Pallavi Prashanth
-
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్తో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
బిగ్బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా!
రైతు బిడ్డ ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్బాస్ సీజన్-7 విన్నర్గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్బాస్ విన్నర్గా స్టార్గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9— Starmaa (@StarMaa) October 15, 2024 -
ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్బాస్ 1బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్బాస్ 2బిగ్బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్బాస్కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్బాస్ 5బిగ్బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్ఫామ్ అని భావించాడు. బిగ్బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్బాస్ విన్నర్ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్బాస్ నాన్స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్గా పోరాడి బిగ్బాస్ నాన్స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్బాస్ ఏడో సీజన్కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
రాజకీయాల్లోకి రైతుబిడ్డ? అందుకే అలా..
రైతుబిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్.. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఏడో సీజన్లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్కు విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే! అయితే షో అయిపోయిన తర్వాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాజాగా ఇతడు బిగ్బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్కు హాజరయ్యాడు. దేవుడే దిక్కు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. 'మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను.. అందుకే మీముందు ఇలా నిలబడ్డాను. మీ ఆశీస్సులు ఉంటే.. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను, వెనక్కు వెళ్లను.. ఇలాగే నిలబడతాను. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు' అని చెప్పాడు. ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా.. 'మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్ను కాలితో తన్నుతూ, కొడుతూ.. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
ప్రశాంత్కు ఇబ్బందిగా మారిన 'బిగ్బాస్' ప్రైజ్ మనీ.. వాళ్లను మోసం చేశాడా?
బిగ్బాస్ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్లైన్తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రశాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్ అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బిగ్బాస్ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్ ఓపెనింగ్స్కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్.. రైతులకు తన ప్రైజ్ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు. వాస్తవంగా అమర్దీప్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్లైన్ ప్రశాంత్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రియాక్షన్ తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్కు వచ్చేది ఎంత బిగ్బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్కు బిగ్బాస్ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క!
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష).. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్బాస్ హౌస్లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది. అప్పుడు ప్రశాంత్కు సపోర్ట్ ప్రశాంత్.. బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. యూట్యూబ్లో పెళ్లి చేశారు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'నేను బిగ్బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ చేయలేదు. అలాంటిది.. నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? విజయకాంత్ కోసం ఆ పని చేస్తానని వాగ్ధానం.. అది గుర్తుపెట్టుకుని.. -
బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ని ఇందులో స్కిట్గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
బిగ్బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
బిగ్ బాస్ అమర్పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్లో కొందరు యావర్తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్లో ప్రశాంత్ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె. హీరోగా సినిమా ఛాన్సులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాడు. బిగ్బాస్కు వెళ్లకపోయినా బాగుండు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్బాస్కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్రౌండర్గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆసక్తికర ట్వీట్ చేసిన ఉపాసన.. భర్తపై ఎంత ప్రేమో.. -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్తో బిగ్బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్షైన్కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్తో 'బిగ్బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
బిగ్బాస్ గొడవలో మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: బిగ్బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా సరూర్నగర్కు చెందిన హరినాథ్రెడ్డి, యూసుఫ్గూడలకు చెందిన ఎం. సుధాకర్లను ఆదివారం రిమాండ్కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్బాస్ షోలో కామన్మ్యాన్ అనే ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్గానే ప్రశాంత్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్స్టాగ్రామ్లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్ను 1 మిలియన్కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్కు అండగా నిలబడిన భోలే చంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్బాస్ విన్నర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
పల్లవి ప్రశాంత్ బెయిల్ పై హైకోర్టులో కీలక వాదనలు
-
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
ప్రశాంత్ అమాయకుడు.. అసలు జైల్లో వేయడమేంటి?: అశ్విని ఎమోషనల్
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ చేసిన హంగామాతో అమర్దీప్, అశ్విని, గీతూరాయల్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. (ఇది చదవండి: భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మరో కంటెస్టెంట్ అశ్విని స్పందించారు. పల్లవి ప్రశాంత్ అమాయకుడని అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్బాస్ టైటిల్ గెలిచిన సంతోషం లేకుండా చేశారని అన్నారు. నాకు ప్రశాంత్ తమ్ముడిలాంటి వాడు.. అతను త్వరలోనే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్లు అశ్విని బాధపడ్డారు. అది ఫ్యాన్స్ చేసిన తప్పే కానీ.. ప్రశాంత్ అలాంటివాడు కాదని తెలంగాణ పోలీసులను కోరింది. అశ్విని మాట్లాడుతూ.. 'పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదండి. ఓ కామన్ మ్యాన్గా వచ్చి ట్రోఫీ గెలిచాడు. పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి. అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ప్రశాంత్ చాలా అమాయకుడు, మంచి వ్యక్తి కూడా. కప్ గెలిచి ఒక్కరోజు కూడా కాలేదు. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్కు సపోర్ట్ చేయండి. అది అతని తప్పుకాదని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్నా' అంటూ ప్రశాంత్కు మద్దతుగా నిలిచారు. కాగా.. స్టూడియో బయట జరిగిన గొడవలో అశ్విని కారు అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!) -
రైతుబిడ్డకు గెలిచినా ఆనందం లేకుండా చేశారు: ప్రశాంత్ తండ్రి ఆవేదన
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!) అరెస్ట్పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!) -
పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిదంటే... అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు నిరాశ.. తీర్పు వాయిదా
బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్టూడియో నుంచి వెళ్లిపోమని చెప్పినా వినకుండా తిరిగి స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అతడి అభిమానులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడంటూ ప్రశాంత్ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ప్రశాంత్.. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్కు బెయిల్ వస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
రైతుబిడ్డకంత నాలెడ్జ్ లేదు..
-
నా పాట, అతడి ఆట జైలుపాలైంది.. ఏడ్చేసిన భోలె షావళి
బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. జనం కోసం ఆడాలి.. 'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి వరకు తీసుకెళ్లండి. ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
మీరు చేస్తుంది తప్పు...
-
నాకేదైనా అయితే ఆ ఐదుగురే కారణం.. వీడియోలున్నాయ్!
ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా అందరినీ వెనక్కు నెట్టి బిగ్బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. పోలీసుల మాటలు బేఖాతరు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమన్నారు పోలీసులు. ఇతడు మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. కావాలనే నెగెటివ్ చేస్తున్నారు అయితే తాను అరెస్ట్ అవడానికి ముందు ప్రశాంత్.. అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత! పోలీసులు చెప్పారు, కానీ.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్ అయిన. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా? అనుకున్నాను. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను. వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగొణ ధ్వనుల మధ్య నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. చదవండి: పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు మనోహర్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్)/ గజ్వేల్: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ఏ–1, ఏ–2 నిందితులుగా ఉన్న బిగ్బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అర్ధరాత్రి తర్వాత న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్ఎస్ఐ మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు. అందులో సాయికిరణ్, రాజులను ఈనెల 19న అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్ ఇంటివద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 17న బిగ్బాస్ సీజన్ –7 ఫైనల్స్లో భాగంగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అశ్వినీ కార్లను, ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లలేదు: ప్రశాంత్ తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్ స్పష్టం చేశారు. అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని, దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. -
బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
-
Pallavi Prashanth Arrest: బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్!
బిగ్బాస్ విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్కు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అభిమానులపై కూడా పోలీసులు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా.. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్న ప్రశాంత్ లాయర్ బిగ్బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో మాట్లాడారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా.. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ప్రశాంత్ లాయర్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు. అయితే తాజాగా బిగ్బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు. సాక్షితో బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'ఇంట్లోనే ఉన్నా.. నేను ఎక్కడికి పారిపోలేదు. కావాలనే కొందరు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చర్యలను ఖండిస్తున్నా. నా గెలుపు రైతుల విజయం. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పై వస్తున్నా తప్పుడు వార్తలతో కలత చెందా. జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా. రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా. హౌస్లో శివాజీ అన్న నాకు అండగా ఉన్నారు. నాగార్జున ,శివాజీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.' అని అన్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్కుమార్ తెలిపారు. -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాప్.. కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు
సాక్షి, గజ్వేల్: కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ అన్నారు. మంగళవారం ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నా...ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. ఆరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ విజేతగా నిలవడం ఇష్టంలేని కొన్ని శక్తులు నగరంలో జరిగిన సంఘటనలకు కారణమన్న అనుమానం నెలకొందన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్ట ప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుపడబోమని, కానీ ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లయితే వెంటనే పోలీసుశాఖ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి..ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు కంటతడి.. తమ కొడుకుపై కక్షసాధిస్తున్నారని విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడిపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్ ఎంతోకష్టడి చివరకు తానూ అనుకున్నదని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని వారు కోరారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
పరారీలో పల్లవి ప్రశాంత్!
-
బిగ్ బాస్కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్లోని ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్కు ముందు ప్రశాంత్ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
పరారీలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్కు కారకుడైన బిగ్బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్దీప్ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
సంతోషం లేకుండా చేశారు !
-
అన్నం కూడా తిననియలే.. నాకు చాలా బాధగా ఉంది: ప్రశాంత్
ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్బాస్ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా. నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు. -
పల్లవి ప్రశాంత్పై కేసు.. ప్రిన్స్ యావర్ రియాక్షన్ ఇదే!
ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్గా ముగిసింది. గతేడాది కంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. అయితే ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో కంటెస్టెంట్ ఎవరంటే మాత్రం అతని పేరే చెబుతారు. వచ్చి, రానీ తెలుగుభాషతో టాప్-5 నిలిచాడంటే మామూలు విషయం కాదు. అతను మరెవరో కాదు ప్రిన్స్ యావర్. ఈ షో ముగిసిన తర్వాత యావర్ తొలిసారి మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవ, కేసులపై యావర్ స్పందించారు. ఇంతకీ అతను ఏమన్నాడో తెలుసుకుందాం. యావర్ మాట్లాడుతూ..'బిగ్బాస్లో ఎవరి గేమ్ వాళ్లు ఆడారు. ఎవరి మైండ్ గేమ్ వారిది. పల్లవి ప్రశాంత్ నాకు బ్రదర్లాంటివాడు. అతనికి అభినందనలు. అతను ఎప్పుడు ఇలాగే రైతులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను కేవలం నా ఆటపైనే ఫోకస్ చేశా. గేమ్లో ఎలా గెలవాలని ఆలోచించా' అని అన్నారు. పల్లవి ప్రశాంత్ కేసుపై మాట్లాడుతూ..' సారీ ఈ విషయం నాకు తెలియదు. మీరు చెబితేనే నాకు తెలిసింది. కచ్చితంగా ఫీలవుతున్నా. ప్రశాంత్ మంచి మనిషి. అయితే కేసు విషయం గురించి నాకేమీ తెలియదు. మూడో రోజుల నుంచి నిద్రపోతున్నా. బిగ్బాస్ అనేది ముగిసిన అధ్యాయం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. అదంతా కేవలం ఒక గేమ్ మాత్రమే. అందరూ బాగా ఆడారు. నా ఫ్యాన్స్ అందరికీ నేను రుణపడి ఉంటా. త్వరలోనే వాళ్లను కలుస్తా. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా.' అని వెల్లడించారు. కాగా.. ఈ సీజన్లో టాప్-4లో నిలిచిన ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. -
బిగ్బాస్కు ఎందుకు వచ్చానంటే?.. రైతు బిడ్డ సమాధానం ఇదే!
రైతుబిడ్డగా బిగ్బాస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్కు బిగ్బాస్కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్బాస్పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. బిగ్బాస్ హౌస్లో ఇచ్చిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్లో నాకు తెలిసిందే కూకట్పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్బాస్కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్లో అడుగుపెట్టా.' అని అన్నారు. రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు. -
నాకేమైనా సీఎం పదవి ఇచ్చిర్రా?: పల్లవి ప్రశాంత్!
కామన్ మ్యాన్ టైటిల్ ఎగరేసుకుపోవడం బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి! ఇంతవరకు తెలుగులో కామన్ మ్యాన్ రన్నరప్ వరకు కూడా వచ్చిందే లేదు. అలాంటిది రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పేరు చానా ఏండ్లు యాదుండేలా బిగ్బాస్ 7 టైటిల్ సాధించేశాడు. జనాలు టాస్కులు ఒక్కటే చూడరు.. వారి మాటతీరు, ప్రవర్తననే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. వినయం, విధేయత ఎక్కడ? అలా ప్రశాంత్ వినయ, విధేయత చాలామందిని కట్టిపడేసింది. పొగడ్తలకు ఉప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చటపడ్డారు, గెలిపించారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది.. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదే! ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. 'మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..' అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 15 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి అండగా నిలిచారా? అని ఓ యాంకర్ అడిగాడు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ.. 'నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా' అని వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఫ్రెండ్స్ను సైతం లెక్కచేయట్లేదా? ఈ ప్రవర్తనను బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. 'ప్రశాంత్.. 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు' అని మండిపడ్డాడు. రైతులకు ఏం చేస్తారో చెప్తేనే ఇంటర్వ్యూలు ఇస్తానన్న వీడియోను షేర్ చేస్తూ.. బిగ్బాస్కు వెళ్లేముందు ఇంటర్వ్యూలు ఇచ్చావుగా.. అప్పుడు లేని కండీషన్స్ ఇప్పుడెందుకు? ఆరోజు రైతుకి ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదు? అని వరుస ప్రశ్నలు అడిగాడు. ఇన్నాళ్లూ మాస్క్ వేసుకున్నాడా? మరోవైపు గ్రాండ్ ఫినాలే రోజు స్టూడియో బయట గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే! అమర్, గీతూ, అశ్విని కారు అద్దాలతో పాటు అక్కడి బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. శాంతి భద్రతల సమస్య కారణంగా వెళ్లిపోమని పోలీసులు చెప్తుంటే.. ప్రశాంత్ అది అర్థం చేసుకోకుండా పోలీసులు రైతుబిడ్డకు విలువ ఇవ్వడం లేదంటూ వీడియో తీశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు.. ప్రశాంత్ ఇన్నాళ్లూ బిగ్బాస్ హౌస్లో మాస్క్ వేసుకునే ఉన్నాడు, బిగ్బాస్కు రాకముందు ప్రశాంత్ ఏమైనా రైతులకు సాయం చేశాడా? లేదు కదా.. ఎందుకింత పొగరుగా వ్యవహరించడం? యాటిట్యూడ్, తలపొగరు చూపించకుండా సమాధానాలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. #BiggBossTelugu7 is immature or arrogance #PallaviPrashanth. Omg he just lost the plot pic.twitter.com/pu53KsS8a4— telugu guy (@nthony_venky) December 19, 2023 చదవండి: 35 ఏళ్ల వయసులోనూ స్లిమ్గా.. అరడజను సినిమాలతో ఫుల్ బిజీ.. -
స్వగ్రామానికి చేరుకున్న రైతుబిడ్డ.. పూలవర్షం కురిపించిన అభిమానులు!
సామాన్య రైతుబిడ్డగా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. వంద రోజులకు పైగా సాగిన తెలుగువారి బిగ్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7 ట్రోఫీని ముద్దాడారు. రైతుబిడ్డ అన్న సింపతి వర్కవుట్ అయినా.. తనలో ఉన్న టాలెంట్ను బయటకు తీశాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మరో కంటెస్టెంట్ అమర్దీప్తో పోటీపడి టైటిల్ సాధించాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. బిగ్బాస్ విన్నర్గా నిలిచిన రైతుబిడ్డ తన సొంత ఊరికి చేరుకున్నాడు. స్వగ్రామానికి చేరుకున్న ప్రశాంత్కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనిపై పూలవర్షం కురిపించారు. కారులో టాప్పై నిలిచి ఉన్న ప్రశాంత్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. రోడ్డు వెంట వందలాది మంది ఫ్యాన్స్ మధ్య ర్యాలీ నిర్వహించారు. టైటిల్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. డీజే స్టెప్పులతో ఊగిపోతూ సిద్దిపేట జిల్లాలోని కోల్గురు చేరుకున్నారు. రోడ్డు వెంట జనసందోహం నడుమ బిగ్ బాస్ విన్నర్ తన సొంతూర్లో అడుగుపెట్టారు. అయితే ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ హంగామా చేశారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం కాస్తా కేసుల వరకు వెళ్లింది. అభిమానుల శృతిమించి అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. -
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో ఉండగానే ప్రశాంత్ను విన్నర్ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్దీప్ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో లేకపోతే యావర్, ప్రశాంత్ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
Bigg Boss 7 Contestants Pics: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ విన్నెర్స్ ఫోటోలు
-
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత
-
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ సూపర్ హిట్టయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా అవతరించాడు. ఇతడి గెలుపుకు సింపతీ కూడా ఓ కారణమే! మొదటి నుంచి అతడిని రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. జనాలు సైతం తమలో ఒకడు ప్రశాంత్ అంటూ అతడికి బాగా కనెక్ట్ అయ్యారు. నిన్న(డిసెంబర్ 17న) అన్నపూర్ణ స్టూడియోలో బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అమర్దీప్ను ఓడిస్తూ విజేతగా అవతరించాడు ప్రశాంత్. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి తిరుగుపమయనమయ్యారు. స్టూడియో వెలుపల గందరగోళం వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అమర్దీప్.. తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొన్ని అల్లరి మూకలు గీతూ రాయల్, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బస్సు అద్దాలపైనా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. వెళ్లిపోమన్నందుకు పోలీసులపై అసహనం ప్రశాంత్ రూఫ్ టాప్ ద్వారా కారులో నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని చెప్పారు. అలాగే కారు కూడా ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనయ్యాడు. 'అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు' అని ఆగ్రహించాడు. 'పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతుబిడ్డ అన్నా.. నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..' అంటూ ఆగ్రహించాడు. పోలీసులను వీడియో తీయ్.. అంటూ ఆర్డర్స్ తనను బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. 'ఈ రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచేశావ్.. దాన్ని ఇంకా వదిలిపెట్టవా' అని కామెంట్లు చేస్తున్నారు. 'శాంతి భద్రతల కోసం పోలీసులు వెళ్లిపోమంటే అది కూడా తలకెక్కడం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️ Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6 — ✯ (@sagatuXuser) December 17, 2023 చదవండి: బిగ్బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
‘ఇదేం అభిమానం!’ బిగ్బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్కు అభిమాని ఊహించని గిఫ్ట్!
బిగ్బాస్ షోకి వెళ్తావా? నిన్నెవడు తీసుకుంటాడ్రా?.. అసలు స్టూడియో లోపలైనా అడుగుపెట్టగలవా? నీకంత సీన్ లేదులే.. పగటి కలలు కనకు.. ఇలా నానామాటలు అన్నారు.. ఎవరెంత హేళన చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్సయ్యాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. అతడిలోని కసిని బిగ్బాస్ టీమ్ గుర్తించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డను బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోకి తీసుకొచ్చింది. వైల్డ్గా ఆడాడు.. గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరూ ప్రశాంత్ అంత ప్రభావం చూపలేకపోయారు. ఓటమికి ఛాన్సే ఇవ్వకూడదన్న చందంగా గెలుపు కోసం విజృంభించి ఆడాడు. తన కోపాన్ని, కసినంతా ఆటలో చూపించాడే కానీ అవతలి వారిపై చూపించలేదు. నామినేషన్స్లో ఎంత వైల్డ్గా రియాక్ట్ అయినా తర్వాత మాత్రం ఎటువంటి రాగద్వేషాలు మనసులో పెట్టుకోకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. తనకు సాయం చేసినవారిని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు. సాయం చేయనివారికి సైతం అవకాశం వచ్చినప్పుడు వారివైపు నిలబడ్డాడు. రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇతడి నిష్కల్మమైన మనసు చూసి జనాలు ఓట్లు గుద్దారు. ఫలితంగా ప్రశాంత్ బిగ్బాస్ 7 విజేతగా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. యాదగిరిగుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. యాదగిరి గుట్టకు సమీపంలోని వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు. ప్రశాంత్కు భారీగానే ముట్టాయి త్వరలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపాడు. ఇది తెలిసిన జనాలు రైతుబిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్కు ప్రైజ్మనీ ద్వారా రూ.35 లక్షలు, పారితోషికం ద్వారా రూ.15 లక్షలు ముట్టాయి. ఇందులో సగం ట్యాక్స్ల రూపేణా ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదు కాకుండా అతడు కాస్ట్లీ కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకోవడం విశేషం. చదవండి: బిగ్బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. బిగ్బాస్ చాణక్యకు తగిన శాస్తి.. మాస్టర్ మైండ్ అని చెప్పి చివరకేమో అలా! -
అమర్ దీప్ కారుపై దాడి, పోలీసుల లాఠీఛార్జ్
-
Bigg Boss 7: రైతుబిడ్డ విజయానికి ప్రధాన కారణాలు ఇవే!
పల్లవి ప్రశాంత్.. బిగ్బాస్ షోకు రావడానికి ముందు సోషల్ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్బాస్ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి? చెప్పులరిగేలా తిరిగాడు 'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్.. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) గెలుపే అంతిమ లక్ష్యంగా.. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నామినేషన్స్లో మాత్రం.. షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్గా ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్ను అని హౌస్మేట్స్కు గుర్తు చేశాడు. నామినేషన్స్లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ఈ సీజన్లోనే తొలి కెప్టెన్ మొదట్లో రతిక రోజ్తో క్లోజ్గా ఉంటూ రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రశాంత్. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్పై తిరిగి ఫోకస్ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. నిష్కల్మషమైన మనసుకు ఫిదా నామినేషన్స్లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్మేట్స్ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. హౌస్లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బిగ్బాస్ 7 విన్నర్గా రైతుబిడ్డ.. స్పీచ్తో అదరగొట్టేశాడు!
మట్టిలో మాణిక్యం.. పల్లవి ప్రశాంత్. తన టాలెంట్తో బిగ్బాస్ షోలో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఆటతీరుతో, మాటతీరుతో ప్రేక్షకుల మనసులు సైతం గెలుచుకున్నాడు. వినయం, విధేయతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రశాంత్.. 18 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి బిగ్బాస్ 7 విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే చివర్లో అమర్దీప్, ప్రశాంత్ ఇద్దరే మిగలగా నాగార్జున రైతుబిడ్డను విన్నర్గా ప్రకటించాడు. దీంతో ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ నమ్మకమే గెలిపించింది విజయానందంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడివరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. తినకపోయినా సరే ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే చేయగలనని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు.. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది. రూ.35 లక్షలు రైతులకోసమే.. నాగార్జున సార్ మీద చిన్న కవిత రాశాను.. చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్ నవ్వు.. ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్ నవ్వు.. అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్ నవ్వు.. సార్ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి. ఇంకెంతోమంది జీవితాలు బాగుపడుతాయి. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చాను.. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను' అంటూ స్పీచ్తో అదరగొట్టాడు ప్రశాంత్. చదవండి: బిగ్బాస్ 7 విజేతగా రైతుబిడ్డ.. రెమ్యునరేషన్ + ప్రైజ్మనీ ఎంతంటే? -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?
బిగ్బాస్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్.. ప్రతి మనిషిలోనూ లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇతడిలోనూ ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ సమయాల్లో మరోలా ప్రవరిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్లో ఇతడు చేసే ఓవరాక్షన్ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా, అతి మామూలుగా ఉండేవాడు. రానూరానూ తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు. బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. ప్రైజ్మనీలో కోత బిగ్బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. పారితోషికం తక్కువే కానీ.. ఇక ప్రశాంత్కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు భోగట్టా. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ పోనూ దాదాపు రూ.8 లక్షల పైచిలుకు తన చేతికి రానున్నట్లు కనిపిస్తోంది. అంటే పారితోషికం(రూ.15,75,000)+ ప్రైజ్మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉన్నా ఈ ట్యాక్స్లు అన్ని పోనూ దాదాపు రూ.25- 27 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. దీనితో పాటు అదనంగా ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: ఆ ఒక్క విషయంలో ప్రియాంక సూపర్.. మొత్తం సంపాదన ఎంతంటే? అర్జున్ ఎలిమినేట్.. కేవలం 10 వారాల్లోనే అంత సంపాదించాడా? -
Bigg Boss 7 Finale Highlights: బిగ్బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్లా, ప్రియాంక.. అమర్లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్కేస్తో బిగ్బాస్లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి రూ.35 లక్షల చెక్తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు. -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. లీక్ చేసిన సందీప్ భార్య!
