Pallavi Prashanth
-
ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్బాస్కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..ఈ ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్దే అన్న టాక్ వినిపిస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు -
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్తో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
బిగ్బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా!
రైతు బిడ్డ ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్బాస్ సీజన్-7 విన్నర్గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్బాస్ విన్నర్గా స్టార్గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9— Starmaa (@StarMaa) October 15, 2024 -
ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్బాస్ 1బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్బాస్ 2బిగ్బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్బాస్కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్బాస్ 5బిగ్బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్ఫామ్ అని భావించాడు. బిగ్బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్బాస్ విన్నర్ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్బాస్ నాన్స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్గా పోరాడి బిగ్బాస్ నాన్స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్బాస్ ఏడో సీజన్కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
రాజకీయాల్లోకి రైతుబిడ్డ? అందుకే అలా..
రైతుబిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్.. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఏడో సీజన్లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్కు విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే! అయితే షో అయిపోయిన తర్వాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాజాగా ఇతడు బిగ్బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్కు హాజరయ్యాడు. దేవుడే దిక్కు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. 'మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను.. అందుకే మీముందు ఇలా నిలబడ్డాను. మీ ఆశీస్సులు ఉంటే.. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను, వెనక్కు వెళ్లను.. ఇలాగే నిలబడతాను. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు' అని చెప్పాడు. ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా.. 'మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్ను కాలితో తన్నుతూ, కొడుతూ.. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
ప్రశాంత్కు ఇబ్బందిగా మారిన 'బిగ్బాస్' ప్రైజ్ మనీ.. వాళ్లను మోసం చేశాడా?
బిగ్బాస్ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్లైన్తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రశాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్ అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బిగ్బాస్ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్ ఓపెనింగ్స్కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్.. రైతులకు తన ప్రైజ్ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు. వాస్తవంగా అమర్దీప్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్లైన్ ప్రశాంత్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రియాక్షన్ తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్కు వచ్చేది ఎంత బిగ్బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్కు బిగ్బాస్ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క!
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష).. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్బాస్ హౌస్లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది. అప్పుడు ప్రశాంత్కు సపోర్ట్ ప్రశాంత్.. బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. యూట్యూబ్లో పెళ్లి చేశారు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'నేను బిగ్బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ చేయలేదు. అలాంటిది.. నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? విజయకాంత్ కోసం ఆ పని చేస్తానని వాగ్ధానం.. అది గుర్తుపెట్టుకుని.. -
బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ని ఇందులో స్కిట్గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
బిగ్బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
బిగ్ బాస్ అమర్పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్లో కొందరు యావర్తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్లో ప్రశాంత్ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె. హీరోగా సినిమా ఛాన్సులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాడు. బిగ్బాస్కు వెళ్లకపోయినా బాగుండు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్బాస్కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్రౌండర్గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆసక్తికర ట్వీట్ చేసిన ఉపాసన.. భర్తపై ఎంత ప్రేమో.. -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్తో బిగ్బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్షైన్కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్తో 'బిగ్బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
బిగ్బాస్ గొడవలో మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: బిగ్బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా సరూర్నగర్కు చెందిన హరినాథ్రెడ్డి, యూసుఫ్గూడలకు చెందిన ఎం. సుధాకర్లను ఆదివారం రిమాండ్కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్బాస్ షోలో కామన్మ్యాన్ అనే ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్గానే ప్రశాంత్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్స్టాగ్రామ్లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్ను 1 మిలియన్కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్కు అండగా నిలబడిన భోలే చంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్బాస్ విన్నర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
పల్లవి ప్రశాంత్ బెయిల్ పై హైకోర్టులో కీలక వాదనలు
-
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
ప్రశాంత్ అమాయకుడు.. అసలు జైల్లో వేయడమేంటి?: అశ్విని ఎమోషనల్
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ చేసిన హంగామాతో అమర్దీప్, అశ్విని, గీతూరాయల్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. (ఇది చదవండి: భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మరో కంటెస్టెంట్ అశ్విని స్పందించారు. పల్లవి ప్రశాంత్ అమాయకుడని అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్బాస్ టైటిల్ గెలిచిన సంతోషం లేకుండా చేశారని అన్నారు. నాకు ప్రశాంత్ తమ్ముడిలాంటి వాడు.. అతను త్వరలోనే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్లు అశ్విని బాధపడ్డారు. అది ఫ్యాన్స్ చేసిన తప్పే కానీ.. ప్రశాంత్ అలాంటివాడు కాదని తెలంగాణ పోలీసులను కోరింది. అశ్విని మాట్లాడుతూ.. 'పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదండి. ఓ కామన్ మ్యాన్గా వచ్చి ట్రోఫీ గెలిచాడు. పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి. అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ప్రశాంత్ చాలా అమాయకుడు, మంచి వ్యక్తి కూడా. కప్ గెలిచి ఒక్కరోజు కూడా కాలేదు. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్కు సపోర్ట్ చేయండి. అది అతని తప్పుకాదని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్నా' అంటూ ప్రశాంత్కు మద్దతుగా నిలిచారు. కాగా.. స్టూడియో బయట జరిగిన గొడవలో అశ్విని కారు అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!) -
రైతుబిడ్డకు గెలిచినా ఆనందం లేకుండా చేశారు: ప్రశాంత్ తండ్రి ఆవేదన
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!) అరెస్ట్పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!) -
పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిదంటే... అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు నిరాశ.. తీర్పు వాయిదా
బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్టూడియో నుంచి వెళ్లిపోమని చెప్పినా వినకుండా తిరిగి స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అతడి అభిమానులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడంటూ ప్రశాంత్ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ప్రశాంత్.. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్కు బెయిల్ వస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
రైతుబిడ్డకంత నాలెడ్జ్ లేదు..
-
నా పాట, అతడి ఆట జైలుపాలైంది.. ఏడ్చేసిన భోలె షావళి
బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. జనం కోసం ఆడాలి.. 'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి వరకు తీసుకెళ్లండి. ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
మీరు చేస్తుంది తప్పు...
-
నాకేదైనా అయితే ఆ ఐదుగురే కారణం.. వీడియోలున్నాయ్!
ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా అందరినీ వెనక్కు నెట్టి బిగ్బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. పోలీసుల మాటలు బేఖాతరు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమన్నారు పోలీసులు. ఇతడు మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ న్యూసెన్స్కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. కావాలనే నెగెటివ్ చేస్తున్నారు అయితే తాను అరెస్ట్ అవడానికి ముందు ప్రశాంత్.. అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత! పోలీసులు చెప్పారు, కానీ.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్ అయిన. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా? అనుకున్నాను. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను. వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగొణ ధ్వనుల మధ్య నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. చదవండి: పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు మనోహర్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్)/ గజ్వేల్: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ఏ–1, ఏ–2 నిందితులుగా ఉన్న బిగ్బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అర్ధరాత్రి తర్వాత న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్ఎస్ఐ మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు. అందులో సాయికిరణ్, రాజులను ఈనెల 19న అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్ ఇంటివద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 17న బిగ్బాస్ సీజన్ –7 ఫైనల్స్లో భాగంగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అశ్వినీ కార్లను, ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లలేదు: ప్రశాంత్ తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్ స్పష్టం చేశారు. అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని, దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. -
బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
-
Pallavi Prashanth Arrest: బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్!
బిగ్బాస్ విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్కు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అభిమానులపై కూడా పోలీసులు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా.. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్న ప్రశాంత్ లాయర్ బిగ్బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో మాట్లాడారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా.. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ప్రశాంత్ లాయర్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు. అయితే తాజాగా బిగ్బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు. సాక్షితో బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'ఇంట్లోనే ఉన్నా.. నేను ఎక్కడికి పారిపోలేదు. కావాలనే కొందరు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చర్యలను ఖండిస్తున్నా. నా గెలుపు రైతుల విజయం. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పై వస్తున్నా తప్పుడు వార్తలతో కలత చెందా. జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా. రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా. హౌస్లో శివాజీ అన్న నాకు అండగా ఉన్నారు. నాగార్జున ,శివాజీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.' అని అన్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్కుమార్ తెలిపారు. -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాప్.. కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు
సాక్షి, గజ్వేల్: కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ అన్నారు. మంగళవారం ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నా...ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. ఆరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ విజేతగా నిలవడం ఇష్టంలేని కొన్ని శక్తులు నగరంలో జరిగిన సంఘటనలకు కారణమన్న అనుమానం నెలకొందన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్ట ప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుపడబోమని, కానీ ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లయితే వెంటనే పోలీసుశాఖ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి..ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు కంటతడి.. తమ కొడుకుపై కక్షసాధిస్తున్నారని విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడిపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్ ఎంతోకష్టడి చివరకు తానూ అనుకున్నదని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని వారు కోరారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
పరారీలో పల్లవి ప్రశాంత్!
-
బిగ్ బాస్కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్లోని ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్కు ముందు ప్రశాంత్ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
పరారీలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్కు కారకుడైన బిగ్బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్దీప్ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
సంతోషం లేకుండా చేశారు !
-
అన్నం కూడా తిననియలే.. నాకు చాలా బాధగా ఉంది: ప్రశాంత్
ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్బాస్ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా. నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు. -
పల్లవి ప్రశాంత్పై కేసు.. ప్రిన్స్ యావర్ రియాక్షన్ ఇదే!
ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్గా ముగిసింది. గతేడాది కంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. అయితే ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో కంటెస్టెంట్ ఎవరంటే మాత్రం అతని పేరే చెబుతారు. వచ్చి, రానీ తెలుగుభాషతో టాప్-5 నిలిచాడంటే మామూలు విషయం కాదు. అతను మరెవరో కాదు ప్రిన్స్ యావర్. ఈ షో ముగిసిన తర్వాత యావర్ తొలిసారి మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవ, కేసులపై యావర్ స్పందించారు. ఇంతకీ అతను ఏమన్నాడో తెలుసుకుందాం. యావర్ మాట్లాడుతూ..'బిగ్బాస్లో ఎవరి గేమ్ వాళ్లు ఆడారు. ఎవరి మైండ్ గేమ్ వారిది. పల్లవి ప్రశాంత్ నాకు బ్రదర్లాంటివాడు. అతనికి అభినందనలు. అతను ఎప్పుడు ఇలాగే రైతులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను కేవలం నా ఆటపైనే ఫోకస్ చేశా. గేమ్లో ఎలా గెలవాలని ఆలోచించా' అని అన్నారు. పల్లవి ప్రశాంత్ కేసుపై మాట్లాడుతూ..' సారీ ఈ విషయం నాకు తెలియదు. మీరు చెబితేనే నాకు తెలిసింది. కచ్చితంగా ఫీలవుతున్నా. ప్రశాంత్ మంచి మనిషి. అయితే కేసు విషయం గురించి నాకేమీ తెలియదు. మూడో రోజుల నుంచి నిద్రపోతున్నా. బిగ్బాస్ అనేది ముగిసిన అధ్యాయం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. అదంతా కేవలం ఒక గేమ్ మాత్రమే. అందరూ బాగా ఆడారు. నా ఫ్యాన్స్ అందరికీ నేను రుణపడి ఉంటా. త్వరలోనే వాళ్లను కలుస్తా. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా.' అని వెల్లడించారు. కాగా.. ఈ సీజన్లో టాప్-4లో నిలిచిన ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. -
బిగ్బాస్కు ఎందుకు వచ్చానంటే?.. రైతు బిడ్డ సమాధానం ఇదే!
రైతుబిడ్డగా బిగ్బాస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్కు బిగ్బాస్కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్బాస్పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. బిగ్బాస్ హౌస్లో ఇచ్చిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్లో నాకు తెలిసిందే కూకట్పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్బాస్కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్లో అడుగుపెట్టా.' అని అన్నారు. రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు. -
నాకేమైనా సీఎం పదవి ఇచ్చిర్రా?: పల్లవి ప్రశాంత్!
కామన్ మ్యాన్ టైటిల్ ఎగరేసుకుపోవడం బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి! ఇంతవరకు తెలుగులో కామన్ మ్యాన్ రన్నరప్ వరకు కూడా వచ్చిందే లేదు. అలాంటిది రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పేరు చానా ఏండ్లు యాదుండేలా బిగ్బాస్ 7 టైటిల్ సాధించేశాడు. జనాలు టాస్కులు ఒక్కటే చూడరు.. వారి మాటతీరు, ప్రవర్తననే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. వినయం, విధేయత ఎక్కడ? అలా ప్రశాంత్ వినయ, విధేయత చాలామందిని కట్టిపడేసింది. పొగడ్తలకు ఉప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చటపడ్డారు, గెలిపించారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది.. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదే! ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. 'మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..' అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 15 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి అండగా నిలిచారా? అని ఓ యాంకర్ అడిగాడు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ.. 'నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా' అని వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఫ్రెండ్స్ను సైతం లెక్కచేయట్లేదా? ఈ ప్రవర్తనను బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. 'ప్రశాంత్.. 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు' అని మండిపడ్డాడు. రైతులకు ఏం చేస్తారో చెప్తేనే ఇంటర్వ్యూలు ఇస్తానన్న వీడియోను షేర్ చేస్తూ.. బిగ్బాస్కు వెళ్లేముందు ఇంటర్వ్యూలు ఇచ్చావుగా.. అప్పుడు లేని కండీషన్స్ ఇప్పుడెందుకు? ఆరోజు రైతుకి ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదు? అని వరుస ప్రశ్నలు అడిగాడు. ఇన్నాళ్లూ మాస్క్ వేసుకున్నాడా? మరోవైపు గ్రాండ్ ఫినాలే రోజు స్టూడియో బయట గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే! అమర్, గీతూ, అశ్విని కారు అద్దాలతో పాటు అక్కడి బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. శాంతి భద్రతల సమస్య కారణంగా వెళ్లిపోమని పోలీసులు చెప్తుంటే.. ప్రశాంత్ అది అర్థం చేసుకోకుండా పోలీసులు రైతుబిడ్డకు విలువ ఇవ్వడం లేదంటూ వీడియో తీశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు.. ప్రశాంత్ ఇన్నాళ్లూ బిగ్బాస్ హౌస్లో మాస్క్ వేసుకునే ఉన్నాడు, బిగ్బాస్కు రాకముందు ప్రశాంత్ ఏమైనా రైతులకు సాయం చేశాడా? లేదు కదా.. ఎందుకింత పొగరుగా వ్యవహరించడం? యాటిట్యూడ్, తలపొగరు చూపించకుండా సమాధానాలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. #BiggBossTelugu7 is immature or arrogance #PallaviPrashanth. Omg he just lost the plot pic.twitter.com/pu53KsS8a4— telugu guy (@nthony_venky) December 19, 2023 చదవండి: 35 ఏళ్ల వయసులోనూ స్లిమ్గా.. అరడజను సినిమాలతో ఫుల్ బిజీ.. -
స్వగ్రామానికి చేరుకున్న రైతుబిడ్డ.. పూలవర్షం కురిపించిన అభిమానులు!
సామాన్య రైతుబిడ్డగా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. వంద రోజులకు పైగా సాగిన తెలుగువారి బిగ్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7 ట్రోఫీని ముద్దాడారు. రైతుబిడ్డ అన్న సింపతి వర్కవుట్ అయినా.. తనలో ఉన్న టాలెంట్ను బయటకు తీశాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మరో కంటెస్టెంట్ అమర్దీప్తో పోటీపడి టైటిల్ సాధించాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. బిగ్బాస్ విన్నర్గా నిలిచిన రైతుబిడ్డ తన సొంత ఊరికి చేరుకున్నాడు. స్వగ్రామానికి చేరుకున్న ప్రశాంత్కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనిపై పూలవర్షం కురిపించారు. కారులో టాప్పై నిలిచి ఉన్న ప్రశాంత్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. రోడ్డు వెంట వందలాది మంది ఫ్యాన్స్ మధ్య ర్యాలీ నిర్వహించారు. టైటిల్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. డీజే స్టెప్పులతో ఊగిపోతూ సిద్దిపేట జిల్లాలోని కోల్గురు చేరుకున్నారు. రోడ్డు వెంట జనసందోహం నడుమ బిగ్ బాస్ విన్నర్ తన సొంతూర్లో అడుగుపెట్టారు. అయితే ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ హంగామా చేశారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం కాస్తా కేసుల వరకు వెళ్లింది. అభిమానుల శృతిమించి అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. -
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో ఉండగానే ప్రశాంత్ను విన్నర్ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్దీప్ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో లేకపోతే యావర్, ప్రశాంత్ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
Bigg Boss 7 Contestants Pics: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ విన్నెర్స్ ఫోటోలు
-
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత
-
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ సూపర్ హిట్టయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా అవతరించాడు. ఇతడి గెలుపుకు సింపతీ కూడా ఓ కారణమే! మొదటి నుంచి అతడిని రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. జనాలు సైతం తమలో ఒకడు ప్రశాంత్ అంటూ అతడికి బాగా కనెక్ట్ అయ్యారు. నిన్న(డిసెంబర్ 17న) అన్నపూర్ణ స్టూడియోలో బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అమర్దీప్ను ఓడిస్తూ విజేతగా అవతరించాడు ప్రశాంత్. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి తిరుగుపమయనమయ్యారు. స్టూడియో వెలుపల గందరగోళం వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అమర్దీప్.. తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొన్ని అల్లరి మూకలు గీతూ రాయల్, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బస్సు అద్దాలపైనా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. వెళ్లిపోమన్నందుకు పోలీసులపై అసహనం ప్రశాంత్ రూఫ్ టాప్ ద్వారా కారులో నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని చెప్పారు. అలాగే కారు కూడా ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనయ్యాడు. 'అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు' అని ఆగ్రహించాడు. 'పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతుబిడ్డ అన్నా.. నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..' అంటూ ఆగ్రహించాడు. పోలీసులను వీడియో తీయ్.. అంటూ ఆర్డర్స్ తనను బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. 'ఈ రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచేశావ్.. దాన్ని ఇంకా వదిలిపెట్టవా' అని కామెంట్లు చేస్తున్నారు. 'శాంతి భద్రతల కోసం పోలీసులు వెళ్లిపోమంటే అది కూడా తలకెక్కడం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️ Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6 — ✯ (@sagatuXuser) December 17, 2023 చదవండి: బిగ్బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
‘ఇదేం అభిమానం!’ బిగ్బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్కు అభిమాని ఊహించని గిఫ్ట్!
బిగ్బాస్ షోకి వెళ్తావా? నిన్నెవడు తీసుకుంటాడ్రా?.. అసలు స్టూడియో లోపలైనా అడుగుపెట్టగలవా? నీకంత సీన్ లేదులే.. పగటి కలలు కనకు.. ఇలా నానామాటలు అన్నారు.. ఎవరెంత హేళన చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్సయ్యాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. అతడిలోని కసిని బిగ్బాస్ టీమ్ గుర్తించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డను బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోకి తీసుకొచ్చింది. వైల్డ్గా ఆడాడు.. గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరూ ప్రశాంత్ అంత ప్రభావం చూపలేకపోయారు. ఓటమికి ఛాన్సే ఇవ్వకూడదన్న చందంగా గెలుపు కోసం విజృంభించి ఆడాడు. తన కోపాన్ని, కసినంతా ఆటలో చూపించాడే కానీ అవతలి వారిపై చూపించలేదు. నామినేషన్స్లో ఎంత వైల్డ్గా రియాక్ట్ అయినా తర్వాత మాత్రం ఎటువంటి రాగద్వేషాలు మనసులో పెట్టుకోకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. తనకు సాయం చేసినవారిని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు. సాయం చేయనివారికి సైతం అవకాశం వచ్చినప్పుడు వారివైపు నిలబడ్డాడు. రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇతడి నిష్కల్మమైన మనసు చూసి జనాలు ఓట్లు గుద్దారు. ఫలితంగా ప్రశాంత్ బిగ్బాస్ 7 విజేతగా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. యాదగిరిగుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. యాదగిరి గుట్టకు సమీపంలోని వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు. ప్రశాంత్కు భారీగానే ముట్టాయి త్వరలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపాడు. ఇది తెలిసిన జనాలు రైతుబిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్కు ప్రైజ్మనీ ద్వారా రూ.35 లక్షలు, పారితోషికం ద్వారా రూ.15 లక్షలు ముట్టాయి. ఇందులో సగం ట్యాక్స్ల రూపేణా ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదు కాకుండా అతడు కాస్ట్లీ కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకోవడం విశేషం. చదవండి: బిగ్బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. బిగ్బాస్ చాణక్యకు తగిన శాస్తి.. మాస్టర్ మైండ్ అని చెప్పి చివరకేమో అలా! -
అమర్ దీప్ కారుపై దాడి, పోలీసుల లాఠీఛార్జ్
-
Bigg Boss 7: రైతుబిడ్డ విజయానికి ప్రధాన కారణాలు ఇవే!
పల్లవి ప్రశాంత్.. బిగ్బాస్ షోకు రావడానికి ముందు సోషల్ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్బాస్ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి? చెప్పులరిగేలా తిరిగాడు 'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్.. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) గెలుపే అంతిమ లక్ష్యంగా.. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నామినేషన్స్లో మాత్రం.. షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్గా ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్ను అని హౌస్మేట్స్కు గుర్తు చేశాడు. నామినేషన్స్లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ఈ సీజన్లోనే తొలి కెప్టెన్ మొదట్లో రతిక రోజ్తో క్లోజ్గా ఉంటూ రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రశాంత్. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్పై తిరిగి ఫోకస్ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. నిష్కల్మషమైన మనసుకు ఫిదా నామినేషన్స్లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్మేట్స్ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. హౌస్లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బిగ్బాస్ 7 విన్నర్గా రైతుబిడ్డ.. స్పీచ్తో అదరగొట్టేశాడు!
మట్టిలో మాణిక్యం.. పల్లవి ప్రశాంత్. తన టాలెంట్తో బిగ్బాస్ షోలో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఆటతీరుతో, మాటతీరుతో ప్రేక్షకుల మనసులు సైతం గెలుచుకున్నాడు. వినయం, విధేయతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రశాంత్.. 18 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి బిగ్బాస్ 7 విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే చివర్లో అమర్దీప్, ప్రశాంత్ ఇద్దరే మిగలగా నాగార్జున రైతుబిడ్డను విన్నర్గా ప్రకటించాడు. దీంతో ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ నమ్మకమే గెలిపించింది విజయానందంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడివరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. తినకపోయినా సరే ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే చేయగలనని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు.. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది. రూ.35 లక్షలు రైతులకోసమే.. నాగార్జున సార్ మీద చిన్న కవిత రాశాను.. చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్ నవ్వు.. ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్ నవ్వు.. అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్ నవ్వు.. సార్ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి. ఇంకెంతోమంది జీవితాలు బాగుపడుతాయి. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చాను.. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను' అంటూ స్పీచ్తో అదరగొట్టాడు ప్రశాంత్. చదవండి: బిగ్బాస్ 7 విజేతగా రైతుబిడ్డ.. రెమ్యునరేషన్ + ప్రైజ్మనీ ఎంతంటే? -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?
బిగ్బాస్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్.. ప్రతి మనిషిలోనూ లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇతడిలోనూ ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ సమయాల్లో మరోలా ప్రవరిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్లో ఇతడు చేసే ఓవరాక్షన్ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా, అతి మామూలుగా ఉండేవాడు. రానూరానూ తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు. బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. ప్రైజ్మనీలో కోత బిగ్బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. పారితోషికం తక్కువే కానీ.. ఇక ప్రశాంత్కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు భోగట్టా. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ పోనూ దాదాపు రూ.8 లక్షల పైచిలుకు తన చేతికి రానున్నట్లు కనిపిస్తోంది. అంటే పారితోషికం(రూ.15,75,000)+ ప్రైజ్మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉన్నా ఈ ట్యాక్స్లు అన్ని పోనూ దాదాపు రూ.25- 27 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. దీనితో పాటు అదనంగా ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: ఆ ఒక్క విషయంలో ప్రియాంక సూపర్.. మొత్తం సంపాదన ఎంతంటే? అర్జున్ ఎలిమినేట్.. కేవలం 10 వారాల్లోనే అంత సంపాదించాడా? -
Bigg Boss 7 Finale Highlights: బిగ్బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్లా, ప్రియాంక.. అమర్లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్కేస్తో బిగ్బాస్లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి రూ.35 లక్షల చెక్తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు. -
బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. లీక్ చేసిన సందీప్ భార్య!
బిగ్బాస్ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్బాస్ 7 చాప్టర్ క్లోజ్ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్నే అయిపోయింది. కష్టం ఎప్పటికీ వృథా పోదు.. ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ 7 విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టేశాడు! ఇక మరో పోస్ట్లో సందీప్ మాస్టర్ న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్ బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు అమర్కు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు. ప్రశాంత్ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్కు ఏ లెవల్లో సపోర్ట్ ఉందో బాగా అర్థమైంది సందీప్కు. దీంతో అమర్ను పక్కన పెట్టేసి ప్రశాంత్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్కు ఫౌల్ గేమ్స్ అనే ట్యాగ్ రావడానికి సందీప్ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. చదవండి: క్రేజీ ఆఫర్.. 7 సెకన్ల టైమ్.. అమర్దీప్ అంత వేగంగా! -
రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఉల్టా పుల్టా అంటూ గత 100 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సీజన్ 7కి నేటితో శుభం కార్డు పడనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అయింది. గత సీజన్తో పోలిస్తే.. ఏడో సీజన్ కాస్త బెటర్గానే ఎంటర్టైన్మెంట్ని అందించింది. తొలుత 14 మందిని.. ఐదువారాల తర్వాత మరో ఐదు మందిని హౌస్లోకి పంపించారు. ఈసారి ఎక్కువగా తెలిసిన ముఖాలే హౌస్లో కనిపించడం.. టాస్క్లు కాస్త డిఫరెంట్గా ఉండడంతో బిగ్బాస్ 7 సక్సెస్ అయింది. మేకర్స్ కూడా సీజన్ 7 పట్ల హ్యాపీగా ఉన్నారు. ఇక ఫినాలేను గతం కంటే గ్రాండ్గా ప్లాన్ చేశారు. టాలీవుడ్కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు ఫినాలేలో పాల్గొని అలరించబోతున్నారు. ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఫినాలే ఎంత గ్రాండ్గా నిర్వహించబోతున్నారనేది పక్కకి పెట్టి..విన్నర్ ఎవరనేదానిపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారు. సోషల్ మీడియాలో సైతం బిగ్బాస్ 7 విన్నర్ ఎవరనేదానిపైనే చర్చ జరుగుతుంది. గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విన్నర్ ఇతనే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హౌస్లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అమర్దీప్, యావర్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది రేపు సాయంత్రం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ అని నెట్టింట వైరల్ అవుతుంది. ‘సాక్షి’ నిర్వహించిన ఓపినియన్ పోల్లో కూడా పల్లవి ప్రశాంత్కే ఎక్కువ శాతం ఓట్లు లభించాయి. ‘బిగ్బాస్-7 విన్నర్ ఎవరని భావిస్తున్నారు?’అని సాక్షి ఓపినియన్ పోల్ నిర్వహించగా.. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ పోల్లో 40 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండగా.. 20 శాతం ఓట్లతో శివాజీ రెండో స్థానంలో నిలిచాడు. అమర్దీప్ 16శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 10శాతం ఓట్లతో అర్జున్, ప్రియాంక..4 శాతం ఓట్లతో యావర్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే విన్నర్ ఎవరో కామెంట్ చేయడంటూ ‘సాక్షి’ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టగా.. అందులో కూడా ఎక్కువ మంది ప్రశాంతే విన్నర్ అవుతారని కామెంట్ చేశారు. మరి నెటిజన్స్ అభిప్రాయపడినట్లుగా ప్రశాంత్ విన్నర్ అవుతారా? లేదా ? అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్బాస్.. విన్నర్గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్బాస్ చెప్పాడు. తొలి గేమ్లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
ట్రూ ఎమోషన్స్ బయటపడ్డాయి.. ది బెస్ట్ జర్నీ వీడియోస్!
-
Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!
బిగ్బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) యావర్కి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు. మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
'నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు'.. రైతుబిడ్డపై బిగ్బాస్ ప్రశంసలు!
బుల్లితెర ఓ రేంజ్లో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రారంభమైన ఈ షో అదే పంథాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. అందుకు తగ్గట్టుగానే అలరించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రతిక రీ ఎంట్రీతో ఈ సీజన్ సరికొత్తగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లో మీ అభిమాన రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. మరి వీరిలో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్లో ఉన్న ఆరుగురి జర్నీపై వీడియోలను బిగ్బాస్ ఆడియన్స్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చివరివారం మొదటి రెండు రోజుల్లో అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చూపించారు. ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నారు. తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని స్క్రీన్పై చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో బిగ్బాస్ పల్లవి ప్రశాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. 'మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాస్కుల్లో గెలవడానికి నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు. మీకు ఇక్కడ రకరకాల వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కృంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ.. నీ లక్ష్యాన్ని గుర్తు చేసి.. ఏడుపు సమాధానం కాదని.. నీకు ఆ స్నేహమే తెలియజేసింది. నామినేషన్స్లో నీలో మరో ప్రశాంత్ను అందరికీ చూపించి.. ఓ బలమైన పోటీదారునిగా మిమ్మల్ని నిలిపి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టు భూమిమీద జీవానికి ఓ అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యం నీది' అంటూ బిగ్ బాస్ కొనియాడారు. ప్రశాంత్ ఫుల్ జర్నీ వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్బాస్ ఆడియన్స్కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్గా మార్చేసిన బిగ్బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
సైకోలా మారిన అమర్దీప్.. టైటిల్ రేసులో నుంచి అవుట్..
ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు.. చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదు.. అదృష్టం కలిసి రావట్లేదు.. అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అమర్దీప్. ఈ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టడానికి బిగ్బాస్, నాగార్జున సైతం గత వారం అమర్ ఆటతీరు అద్భుతంగా ఉందని, అందుకు బహుమతిగా కెప్టెన్సీని అనుభవించమని బంపరాఫర్ ఇచ్చాడు. కానీ అమర్ ఏం చేస్తున్నాడు? హౌస్మేట్స్తో సరిగా పనులు చేయించుకోలేకపోతున్నాడు. కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతుండటంతో ఇంటిసభ్యులు అమర్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ బ్యాడ్జ్తో మొదలైంది.. అటు నామినేషన్స్లోనూ నేను కెప్టెన్ను చెప్తున్నా.. కూర్చో అని కాస్త రూడ్గా మాట్లాడాడు. ఇక ఎప్పుడైతే అమర్ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడో.. అప్పుడే అతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుస కొట్లాటలు.. గొడవలు.. ఆఖరికి స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు. అంతకుముందు వరకు సరదాగా ఉండే అమర్ ఈ వారం మాత్రం కంట్రోల్ తప్పిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు గొడవపడుతున్నాడు? అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చేతులారా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు. మొన్నటి వరకు విన్నర్ రేసులో ఉన్న అతడి గ్రాఫ్ నిన్నటి ఒక్క ఎపిసోడ్తో పాతాళానికి పడిపోయింది. కొడుతూ, తిడుతూ, కొరికేస్తూ.. ఏంటీ అరాచకం? నిజానికి ఏ సీజన్లో అయినా అప్పటిదాకా కొట్టుకున్న కంటెస్టెంట్లు కూడా ఫినాలే దగ్గరపడగానే అంతా మర్చిపోయి కలిసిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం గొడవలు ముదురుతున్నాయే తప్ప చల్లారడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో అయితే అమర్దీప్ రైతుబిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతడిని తిడుతూ, కొడుతూ.. ఒరేయ్ అని పిలుస్తూ సైకోలా మారిపోయాడు. చెప్పుతో కొడతానంటూ సంజ్ఞ చేశాడు. పైగా కోపంతో ప్రశాంత్ను పంటితో కొరికేశాడు. ఇలా కొరుకుతున్నావేంటన్నా అని ప్రశాంత్ అడిగిన పాపానికి అతడిని మెడికల్ రూమ్కు తోసుకుంటూ, నెట్టేస్తూ, లాక్కెళ్తూ హీనంగా ప్రవర్తించాడు. ఎందుకంత చులకన? తోయకు అన్నా.. వద్దన్నా.. అని ప్రశాంత్ ఎంత అర్థిస్తున్నా వినకుండా అతడి మీద చేయి చేసుకుంటూ, చులకనతో నెట్టేస్తూ అతి చేశాడు. ఇది చూసిన జనాలు అమర్ను ఏకిపారేస్తున్నారు. 'అమర్కు ప్రశాంత్ అంటే ఎందుకంత చులకనభావం?', 'ఒక వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?', 'ఇలాంటి వ్యక్తికి నాగార్జున రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ చేయాలి' అని ఆగ్రహిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్తో అమర్ గెలుపు దాదాపు దూరమైనట్లే! ప్రశాంత్ విజయానికి మరో అడుగు ముందుకు పడినట్లే! #BiggBossTelugu7#Biggboss7Telugu Amar inthakante digajaradu anukunna prathi sari antha kante worst ga behave chestunnadu. Dear @StarMaa and @iamnagarjuna, its rigt time to show RED card to this worst fellow #Amardeep pic.twitter.com/RKgUYvdx9L — 🦋🅺🆄🆂🆄🅼🅰🦋 (@KusumaAllada) December 7, 2023 Poorthiga pichhodi la maripotunna #amardeep 👍🏻#BiggBossTelugu7 pic.twitter.com/9pAVafq3h7 — MK (@MK99086) December 7, 2023 చదవండి: అమర్దీప్ ఫ్యాన్స్ గలీజ్ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్ -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్ను కొరికి నెట్టేస్తూ..
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
'హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత.. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి'
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్మేట్స్తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్బాస్ ఈసారి త్రో బాల్ టాస్క్ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్లో ప్రతి రౌండ్లో ఎవరీ జాకెట్కు అయితే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్బాస్ ప్రకటించాడు. అయితే గేమ్ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. రేయ్ హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్ కౌంటరిచ్చాడు. అమర్ను శోభా వారిస్తుండగా.. అర్జున్ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
Bigg Boss 7: మళ్లీ గొడవపడ్డ అమర్-ప్రశాంత్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ హడావుడి గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? యావర్ - శోభా, ప్రియాంక శోభాశెట్టి - యావర్, శివాజీ ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి అర్జున్ - అమర్, యావర్ ప్రియాంక - అమర్, యావర్ శివాజీ - ప్రియాంక, అమర్ అమర్ - ప్రశాంత్, యావర్ చాలా అతి చేసిన యావర్ వీకెండ్ ఎపిసోడ్లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు. అమర్కి షాకిచ్చిన ప్రియాంక సీరియల్ బ్యాచ్కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్ని గుర్తుచేశారు. అమర్ vs ప్రశాంత్ గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. బిగ్బాస్ సీజన్-7 ఇవాల్టి ఎపిసోడ్ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్ను అమర్దీప్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్, యావర్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్బాస్' తీరు మారట్లేదు!
బిగ్బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: లవ్ స్టోరీ బయటపెట్టిన రైతుబిడ్డ.. ఆ ఒక్క కారణంతో బ్రేకప్!
గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు పోరాడి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని తన ప్రేమకథని బయటపెట్టాడు. అయితే ఇది బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 89 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ రేసు నుంచి ఔట్ నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్.. రేసు నుంచి తప్పుకొన్నాడని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు.. రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్తో చెప్పాడు. (ఇదీ చదవండి: Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!) బెడ్రూంలో శోభా డిస్కషన్ అయితే పాయింట్స్ ఇస్తూ.. ప్రియాంకని ఏమొనద్దని అమర్కి చెప్పడం ఏం బాగోలేదని శోభా అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని రాత్రి నిద్రపోయే టైంలో తన ఫ్రెండ్స్ అయిన ప్రియాంక-అమర్తో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలానే ఇవ్వాలనుకుంటే నువ్వే(ప్రియాంక) నేరుగా ఇవ్వొచ్చు కదా, గౌతమ్ని బతిమలాడి అడగడం ఎందుకు? అని శోభా.. తన ఫ్రెండ్ ప్రియాంకతో చెప్పుకొచ్చింది. శోభాకి పనిష్మెంట్ 10వ గేమ్గా 'కలర్ బాల్స్' అన్ని ఒకే వరసలో సెట్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ నిలిచారు. అయితే ఈ పోటీ పూర్తయిన తర్వాత శోభా.. బంతుల్ని టచ్ చేసిందని చెబుతూ ఆమెకి పనిష్మెంట్ ఇస్తున్నట్లు బిగ్బాస్ కాస్త భయపెట్టాడు. కానీ పనిష్మెంట్గా అందరూ గంట నిద్రపోవాలని అన్నాడు. అందరూ పడుకుని లేచేసరికి బయట గార్డెన్ ఏరియాలో టీ-స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేశాడు. ఇవి తింటూ అందరూ తమతమ లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) ప్రశాంత్ భగ్న ప్రేమకథ ఈ టాస్కులో భాగంగా శివాజీ, శోభా.. తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల.. దాదాపు పెళ్లి వరకు ఓ వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్ని ప్రేమకథ చెప్పాలని బిగ్బాస్ చెప్పమన్నాడు. దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఓ రోజు పొలంకి వెళ్తుంటే.. దారిలో ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది. అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు. దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది. వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి.. పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశా, అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అర్జున్ మైండ్ గేమ్.. తొలి ఫైనలిస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో భాగంగా 'పట్టు వదలకురా డింభకా' అని పెట్టిన 11వ గేమ్ పెట్టారు. ఇందులో లోపలి నుంచి ఎవరికి వాళ్లు తాడుని డిఫెండ్ చేస్తూనే, కింద పడున్న జెండాలని తీసి, బుట్టలో వేయాలని చెప్పగా అర్జున్.. వేగంగా పదివరకు జెండాలని తన బుట్టలో వేశాడు. తర్వాత అమర్-ప్రశాంత్.. కనీసం అక్కడి నుంచి కదలకుండా చేశాడు. అలా చాలాసేపు ఉంచేశాడు. దీంతో బజర్ మోగింది. ఇక ముగ్గురిలో చివరి స్థానంలో నిలిచిన ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోయాడు. కాసేపు బాధపడ్డాడు. 'పాముతో చెలగాటం' అని ఫైనల్ పోటీ పెట్టగా.. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఏడో సీజన్ తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
టికెట్ టు ఫినాలే.. ఆదిలోనే రైతుబిడ్డ అవుట్.. కానీ..
డబుల్ ఎలిమినేషన్ సమయంలో గ్రూపులు బయటపడ్డాయి. హౌస్లో స్పా(శోభ, ప్రియాంక, అమర్), స్పై(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్లున్నాయని స్వయంగా నాగార్జునే బయటపెట్టాడు. దీంతో గ్రూప్ గేమ్ ఆడట్లేదంటూ అబద్ధాలు వల్లెవేస్తున్న శివాజీ నాటకాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఇక నామినేషన్స్తో బిగ్బాస్ హౌస్లో లెక్కలు మారిపోయాయి. స్పై బ్యాచ్కు దగ్గర్లో ఉన్న అర్జున్ నామినేషన్స్తో శివాజీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాలను పక్కనపెడితే బిగ్బాస్ ఫినాలేకు చేరుకోవడానికి టికెట్ టు ఫినాలేను ప్రవేశపెట్టాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్నవారు నేరుగా ఫైనల్స్కు వెళ్తారని చెప్పాడు. అయితే ఒకటీరెండు ఆటలు కాకుండా దాదాపు 10 వరకు టాస్క్లివ్వనున్నట్లు తెలుస్తోంది. టాస్క్లో గెలిచినవారికి వంద పాయింట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే వారే ఫినాలే అస్త్ర సొంతం చేసుకుంటారు. తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఫినాలే అస్త్ర కోసం మొదటి టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటలో ప్రశాంత్ మొదట అవుట్ అవగా.. అర్జున్ చివరి వరకు ఉండి గెలిచాడు. రెండో గేమ్లో ప్రశాంత్, మూడో గేమ్లో అర్జున్ గెలిచారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న శివాజీ, శోభ గేమ్లో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరు తమ పాయింట్లను అమర్కు త్యాగం చేసినట్లు వినికిడి! చదవండి: రంగులు గుమ్మరించినట్లుగా ఉన్న ఈ షర్ట్ ధరెంతో తెలుసా? -
శివాజీ ఆటలో బలిపశువుగా అర్జున్.. ఈ వారం అస్సాం టికెట్ ఫిక్స్!
ఎలిమినేషన్కు పునాదులు పడేది నామినేషన్లోనే! కేవలం నామినేట్ అయితేనే ఎలిమినేట్ అయిపోరు.. ఇక్కడ ఎవరు ఏ కారణాలు చెప్తున్నారు? ఎవరి తప్పొప్పులు బయటపడుతున్నాయి? ఇలా అన్నింటినీ గమనిస్తారు ప్రేక్షకులు. ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వారికి సపోర్ట్గా ఉంటారు. ఫలానా వాళ్లు తప్పనిపిస్తే వారికి ఓట్లేయడం మానేసి బయటకు పంపించేస్తారు. మరి ఈ పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూసేద్దాం... అబద్ధాలు ఆడుతున్నానా? ఈ వారం నామినేషన్ ప్రక్రియ రైతుబిడ్డతో మొదలైంది. సీక్రెట్ టాస్క్లో కూడా నీ ఫ్రెండ్ శోభాను కాపాడాలనుకున్నావ్, అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాను నామినేట్ చేశాడు ప్రశాంత్. గౌతమ్.. ప్రియాంక, శివాజీకి రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతానని నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు... అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ శివాజీకి రంగు పూసింది. తర్వాత ప్రశాంత్ను నామినేట్ చేసింది. పెద్ద తప్పు చేసిన అర్జున్ ఒక్కోసారి చిన్న తప్పులే మన మెడకు చుట్టుకుంటాయి. అలా గతవారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఏకంగా ఎలిమినేట్ అయిపోయింది అశ్విని. ఇక ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్ వేసిన అర్జున్ అంబటి ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్ను అడ్డుపెట్టుకుని అమర్ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్ కానీయకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్లో గౌతమ్ తప్ప ఎవరూ పసిగట్టలేకపోయారు. అర్జున్ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్ను కెప్టెన్ చేయండి అని చెప్పుంటే హీరో అయ్యేవాడు. అర్జున్కు దెబ్బ పడింది అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్ అయిపోయాడు. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్ కాదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదన్నాడు. నీకు కెప్టెన్ కావాలని ఇంట్రస్ట్ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్ను నామినేట్ చేశాడు. తర్వాత తనను నామినేట్ చేసిన గౌతమ్కు రివేంజ్ నామినేషన్ వేశాడు. తప్పు చేసిన అమర్, ఏడ్చేసిన ప్రశాంత్ అనంతరం అమర్దీప్ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేసిన ప్రశాంత్ను నామినేట్ చేశాడు. బీబీ మ్యాన్షన్ గేమ్లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ సిల్లీ రీజన్ చెప్పాడు. ఇది విని షాకైన ప్రశాంత్.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్ అన్నప్పటికీ ప్రశాంత్ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్. అలాగే తనకు కెప్టెన్సీ కోసం సాయపడలేదని గౌతమ్ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. చివరిగా శోభా.. ప్రశాంత్, యావర్లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్దీప్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు చిత్రం.. నిర్మాతకు కాస్ట్లీ కారు గిఫ్ట్ -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్ను అడిగాడు. దీనికి ప్రశాంత్పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్ కాలేదు. రైతుబిడ్డ రివేంజ్ వల్ల ఈ బ్యూటీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండుసార్లు రతిక ఎలిమినేషన్కి రైతుబిడ్డ ప్రశాంతే కారణమయ్యాడు. ఇంతకీ లేటెస్ట్ ఎలిమినేషన్లో ఏం జరిగింది? ప్రశాంత్, రతికపై ఎలా పగ తీర్చుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ హౌస్లో రతిక ఓ వింత కంటెస్టెంట్. ఎందుకంటే తొలి వారంలో ఎఫర్ట్ పెట్టింది. రెండో వారానికి వచ్చేసరికి రైతుబిడ్డ ప్రశాంత్తో ప్రేమ కహానీ మొదలుపెట్టింది. అక్కడివరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచేసరికి తనలోని మరో యాంగిల్ బయటకు తీసింది. అన్నిరోజులు క్లోజ్గా మూవ్ అయిన ప్రశాంత్పై రివర్స్ అయింది. దీంతో ఈమెకి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు గేమ్స్లోనూ రతిక సరిగా ఆడకపోవడం మరో మైనస్. ఫలితంగా ఐదో వారం ఈమెని ఎలిమినేట్ చేసి బయటకు తోసేశారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) అయితే బిగ్బాస్కి రతిక అంటే చాలా ప్రేమ. దీంతో వింత లాజిక్స్ అన్ని పెట్టి ఎలాగోలా రీఎంట్రీ పేరుతో ఈమెని మళ్లీ హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా గేమ్స్, టాస్కులు ఆడిందా అంటే నో ఛాన్స్. శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. దానికి తోడు ప్రశాంత్ తో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వారం రతిక, ప్రశాంత్.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరూ నామినేషన్స్లోనూ ఉన్నారు. ఇకపోతే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, హోస్ట్ నాగార్జున గత వారమే చెప్పారు. మరోవైపు ఈ వారం జరిగిన పోటీలో గెలిచిన ప్రశాంత్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్ సందర్భంగా ఉపయోగించేసినట్లు తెలుస్తోంది. తొలుత అశ్విని ఎలిమినేట్ అయిందట. రెండో విడతలో చివరగా రతిక, అర్జున్ మిగిలారట. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని చెప్పగా.. ప్రశాంత్ తన పాస్ ని అర్జున్ కి ఇచ్చేశాడట. అలా రతిక.. రైతుబిడ్డ వల్లే రెండోసారి ఎలిమినేట్ అయిపోయిందట. ఈ క్రమంలోనే రైతుబిడ్డ, రతికపై వేరే లెవల్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) -
సీక్రెట్ టాస్క్లో ఫెయిల్... జైలుకు వెళ్లిన శివాజీ!
బిగ్బాస్ హౌస్లో ఓ సరదా, సీరియస్ టాస్క్ జరుగుతోంది. బిగ్బాస్ భార్య వండిన బిర్యానీని హౌస్మేట్స్ ఆవురావురుమని ఆరగించారు. కరువులో కొట్టుమిట్టాడుతున్నట్లుగా మెతుకు మిగల్చకుండా ప్లేటు ఖాళీ చేశారు. ఇంతలో బిగ్బాస్ ఓ విషాద వార్త మోసుకొచ్చాడు. తన భార్యను చంపేసి ఆమె దగ్గరున్న నెక్లెస్ ఎత్తుకెళ్లారని, ఆ హంతకుడిని కనిపెట్టాలని కోరాడు. ఈ క్రమంలో అమర్, అర్జున్ పోలీసులుగా అవతారం ఎత్తగా అశ్విని, శోభా రిపోర్టర్లుగా మారారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్కు ఒక్కో రోల్ అప్పగించాడు. ఓపక్క హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోపక్క కంటెస్టెంట్లకు క్రమానుసారంగా సీక్రెట్ టాస్కులు ఇస్తున్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో శివాజీకి ఎవరికీ అనుమానం రాకుండా పల్లవి ప్రశాంత్, అశ్వినిని చంపాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఆ ఇద్దరినీ చంపాడు కానీ హౌస్మేట్స్ శివాజీయే చంపాడని పసిగట్టారు. దీంతో శివాజీని టాస్క్లో ఫెయిలైనట్లుగా తెలిపిన బిగ్బాస్ అతడిని జైల్లో వేసినట్లు తెలుస్తోంది. ఒక్క టాస్క్ అయినా సరిగా ఆడని శివాజీ పక్కవాళ్ల ఆటలకు మాత్రం వెయ్యి వంకలు పెడుతాడు. ఇప్పుడు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ కూడా సరిగా నిర్వర్తించలేక మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నాడు. చదవండి: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్.. -
ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?
