బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే? | Jubilee Hills Police Given Notices To Bigg Boss Organizers Over Violence Happened On Grand Finale Day - Sakshi

Notices To Bigg Boss Organizers: బిగ్ బాస్ నిర్వాహకులకు షాకిచ్చిన పోలీసులు!

Dec 25 2023 9:30 PM | Updated on Dec 28 2023 7:19 PM

Jubilee Hills Police Given Notices To Bigg Boss Organizers about Incident - Sakshi

పల్లవి ప్రశాంత్‌ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత  అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 

తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement