అమ్మకం అయి పోయిందట. 100 మిలియన్ డాలర్లకు పైగా ఈ భవంతిని ప్లే బోయ్ యజమాని హుగ్ హెఫ్నర్ అమ్మారట. ప్లే బోయ్ ఎంటర్ ప్రైజస్ కలిగి ఉన్న ఈ హాంబీ హిల్స్ ఎస్టేట్ ను, వారి ప్రాపర్టీకి పక్కనే నివసిస్తున్న డరెన్ మెట్రోపాలస్ కొనుగోలు చేశారట. 200 మిలియన్ డాలర్లకు ఈ ఎస్టేట్ ను హుగ్ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అయితే ఎంతకు అమ్ముతున్నారో మాత్రం ప్రకటించలేదు. 100 మిలియన్ డాలర్లకు పైగా మొత్తానికి ఈ భవంతి అమ్ముడు పోయినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ భవంతిని కొనుగోలు చేసిన డరెన్ కోటీశ్వరుడైన సీ. డీన్ మెట్రోపాలస్ కుమారుడు. ప్లే బోయ్ భవంతికి పక్కనే ఆయన 2009లో ఓ భవంతిని 18 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన కొనుగోలు చేసిన ఈ భవంతిలో హుగ్ చనిపోయేంతవరకు అక్కడే నివసించేందుకు డరెన్ సమ్మతించినట్టు మెట్రోపాలస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చారిత్రాత్మకమైన భవంతిని 1927లో ఆర్థర్ ఆర్. కెల్లీ డిజైన్ చేశారు. 5.3 ఎకరాల్లో ఈ భవంతి విస్తరించి ఉంది. 21,789 చదరపు అడుగుల గోథిక్-ట్యూడర్ స్లైల్ లో ఈ భవంతి ఉంది. ఇందులో మొత్తంలో 22 గదులుంటాయి. వాటిలో మద్యపాన గది, స్క్రీనింగ్ రూమ్, గేమ్స్ రూమ్, టెన్నీస్, బాస్కెట్ కోర్టు, వాటర్ ఫాల్, స్విమ్మింగ్ పూల్ ఏరియాను ఈ భవంతిలోనే ఉంటాయి. సెపరేట్ వింగ్ లో ప్లేబోయ్ మ్యాగజేన్ ఆఫీసు కూడా ఉంది. -
బాలుడిని విక్రయించడానికి తల్లి యత్నం
ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆదివారం ఓ బాలుడిని విక్రయించడానికి వచ్చిన తల్లిని గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన శైలజకు నిజామాబాద్ పట్టణానికి చెందిన పోశెట్టితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా శైలజతో భర్త పోశెట్టి విడాకులు పొంది నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి శైలజ తన తల్లిదండ్రులు రాజేందర్-రేణుకల వద్ద నిజామాబాద్ పట్టణంలోని గాజుల్పేటలో ఉంటుంది. ఆదివారం శైలజ తన రెండున్నరేళ్ల కుమారుడు బాలయ్యను జానకంపేట గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయించాలని గ్రామంలో తిరుగుతోంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆమెను నిలదీయగా అసలు విషయం బయట పడింది. స్థానికులు గ్రామ సర్పంచ్ బండారి దశరథ్కు సమాచారం అందించగా.. ఆయన ఐసీడీఎస్ జిల్లా ఇన్చార్జి పీడీకి, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్లకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించకపోవడంతో.. చివరకు గ్రామంలో ఉన్న అంగన్వాడి కార్యకర్తలకు పసిబాలున్ని అప్పగించారు. కాగా, ఐసీడీఎస్ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని సర్పంచ్ తెలిపారు. -
కన్నపేగుకు ఖరీదు..?
♦ పసికందు రూ. 2 లక్షలకు విక్రయం.. ♦ ఎట్టకేలకు శిశువిహార్కు తరలించిన అధికారులు మంచాల: పోషణ భారమనుకున్నారో.. లేక ఆడపిల్ల అనుకున్నారో ఏమో ఆ తల్లిదండ్రులు తమ కన్నపేగుకు ఖరీదు కట్టి విక్రయించారు. ఎట్టకేలకు ఐసీడీఎస్ అధికారులు శిశువును శిశు విహార్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండలేమూర్కు చెందిన పద్మకు ఆరేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చింతపల్లి పరిధిలోని బండకింది తండాకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈక్రమంలో గత జనవరి 1న పద్మ తిరిగి ఆడపిల్లను ప్రసవించింది. పాప పుట్టిన నాలుగు రోజులకే రూ. 2 లక్షలకు ఘట్కేసర్ మండలం అన్నోజీగూడకు చెందిన వెంకన్నకు విక్రయించారు. అయితే, స్వగ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా పద్మ తన పుట్టిల్లు బండలేమూర్ వచ్చింది. గతంలో కూడా పద్మ, రాజు దంపతులు తమ మూడో కూతురును అప్పట్లో రూ.70 వేలకు విక్రయించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాపను శిశు విహార్కు తరలించారు. అయితే తిరిగి పద్మ ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆమెపై ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా పద్మ తన పుట్టింటికి వచ్చి శిశువును విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి ఐసీడీఎస్ అధికారి లావణ్య, సూపర్వైజర్లు సత్యమ్మ, సుగుణ ఇబ్రహీంపట్నం ఐసీడీ ఎస్ అధికారుల సహకారంతో విచారణ మొదలు పెట్టగా పుట్టిన నాలుగోరోజునే పాపను విక్రయించినట్లు తేలింది. దీంతో పద్మ, రాజు దంపతులతోపాటు వారి కుటుంబీకులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తాము శిశువును విక్రయించలేదని, కేవలం పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చామని దంపతులు అన్నోజిగూడకు చెందిన వెంకన్న అడ్రస్ ఇచ్చారు. పోలీసుల సహకారంతో అధికారులు ఆ పాపను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని శిశు విహార్కు తరలించారు. అయితే, తాను పాపను కొనుగోలు చేయలేదని, పెంచుకోవడానికి మాత్రమే తీసుకున్నానని మల్లయ్య అధికారులకు తెలిపాడు. -
కూరగాయలమ్మిన బంగారం వర్తకులు
తిరుపతి: బంగారం వర్తకులు టీ, టిఫిన్, కూరగాయలు విక్రయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పట్టణంలోని చిన్న బజార్ వీధిలో ఈ వినూత్న దృశ్యం చోటు చేసుకుంది. ఆభరణాలపై కేంద్రం విధించిన ఎక్సైజ్ పన్నును ఎత్తివేయాలని కోరుతూ బంగారం వర్తకులు బుధవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం షాపులు బంద్ చేసి తమ షాపుల ముందే టీ, టిఫిన్, కూరగాయలను విక్రయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ విధించడం వల్ల బంగారం వ్యాపారం దెబ్బతినే పరిస్థితి దాపురించిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
భార్యను పోర్న్ ఫిల్మ్మేకర్స్కు అమ్మేశాడు
పట్నా: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని అందరిముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెను నిలువునా మోసం చేశాడు. పరాయి మగాడు వెంటపడితే దండించి తన భార్యకు తండ్రిలాగా అండగా నిలవాల్సిన ఆ భర్త.. సభ్యసమాజం సిగ్గుపడేలా తన భార్యను వేరొకరి చేతిలో పెట్టేందుకు సిద్ధపడ్డాడు. అది కూడా నీలి చిత్రాలు తీసే వాళ్ల చేతుల్లో. పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే సంతలో వస్తువులా అమాయకురాలైన తన భార్యను రూ.7లక్షలకు పోర్న్ వీడియోలు తీసేవారికి అమ్మేశాడు. అదృష్టవశాత్తు ఆమె తన తోటికోడలు ద్వారా ఈ విషయం తెలుసుకొని పరుగుపరుగున రాత్రికి రాత్రే ప్రాణాలు అరచేతబట్టుకొని తన ఇంటికి చేరుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామంలో రితాదేవీ(పేరు మార్చాం)కి అదే రాష్ట్రానికి చెంది హర్యానాలోని పాటికారా అనే గ్రామంలో స్థిరపడిన టికు పాటికర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. అది కూడా ఈ ఏడాది జనవరి 8న వారి ఊర్లోని ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా ఈ వివాహం జరిగింది. అనంతరం ఆమెను కాపురానికి హర్యానా పంపించారు. అయితే, ఆమె కాపురానికి వెళినప్పటి నుంచి ఆ కుటుంబం రాచిరంపాన పెట్టడం ప్రారంభించారు. రూపాయి కట్నం కూడా తీసుకురాలేదంటూ కొట్టడం మొదలుపెట్టారు. రూ.2లక్షల కట్నం, ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇప్పించాలని కోరామని ఇప్పటి వరకు వాటిని ఆమె కుటుంబం ఇవ్వలేకపోయిందంటూ చిత్రహింసలు పెట్టసాగారు. వాటన్నింటి ఆమె ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమెకు గుండెలో దడపుట్టించే వార్త తెలిసింది. ఆమెను తన భర్త పరాయివాళ్లకు అమ్మేశాడని, వారు కూడా నీలి చిత్రాలు తీసేవాళ్లకు అని తెలిసింది. తెల్లారితే ఆమెను వాళ్లు తీసుకెళతారని తెలియడంతో రాత్రికి రాత్రే తన గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వెస్ట్రన్ యూపీ ప్రాజెక్ట్ విక్రయించిన గాయత్రి ప్రాజెక్ట్స్
ప్రాజెక్టు విలువ 575 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్సై యూపీ టోల్వే లిమిటెడ్ (డబ్ల్యూయూపీటీఎల్)లో 100 శాతం వాటాను క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీటీఈకి విక్రయించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. డబ్ల్యూయూపీటీఎల్లో గాయత్రి ప్రాజెక్ట్స్కు 49 శాతం వాటా ఉండగా, ఎన్సీసీ 51 శాతం వాటాను కలిగి ఉంది. లావాదేవీలు పూర్తవడానికి రెండు నెలలు పడుతుందని అంచనా. రుణ భారం తగ్గించుకునే పనిలో భాగంగా డబ్ల్యూయూపీటీఎల్ను విక్రయించింది. రూ. 756 కోట్ల వ్యయంతో ఎన్హెచ్ 58లో నిర్మించిన 78 కి.మీ ఈ రోడ్ ప్రాజెక్ట్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విలువను రూ. 575 కోట్లుగా అంచనా. గతేడేది ఈ ప్రాజెక్టు వార్షిక ఆదాయం రూ. 108 కోట్లుగా నమోదయ్యింది. -
రికార్డు స్థాయిలో పెరిగిన వాహన అమ్మకాలు
-
హైదరాబాద్లో నయా మోసం
-
ఆ అమెరికన్ డైమ్ చాలా కాస్ట్లీ గురూ..!
పది సెంట్లు విలువైన అమెరికన్ 'డైమ్' (నాణెం) ఇప్పుడు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు పలికింది. నాణేల సేకరణే హాబీగా ఉన్నఓ వ్యక్తి ఆ పురాతన నాణేన్ని దక్కించుకునేందుకు ఏకంగా రెండు మిలియన్ డాలర్లు చెల్లించాడు. అయితే అంత డబ్బు చెల్లించాడంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని ఊహిస్తున్నారు కదూ... అవును మీరు ఊహించింది నిజమే. ఆ నాణెం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అమెరికాకు చెందిన 1894 ఎస్ బార్బర్ డైమ్... ప్రపంచంలోనే అరుదైన నాణెంగా గుర్తింపు కూడా పొందింది. తంపాలోని హెరిటేజ్ ఆక్షన్స్ లో వేలానికి పెట్టిన ఆ నాణెం 1,997 డాలర్లకు అమ్ముడుపోయి వార్తల్లోకెక్కింది. 1804 డాలర్, 1913 లిబర్టీ నికెల్, 1894 ఎస్ బార్బర్ నాణేలు అమెరికన్ నాణేల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన, అరుదైనవిగా గుర్తింపు పొందాయి. అదే విషయాన్ని హెరిటేజ్ ఆక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కో మింట్ అప్పట్లో 2.5 మిలియన్ల డైమ్ లను ముద్రించిందట. అయితే అందులో సుమారు పది నాణేలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. 1893 లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో కొత్త నాణేల ముద్రణకు డిమాండ్ ఏర్పడింది. దీంతో డైమ్ లను మెల్ల మెల్లగా కరిగించేశారు. అమెరికాలోని ఆక్షన్ హౌస్ లో జనవరి 6 నుంచి 11 వరకు పలు ఆమెరికన్ నాణేలను వేలానికి పెట్టారు. అయితే వీటిలో మిగిలిన అన్ని నాణేలు వందలు, వేల డాలర్లకే అమ్ముడు పోయాయి. ఇంతకు ముందు 2013 లో 1794 కు చెందిన ఓ వెండి డాలర్.. వేలంలో 10.016.875 డాలర్లు పలికి రికార్డు సృష్టించినట్లు కాలిఫోర్నియా.. ఇర్విన్ లోని వేలంపాటదారుడు స్టాక్స్ బౌవర్స్ చెప్తుండగా... ఇప్పుడు ఈ నాణెం సుమారు రెండు మిలియన్ డాలర్ల రేటు పలికి వార్తల్లో నిలిచింది. -
వారంలోగా అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం
-
అంకుల్ ద్రోహం..12 ఏళ్ల బాలికకు నరకం
న్యూఢిల్లీ: ఒకవైపు మహిళలపై హింసకు వ్యతిరేకంగా వారోత్సవాలు. మరోవైపు దేశ రాజధాని నడిబొడ్డులో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం. ఉద్యోగం పేరుతో తీసుకొచ్చిన ఓ బాలికను రూ. 50వేలకు అమ్మేశాడో దుర్మార్గుడు. దగ్గరి బంధువే నమ్మించి... ద్రోహం చేయడంతో 12 ఏళ్ల బాలిక అంతులేని నరకాన్ని అనుభవించింది. ఉత్తరప్రదేశ్ లోని మధురైలో ఉంటున్న ఒడిషాకు చెందిన ఓ బాలికకు ఆమె సమీప బంధువు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఢిల్లీలో ఉద్యోగం ఉందని చెప్పి గుర్గావ్లోని పల్వాల్ గ్రామానికి తీసుకొచ్చాడు. నాలుగు నెలల తర్వాత తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడు. దీనికి బాలిక నిరాకరించడంతో మరో ఎత్తుగడ వేశాడు. 50 వేలకు ఆ బాలికను ఓ వ్యక్తికి అమ్మేశాడు. అప్పటి నుంచి ఆమెపై లైంగికదాడులు చేస్తూ నరకం చూపించాడు కొనుక్కున్న వ్యక్తి. ఆ కామాంధుడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోతుండగా మరోసారి దురదృష్టం ఆమెను కాటేసింది. పల్వాల్ బస్టాండ్లో బస్సు కోసం చూస్తూ ఉండగా.. ఆటోలో వచ్చిన ఇద్దరు దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు పల్వాల్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తెలిపిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు గోవర్థన్, జితేందర్ అనే ఇద్దరు నిందితులను గుర్తించారు. కిడ్నాప్, అత్యాచారం, అనంతరం పొలాల్లో వదిలేసిన ఘటనలో వారిపై వివిధ చట్టాల కింద కేసులు పెట్టారు. మరోవైపు బాలిక బంధువు, ఆమెను కొనుక్కున్న వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. వారిపై లుక్ అవుట్ నోటీసు జారీచేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ కేంద్రానికి తరలించారు. విచారణ అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నామని తెలిపారు. అటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా కేంద్రాలుగా వ్యవస్థీకృతమైన అక్కమ సిండికేట్ పని చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇలాంటి వ్యభిచార ముఠా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తమ దృష్టిలో ఉందన్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
నాలుగురోజుల్లో 5,300 కేజీల బంగారం కొనేశారు
ధర తగ్గడంతో ఎగబడిన వినియోగదారులు భారీ వర్షంలోనూ రూ.4,800 కోట్ల బాణ సంచా విక్రయం ఈ పండుగ ‘బంగారం’ గానూ! చెన్నై: రికార్డు స్థాయిలో షాపింగ్ చేయడం ద్వారా దీపావళి పండుగా...మజాకా అని పించారు రాష్ట్ర ప్రజలు. నాలుగే రోజుల్లో 5,300 కిలోల బంగారు నగలను కొనుగోలు చేశారు. రూ.4,800 కోట్ల విలువైన బాణ సంచాతో దీపావళి సందడి చేశారు. దేశంలోనే బంగారు నగల ధారణలో తమిళనాడు ముందంజలో ఉన్నట్లు అనేక సర్వేల్లో తేలింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే త మిళనాడులో నగల తయారీ కూలి తక్కువ. దుకాణాల సంఖ్య ఎక్కువ కావడంతో రాయితీలు ఇవ్వడంలో వ్యాపారస్తులు పోటీపడుతుంటారు. వ్యాపారుల మ ద్య పోటీతో వినియోగదారుడు లాభపడుతున్నాడు. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో నే సగటున 1,200 కిలోల బంగారు నగలు అమ్ముడవుతుంటాయి. అదే దీపావళి వం టి ముఖ్యమైన పండుగ రోజుల్లోనైతే 20 నుంచి 25 శాతం అమ్మకాలు పెరుగుతా యి. రాష్ట్రంలో 2013లో దీపావళి రోజైన నవంబరు 3వ తేదీన ఒక గ్రాము బం గారు రూ.2,851లు, సవర రూ.22,808 పలికింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఒక గ్రాము రూ.2,450, ఒక సవర రూ.19,600కు తగ్గింది. వారం రోజులుగా చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవేమీ బంగారు అమ్మకాలపై ప్రభావం చూపలేదు. ఈనెల 7వ తేదీన 1,250 కిలోలు, 8వ తేదీన 1,200, 9వ తేదీన 1,350, 10వ తేదీన 1,500 కిలోలు మొత్తం 5,300 కిలోల బంగారు నగలు అమ్ముడుపోయాయి. గత ఏడాది దీపావళి రోజున 1,250 కిలో బంగారు నగలు అమ్ముడుపోగా ఈ ఏడాది 1,500కిలోలు అమ్మకాలు సాగడం విశేషం. ఇలా రికార్డు స్థాయి అమ్మకాలపై చెన్నై బంగారు, రత్నాల నగల వ్యాపారుల సంఘం అధ్యక్షులు జయంతీలాల్ సలానీ మాట్లాడుతూ బంగారు ధర తగ్గడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగిందని అన్నారు. రూ.4,800 కోట్ల బాణ సంచా అమ్మకాలు.. దీపావళి పండుగ సందర్భంగా బాణ సంచా అవసరాలను శివకాశిలోని అనేక సంస్థలే తీరుస్తున్నాయి. నిషేధాజ్ఞలను దిక్కరించి రాష్ట్రంలో చైనా టపాసులు చెలామణి అయిపోయాయి. దీపావళికి సహజంగా శివకాశిలోని బాణ సంచా తయారీదారులకు రూ.6వేల కోట్ల ఆర్డర్లు రావాల్సి ఉండగా కేవలం రూ.4వేల కోట్లకు లభించాయి. బాణ సంచా వ్యాపారంపై తయారీదారులు విరక్తి పెంచుకున్నారు. దీనికితోడు కుండపోతగా కురుస్తున్న వర్షాలు తయారీదారులను నిరుత్సాహంలోకి నెట్టివేశాయి. అయినా దీపావళి పండుగ చేరువైన తరుణంలో అక స్మాత్తుగా అమ్మకాలు ఊపందుకుని రూ.4,800 కోట్లకు చేరుకున్నాయి. దీనిపై తమిళనాడు బాణ సంచా తయారీదారుల సంఘం నేతలు మాట్లాడుతూ చైనా టపాసుల ప్రవేశం వల్ల తమ అమ్మకాలు పడిపోతాయని ఆందోళన చెందామని అన్నారు. చైనా టపాసులపై నిషేధాజ్ఞలు రావడంతో ఓ మోస్తరుగా గట్టెక్కామని తెలిపారు. -
పసికందును అమ్మిన తల్లిదండ్రులు
ఎల్ఎన్ పేట: శ్రీకాకుళం జిల్లాలో రూ.70 వేలకు ఓ మగ శిశువు విక్రయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఎల్ఎన్ పేట మండలం బొరమాంబాపురం గ్రామానికి చెందిన కె.సింహాద్రి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు కావాలన్న ఆశతో వారు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన దంపతులను ఆశ్రయించారు. దీంతో వారు తమ రెండు నెలల మగ శిశువును సింహాద్రి, లక్ష్మి దంపతులకు రూ.70వేలకు విక్రయించేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం బొరమాంబాపురంలో పెద్దల సమక్షంలో ఇరువైపుల వారు పత్రాలు రాసుకున్న అనంతరం, శిశువును సింహాద్రి, లక్ష్మికి అప్పగించారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
మేకలను మింగిన ఖాకీలు
-
పోలీసులే దొంగలుగా మారారు...
-
పిల్లలను అమ్మేసిన సవతితల్లి
-
బిడ్డలను అమ్ముకున్న అన్నదాత
-
పచ్చనోట్లకి దాసోహమైన పచ్చపార్టీ
-
ఆడపిల్లను అమ్ముతూ దొరికిపోయిన బ్రోకర్
-
అద్దెకిచ్చిన లారీని అమ్మేశాడు
రంగారెడ్డి(మేడ్చల్): ఓ ప్రబుద్ధుడు అద్దెకు ఇచ్చిన లారీని యజమానికి తెలియకుండా అమ్మేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... మేడ్చల్ పరిధిలోని గిర్మాపూర్కు చెందిన వంగేటి రాజిరెడ్డి తన లారీని అదే గ్రామానికి చెందిన రఘురాంరెడ్డికి ఆరు నెలల క్రితం అద్దెకు ఇచ్చాడు. ఇటీవల రఘురాంరెడ్డి రాజిరెడ్డికి తెలియకుండా లారీని అమ్మేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ తెలిపారు. -
'అమ్మ.. నన్ను పిన్నికి అమ్మేసింది'
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... నిదుర తెరలు మెల్లగా తొలగుతున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు ఎక్కడి నుంచో సూటిగా వచ్చి నా ముఖమ్మీద పడుతున్నాయి. నన్ను లేపే ప్రయత్నం చేస్తున్నాయి. బాగా తెల్లవారిపోయినట్టుంది అనుకుంటూ లేవబోయాను. కానీ లేవలేకపోయాను. కనురెప్పలు భారంగా ఉన్నాయి. తెరవాలని ప్రయత్నించినా తెరచుకోన ని మారాం చేస్తున్నాయి. ఎందుకిలా ఉంది? ఏమీ అర్థం కావడం లేదు. నా శరీరం నా వశంలో లేదనిపిస్తోంది. నేనా అవస్థను జయించే ప్రయత్నంలో ఉండగానే మెల్లగా ఓ పిలుపు నా చెవిన పడింది... సాధనా! ఎవరో పిలుస్తున్నారు. ఆ స్వరం ఎప్పుడూ విన్నది కాదు. నాకు పరిచయమున్నదీ కాదు. మరి ఆ వ్యక్తి ఎవరు? నన్ను అంత అనునయంగా ఎందుకు పిలుస్తున్నాడు? ఎలాగో తంటాలుపడి బరువెక్కిన కనురెప్పల్ని బలవంతంగా తెరిచాను. అంతా మసక మసకగా ఉంది. క్షణం తర్వాత కళ్లముందు దృశ్యం స్పష్టమయ్యింది. ఓ వ్యక్తి నా పక్కన నిలబడి నా ముఖంలోకే చూస్తున్నాడు. చప్పున లేవబోయాను. చేతికి ఏదో చురుక్కున గుచ్చుకుంది. చూస్తే సూది. నా చేతికి సెలైన్ ఎక్కుతోంది. ఒళ్లంతా కూడా ఏవో వైర్లు అమర్చి ఉన్నాయి. అంటే నేను... నేను హాస్పిటల్లో ఉన్నానా?! ఎదురుగా ఉన్నది డాక్టరా? దుఃఖం తన్నుకొచ్చింది. కళ్లగుండా పొంగుకొచ్చింది. ఆపుకోలేక భోరుమన్నాను. డాక్టర్ కంగారుపడ్డాడు. ‘భయపడకమ్మా... ఇక నీ ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు’ అన్నాడు. అంత ఏడుపులోనూ నవ్వొచ్చింది. ప్రాణాలకు ప్రమాదం లేదా? అంటే నేను చచ్చిపోతానేమోనని భయంతో ఏడుస్తున్నానని అనుకుంటున్నాడా? అవునులే. ఆయనకెలా తెలుస్తుంది! నేను చావు అంచుల దాకా వెళ్లినందుకు కాదు... వెళ్లి తిరిగొచ్చేసినందుకు బాధపడుతున్నాని. బతుకు అంతమైపోబోయినందుకు కాదు.... మళ్లీ బతకాలా అన్న భయంతో ఏడుస్తున్నానని! చావు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు కానీ అంతకన్నా భయంకరమైనదొకటుంది. అదేమిటో తెలుసా? బతకడం. అవును. చావడం కంటే బతకడమే కష్టం. అందులోనూ జీవచ్ఛవంలా బతుకు సాగించడం ఇంకా కష్టం. అనుక్షణం నరకం అనుభవిస్తూ, గుండె చిక్కబట్టుకుని జీవించడం ఎంతో ఎంతో కష్టం. అది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి నాకెలా తెలిసిందనా? నేను అనుభవించాను కాబట్టి. కొండంత బాధను గుండెల్లో దాచుకుని... అర్థం చేసుకునేవారు లేక, ఆదుకునేవారు కానరాక కుళ్లి కుళ్లి ఏడ్చాను కాబట్టి! ‘లక్ష్మి పిన్నికి ఒంట్లో బాలేదు కదా! నువ్వు కొన్ని రోజులు తనకి సాయంగా ఉండు. నేను నాలుగు రోజులు పోయాక వచ్చి నిన్ను తీసుకెళ్తాను.’ అమ్మ అలా అనగానే ఎక్కడ లేని సంతోషం వేసింది నాకు. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. సెలవులు ఎలా గడపాలా అనుకుంటుంటే... తన స్నేహితురాలు లక్ష్మికి ఒంట్లో బాలేదు, చూడ్డానికి వెళ్లాలి అంది అమ్మ. హుషారొచ్చేసింది నాకు. ఎప్పుడూ బడి, ఇంట్లో అమ్మకి బట్టలు కుట్టడంలో సాయం చేయడం... ఇదే పని. ఇన్నాళ్లకి సరదాగా గడిపే చాన్స్ వచ్చింది. అందుకే ఆనందంగా అమ్మతో పాటు బయలుదేరాను. కానీ ఇప్పుడేమో అమ్మ నన్ను ఇక్కడే ఉండమంటోంది. లక్ష్మి పిన్ని నన్ను బాగానే చూస్తుంది కానీ, అమ్మని వదిలిపెట్టి నేనెప్పుడూ ఉండలేదు. అందుకే బెంగనిపించింది. కానీ నాలుగు రోజులే కదా అని సరే అన్నాను. కానీ అలా అనడం ఎంత తప్పో అప్పుడు నాకు తెలియలేదు. రెండు రోజులు సంతోషంగా గడిచిపోయాయి. పిన్నికి పనుల్లో సాయపడుతూ.. టీవీ చూస్తూ.. మంచి మంచి మిఠాయిలు తింటూ ఎంజాయ్ చేశాను. కానీ మూడో రోజు అన్నీ మారిపోయాయి. ఆ రాత్రి నేను నిద్రపోతుంటే... ఉన్నట్టుండి నా ఒంటిమీద ఓ చేయి పడింది. పిన్ని అనుకున్నాను. కానీ కాదు. ఆ చేయి పిన్నిది కాదు. అది నన్ను ఎక్కడెక్కడో తడుముతోంది. తాకరాని చోటల్లా తాకుతోంది. నాకు కంపరంగా ఉంది. అసహ్యంగా ఉంది. నరాలకు నిప్పు సోకినట్టు బాధగా ఉంది. భరించలేకపోయాను. సహించలేకపోయాను. చప్పున లేచి కూర్చున్నాను. చీకట్లో ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి కెవ్వున కేక పెట్టాను. అంతే... ఆ చేయి నా నోరు మూసింది. నన్ను బలంగా తోసింది. ఆ ఆకారం నా తనువును బలవంతంగా ఆక్రమించుకుంది. నా బతుకును క్షణాల్లో బుగ్గిపాలు చేసి వెళ్లిపోయింది. భయంతో కంపించిపోయాను. పిన్ని దగ్గరకు పరుగు తీశాను. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగినదంతా చెప్పాను. ఆమె కంగారుపడుతుందనుకున్నాను. నన్ను ఓదారుస్తుందనుకున్నాను. కానీ అలా చేయలేదు. పైగా ఊహించని ఒక మాట అంది. ఆ మాట నన్ను నిలువెల్లా వణికించింది. ‘ఏం కాలేదు. వెళ్లి స్నానం చేసి పడుకో. అనవసరంగా అరిచి గోల చేయకు’. ఏమంటోంది పిన్ని! ఎవడో నా జీవితాన్ని పాడు చేశాడు. వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు.. ఏమీ తెలుసుకోదా! పైగా వెళ్లి పడుకోమంటుందేంటి! అదే అడిగాను. కానీ ఆమె మాట్లాడలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడలేదు. రోజుకొక కొత్తఆకారం వచ్చి చీకటిలో నా తనువును నలిపేస్తున్నా ఆమె మాట్లాడలేదు. మా అమ్మ దగ్గరకు పంపించెయ్యి అని నేను కాళ్లు పట్టుకుని ఏడ్చినా మాట్లాడలేదు. అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోతుంటే కనికరంతో అయినా మాట్లాడలేదు. కానీ ఓ రోజు ఫోన్లో మాత్రం ఎవరితోనో మాట్లాడింది. అప్పుడే తెలిసింది అసలు నిజం. మా అమ్మ నన్ను పిన్నికి యాభై వేలకు అమ్మేసిందన్న వాస్తవం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నాతో వ్యాపారం చేసేందుకే పిన్ని కొనుక్కుందన్న కఠోర సత్యం నాకు బతుకు మీద ఆశను చంపేసింది. కన్నతల్లే నాకు వెల కట్టింది. కొనుక్కున్న మనిషి రోజుకో కామాంధుడికి కానుకగా నన్ను అందిస్తోంది. నా మానాన్ని, అభిమానాన్ని అమ్మి కాసులు కూడగట్టుకుంటోంది. నా వల్ల కాలేదు. నాకిక భరించే శక్తి లేదు. అందుకే చావాలనుకున్నాను. ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ కన్నతల్లికే లేని కనికరం నాకెందుకనుకుందో ఏమో... మృత్యుదేవత కూడా ముఖం తిప్పుకు పోయింది. నన్ను తెచ్చి ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయిన పిన్ని, మూడు రోజులైనా నన్ను చూడ్డానికి రాలేదు. నా కథ తెలుసుకున్న డాక్టర్ పోలీసుల్ని పిలిచాడు. వాళ్లు వచ్చి నా జీవితాన్ని కాలరాసినవాళ్ల మీద కేసు రాసుకున్నారు. కటకటాల్లోకి తోశారు. నన్ను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఇక్కడ నేను సురక్షితంగానే ఉన్నాను. సంతోషంగా మాత్రం లేను. ఇప్పటికీ నన్నొక ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఓ కన్నతల్లి పాపిష్టి సొమ్ము కోసం తన కూతుర్ని పాపపు రొంపిలోకి ఎలా దించుతుంది? తన స్వార్థానికి సొంత బిడ్డను ఎలా బలి చేయగలుగుతుంది? అలా చేయగలిగింది అంటే అమ్మ అనే మాటకు అర్థమేముంది?! - సాధన (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి -
రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్
-
‘మత్తు' దందా
ముత్తుకూరు: మత్తు పుట్టించే మందులు, మాత్రల విక్రయాలు ముత్తుకూరులో కాస్త అటూఇటూగా మద్యంతో పోటీపడుతున్నాయి. కొందరు ఆర్ఎంపీల సహకారంతో మందుల షాపుల్లో వీటిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అక్రమ మార్గంలో భారీగా సంపాదిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముత్తుకూరు ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్టు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లోని పలు విభాగాల్లో వందలాది మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా బీహార్, ఒడిశా, జార్ఖండ్కు చెందిన యువకులు షిఫ్టుల వారీగా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిర్వర్తిస్తున్నారు. శరీర కష్టం తెలియకుండా ఉండేందుకు వీరిలో అనేక మంది మత్తు మందుకు అలవాటుపడ్డారు. అయితే మద్యం సేవించి పనులకు వెళితే కాంట్రాక్టర్లు, సూపర్వైజర్ల నుంచి ఇబ్బందులు తప్పవు. దీంతో మత్తునిచ్చే దగ్గుమందు, బీపీ మాత్రలను ఎంచుకుంటున్నారు. స్థానికంగా కొన్ని మందుల దుకాణాలు, పలువురు ఆర్ఎంపీలు వీరికి కల్పతరువయ్యారు. ఇష్టారాజ్యంగా విక్రయాలు పలు రాష్ట్రాల్లో నిషేధించిన ‘కోరెక్స్’, ‘ఫెన్సిడెల్’ దగ్గు మందులో మత్తు కలిసివుంటుంది. ఒక సీసా మందు తాగితే కావాల్సినంత మత్తు లభిస్తుంది. జేబులో ఇమిడిపోయే వీటిని కొనుగోలు చేసి, దర్జాగా పనుల్లోకి వెళ్తున్నారు. సాధారణంగా వీటి ఖరీదు రూ. 80-90లైతే ఇక్కడ రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ‘ఆల్ప్రోజర్-0.5’ మాత్రలు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి రాసిస్తారు. వీటిల్లో కూడా మత్తు ఉండడంతో అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వైద్యపరిభాషలో వీటిని ‘క్యాటగిరి హెచ్ డ్రగ్స్’ అంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లు రాసిస్తేనే మందుల దుకాణాలు అమ్మకాలు చేయాలి. పరిమితి సంఖ్యలోనే స్టాకు ఉంచుకోవాలి. అయితే కొందరు ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వీటిని రాసేస్తున్నారు. చీటీలు లేకున్నా కొన్ని దుకాణాలు వేల సంఖ్యలో వీటిని అమ్మకాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ విక్రయాలపై పలువురు ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించకుండానే మందుల దుకాణాల వారి వద్ద మామూళ్లు పుచ్చుకుని వెళ్లారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ ముత్తుకూరు ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసే వారు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జబ్బులు త్వరగా నయం చేశామని రోగుల ఆదరణ చూరగొనేందుకు కొందరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స్ కలిసిన మందులను సిఫార్సు చేస్తున్నారు. యాంటిబయాటిక్స్తో పాటు స్టెరాయిడ్స్ కలిగిన ‘సిలిస్ట్రైన్’, ‘ప్రిడ్నిసెల్’ మాత్రలను వాడాలని సూచిస్తున్నారు. అధిక డోసు కలిగిన మందులు ఐదారు రకాలు రాసి, తమకు అనుకూలమైన మందుల షాపులకు ఆదాయం కల్పిస్తున్నారు. అక్షరజ్ఞానం లేని కార్మికులు, గత్యంతరం లేని రోగుల నుంచి ఫీజులు, మందుల రూపంలో వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. పలు మార్లు ఫిర్యాదు చేశాం: రాకేష్కుమార్, ఎంబీబీఎస్, ముత్తుకూరు. గుర్తింపు పొందిన వైద్యులు రాసిన చీటీలు లేకుండా క్యాటగిరి హెచ్ డ్రగ్స్ను పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. గుర్తింపులేని కొందరు వైద్యులు విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ కలిసిన మందులు రాస్తున్నారు. అసలు జబ్బులు ఎలా ఉన్నా వీటి వల్ల అపాయకరమైన జబ్బులు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై పలు మార్లు ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా, ఎటువంటి మార్పు రాలేదు. గతంలో తనిఖీలు చేశాం: శ్రీరామమూర్తి, డ్రగ్ ఇన్స్పెక్టర్ ముత్తుకూరులో మత్తు కలిసిన దగ్గు మందులు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. తనిఖీలు కూడా చేశాము. వాస్తవానికి ముత్తుకూరు ప్రాంతం మా పరిధిలోకి రాదు. గూడూరు డ్రగ్ ఇన్స్పెక్టర్కు చెప్పి, తనిఖీలు చేయిస్తాము. (గూడూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ 73829 34368 నంబర్కు కాల్ చేయగా, ప్రభుత్వం బిల్లు చెల్లించని కారణంగా ఫోన్ పనిచేయలేదు) -
ఐఎన్ఎస్-విక్రాంత్ వీడ్కోలుకు భారీ ఏర్పాట్లు
సాక్షి, ముంబై: వేలం పాటలో అమ్ముడైన ఐఎన్ఎస్-విక్రాంత్ యుద్ధనౌకకు తుది వీడ్కోలు పలికేందుకు ముంబైలో నేవీ దళం భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ నౌక అందించిన సేవలు చిరస్మరణీయం కావడంతో భారీ ఏర్పాట్ల మధ్య సాగనంపాలని సిబ్బంది నిర్ణయించారు. కాలం చెల్లిన విక్రాంత్ను రూ.63 కోట్లకు కొనుగోలు చేసిన ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 రోజుల్లోపు ముంబై బందర్ నుంచి భావ్నగర్కు తరలించనుంది. ఆ తర్వాత దీన్ని ముక్కలుముక్కలుగా చేయనుంది. ఈ నౌక అందించిన సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండిపోవాలనే ఉద్ధేశంతో దీని స్థానంలో మరో విక్రాంత్ యుద్ధనౌకను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావించింది. ప్రస్తుతం ఈ యుద్ధనౌకను కొచ్చిన్ షిప్ యార్డులో తయారుచేస్తోంది. 2018 సంవత్సరంలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయని నేవీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ యుద్ధనౌక విక్రాంత్ కంటే కొంత పొడవు, వెడల్పు ఎక్కువే ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధం కోసం అవసరమయ్యే సామగ్రి నిల్వ చేసేందుకు తగిన స్థలం ఉండనుంది. 12 మికోయాన్, మిగ్-29, ఎనిమిది తేజస్ హెలికాప్టర్లు, 10 కొమావ్ వెస్ట్ల్యాండ్ సోకింగ్ హెలికాప్టర్, ధ్రువ హెలికాప్టర్లు పార్కింగ్ చేసేందుకు డెక్పై వీలుంటుందని నేవీ దళ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాత విక్రాంత్ లేని లోటును నాలుగేళ్లలో అందుబాటులోకి రానున్న కొత్త యుద్ధనౌక తీర్చనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.