బిగ్బాస్ షోలో ఆడుతున్న రైతుబిడ్డ ప్రశాంత్ మరో సూపర్ పవర్ సాధించాడు. శివాజీ గ్యాంగులో ఉన్నప్పటికీ ప్రతిసారి తనదైన మార్క్ చూపిస్తున్న ప్రశాంత్.. ఈసారి కీలకమైన పోటీలో గెలిచాడు. కాకపోతే ఇతడు గెలవడం ఓ లేడీ కంటెస్టెంట్కి శాపమయ్యేలా ఉంది. ఇంతకీ అసలేం జరిగింది? డేంజర్ జోన్లో ఉన్న ఆమె ఎవరు? ప్రస్తుతం బిగ్బాస్ హౌసులో 12వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలిన సగం ప్రసారం కానుంది. అయితే ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభాశెట్టి తప్పితే మిగిలిన వాళ్లందరూ నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే గతవారం యావర్, తను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేశాడు. దీంతో సదరు పాస్ కోసం ఈ వారం మళ్లీ పోటీ పెట్టారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఎవిక్షన్ పాస్ కోసం ప్లేట్లు, గ్లాసుల్ని బ్యాలెన్సింగ్ చేసే టాస్క్ పెట్టగా ఇందులో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు గానీ న్యూస్ అయితే బయటకొచ్చేసింది. అయితే ఈ పాస్ని ప్రశాంత్.. ఎప్పుడు ఉపయోగించాలనేది అతడి ఇష్టం. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఉపయోగించమని బిగ్ బాస్ చెప్పాడే అనుకుందాం. ప్రశాంత్ కి ఓట్లు పడతాయి కాబట్టి తన గురించి తాను ఉపయోగించకపోవచ్చు. ఎలిమినేషన్స్లో ఉన్న మిగతా వాళ్ల కోసం అంటే యావర్, శివాజీకి ఓట్లు పడతాయి కాబట్టి వాళ్లు సేవ్ అయిపోతారు. తనని నామినేట్ చేసిన గౌతమ్, గతవారం నామినేట్ చేసిన అర్జున్ కోసం దీన్ని ప్రశాంత్ ఉపయోగించకపోవచ్చు. ఎటొచ్చి మొన్నటివరకు ప్రశాంత్తో మంచిగా ఉన్న రతిక.. ఈసారి అతడిని నామినేట్ చేసి పడేసింది. కాబట్టి రతిక బదులు అశ్వినిని ప్రశాంత్ సేవ్ చేయొచ్చు. ఒకవేళ గొడవ పడకుండా, నామినేట్ చేయకుండా ఉంటే రతికని ప్రశాంత్ సేవ్ చేసి ఉండేవాడేమో? ఎందుకో ఈసారి రతిక ఎలిమినేట్ కావడం గ్యారంటీ అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ రెండు హిట్ మూవీస్!) -
Bigg Boss 7: రైతుబిడ్డతో గౌతమ్ 'పంచె' పంచాయతీ.. క్షమాపణలు చెప్పిన రైతుబిడ్డ!
బిగ్బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతికక చెప్పి మరీ అమర్ అలా ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమర్దీప్ - యావర్, రతిక గౌతమ్ - ప్రశాంత్, శివాజీ రతిక - అమర్దీప్, ప్రశాంత్ అర్జున్ - యావర్, శివాజీ ప్రశాంత్ - గౌతమ్, రతిక అశ్విని - సెల్ఫ్ నామినేషన్ యావర్ నో లాజిక్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు. ప్రశాంత్ vs గౌతమ్ తొలుత గౌతమ్, ప్రశాంత్ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్లో సంచాలక్గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు. శివాజీని లాజిక్స్తో కొట్టారు ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
తమ్ముడికి రతిక వెన్నుపోటు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అలాంటి మాటలు!
బిగ్బాస్ ముద్దుబిడ్డ రతిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఓసారి ఎలిమినేట్ అయి బయటకెళ్లి వచ్చినా ఇంకా బుర్ర పనిచేయట్లేదు. ఏకంగా తమ్ముడికే వెన్నుపోటు పొడిచి పారేసింది. రతికకు తోడు యవర్ కూడా అలానే మెంటలెక్కినట్లు బిహేవ్ చేశాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 73 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టాప్-10 ప్లేసుల కోసం గొడవ నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ఇప్పటివరకు 10 వారాలు పూర్తయ్యాయి కదా.. ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ చూసుకుని టాప్-10లో ఎవరు ఏ ప్లేసులో నిలబడాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో మొత్తం గొడవ గొడవ అవుతుందనుకుంటే చాలా సాదాసీదా గొడవలే జరిగాయి. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) ఏ కంటెస్టెంట్ ఏ స్థానంలో? 1 శివాజీ 2 యావర్ 3 ప్రశాంత్ 4 ప్రియాంక 5 శోభాశెట్టి 6 అమర్దీప్ 7 గౌతమ్ 8 అర్జున్ 9 అశ్విని 10 రతిక శోభా ఫస్ట్ టైమ్ ఏడుపు ఈసారి బిగ్బాస్ సీజన్లోకి వచ్చిన అమ్మాయిల్లో కాస్తోకూస్తో బెటర్ అంటే శోభా-ప్రియాంకనే. చాలామంది వీళ్లని తిడతారు గానీ ఇలాంటోళ్లు లేకపోతే అస్సలు మజా ఉండదు. అయితే ఇన్నాళ్ల గొడవలు, అరుపులతో హౌస్ మొత్తాన్ని గడగడలాడించిన శోభా.. అర్జున్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. టాప్-10లో శోభా ఏడో స్థానానికి సూట్ అవుతుందని చెప్పిన అర్జున్.. ప్రతిసారీ శోభాకు అదృష్టం కలిసొచ్చిందని కారణం చెప్పాడు. బయట కాస్త గంభీరంగా కనిపించిన శోభా.. బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. అమర్-ప్రియాంకతో దీని గురించి మాట్లాడుతూ తెగ బాధపడిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) రతిక వెన్నుపోటు ఆట తప్ప అన్నీ చేస్తున్న రతిక ఓసారి ఎలిమినేట్ అయింది. పిచ్చి కారణాలతో రీఎంట్రీ పేరు చెప్పి ఈమెని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చారు. అయినా సరే ఆడకుండా అలానే బండి లాక్కుని వస్తోంది. తాజాగా టాప్-10లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తొలి నాలుగు వారాల్లో నీ గేమ్ కనిపించలేదు, సొంతంగా గేమ్ ఆడలేవు, బిగ్బాస్ రూల్స్ అర్థం కావు, నువ్వు ఆడుతున్నావా? ఒకరి హెల్ప్తో(శివాజీని ఉద్దేశించి) గ్రూపులో ఆడుతున్నావా? అనేది కనిపించట్లేదని రతిక చెప్పింది. అలా శివాజీ గ్రూపులో కలిసిపోయిన రతిక.. అదే గ్రూప్లో పల్లవి ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచేసింది. ఇక రతిక అన్నేసి మాటలు అనేసరికి రైతుబిడ్డ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. 'నీ వెనకాల తిరిగా అన్నావ్, మా అమ్మ-నాన్నని తిట్టావ్, నన్ను గుండు గొరిగిస్తా అన్నావ్.. అయినాసరే హౌసుకి ఫస్ట్ కెప్టెన్ అయ్యా. నేను కెప్టెన్ అవ్వాలని అన్న(శివాజీ) లెటర్ త్యాగం చేసిండు. అర్థమైందా అక్కా' అని రతికకి ప్రశాంత్ వేరే లెవల్లో కౌంటర్ వేశాడు. దీంతో బిగ్బాస్ ముద్డుబిడ్డ ఆమె ముఖం మాడిపోయింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) యావర్కి నిజంగా పిచ్చే ఇక టాప్-10లో యావర్ ఎక్కడుండాలో అనేది అశ్విని చెప్పడానికి ట్రై చేస్తుంటే.. ఆమెతో యావర్ గొడవ పెట్టుకున్నాడు. ఒకానొక దశలో మాటామాటా పెరిగి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అశ్విని కోప్పడితే.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని యావర్ అన్నాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఏం లేనిదానికి యవర్, అశ్వినితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో యావర్కి నిజంగా పిచ్చి పట్టిందా అని డౌట్ వచ్చింది. అర్జున్ కే ఎవిక్షన్ పాస్ అయితే టాప్-10లో అందరూ నిలబడిన తర్వాత బిగ్బాస్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ తతంగం అంతా కూడా ఎవిక్షన్ పాస్ గురించి అని చెప్పి.. చివరి ఐదు స్థానాల్లో నిలబడిన వాళ్లకు పోటీ ఉంటుందని, అందులో విజేతగా నిలబడిన వాళ్లకు ఎవిక్షన్ పాస్ దక్కుతుందని చెప్పాడు. ఇందులో అమరదీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడగా.. అర్జున్ పాస్ గెలుచుకున్నాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అయితే శివాజీ.. కాస్త ఆడమ్మా అని రతికకి గైడెన్స్ ఇచ్చినా సరే సొంత గ్రూప్ మీదకే ఈ పిల్ల తిరగబడటం కాస్త వెరైటీగా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్పై పోలీస్ కేసు) -
'నా లైఫ్లో ఎవ్వరూ ఇలా చేయలే'.. రైతు బిడ్డ ఎమోషనల్!
బిగ్ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకుని చావండి.. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నరీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఆ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతోంది. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) ప్రోమోలో పల్లవి ప్రశాంత్కు నంబర్వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్లో ఎవ్వరు చేయలే.. అన్న చేసిండు.. పల్లవి ప్రశాంత్ సీజన్-7 ఫస్ట్ కెప్టెన్.. అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీకు సొంతంగా ఆడుతున్నవో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో.. అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్..గడ్డం గీకెస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్పై అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్ టీచ్ మీ దట్.. అని యావర్ అన్నాడు. ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించని విధంగా షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా- పుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశముందని ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరీ ఈ గేమ్లో ఎవరు గెలిచారు? ఎవరినీ ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇది చదవండి: ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?) -
అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు!
బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్ కార్డ్పై హౌస్లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్బాస్లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్ బాస్కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్బాస్లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. -
నెత్తిన పగిలిన బాటిల్స్, రైతుబిడ్డ సేఫ్.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది ఎలిమినేట్ అవడంతో హౌస్లో పది మంది మాత్రమే మిగిలారు. వీరందరూ టాప్ 5లో కర్చీఫ్ వేసేందుకు పోటీపడుతున్నారు. మరికొందరు కప్పు కొట్టుకుపోవాలని తహతహలాడుతున్నారు. ఎవరు ఫినాలేలో అడుగుపెట్టాలి? ఎవరు విజేతగా నిలుస్తారనేది ప్రజల చేతుల్లో ఉంది. రతికను రెచ్చగొట్టిన శివాజీ అయితే నామినేషన్స్ గండం గట్టెక్కితే కంటెస్టెంట్లు మరికొన్ని వారాలు హౌస్లో ఉండొచ్చు. మరి ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయో తెలియజేస్తూ తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో కెప్టెన్ శివాజీ.. నామినేషన్స్లో నీ టాలెంట్ చూపించు.. అంటూ రతికను రెచ్చగొట్టాడు. ఇంకేముంది.. రతిక రోజ్ రెచ్చిపోయింది. ప్రియాంక, శోభలను నామినేట్ చేసింది. కెప్టెన్ అంటే కేవలం బ్యాడ్జ్ పెట్టుకోవడమే కాదు, ఏం చేశావో చెప్పు.. అంటూ శోభా శెట్టిని నిలదీసింది. ప్రియాంకను కూడా ఏదో అడుగుతూ.. నేను అడిగినదానికి సమాధానం చెప్పు అంటూ ఆవేశంతో ఊగిపోయింది. సొంతంగా నామినేట్ చేశావా? అర్జున్ ఎవరూ ఊహించని రీతిలో రైతుబిడ్డను నామినేట్ చేశాడు. నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్ చెప్తున్నా.. నువ్వు ఓడిపోయావ్ అంటూ అతడి తలపై బాటిల్ పగలగొట్టాడు అర్జున్. అలాగే శోభనూ నామినేట్ చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఈ వారం కెప్టెన్ శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుబిడ్డకు ఒక్క ఓటు మాత్రమే పడటం వల్ల అతడు నామినేషన్స్లో లేడని సమాచారం. చదవండి: బిగ్బాస్ 7: టాప్ 5లో ఉండేది వీళ్లే! -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!
బిగ్బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ ఉన్నవాళ్లతో పాటు చూస్తున్న మనల్ని కూడా ఏడిపించేస్తున్నారు భయ్యా! తాజాగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. కొడుకుకి ధైర్యం చెబుతూనే ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? ప్రతిసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరో ఒకరు వస్తుంటారు. కాకపోతే పెద్దగా గుర్తింపు తెచ్చుకోరు. రైతుబిడ్డ ట్యాగ్తో బిగ్బాస్ 7లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. శివాజీ కూడా ఉండటం తప్పితే గేమ్ పరంగా ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఫ్యామిలీ వీక్ సందర్భంగా అందరూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. అలా పల్లవి ప్రశాంత్ తండ్రి బిగ్బాస్లో అడుగుపెట్టారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) పొలంలో పండిన బంతిపూలని తీసుకొచ్చిన ఆయనని చూసి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అమరదీప్తో మాట్లాడుతూ.. గొడవలు పడకండి బిడ్డా, మంచిగా కలిసి ఉండండి అని ప్రశాంత్ తండ్రి చెప్పారు. అలానే తండ్రిని ఎత్తుకుని ప్రశాంత్ తిప్పాడు. ఇద్దరూ కలిసి తగ్గేదే లే అనే డైలాగ్ కూడా చెప్పారు. తండ్రి అన్నం కూడా కలిపి తినిపించాడు. ఇదంతా అయిన తర్వాత కొడుకుతో మాట్లాడిన ఆయన.. 'టాలెంట్ ఉంది ఉపయోగించుకో, నేను ఏం చెప్పినా నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తుంది, ఆమెకు బీపీ కూడా పెరుగుతుంది' అని అన్నాడు. దాదాపు రెండు నెలల నుంచి కొడుక్కి దూరంగా ఉండటం వల్ల ప్రశాంత్ తల్లి తట్టుకోలేకపోతుంది. బహుశా అందుకో కాస్త అనారోగ్యానికి గురైనట్లు ప్రశాంత్ తండ్రి మాటల బట్టి తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోనే ఇంతలా ఎమోషనల్ చేసింది. ఇక ఫుల్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం ఉండబోతుందో? (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) -
బిగ్బాస్లోకి పల్లవి ప్రశాంత్ తండ్రి.. శివాజీతో ఏమన్నాడంటే..?
ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్లోని కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కోక్కరిగా వస్తూ అందరితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అలా ఈ వారం మొత్తం బిగ్ బాస్లో సందడి వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చేశారు. పల్లవి ప్రశాంత్, రతిక కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కనిపించనున్నారు. తాజాగా ప్రశాంత్ నాన్నగారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. (ఇదీ చదవండి: సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్) ప్రశాంత్ నాన్నగారు బంతిపూలు తీసుకుని బిగ్ బాస్లోకి అడుగుపెట్టారు. అతన్ని ముందుగా చూసిన శివాజీ ప్రశాంత్కు చెబుతాడు.. అప్పుడు ఒక్కసారిగా తన తండ్రి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆపై వారిద్దరూ కౌగిలించుకుని ఎమోషనల్ అవుతాడు. ఆ సమయంలో వారి వద్దకు శివాజీ రాగానే పల్లవి ప్రశాంత్ తండ్రి ఇలా అంటాడు.. నా బిడ్డను ఒక తండ్రి లెక్క చూసుకున్నావ్ అంటూ శివాజీతో అంటాడు. అలా అందరితో ఆయన పలకరిస్తూ వారిలో సంతోషాన్ని నింపుతాడు. ఈ సీజన్లో అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా ప్రశాంత్ అడుగుపెట్టాడు. అయితే అతను బిగ్బాస్లోకి రాకముందే అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు. అలా రైతుల బాధలను సాధరణ ప్రజలకు తెలుపుతూ నెట్టింట భారీగా క్రేజ్ సంపాందించాడు. పంటపొలంలో వ్యవసాయం చేస్తూ ఆయన తండ్రితో కూడా పలు వీడియోలు షేర్ చేశాడు. పట్టుబట్టి మరీ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాలని కోరికతో సీజన్ 7లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్. -
రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని
బిగ్బాస్ సీజన్-7లో సింగర్స్ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయితే.. గీతా మాధురి టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్లో సింగర్ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్లో ఉన్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్ బాస్.. దామినిలోని పాజిటివ్ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. హౌస్లో వారికి చాలామందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను కూడా పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకునే బిగ్ బాస్లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్ బాగాలేదు.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది. రాహుల్తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని బిగ్ బాస్ నుంచి నేను బయటికి రాగానే రాహుల్ సిప్లిగంజ్- రతికా రోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్ టాపిక్ రతక తెచ్చింది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. బిగ్ బాస్ విన్నర్ అతనే రతికా రోజ్ను రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్ బాస్ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్తో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది. అతనొక కామన్ మ్యాన్గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది. ప్రశాంత్ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్ వారంలో ఏసీ కూడా సెట్ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్ టీమ్ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది. -
అందుకే నన్ను పంపించేశారు.. అతనంటే భయమా?: ఆట సందీప్
ఉల్టా పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ షో అభిమానులను అలరిస్తోంది. ఈ వారంలో హౌస్మేట్స్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ చేసే సమయంలో కంటెస్టెంట్స్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈసారి కూడా మరింత హాట్హాట్గా మారిపోయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వడంతో బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం కంటెస్టంట్స్కు గేమ్ టాస్కులు ఇచ్చాడు. ఇంటి సభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అశ్విని గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. రైతుబిడ్డ అవుట్! అయితే రెండు టీమ్స్కు బిగ్బాస్ మొదట జంపింగ్ జపాంగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందరూ మాట్లాడుకుని పల్లవి ప్రశాంత్ను గేమ్ నుంచి తప్పించారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేయించారు. అతనంటే భయమా? అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ను గేమ్ నుంచి తప్పించడంపై ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాపం రా.. ప్రశాంత్ మంచి ప్లేయర్ ఎందుకు గేమ్ నుంచి పక్కన పెట్టారు. అతనంటే భయపడుతున్నారా? అందుకే గేమ్ నుంచి తప్పించారా? అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను పక్కన పెడితే గేమ్లో అసలు కిక్కే ఉండదు అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. గేమ్లో గట్టి పోటీనిచ్చేవారితోనే ఆడాలి..నేను స్ట్రాంగ్ ప్లేయర్ అయినందుకే నన్ను హోస్ నుంచి బయటికి పంపారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. -
వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్బాస్ తర్వాత బిగ్బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
ఆటలో రైతుబిడ్డ ఔట్.. ప్రశాంత్ మెడలో డెడ్బోర్డు వేసిన శివాజీ
నామినేషన్స్తో బిగ్బాస్ హౌస్ వేడెక్కిపోయింది. ఈ పోట్లాటలు చాలు.. ఆట మొదలుపెడదాం అనుకున్నాడు బిగ్బాస్. ఈ వారం ఇంటిసభ్యులను రెండు టీమ్గా విడగొట్టి టాస్కులు పెడుతున్నాడు. ఈ క్రమంలో మొదట బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక టీమ్ నుంచి తేజ, ప్రిన్స్ యావర్ వస్తే మరో టీమ్ నుంచి అర్జున్, ప్రశాంత్ వచ్చి ఆడారు. ఈ గేమ్లో రెండు టీమ్ల మధ్య చిన్నగొడవ జరిగినట్లు కనిపిస్తోంది. ఇంతలో బిగ్బాస్ లెటర్ పంపించాడు. గెలిచిన టీమ్.. అవతలి టీమ్లో నుంచి ఒక ఆటగాడిని గేమ్ నుంచి తప్పించవచ్చని పేర్కొన్నాడు. వారి మెడలో డెడ్ బోర్డ్ వేయాలన్నాడు. దీంతో గౌతమ్ తన మాస్టర్ మైండ్ను ఉపయోగించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ప్రశాంత్ను ఆట నుంచి సైడ్ చేశాడు. ప్రశాంత్ను పక్కన పెట్టేయాలని నిర్ణయించడంతో శివాజీ అతడి మెడలో డెడ్ బోర్డ్ వేశాడు. అయితే మొదటి టాస్కులోనే తనను తప్పించడంతో ప్రశాంత్ కంటతడి పెట్టుకున్నాడు. రైతుబిడ్డను ఓదార్చిన అర్జున్.. ఒకరకంగా దీనివల్ల పాపులారిటీ పెరుగుతుందిలే అని సముదాయించాడు. అశ్విని అయితే.. వాడు మంచిగా ఆడుతున్నాడని అందరూ కుళ్లుకుని తీసేశారని అభిప్రాయపపడింది. మరోపక్క తేజను అమ్మాయిగా రెడీ చేశారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న తేజ అమ్మాయిలను హగ్ చేసుకోవడానికి పోటీపడ్డాడు. ఇక రానున్న గేమ్స్లో ఎవరు గెలుస్తారు? ఎవర్ని సైడ్ చేస్తారనేది చూడాలి! చదవండి: ఈ వారం నామినేషన్లో ఉంది వీళ్లే -
బిగ్బాస్లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!
టాలీవుడ్ నటుడు బాలాదిత్య గురించి పరిచయం అక్కర్లేదు. చంటిగాడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతేడాది బిగ్బాస్ సీజన్లో పాల్గొన్న బాలా.. గతంలో మా ఊరి పొలిమేర చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఈ సినిమాకు మా ఊరి పొలిమేర -2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. బాలాదిత్యతో పాటు సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల, అక్షత ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకులను అలరించనుంది. గతేడాది బిగ్బాస్ రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సీజన్లో బిగ్బాస్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాలాదిత్యా మాట్లాడుతూ.. 'బిగ్బాస్ హౌస్లో ఉన్నవారిలో అంబటి అర్జున్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను, అతను జిమ్ మేట్స్. అర్జున్ బాగా స్మార్ట్గా ఆడుతున్నాడు. బిగ్బాస్ నాకు చాలా నేర్పించింది. ఈ రియాలిటీ షో అనేది ఓ గేమ్. ఇందులో కొంతమంది ఫేక్లానే అనిపిస్తారు. కొందరు జెన్యూన్లా కనిపిస్తారు. హౌస్లో ఎంత తెలివిగా ఆడుతున్నామనేదే మనకు ముఖ్యం. పల్లవి ప్రశాంత్, రతిక గురించి తెలుసు. హౌస్లో మన ఫర్మామెన్స్ మాత్రమే ఆడియన్స్ చూస్తారు. నువ్వు ఎంత లాజిక్గా ఆడుతున్నావనేదే ఆడియన్స్ గుర్తిస్తారు. ఐదు వారాలా తర్వాత వచ్చినవారికి కాస్తా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో డిస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ను మీరు ఎంత బాగా ఆడుతున్నారనేదే ముఖ్యం ' అని చెప్పుకొచ్చారు. -
పల్లవి ప్రశాంత్పై సందీప్ పాజిటివ్ కామెంట్స్.. అదే కారణమా?
బిగ్బాస్ సీజన్-7 ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా టాప్-5లో ఉంటాడని భావించిన ఆట సందీప్ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. ఈ వారం నామినేట్ అయినవారిలో శోభాశెట్టి, సందీప్కు తక్కువ ఓట్లు రాగా.. చివరికీ సందీప్ బయటకు రావాల్సి వచ్చింది. ఏడు వారాలుగా నామినేషన్స్లో లేని అతను బయటికి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతను హౌస్లో వందశాతం గేమ్ బాగా ఆడుతున్నాడని ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్) సందీప్ మాట్లాడుతూ..'రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేక్ హా, జెన్యూన్ అని నేను చెప్పలేను. తాను వందశాతం గేమ్ ఆడుతున్నాడు. అతనితో పాటు అందరూ కూడా గట్టిగానే వందశాతం ఎఫర్ట్ చూపిస్తున్నారు. ఆడని వాళ్లు హౌస్లో చాలామంది ఉన్నారు. నేను అనుకోలేదు ఇలా బయటకొస్తానని. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో.. ఆడనివాళ్లు బయటకొస్తారని నేను అదే అనుకున్నా. అంతే కాన్ఫిడెంట్గా ఉన్నా. కానీ నా ఎలిమినేషన్ ఊహించలేదు. అమర్ లాస్ట్ టైమ్ నామినేషన్స్లో ప్రశాంత్ పట్ల మాట్లాడింది తప్పు. ఏదైతే ఆ పదం ఉందో 'ఈ నా కొడుకు' అన్నది తప్పు అన్న. దాన్ని నేను కూడా అంగీకరించను.' అంటూ ప్రశాంత్ పట్ల పాజిటివ్ కామెంట్స్ చేశారు. సందీప్ మాట్లాడుతూ..'ఇప్పటికీ హౌస్లో నా కన్నా తక్కువగా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. రతిక రోజ్, భోలే షావలి ఆడిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ముందే భోలే వెళ్ల పోవచ్చని అనుకున్నా. హౌస్లో ఉన్నప్పుడు నా ఆటను నేను బాగానే ఆడా. ఒక గ్రూప్ అంటూ మమ్మల్ని వేరు చేయటం సరికాదు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్దీప్లు టాప్-3లో ఉంటారు' అని చెప్పుకొచ్చారు. సోషల్ వార్ అయితే సందీప్ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ను నామినేట్ చేసే విషయంలో ఇద్దరి మధ్య కాస్తా వాదన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ సపోర్టర్స్కు, సందీప్ భార్య జ్యోతిరాజ్కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. అదే సమయంలో సందీప్ భార్య జ్యోతిరాజ్ను ఓ వీడియోను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ విషయాన్ని ఇటీవలే ఇంటర్వ్యూలోనూ జ్యోతిరాజ్ ప్రస్తావించింది. పల్లవి ప్రశాంత్ మద్దతుగా ఉండేవాళ్లే అతన్ని ఎలిమినేట్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. బిగ్ బాస్ అనేది ఒక షో అని.. ఇందులో కుటుంబ సభ్యులను లాగడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే సందీప్ అలా మాట్లాడి ఉంటారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్.. సందీప్ ఫ్యాన్స్కు మధ్య సోషల్ వార్కు ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. (ఇది చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్లో ఉన్నదెవరంటే?) -
'నీ మొగుడు వేస్ట్.. నేను చెప్పకూడని మాటలన్నారు': జ్యోతిరాజ్ ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కంటెస్టెంట్గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి హౌస్లో చురుకుగా ఉంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య జ్యోతిరాజ్ సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ తమపై చేసిన కామెంట్స్పై స్పందించారు. వీళ్లంతా కలిసి అతన్ని ఎలిమినేట్ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఉందని జ్యోతిరాజ్ అన్నారు. తమపై ట్రోల్స్ను తలుచుకుని ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్) జ్యోతిరాజ్ మాట్లాడుతూ..'రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు. అతను ఇంట్రావర్ట్. హౌస్లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్బాస్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను ఫైనల్గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం.'అని అన్నారు. పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ట్రోల్స్పై స్పందిస్తూ..'ప్రశాంత్కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ఇంకా చెడగొడుతున్నారు. మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు. మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా?. ఆ విషయంలో నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. నీ మొగుడు వేస్ట్.. అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడమేంటి? ప్రశాంత్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్ జోలికి రావొద్దని. ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు. దానివల్ల ఎవరికీ చెడ్డపేరు. తమ్ముడు ప్రశాంత్కే కదా. అతను లోపలికి వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. వీళ్లంతా కలిసి ప్రశాంత్కు బ్యాడ్నేమ్ తెస్తున్నారు.' అని అన్నారు. (ఇది చదవండి: గ్రాండ్గా ఆ హీరో హీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) కాగా.. ఇప్పటికే బిగ్బాస్లో ఉన్న సందీప్పై ట్రోల్స్పై జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్బాస్ మారథాన్లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్బాస్ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్బాస్ హౌస్మేట్స్కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు సగానికి పైగానే పూర్తి అయింది. ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఉల్టాపుల్టా పేరుతో రతికా రోజ్ రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. భోలే, అమర్ చేసిన వ్యాఖ్యలు అందులే భాగమే... ఇన్నీ చేస్తున్నా ఆడియన్స్లో అనుకున్నంత రీచ్ అయితే ఈ సీజ్న్ చేరుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్పై కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్,యావర్,రతికా రోజ్, అమర్ వంటి వారి ఆటతీరుపై ఆయన స్పందించాడు. సమాజంలో పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకే శివాజీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి మాయమర్మం చేయకపోతే జనాలు నమ్మరు. ఉదాహరణకు సత్యసాయిబాబ నోటి నుంచి శివలింగం, చేతి నుంచి విభూతి తీసి ప్రజలను ఎలా నమ్మించారో తెలిసిందే. (ఇదీ చదవండి: నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన శ్రీలీల) అలాగే శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు (పల్లవి ప్రశాంత్) సాయం చేస్తూ తన ఇమేజ్ను చూపించుకునేందుకు, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. హౌస్లో ప్రశాంత్,యావర్కు మాత్రమే శివాజీ సపోర్ట్గా ఉంటున్నాడు. వారిద్దరు కాకుండా మరో వ్యక్తి ఉంటే చూపించండి. యావర్కు పెద్దగా తెలుగు రాదు కాబట్టి కొంత వరకు మొదట్లో ఇబ్బంది పడ్డాడు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ అవుతుంది. మన ఇండియన్స్ అంతా సెంటిమెంట్కు పడిపోతాం అది మన బ్లడ్లోనే ఉంది. అందుకే రైతు బిడ్డ అని చెప్పగానే ప్రశాంత్పై సానుభూతితో కూడిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ప్రశాంత్ గెలిస్తే శివాజీ ఎందుకు..? ఈ పాయింట్నే తెలివిగా శివాజీ అందిపుచ్చుకున్నాడు. అందుకే ప్రశాంత్కు ప్రతి విషయంలో శివాజీ సపోర్ట్ చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా బిగ్బాస్ ఎంట్రీకి ముందే బయట మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది. ఇది నా అభిప్రాయం. వారిద్దరూ సోషల్ మీడియాలో గుర్తింపు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్కు వేరువేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే బిగ్బాస్లోకి వచ్చారు. హౌస్లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే వారి ప్లాన్ను అమలు చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్ నువ్వు గెలవాలి రా అని శివాజీ పదేపదే అంటున్నాడు. ప్రశాంత్ గెలిస్తే బిగ్బాస్లోకి శివాజీ ఎందుకు వెళ్లినట్లు అని నటరాజ్ ప్రశ్నించాడు. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్, పలు సోషల్ మీడియాలను రన్ చేస్తున్న వారిని పల్లవి ప్రశాంత్ ముందే కలిసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడని నటరాజ్ మాస్టర్ చెప్పాడు. బిగ్ బాస్లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ్యాన్స్ పేజీలు ఉన్న వాళ్లందరినీ ప్రశాంత్ ముందే కలిశాడు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసే బిగ్ బాస్లోకి వెళ్లాడు. వాటంన్నిటికీ తోడు శివాజీ ఇస్తున్న సపోర్ట్ వల్ల కూడా ప్రశాంత్ స్ట్రాంగ్ అయ్యాడు. కానీ రైతు బిడ్డలా మాత్రం హౌజ్లో ప్రశాంత్ కనిపించడంలేదు. అతనిపై సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అతని నామినేషన్ ప్రక్రియ చూస్తున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ఈజీగా కనిపిస్తుంది. -
శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు!: పూజా
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. (ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) 'పల్లవి ప్రశాంత్, యావర్కు శివాజీ సపోర్ట్గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) -
ఎవరెన్ని వెధవ ప్రయత్నాలు చేసినా కప్పు కొట్టుకునే పోతా: అమర్
వారాలు గడిచేకొద్దీ, హౌస్లో జనం పలుచబడే కొద్దీ నామినేషన్స్ రసవత్తంగా మారుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్స్తో ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టేశాడు బిగ్బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్లీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా అది కొనసాగేట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మధ్యలో దూరిన శివాజీ.. గౌతమ్ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్తో పాటు అమర్దీప్ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్- అమర్ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె షావళి కలుగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కుర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడతావ్.. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అడిగాడు. విశ్వరూపం చూపించిన అమర్ అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే చేసేయండి అని బదులిచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంత వెధవ ప్రయత్నాలు చేసినా కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అని తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి- భోలె షావళిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. తేజ- అశ్విని మధ్య సైతం ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్స్తో కంటెస్టెంట్ల మధ్య ఆరని చిచ్చు పెట్టేశాడు బిగ్బాస్. చదవండి: హీరోతో లవ్లో ఉన్న యాక్షన్ కింగ్ కూతురు -
నామినేషన్స్లో రైతుబిడ్డ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన గౌతమ్!
నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు హడలెత్తిపోతుంటారు. కొందరేమో దొరికిందే ఛాన్సని అవతలి వారి మీదున్న కోపాన్ని నామినేషన్స్ ద్వారా తీర్చుకుంటారు. మరికొందరేమో మండే రోజే తమలోని కళల్ని బయటకు తీస్తారు. రైతుబిడ్డగా జనాల్లో బీభత్సమైన సింపతీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ రెండో కేటగిరీకి చెందుతాడు. సాధారణ రోజుల్లో తన ధ్యాసంతా గేమ్ మీదే పెడతాడు.. బాగా ఆడతాడు కూడా! కానీ, పొరపాటున తనను ఆటలో నుంచి తీసేసినా.. ఎవరైనా నామినేట్ చేసినా అస్సలు భరించలేడు. విశ్వరూపం చూపిస్తాడు. ఊరోడు అన్నావ్.. మళ్లీ అనలేదని మాట మార్చావ్ నిన్నటి నామినేషన్స్లోనూ అదే జరిగింది. గౌతమ్ తనను నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎప్పటిలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. సందీప్ మాస్టర్ను ఊరోడు అన్నావు.. తర్వాతేమో అనలేదని మాట మార్చావు.. అలా రెండు మాటలు మాట్లాడటం నచ్చలేదంటూ ప్రశాంత్ ఫోటోను మంటల్లో వేయబోయాడు గౌతమ్. అయితే ప్రశాంత్ మాత్రం.. నేను మాట్లాడాక నా ఫోటోను మంటల్లో వేయు. కాసేపైనా నా ఫోటో చూసుకుంటూ మాట్లాడతా.. గట్లే ఉంటదా అన్న.. ఫోటో చూపెట్టు.. ఎంత బాగుంది.. అంటూ రాగాలు తీశాడు. గౌతమ్ చెప్పిన పాయింట్ ఎలాగూ కరెక్టే కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేక.. అది అయిపోయిన విషయం.. సందీప్కు సారీ చెప్పేశానంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. అంతేకాదు, తన మేనరిజాన్ని చూపిస్తూ అవతలివారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. ఈ యాక్టింగ్ చూసి నవ్వుకున్న గౌతమ్.. నువ్వెప్పుడూ నన్ను నామినేట్ చేయలేదా? అప్పుడు నేను ఇలాగే ప్రవర్తించానా? అని ప్రశ్నించగా ప్రశాంత్ దగ్గరి నుంచి సమాధానమే కరువైంది. పైగా అలాగే ఓవరాక్షన్ చేస్తుండటంతో ఎందుకురా? మంట ఆరదు, నీతి చావదు అన్న మాటలెందుకు? నీ నీతి, నిజాయితీ గురించి నేనేమీ మాట్లాడట్లేదు.. నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎందుకేడ్చావు? అదంతా యాక్టింగా? అని వరుస ప్రశ్నలతో ప్రశాంత్కు ఇచ్చిపడేశాడు. వెనక్కు తగ్గని డాక్టర్ బాబు అయినా ప్రశాంత్ ఓవరాక్టింగ్ చేస్తూనే ఉండటంతో నేనేమీ ఆడిషన్ చేయట్లేదు అని కౌంటరిచ్చాడు డాక్టర్ బాబు. తర్వాత హౌస్లో అందికంటే మీరు వీక్గా ఉన్నారనిపిస్తోందంటూ భోలె షావళిని నామినేట్ చేశాడు గౌతమ్. దీనికతడు నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు.. నేను వీక్ అని చెప్పకు అంటూ వెక్కిరిస్తూ పాటలు పాడాడు. అయినా సరే డాక్టర్ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రైతుబిడ్డ ఇలాగే అతి చేస్తే రానున్న రోజుల్లో ఎలిమినేట్ అవడం ఖాయమే! చదవండి: భగవంత్ కేసరికి సీక్వెల్.. డైరెక్ట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!
బిగ్బాస్ 7లో ఆడుతున్న రైతుబిడ్డ మాటల మార్చి దొరికిపోయాడు. ప్రూఫ్స్తో సహా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇక శివాజీ హౌసులో ఉంటాడా? వెళ్లిపోతాడా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు శివాజీ గురించి పెద్దగా మాట్లడని కంటెస్టెంట్ అతడి గురించి నిజాల్ని బయటపెట్టాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 48 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. భోలెకి నాగార్జున క్లాస్ కెప్టెన్సీ టాస్కులో సందీప్, అర్జున్ చివరి స్టేజీకి చేరుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీళ్లిద్దరి మధ్య ఫైనల్ గేమ్ పెట్టడంతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇందులో గెలిచిన అర్జున్.. బిగ్బాస్ 7 హౌసుకి మూడో కెప్టెన్ అయ్యాడు. ఇక ఇదంతా చూసిన హోస్ట్ నాగార్జున ప్రస్తుతానికి వచ్చేశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికీ క్లాస్ పీకాడు. ఈ వారం నామినేషన్స్లో బూతులు మాట్లాడి అతి చేసిన భోలెకి గట్టిగా పడ్డాయి. అతడు మరోసారి ఇలాంటివి జరగవని చెప్పాడు. దీంతో సమస్య అక్కడితో సాల్వ్ అయింది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) రైతుబిడ్డ నిజస్వరూపం రైతుబిడ్డ అనే ట్యాగ్తో ప్రతిసారి సింపతీ గేమ్ ఆడుతున్న ప్రశాంత్.. ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్స్లో భాగంగా.. సందీప్ తనని 'ఊరోడు' అని అన్నాడని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని బయటకు తీసిన హోస్ట్ నాగార్జున.. మొత్తం గొడవ క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే నామినేషన్స్లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయిన ప్రశాంత్.. నాగ్ అడిగేసరికి మాత్రం నంగనాచి కబుర్లు చెబుతూ పిల్లిలా ప్రవర్తించాడు. హౌస్ట్ నాగార్జున.. ప్రశాంత్ చేసి తప్పని నేరుగా చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇంట్లోని సభ్యులైన పూజా, అర్జున్లతో ఈ విషయాన్ని చెప్పించాడు. ప్రశాంత్ మాటలు మార్చేస్తున్నాడని ఈ ఇద్దరు చెప్పారు. దీంతో రైతుబిడ్డ నిజస్వరూపం బయటపడినట్లయింది. అయితే సందీప్ చెప్పిన తర్వాత అలా కాదు ఇలా అన్నానని చెప్పడానికి ప్రయత్నించానని, కానీ చెప్పే అవకాశం ఇవ్వలేదని నాగార్జునతో చెప్పాడు. కానీ ఇది కూడా అబద్ధమే. నాగ్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈ గొడవని పుల్స్టాప్ పెడదామని ఫిక్స్ అయిన నాగ్.. 'నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు' అని అనడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ ప్రశాంత్ మాటలు మార్చి అడ్డంగా దొరికిపోవడంతో అతడి పరువంతా పోయినట్లయింది. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) పాము నిచ్చెన గేమ్ ఇక బిగ్బాస్ 7వ సీజన్ 100 రోజుల గేమ్ అని, శనివారం 50వ రోజు అని చెప్పిన నాగార్జున.. పాము-నిచ్చెన అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్స్.. హౌసులోని తమకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు కిందకు లాగుతున్నారు? అనేది చెప్పాల్సి ఉంటుంది. కంటెస్టెంట్.. నిచ్చెన, పాము ఎవరు? అశ్విని.. గౌతమ్, శోభా గౌతమ్.. అర్జున్, శివాజీ శివాజీ.. యవర్, అమరదీప్ అమరదీప్.. అర్జున్, తేజ అర్జున్.. గౌతమ్, శివాజీ యవర్.. శివాజీ, గౌతమ్ పూజా.. అర్జున్, అశ్విని ప్రియాంక.. శోభా, అశ్విని భోలె.. శివాజీ, శోభాశెట్టి శోభాశెట్టి.. ప్రియాంక, భోలె సందీప్.. శోభా, శివాజీ తేజ.. అమరదీప్, యవర్ ప్రశాంత్.. శివాజీ, పూజా ఈ ఆటలో భాగంగా శివాజీ రెండు వైపుల ఉన్నాడు. అతడి సపోర్టర్స్ అయిన ప్రశాంత్, యవర్, భోలె.. నిచ్చెన అని చెప్పారు. మరోవైపు గౌతమ్, అర్జున్,సందీప్.. శివాజీ పాములాంటోడని చెప్పారు. మరోవైపు శివాజీ.. తన ఆరోగ్యం గురించి నాగార్జునతో మాట్లాడాడు. శరీరం సహకరించట్లేదని బయటకెళ్లిపోతానని అన్నాడు. ఉండమని చెప్పడంతో.. ఫిజియోని ఏర్పాటు చేయాలని శివాజీ అన్నాడు. దీనికి నాగ్ ఒప్పుకొన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆదివారం ఎపిసోడ్లో తేలుతుంది. (ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
మా నాన్న కూడా ఊరోడే.. ఇప్పుడేంటి ప్రశాంత్?: నాగ్ ఫైర్
ఈ వారం నామినేషన్స్ భలే రసవత్తరంగా సాగాయి. భోలె బూతులు మాట్లాడటం.. అది వినలేక ప్రియాంక, శోభ చిందులు తొక్కడం.. ప్రశాంత్ తనను ఊరోడన్నారని బాధపడటం.. నేను అనలేదు మహాప్రభో అని సందీప్ మాస్టర్ తన కళ మీద ఒట్టేయడం.. ఇలా చాలానే జరిగాయి. వీటన్నింటి గురించి మాట్లాడేందుకు వచ్చేశాడు నాగార్జున. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. కుండ బద్ధలు కొట్టిన నాగ్ బిగ్బాస్ హౌస్లో కుండ బద్ధలు కొట్టి చెప్పాల్సిన నిజాలున్నాయంటూ నాగ్ మొదలుపెట్టాడు. మొదట అశ్విని కుండ బద్ధలు కొట్టిన నాగ్.. రేయ్, పోరా అని మాట్లాడుతున్నావ్ అని చెప్పగానే ఆమె బిక్కముఖం వేసింది. ఇక భోలె కుండ బద్ధలు కొట్టిన నాగ్.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చింది? అని నిలదీశాడు. దీనికి భోలె.. శోభ సెన్స్ లేదు అనేసరికి అలా అనాల్సి వచ్చిందని చెప్పాడు. సెన్స్లెస్కు మెంటల్కు చాలా తేడా ఉందని గరమయ్యాడు కింగ్. అమర్ కేక్ తినడం అవసరమా? అమర్ కేక్ తిన్నప్పుడు బిగ్బాస్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. గ్రూపిజమా? అని శోభను ప్రశ్నించాడు నాగ్. తర్వాత అమర్తో మాట్లాడుతూ.. అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా? నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా? అని అడగడంతో నీళ్లు నమిలాడు అమర్. తేజ అందరినీ రెచ్చగొడుతున్నాడన్నాడు నాగ్. ఇక నామినేషన్స్లో సందీప్ మాస్టర్ తనను ఊరోడు అని చులకన చేశాడని నానా రభస చేసిన సంగతి తెలిసిందే! తాను అనలేదని సందీప్ ప్రమాణం వేసి మరీ చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తు చేసిన నాగ్.. సందీప్ ఒట్టేసినప్పుడు నువ్వెందుకు వేయలేదని ప్రశ్నించాడు. ఏడుపందుకున్న ప్రశాంత్ 'ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. ఇవన్నీ కాదు.. అసలు ఊరోడు అనడం తప్పా?' అని సూటిగా ప్రశ్నించాడు. 'అందరూ ఊరి నుంచే వచ్చారు. అందరికీ తిండి పెట్టేది ఊరే.. నేను గర్వంగా చెప్తున్నాను మా నాన్న ఊరోడు. సగర్వంగా చెప్తున్నా.. అందులో తప్పే లేదు' అని కౌంటరిచ్చాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలాగే ఏడుపు అందుకున్నాడు. చదవండి: సింగర్ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు! -
అమర్ దీప్ బ్యాక్గ్రౌండ్ తెలుసా.. అనంతపూర్ నుంచి లండన్ ఆపై..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ టైటిల్ విన్నర్గా ఆట బరిలోకి దిగిన అమర్లో గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తన ఆటలో రాణిస్తున్నాడు. ఐదు వారాలుగా ఎలిమినేషన్లో లిస్ట్లో ఉన్నా... ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతూ తన సత్తాను చాటుతున్నాడు. ప్రతి గేమ్లోనూ పట్టువదలకుండా ఆడుతూ ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో సమాధానం ఇస్తున్నాడు. కానీ బిగ్బాస్ లైవ్ చూస్తున్న వారు మాత్రం అమర్కు అన్యాయం జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. హౌస్లో ఆయన చేస్తున్న మంచి పనులను చాలా వరకు ప్రసారం కావడం లేదని చెప్పుకొస్తున్నారు. కేవలం అమర్ తప్పుల్ని మాత్రమే బయటి ప్రపంచానికి చూపుతున్నారనే విమర్శలు అమర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్) తాజాగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు అమర్ తల్లి రూప, అతని భార్య తేజస్వని గౌడల పట్ల అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆయన అమ్మగారు కన్నీరు పెట్టిన విషయం తెలిసందే. బిగ్బాస్ను ఎంటర్టైన్మెంట్ షోగా మాత్రమే చూడండి. కంటెస్టెంట్ల కుటుంబాలకు చెందిన వ్యక్తులను భూతులతో తిట్టడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని పలువురు తెలుపుతున్నారు. అనంతపురం నుంచి లండన్కు అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జన్మించాడు. ఆయన తండ్రి అమీర్ బాషా. కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కూడా.. అమర్ తల్లి పేరు రూపా.. ఆమె కూడా కూచిపూడి నృత్యకారిణి. గతంలో ఆమె బీజేపీలో క్రీయాశీలకంగా పనిచేశారు. అలా అనంతపురం ప్రాంతంలో ప్రముఖంగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదివిన అమర్.. మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లి 2016లో పూర్తి చేసి తిరిగొచ్చాడు. తర్వాత కేరళలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి సినిమాలపైన మక్కువతో హైదరాబాద్ వచ్చేశాడు. (ఇదీ చదవండి: ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా) అలా తన జాబ్ను పక్కన పెట్టి లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లలో నటించాడు. వాటిలో నా పబ్ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ,గర్ల్ఫ్రెండ్ పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్ వంటివి మంచి గుర్తింపు తెచ్చాయి. మొదటిసారి 2017లో 'ఉయ్యాల జంపాలా' అనే సీరియల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు అమర్. ఆ తర్వాత 'సిరి సిరి మువ్వలు' అశ్విన్ అనే ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రియాంక జైన్తో కలిసి 'జానకి కలగనలేదు' సీరియల్తో మరింత పాపులర్ అయ్యాడు. కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో కూడా ఆమర్ మెరిశాడు. కన్నడ బ్యూటీతో ప్రేమ పెళ్లి ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని అమర్ తల్లి రూపతో చెప్పి ఆపై అందరీ అంగీకారంతో కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఆమర్కు హీరో రవితేజ అంటే చెప్పలేనంత అభిమానం. రవితేజ స్టైల్నే అమర్ కూడా అనుసరిస్తూ ఉంటాడు. -
ట్రాక్ తప్పుతున్న రైతుబిడ్డ.. నామినేషన్స్లో ఒక్క పాయింట్ తిన్నగా లేదు!