బిగ్బాస్ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్బాస్ 7 చాప్టర్ క్లోజ్ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్నే అయిపోయింది. కష్టం ఎప్పటికీ వృథా పోదు.. ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ 7 విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టేశాడు! ఇక మరో పోస్ట్లో సందీప్ మాస్టర్ న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్ బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు అమర్కు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు. ప్రశాంత్ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్కు ఏ లెవల్లో సపోర్ట్ ఉందో బాగా అర్థమైంది సందీప్కు. దీంతో అమర్ను పక్కన పెట్టేసి ప్రశాంత్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్కు ఫౌల్ గేమ్స్ అనే ట్యాగ్ రావడానికి సందీప్ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. చదవండి: క్రేజీ ఆఫర్.. 7 సెకన్ల టైమ్.. అమర్దీప్ అంత వేగంగా! -
రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఉల్టా పుల్టా అంటూ గత 100 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సీజన్ 7కి నేటితో శుభం కార్డు పడనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అయింది. గత సీజన్తో పోలిస్తే.. ఏడో సీజన్ కాస్త బెటర్గానే ఎంటర్టైన్మెంట్ని అందించింది. తొలుత 14 మందిని.. ఐదువారాల తర్వాత మరో ఐదు మందిని హౌస్లోకి పంపించారు. ఈసారి ఎక్కువగా తెలిసిన ముఖాలే హౌస్లో కనిపించడం.. టాస్క్లు కాస్త డిఫరెంట్గా ఉండడంతో బిగ్బాస్ 7 సక్సెస్ అయింది. మేకర్స్ కూడా సీజన్ 7 పట్ల హ్యాపీగా ఉన్నారు. ఇక ఫినాలేను గతం కంటే గ్రాండ్గా ప్లాన్ చేశారు. టాలీవుడ్కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు ఫినాలేలో పాల్గొని అలరించబోతున్నారు. ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఫినాలే ఎంత గ్రాండ్గా నిర్వహించబోతున్నారనేది పక్కకి పెట్టి..విన్నర్ ఎవరనేదానిపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారు. సోషల్ మీడియాలో సైతం బిగ్బాస్ 7 విన్నర్ ఎవరనేదానిపైనే చర్చ జరుగుతుంది. గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విన్నర్ ఇతనే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హౌస్లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అమర్దీప్, యావర్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది రేపు సాయంత్రం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ అని నెట్టింట వైరల్ అవుతుంది. ‘సాక్షి’ నిర్వహించిన ఓపినియన్ పోల్లో కూడా పల్లవి ప్రశాంత్కే ఎక్కువ శాతం ఓట్లు లభించాయి. ‘బిగ్బాస్-7 విన్నర్ ఎవరని భావిస్తున్నారు?’అని సాక్షి ఓపినియన్ పోల్ నిర్వహించగా.. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ పోల్లో 40 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండగా.. 20 శాతం ఓట్లతో శివాజీ రెండో స్థానంలో నిలిచాడు. అమర్దీప్ 16శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 10శాతం ఓట్లతో అర్జున్, ప్రియాంక..4 శాతం ఓట్లతో యావర్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే విన్నర్ ఎవరో కామెంట్ చేయడంటూ ‘సాక్షి’ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టగా.. అందులో కూడా ఎక్కువ మంది ప్రశాంతే విన్నర్ అవుతారని కామెంట్ చేశారు. మరి నెటిజన్స్ అభిప్రాయపడినట్లుగా ప్రశాంత్ విన్నర్ అవుతారా? లేదా ? అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్బాస్.. విన్నర్గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్బాస్ చెప్పాడు. తొలి గేమ్లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
ట్రూ ఎమోషన్స్ బయటపడ్డాయి.. ది బెస్ట్ జర్నీ వీడియోస్!
-
Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!
బిగ్బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) యావర్కి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు. మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
'నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు'.. రైతుబిడ్డపై బిగ్బాస్ ప్రశంసలు!
బుల్లితెర ఓ రేంజ్లో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రారంభమైన ఈ షో అదే పంథాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. అందుకు తగ్గట్టుగానే అలరించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రతిక రీ ఎంట్రీతో ఈ సీజన్ సరికొత్తగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లో మీ అభిమాన రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. మరి వీరిలో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్లో ఉన్న ఆరుగురి జర్నీపై వీడియోలను బిగ్బాస్ ఆడియన్స్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చివరివారం మొదటి రెండు రోజుల్లో అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చూపించారు. ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నారు. తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని స్క్రీన్పై చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో బిగ్బాస్ పల్లవి ప్రశాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. 'మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాస్కుల్లో గెలవడానికి నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు. మీకు ఇక్కడ రకరకాల వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కృంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ.. నీ లక్ష్యాన్ని గుర్తు చేసి.. ఏడుపు సమాధానం కాదని.. నీకు ఆ స్నేహమే తెలియజేసింది. నామినేషన్స్లో నీలో మరో ప్రశాంత్ను అందరికీ చూపించి.. ఓ బలమైన పోటీదారునిగా మిమ్మల్ని నిలిపి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టు భూమిమీద జీవానికి ఓ అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యం నీది' అంటూ బిగ్ బాస్ కొనియాడారు. ప్రశాంత్ ఫుల్ జర్నీ వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్బాస్ ఆడియన్స్కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్గా మార్చేసిన బిగ్బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
సైకోలా మారిన అమర్దీప్.. టైటిల్ రేసులో నుంచి అవుట్..
ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు.. చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదు.. అదృష్టం కలిసి రావట్లేదు.. అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అమర్దీప్. ఈ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టడానికి బిగ్బాస్, నాగార్జున సైతం గత వారం అమర్ ఆటతీరు అద్భుతంగా ఉందని, అందుకు బహుమతిగా కెప్టెన్సీని అనుభవించమని బంపరాఫర్ ఇచ్చాడు. కానీ అమర్ ఏం చేస్తున్నాడు? హౌస్మేట్స్తో సరిగా పనులు చేయించుకోలేకపోతున్నాడు. కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతుండటంతో ఇంటిసభ్యులు అమర్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ బ్యాడ్జ్తో మొదలైంది.. అటు నామినేషన్స్లోనూ నేను కెప్టెన్ను చెప్తున్నా.. కూర్చో అని కాస్త రూడ్గా మాట్లాడాడు. ఇక ఎప్పుడైతే అమర్ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడో.. అప్పుడే అతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుస కొట్లాటలు.. గొడవలు.. ఆఖరికి స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు. అంతకుముందు వరకు సరదాగా ఉండే అమర్ ఈ వారం మాత్రం కంట్రోల్ తప్పిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు గొడవపడుతున్నాడు? అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చేతులారా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు. మొన్నటి వరకు విన్నర్ రేసులో ఉన్న అతడి గ్రాఫ్ నిన్నటి ఒక్క ఎపిసోడ్తో పాతాళానికి పడిపోయింది. కొడుతూ, తిడుతూ, కొరికేస్తూ.. ఏంటీ అరాచకం? నిజానికి ఏ సీజన్లో అయినా అప్పటిదాకా కొట్టుకున్న కంటెస్టెంట్లు కూడా ఫినాలే దగ్గరపడగానే అంతా మర్చిపోయి కలిసిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం గొడవలు ముదురుతున్నాయే తప్ప చల్లారడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో అయితే అమర్దీప్ రైతుబిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతడిని తిడుతూ, కొడుతూ.. ఒరేయ్ అని పిలుస్తూ సైకోలా మారిపోయాడు. చెప్పుతో కొడతానంటూ సంజ్ఞ చేశాడు. పైగా కోపంతో ప్రశాంత్ను పంటితో కొరికేశాడు. ఇలా కొరుకుతున్నావేంటన్నా అని ప్రశాంత్ అడిగిన పాపానికి అతడిని మెడికల్ రూమ్కు తోసుకుంటూ, నెట్టేస్తూ, లాక్కెళ్తూ హీనంగా ప్రవర్తించాడు. ఎందుకంత చులకన? తోయకు అన్నా.. వద్దన్నా.. అని ప్రశాంత్ ఎంత అర్థిస్తున్నా వినకుండా అతడి మీద చేయి చేసుకుంటూ, చులకనతో నెట్టేస్తూ అతి చేశాడు. ఇది చూసిన జనాలు అమర్ను ఏకిపారేస్తున్నారు. 'అమర్కు ప్రశాంత్ అంటే ఎందుకంత చులకనభావం?', 'ఒక వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?', 'ఇలాంటి వ్యక్తికి నాగార్జున రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ చేయాలి' అని ఆగ్రహిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్తో అమర్ గెలుపు దాదాపు దూరమైనట్లే! ప్రశాంత్ విజయానికి మరో అడుగు ముందుకు పడినట్లే! #BiggBossTelugu7#Biggboss7Telugu Amar inthakante digajaradu anukunna prathi sari antha kante worst ga behave chestunnadu. Dear @StarMaa and @iamnagarjuna, its rigt time to show RED card to this worst fellow #Amardeep pic.twitter.com/RKgUYvdx9L — 🦋🅺🆄🆂🆄🅼🅰🦋 (@KusumaAllada) December 7, 2023 Poorthiga pichhodi la maripotunna #amardeep 👍🏻#BiggBossTelugu7 pic.twitter.com/9pAVafq3h7 — MK (@MK99086) December 7, 2023 చదవండి: అమర్దీప్ ఫ్యాన్స్ గలీజ్ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్ -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్ను కొరికి నెట్టేస్తూ..
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
'హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత.. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి'
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్మేట్స్తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్బాస్ ఈసారి త్రో బాల్ టాస్క్ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్లో ప్రతి రౌండ్లో ఎవరీ జాకెట్కు అయితే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్బాస్ ప్రకటించాడు. అయితే గేమ్ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. రేయ్ హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్ కౌంటరిచ్చాడు. అమర్ను శోభా వారిస్తుండగా.. అర్జున్ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)