బిగ్బాస్ హౌసులో నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో లాజిక్స్ కంటే అవసరమైన సోది ఎక్కువైంది. రైతుబిడ్డ ప్రశాంత్ అయితే అపరిచితుడులా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదేదో అరుస్తూ రెచ్చిపోయాడు. శివాజీ విషయంలోనూ అందరికీ చిన్న షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 43 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి సమస్యలు నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఆమె వెళ్లిపోవడంతో అందరూ అలానే షాక్లో ఉండిపోయారు. ఉదయానికి మళ్లీ నార్మల్ మూడ్లోకి వచ్చేశారు. ఐదోవారం ఓ గేమ్లో భాగంగా శివాజీ భుజానికి గాయమైంది. దాదాపు 10 రోజులకు పైగా అలానే మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడిని ఎక్స్రే తీసేందుకు బయటకు తీసుకెళ్లి మళ్లీ రాత్రికి తిరిగి తీసుకొచ్చేశారు. ఏదో పెద్ద మనిషిలా అందరికీ సలహాలిస్తూ వారం వారం గడిపేస్తున్న శివాజీకి.. ఎలిమినేట్ చేసి రెస్ట్ ఇస్తే మంచిదేమో! (ఇదీ చదవండి: హిందీ 'బిగ్బాస్'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ) నామినేషన్స్ షురూ ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ ఎదురుగా ఉన్న కుండ పగలగొట్టి కారణం చెప్పాలని అన్నారు. అయితే ప్రశాంత్, అశ్విని, భోలె.. తమని నామినేట్ చేస్తున్నారని ఫ్రస్టేట్ అయిపోయి టైం మొత్తం తినేశారు. దీంతో సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు. ఎవరు.. ఏ ఇద్దరిని నామినేట్ చేశారు? ప్రశాంత్- సందీప్, తేజ అమరదీప్- భోలె, అశ్విని పూజామూర్తి- భోలె, అశ్విని సందీప్- భోలె, ప్రశాంత్ అర్జున్- భోలె, అశ్విని ప్రియాంక- అశ్విని, భోలె తేజ- పూజా, ప్రశాంత్ (ఇదీ చదవండి: ఏడాది నుంచి దానికి దూరమైన సమంత.. ఎంత కష్టమో!) రైతుబిడ్డ ప్రశాంత్ అబద్ధాలు రైతుబిడ్డ అనే ట్యాగ్తో హౌసులోకి వచ్చిన ప్రశాంత్.. తొలివారం నుంచి కాస్త డిఫరెంట్గానే ఉన్నాడు. గేమ్స్ ఉంటే బాగా ఆడటం, మిగిలిన టైం అంతా శివాజీ వెనకాల తిరగడం, నామినేషన్స్ అంటే అవతల వాళ్లు ఏం చెబుతున్నారో వినిపించుకోకుండా అరిచి గోల చేయడం. ఈసారి కూడా అదే చేశాడు. సందీప్.. కెప్టెన్సీ సరిగా చేయలేకపోయావ్ కదా అని అన్నాడు. అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించి.. సందీప్ తనని 'ఊరోడు' అన్నాడని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అయితే ఇది నిజమైతే పొలం, తినే అన్నంపై ఒట్టు వేయ్ అని సందీప్ అడగ్గానే మళ్లీ మాట మార్చేశాడు. రైతు అనేవాడు పొలంపై ఒట్టు వేయడు అని ఏదేదో చెప్పి కాస్త అతి చేశాడు. సందీప్ మాట్లాడుతుంటే అతడు చెబుతున్నది వినకండా పదే పదే మాటలకు అడ్డు తగిలాడు. ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ కూల్ గా ఉండటానికి ట్రై చేస్తే.. ప్రశాంత్ మాత్రం ఫుటేజీ ఇవ్వడానికి ప్రయత్నించాడా అనే డౌట్ వచ్చింది. తట్టుకోలేకపోయిన అశ్విని, భోలె అమరదీప్, పూజా,అర్జున్, ప్రియాంక.. ఇలా వరసగా అందరూ తనని నామినేట్ చేసేసరికి అశ్విని కూడా తట్టుకోలేకపోయింది. తనతో ఎవరూ కలవట్లేదని, మాట్లాడట్లేదని ఒకే కారణాన్ని గుచ్చిగుచ్చి చెప్పింది. దీంతో నామినేట్ చేసినవాళ్లకేమో గానీ చూస్తున్న ప్రేక్షకులకు ఫ్రస్టేషన్ వచ్చేసింది. ఇక భోలె అయితే మరోరకం. అమరదీప్, పూజా తనని నామినేట్ చేసినా భోలె ఏం మాట్లాడలేదు. వాళ్లు చెప్పిన కారణాల్ని అస్సలు డిఫెండ్ చేయలేదు. ఏదో అవతలి వాళ్ల ఆనందమే తనకు ముఖ్యమున్నట్లు ప్రవర్తించాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెని ఇరిటేట్ చేస్తూ పాటలు పాడుతూ, జోక్స్ వేస్తూ ఇబ్బంది పెట్టాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్) -
పాటబిడ్డ కుండ పగిలింది.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
నయని పావని ఎలిమినేషన్తో బిగ్బాస్ హౌస్లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్తగా హౌస్లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! నేటితో ఆ బేధాలు చెరిపేసి అందరూ సమానమే అని ప్రకటించాడు బిగ్బాస్. ఈ వారం కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్ చేయాలని తెలిపాడు. ప్రశాంత్.. సందీప్ మాస్టర్, అమర్దీప్లను నామినేట్ చేశాడు. ఇక అమర్.. అశ్వినిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అశ్విని మాట్లాడుతూ అమర్కు బదులుగా ప్రశాంత్.. ప్రశాంత్.. అని రైతుబిడ్డ పేరు జపించింది. అనంతరం పాటబిడ్డ భోలెను నామినేట్ చేశాడు అమర్. ఇది చూసి నవ్వుకున్న భోలె.. పదేళ్ల పిల్లాడిలా కనపడుతున్నావ్ అన్నాడు. పూజా మూర్తి.. అశ్విని, భోలె షావళిని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటే ఎక్కువ ఓట్లు అశ్విని, భోలె షావళికి పడ్డట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వారం అర్జున్, గౌతమ్, అమర్, భోలె, అశ్విని, తేజ, పూజ, శోభ, ప్రశాంత్ నామినేషన్లో ఉన్నారట! వీరిలో ఒకరిద్దరి పేర్లు అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శివాజీ హెల్త్ చెకప్, ట్రీట్మెంట్కు వెళ్లి తిరిగి హౌస్లోకి రానున్నాడు. -
నీచమైన కామెంట్స్.. ప్రశాంత్ పీఆర్ టీమ్కు అమర్దీప్ తల్లి వార్నింగ్
-
నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి
గేమ్లో తప్పొప్పులు, గెలుపోటములు సహజం. తప్పులు సరి చేసుకుని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా అడుగులు వేయడమే అసలైన విజయం. అయితే బిగ్బాస్ హౌస్లో జరిగే సంఘటనలను కొందరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. కొన్ని పీఆర్ టీమ్స్ వారి కంటెస్టెంట్కు హైప్ ఇవ్వడానికి బదులు అవతలవారిని దూషిస్తూ నిందలేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అవతలి కంటెస్టెంట్ కుటుంబసభ్యులు ఈ ట్రోలింగ్ వల్ల ఎంత బాధపడతారనేది ఆలోచించడం లేదు. అమర్దీప్పై రైతుబిడ్డ ఫ్యాన్స్, పీఆర్ ట్రోలింగ్! ఈ సీజన్లో రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. హౌస్లో వెళ్లడానికి ముందే అతడు గట్టి పీఆర్ను రెడీ చేసుకుని వెళ్లాడని చాలాకాలం నుంచే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే నిజమని తెలుస్తోంది. అయితే వాళ్లు ప్రశాంత్ను పొగడటానికి బదులు అవతలివారిని చులకన చేసి మాట్లాడుతూ వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ఈ ట్రోలింగ్తో మనస్తాపానికి గురైన అమర్దీప్ తల్లి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహించింది. (ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ) నన్ను ప్రశాంత్ దగ్గరకు పంపిస్తావా? 'నేను అమర్దీప్ తల్లిని.. మీకు ఏమైనా మతుండే అలాంటి కామెంట్స్ పెడుతున్నారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా? ప్రశాంత్ దగ్గరకు అమర్దీప్ భార్య(తేజస్విని)ని, తల్లిని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్రా.. పల్లవి ప్రశాంత్ మీద ప్రేముంటే ఓట్లేసి గెలిపించుకోరా.. అంతేకానీ తల్లి, భార్యల జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా. నేను అమ్మను రా.. నన్ను ప్రశాంత్ దగ్గరకు పంపిస్తావా? ఎవడ్రా నీకు చదువు నేర్పింది? కొంచెమైనా సంస్కారం ఉందా? మానసికంగా చంపుతున్నారు మీవి నీచమైన బతుకులు. మీ మాటల వల్ల ఎంత బాధపడుతున్నాంరా.. మానసికంగా చంపేస్తున్నారు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతా.. ఏమనుకుంటున్నారో, జాగ్రత్త..' అంటూ ఏడ్చేసింది. ఇది చూసిన జనాలు కంటెస్టెంట్ల ఆట గురించి మాట్లాడాలి కానీ వారి కుటుంబాలను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? వారికెందుకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ పీఆర్ చెత్తగా ప్రవర్తిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: శ్రీలీల తనకు ఏమవుతుందో మొదటిసారి రివీల్ చేసిన అనిల్ రావిపూడి) -
రైతుబిడ్డ వింత వాదన.. అది వినిపించుకోకుండా పిచ్చి ప్రవర్తన!
బిగ్ బాస్ 7 షోలో ఊహించని వ్యక్తి రెండో కెప్టెన్ అయ్యాడు. అయితే తామే కెప్టెన్ అయిపోతామని ఫుల్ ధీమాతో బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం బరస్ట్ అయిపోయారు. వాళ్లకు ఏడుపొక్కడే తక్కువైంది. అదే టైంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరు జారాడు. పరువు అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ బిగ్బాస్ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 40 హైలైట్స్లో చూద్దాం. నోరుజారిన రైతుబిడ్డ కెప్టెన్సీ టాస్కులో భాగంగా పోటుగాళ్లతో ఆటగాళ్లు సమం కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. రాత్రి నిద్రపోయే టైంలో శివాజీతో పిచ్చపాటి కబుర్లు ఆడుతూ ప్రశాంత్ నోరుజారాడు. 'కెప్టెన్సీ వచ్చింది అన్నవల్లనే.. నేను చేసిందేం లేదు' అని అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎంత మోటివేట్ చేసినా గేమ్స్ ఆడింది, కెప్టెన్సీ బ్యాడ్జ్ సంపాదించింది ప్రశాంత్. కానీ శివాజీకి క్రెడిట్ ఇచ్చేసి తన గాలి తనే తీసుకున్నాడు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) ఆటగాళ్లు గెలిచారు ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా చివరగా 'హూ ఈజ్ ద బెస్ట్' అని గేమ్ పెట్టాడు. ఫుట్బాల్ లాంటిది కానీ బంతిని చేతులతో గోల్ పోస్టులో వేయాల్సి ఉంటుంది. కిందామీద పడి ఈ ఆటలో ఎలాగైతేనేం ఆటగాళ్లు గెలిచారు. కెప్టెన్సీ టాస్కులోకి ఎంటరయ్యారు. అశ్విని-పూజా గొడవ అయితే కెప్టెన్సీ కోసం చివరగా జరిగిన గేమ్లో ఎవరు ఆడాలనే క్రమంలోనే అశ్విని, పూజాని ఉద్దేశిస్తూ.. 'చూస్తే తెలియట్లేదా ఎవరు స్ట్రాంగో?' అని వాళ్ల టీమ్ మెంబర్స్తో చెప్పింది. దీంతో పూజాకి ఎక్కడో కాలింది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అశ్వినికి ఇచ్చిపడేసింది. నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మాములుగా ఉండదని వేలు చూపిస్తూ మరీ వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో అమర్కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్) యవర్ రెండో కెప్టెన్ ఇక ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్ కావాలనేది పోటుగాళ్లు డిసైడ్ చేశారు. ఆటగాళ్లలో అందరికీ బెలూన్స్ ఉంటాయి. పోటుగాళ్ల నుంచి ఒక్కొక్కరు.. ఆటగాళ్లలో ఒకరికి సూది ఇస్తారు. వాళ్లు మరొకరి బెలూన్ని పేల్చేయాలి. చివరగా మిగిలిన వాళ్లు కెప్టెన్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. అలా ఇందులో యవర్ నిలిచి, గెలిచారు. హౌసుకి రెండో కెప్టెన్ అయ్యాడు. నిజం చెప్పిన తట్టుకోని ప్రశాంత్ అయితే సందీప్, ప్రశాంత్ బెలూన్ పేల్చేసి ప్రస్తుతం కెప్టెన్ గా నువ్వే ఉన్నావ్, ఇందులో నువ్వు ఫెయిలయ్యావ్ అని బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో అదే మళ్లీ చెప్పాడు. ఇది నిజమని చూస్తున్న వాళ్లందరికీ తెలుసు. ఒక్క రైతుబిడ్డకు తప్ప. అసలు కెప్టెన్గా తానేం తప్పు చేశానో చెప్పు అని సందీప్ చెబుతున్నది వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ అదే పాట పాడాడు. ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ఫిజికల్ గా కష్టపడుతున్నాడు గానీ రైతుబిడ్డ ప్రశాంత్.. బుర్రపెట్టి ఒక్కసారి కూడా తిన్నగా ఆలోచించట్లేదని ఈ సీన్తో అర్థమైపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
ప్రశాంత్ను మడతపెట్టాల్సింది.. రైతుబిడ్డపై అర్జున్కు ఇంత పగ ఉందా?
బిగ్బాస్ 7.. ఈ షో అంతా రైతుబిడ్డ చుట్టే తిరుగుతోంది. మొదటి నుంచీ అతడిని దూరం పెడుతూ.. తనేం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంది సీరియల్ బ్యాచ్. అందుకే ఈ బ్యాచ్పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ముఖ్యంగా విన్నర్గా వెలిగిపోతాడనుకున్న అమర్దీప్ సైతం అదే బ్యాచ్లో ఉండి ఆటలో ఆరిపోయాడు. ప్రశాంత్ ముందు తేలిపోయాడు. అందరినీ వెనక్కు నెట్టి ఈ సీజన్లోనే తొలి కెప్టెన్గా అవతరించాడు ప్రశాంత్. సలహాను బేఖాతరు చేసిన రైతుబిడ్డ ప్రశాంత్ విజయం సీరియల్ బ్యాచ్కు నచ్చలేదని టాక్ నడిచింది. కానీ ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ సైతం ఈ గెలుపు మింగుడుపడనట్లు కనిపిస్తోంది. నిన్న రాత్రి లైవ్లో రైతుబిడ్డపై విషాన్ని కక్కాడు. సాధారణంగా రైతుబిడ్డ.. శివాజీ మాట తప్ప హౌస్లో ఎవరి మాటా వినడు. అర్జున్ ఏదో సలహా ఇస్తే అది పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. దీంతో అర్జున్ మండిపోయాడు. గౌతమ్ దగ్గర ప్రశాంత్ గురించి నోటికొచ్చింది మాట్లాడాడు. టాస్కులో మడతపెట్టి.. అర్జున్ ఏమన్నాడంటే.. 'ఆ ఎర్రిపుష్పం గాడికి ఓ సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు. ఒక్క టాస్క్ ఏదైనా పడనీ, చెప్తా.. మొన్న కలర్ టాస్క్లో మొత్తం మడతపెట్టేసి ఉండాల్సింది. ఎందుకు వదిలేశినవ్? ఆ టాస్కులో మడతపెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడుతడు, వీడు ఆడుతడు అనే మాటనే ఎగిరిపోయేది' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్ మాటలు విని షాకవుతున్నారు. నీకన్నా అమర్ నయం.. ఐదు వారాల నుంచి ప్రశాంత్ అంతలా కష్టపడి ఆడుతుంటే ఇప్పుడు మధ్యలో వచ్చి అతడిని ఇలా అనడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందంటున్నారు. నీ కన్నా అమర్ నయం, అతడు నటించలేదు, తన నోటివాగుడు వల్ల నెగెటివ్ అయ్యాడు.. నువ్వు సీజన్ ప్రారంభం నుంచి ఉండుంటే ఇంకా అతడి కన్నా ఎక్కువ నెగెటివ్ అయ్యేవాడివి అని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చదవండి: లేడీ కంటెస్టెంట్పై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి, వరుసగా ఆరోసారి! -
శోభా శెట్టి చిల్లర గేమ్.. అంతా అయ్యాక ఏడుపొకటి!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లుగా మారింది. మొదట్లో తమ ప్రతాపం చూపించిన పోటుగాళ్లు నెమ్మదిగా వెనకబడ్డారు. ఆరంభంలో ఓటమిపాలవుతూ వచ్చిన ఆటగాళ్లు తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. చివరకు ఇరు టీములు చెరి మూడు పాయింట్లతో సమానంగా నిలబడ్డారు. అదెలాగో తాజా(అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం.. ఓటమి నుంచి పాఠాలు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడే కానీ ఆ నాయకుడి లక్షణాలైతే లేవు. ఇతడు అవతలి వారికి పని చెప్పడానికి బదులు అవతలి వారు ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నాడు. అన్నింటినీ ఓ కంట గమనిస్తూనే ఉన్న బిగ్బాస్ ప్రశాంత్ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అయితే అది కేవలం వార్నింగ్ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కు ఇచ్చేశాడు. ఇక అమర్.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకున్నాడు. మేకప్ కోసం ప్రాణం పోతోంది మరోవైపు శోభా శెట్టి మేకప్ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్ అడిగి మరీ ముఖాన కొట్టుకుంది. అబ్బే, బిగ్బాస్ ఒప్పుకోలేదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో అర్జున్.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్ను వేసుకోవాలని చెప్పాడు. అది కంపు కొడుతున్నా చేసేదేం లేక ముక్కు మూసుకుని దాన్ని ధరించింది శోభా. ఎవరు స్మార్ట్? తర్వాత ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లలో ఎవరు స్మార్ట్ అనేది తేల్చేందుకు హూ ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో సినిమాలు, పాటలు, డైలాగులకు సంబంధించి రకరకాల ప్రశ్నలడిగాడు. ఇందులో ఆటగాళ్లే గెలిచారు. అయితే శోభా కాస్త ఓవర్ చేసింది. బిగ్బాస్ అడిగే ప్రశ్నకు ఏది కరెక్ట్ సమాధానం అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకుని బోర్డుపై పెట్టాలి. కానీ శోభ ఎందుకైనా మంచిది అన్నట్లుగా రెండు బోర్డులను పట్టుకుని నేనివ్వను అంటూ చిల్లరగా ప్రవర్తించింది. ఏడ్చేసిన శోభా శెట్టి అయితే రెండు బోర్డులు తీసుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభా పరువు తీశాడు బిగ్బాస్. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు. పూజా మూర్తితోనూ గొడవకు దిగింది శోభ. తను చెప్తే నీతులు, ఎదుటివాళ్లు చెప్తే బూతులా.. అని పూజా ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత పాప.అనంతరం ఎవరు ఫోకస్ అనే టాస్క్ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు గేమ్ చెరి మూడు పాయింట్లతో టై అయింది. మరి నెక్స్ట్ బిగ్బాస్ ఏ గేమ్ ఇస్తాడు? ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్కు కూడా రెడీ అంటూ.. పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్ -
పల్లవి ప్రశాంత్ వల్ల నన్ను బాధపెట్టారు.. నా సపోర్ట్ ఎవరికంటే: సోహైల్
'బిగ్ బాస్' ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ అందరికీ పరిచయమే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. త్వరలో సోహైల్ 'బూట్కట్ బాలరాజు' సినిమాతో త్వరలో వస్తున్నాడు. ఈ సినిమా పనిలో ఆయన చాలారోజుల నుంచి బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాకు ఎం.డి.పాషా నిర్మాత. మేఘ లేఖ కథానాయిక. సునీల్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన బిగ్బాస్ సీజన్ 7 గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్బాస్ షోను రెగ్యులర్గా తాను చూడటం లేదని చెప్పిన సోహైల్.. పల్లవి ప్రశాంత్ను మెచ్చుకున్నాడు. 'బిగ్బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ప్రశాంత్ ఎక్కడ కూడా దురుసు మాటలు మాట్లడలేదు. లూజ్ టంగ్ ఉపయోగించలేదు. వాడు పెద్దగా చదువుకోలేదు.. కానీ ఎక్కడా ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు. అది నాకు నచ్చింది కాబట్టి ఒకసారి నా సోషల్ మీడియాలో 'ఫార్మర్' అని మాత్రమే మెసేజ్ పెట్టాను. అందుకు నన్ను తిడుతూ వెంటనే ఎన్నో మెసేజ్లు వచ్చాయి. నేను ఏం తప్పు చేశాను. ప్రశాంత్ తీరు నచ్చి ఆ మెసేజ్ మాత్రమే చేసినా.. అందుకు కొందరు నన్ను దొంగ, ఫాల్తు, ఫ్రాడ్ గాడు అంటూ గలీజు కామెంట్లు చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. దీంతో బిగ్బాస్ గురించి ఎక్కడా మాట్లడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒక్కోసారి నేను కూడా ట్రిగ్గర్ అవుతాను. అప్పుడు నేను కూడా నాలుగు మాటలు అనవచ్చు.. అందువల్ల వాళ్లు కూడా బాధపడుతారు. ఎందుకు ఇవన్నీ అని దూరంగా ఉన్నాను.' అని సోహైల్ తెలిపాడు. తనకు అమర్ దీప్తో పాటు హోస్లో చాలమంది స్నేహితులు ఉన్నారు. వారి పేరును చెప్పనందుకు బాధ కలగవచ్చు అందుకు తానేమీ చేయలేనని సోహైల్ చెప్పాడు. వాడు నా కోసం కష్టపడ్డాడు సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల కోసం పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం వాడు కనీసం నిద్రపోకుండా కష్టపడ్డాడు. నా రూమ్ వద్దకు వచ్చి వాడే ఆ సినిమా ప్రమోషన్స్ పనులను చూసుకున్నాడు అని సోహైల్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో పల్లివి ప్రశాంత్ను అభిమానించే వారు ఆశ్చర్యపోతున్నారు. సోహైల్ కోసం ఇంతలా కష్టపడినా ఓట్ల కోసం ఆయన పేరును హోస్లో ప్రశాంత్ ఎక్కడా ప్రస్థావించలేదని చెప్పుకొస్తున్నారు. -
రైతుబిడ్డ, అమర్ దీప్.. ఇద్దరూ అదరగొట్టేశారుగా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట భలే రంజుగా మారింది. పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా, రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురినీ పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! ఈ రెండు టీముల మధ్య వరుసగా పోటీలు పెడుతున్నాడు బిగ్బాస్. ఇప్పటివరకు అయిన గేమ్ ప్రకారం పోటుగాళ్లు టీమ్ లీడింగ్లో ఉండగా ఆటగాళ్లు కాస్త వెనకబడ్డారు. తాజాగా నేడు కూడా మరో ఆసక్తికరమైన గేమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో బిగ్బాస్.. సినిమా నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలడిగాడు. కొన్ని డైలాగులు వినిపిస్తూ ఆ సమయంలో వాడిన ఆయుధాలేంటి? అని అడిగాడు. అలాగే పాటలు వినిపిస్తూ అందులో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పాలన్నారు. ఒక్కడు సినిమాలో మహేశ్బాబు.. ప్రకాశ్రాజ్ను కొట్టిన స్థలమేది? అని అడగ్గా రైతు బిడ్డ క్షణం ఆలోచించకుండా కొండారెడ్డి బురుజు ఫోటోను తీసుకెళ్లి బోర్డుపై అతికించాడు. గత కొద్ది రోజులుగా డల్గా కనిపిస్తున్న అమర్దీప్ ఈ ఆటలో అద్భుతంగా ఆడటమే కాక బాగా పర్ఫామ్ కూడా చేసినట్లు కనిపిస్తోంది. శివాజీ పదేపదే నువ్వు ఆడలేవు, ఆడటం లేదు.. అంటూ అమర్ నమ్మకాన్ని దెబ్బతీస్తూ వచ్చాడు. మొదటి నుంచీ ఇలాంటి మాటలు వింటూ వస్తున్న అమర్ తనను డిఫెండ్ చేసుకోవడం కూడా మానేసి మానసికంగా కుంగిపోయాడు. ఫలితంగా ఆట మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు. అయితే తాజా టాస్క్లో మాత్రం తనకు ఛాన్స్ రావడమే కాకుండా దాన్ని ప్రూవ్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ లాగేసుకున్న బిగ్బాస్ దాన్ని తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రోమోలో అతడి షర్ట్కు బ్యాడ్జ్ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. -
రైతుబిడ్డకు ఏడవడం మాత్రమే వచ్చు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు వచ్చారు. దీంతో కాస్త జోష్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగిస్తూ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేశాడు. అలానే అమరదీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకొచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది Day 38 హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) అమర్కి మోటివేషన్ ఆటగాళ్లు vs పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. మంగళవారం గేమ్స్ సగంలోనే ఆగిపోయాయి. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక పోటీల్లో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదని అమరదీప్ డల్ అయిపోయాడు. దీంతో యవర్ అతడికి మోటివేషన్ చేశాడు. రాత్రి నిద్రపోయే టైంలో అమరదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక, సందీప్ వచ్చి అతడిని సముదాయించారు. రైతుబిడ్డ కెప్టెన్సీ పాయే ప్రశాంత్ కెప్టెన్ అయితే అయ్యాడు గానీ పెద్దగా మెరుపుల్లేవు. దీంతో బిగ్ బాస్ అతడి కెప్టెన్సీని డైరెక్ట్గా రద్దు చేయొచ్చు గానీ అలా చేయలేదు. మిగతా హౌస్మేట్స్ని అసలు కెప్టెన్ అంటే ఏంటని అడిగితే.. వర్క్ డివైడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీ అని అతడికి వ్యతిరేకంగా చెప్పారు. తీరా ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అని అడిగితే శోభా, సందీప్, తేజ తప్ప అందరూ చేతులెత్తేశారు. అయినా సరే బిగ్బాస్ కనికరించలేదు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) యవర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, తేజ నిద్రపోతున్నా, ఇంట్లో రేషన్ అయిపోతున్నా ఏం చేశావంటూ కెప్టెన్సీ పీకిపడేశాడు. ఇక కెప్టెన్సీ నుంచి తీసిపడేసరికి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇలాంటి టైంలో మరోచోట కూర్చుని మాట్లాడిన శివాజీ.. వాడికి(ప్రశాంత్) ఏడవడం తప్ప ఇంకేం రాదని అన్నాడు. విజేతగా పోటుగాళ్లు మంగళవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం రెండు గేమ్స్ పెట్టిన బిగ్ బాస్.. బుధవారం మిగిలిన రెండు గేమ్స్ పెట్టాడు. 'హౌ ఈజ్ ఫాస్టెస్ట్' గేమ్లో భాగంగా బిగ్ బాస్ చెప్పిన రంగు ఉన్న ఏదైనా వస్తువుని తీసుకొచ్చి లాన్ లోని మార్క్ చేసిన ప్లేసులో వేయాలి. ఇందులో ఆటగాళ్లు గెలిచారు. 'హౌ ఈజ్ స్ట్రాంగెస్ట్' అని పెట్టిన ఇంకో పోటీలో పోటుగాళ్లు గెలిచారు. అలా నాలుగింటిలో మూడు గెలిచిన పోటుగాళ్లు.. కెప్టెన్సీ పోటీలో నిలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
కెప్టెన్సీ లాగేసుకున్న బిగ్బాస్, ఏడ్చేసిన రైతుబిడ్డ
బిగ్బాస్ హౌస్లో అందరూ ఇష్టపడేది ఇమ్యూనిటీ అయితే అందరూ భయపడేది ఎలిమినేషన్కు! ఇమ్యూనిటీ వస్తే నామినేషన్లోకే రారు, అప్పుడు ఎలిమినేషన్ అన్న ఆలోచన కూడా వారి మనసులోకి రాదు. ఇమ్యూనిటీ సులభంగా లభించేది కెప్టెన్కు.. అందుకే కెప్టెన్సీ కోసం ప్రతి ఒక్కరూ తెగ కష్టపడుతుంటారు. ఈ సీజన్లో రైతుబిడ్డ తొలి కెప్టెన్గా అవతరించాడు. నువ్వెంత అన్నవాళ్లనే ఓడిస్తూ కెప్టెన్గా గెలిచి అందరిచేత చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ తర్వాతే సైలెంట్ అయిపోయాడు. కెప్టెన్గా ఎవరికీ పనులను అప్పజెప్పడమో, ఇల్లును చూసుకోవడమే, నాయకుడిగా వ్యవహరించడమో చేయడం లేదు. ఎవరు తప్పు చేసినా చూసీచూడనట్లు పోతున్నాడు. తన పనేదో తను చేసుకుపోతున్నాడు. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న బిగ్బాస్ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించాడు. అసలు కెప్టెన్సీకి అర్థమేంటో తెలుసా? అని హౌస్లో కొందరితో సమాధానాలు చెప్పించాడు. అనంతరం ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అనుకుంటున్నవాళ్లు చేతులెత్తమనగానే హౌస్లో దాదాపు అందరూ చేయెత్తారు. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. కష్టపడి సాధించిన కెప్టెన్సీ ఇలా మూన్నాళ్ల ముచ్చటగానే మారడంతో కంటతడి పెట్టుకున్నాడు రైతుబిడ్డ. చదవండి: బాల్యంలోనే రెండుసార్లు అత్యాచారం.. బిగ్బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్! -
ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్గా ఈయన చాలామందికి సుపరిచితం. బిగ్బాస్ సీజన్-7లో ఆయన టాప్ కంటెస్టెంట్గా కొనసాగుతున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. వారిద్దరూ డ్యాన్స్ బరిలో దిగితే గెలుపు ఖాయం అని తెలిసిందే. (ఇదీ చదవండి; గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో) తాజాగా బిగ్బాస్లో ఉన్న సందీప్పై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 'యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు, వ్యూస్ కోసం ఒక మనిషిని ఎంత నీచంగా అయినా మాట్లాడుతారా.. అలాంటి తప్పుడు వీడియోలతో వచ్చిన డబ్బుతో ఎప్పటికీ బాగుపడరు. అన్యాయంగా ఒకరిని తొక్కుతూ.. మరోకడు పైకి రావాలని ఆకాంక్ష ఎందుకు..? బిగ్బాస్లో గెలిచేవాడు గెలుస్తాడు. ఆట నుంచి బయటకు వచ్చేవాడు వస్తాడు. అంతేగానీ ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు..? అందరిలాగే ఆట సందీప్ కూడా బిగ్బాస్తో మంచిపేరు రావాలి.. ప్రజల్లో మరింత గుర్తింపు దక్కాలనే వెళ్లాడు. కానీ ఒకరిని గెలిపించేందుకు బయట కొందరు చేసే దందా ఎంతవరకు కరెక్ట్..? వారు కోరుకున్న వ్యక్తి గెలవాలని ఎదుటివారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సందీప్పై చేస్తున్న కామెంట్ల వల్ల నాతో పాటు మా కుంటుంబం ఎంతో బాధపడుతుంది.' అని ఆమె భావోద్వేగానికి గురైయారు. ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్ 'ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్' అని పలువురు తప్పుడు థంబ్నైల్స్ పెట్టి వీడియో చేశారు. మరికొందరు అదే స్థాయిలో చెడు కామెంట్లు కూడా చేస్తున్నారని జ్యోతిరాజ్ ఇలా తెలిపారు. 'అసలు పల్లవి ప్రశాంత్ కుక్కకొట్టుడు కొట్టడం ఏంటి..? ఎవరు పల్లవి ప్రశాంత్..? ఎవరు ఆట సందీప్..? అదీ డబ్బుతో వచ్చే విలువ కాదు. కళతో వచ్చే విలువ. ఎంతో కష్టపడి సందీప్ ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి.. నేనూ కూడా చేస్తాను.. తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అందరం గుర్తించాలి. ఎంతో కష్టపడి అతను కూడా ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి థంబ్నైల్స్ పెట్టడంతో పాటు ఒక మనిషిని మరోక వ్యక్తితో పోల్చి డీగ్రేడ్ చేయకండి. ఇదీ చాలా తప్పు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న. బిగ్బాస్లోని అమ్మాయిల్ని కూడా కొందరు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. వారందరూ కూడా తమ కుటుంబాన్ని వదిలేసి అక్కడ ఉన్నారు. అలాంటి వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆట సందీప్ అంటే ఒక అబ్బాయి కాబట్టి సరేలే అనుకోవచ్చు కానీ ఒక అమ్మాయిని నీచంగా తిట్టడం వల్ల ఆమె కెరియర్ పరిస్థితి ఏంటి. దయచేసి బిగ్బాస్లోని ఆడపిల్లల గురించి చెడు కామెంట్లు చేయకండి.' అని జ్యోతిరాజ్ ఎమోషనల్ అయ్యారు. -
'బిగ్బాస్ 7' ఫస్ట్ కెప్టెన్గా రైతుబిడ్డ.. కానీ అతడిని గాయపరిచాడు!
బిగ్బాస్ హౌసులో రైతుబిడ్డ సత్తా చూపించాడు. చాలామంది ఇతడిని తక్కువ అంచనా వేశారు కానీ హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ అయి చూపించాడు. అయితే ఈ క్రమంలోనే గేమ్ ఆడుతూ ఓ కంటెస్టెంట్ ని గాయపరిచాడు. దీంతో ఆ గొడవ చాలా సీరియస్ అయ్యేసరికి మిగతా కంటెస్టెంట్స్ శాంతింపజేశారు. అలానే ప్రశాంత్ ఓ విషయంలో బతికిపోయాడు. ఇంతకీ ఏంటి సంగతి? అసలు శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day-33 హైలైట్స్లో చూద్దాం. సందీప్ గుక్కపట్టి ఏడుపు చిట్టి ఆయిరే అనే టాస్కులో మధ్యలో ఉండగానే గురువారం ఎపిసోడ్ పూర్తయింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. సందీప్-అమరదీప్ జోడీని పిలవగా.. అమ్మ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని చెబుతూ సందీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు భార్య గురించి విని, ఆమె పేరు చూసి చాలారోజులైందని అమర్ ఏడ్చాడు. ఫైనల్గా అమరదీప్ త్యాగం చేయడంతో సందీప్ మాస్టర్ గుక్కపట్టి ఏడుస్తూ లెటర్ చదివాడు. అలానే కెప్టెన్సీ రేసులో నిలిచాడు. ప్రశాంత్ విషయంలో శివాజీ త్యాగం చేశాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ఫైనల్ టాస్క్లో గోల ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా రెండు రౌండ్స్ దాటుకుని.. చివరగా తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ రేసులో నిలిచారు. వీళ్లకు 'రంగు పడుద్ది రాజా' అనే టాస్కుని బిగ్బాస్ నిర్వహించాడు. ఈ గేమ్లో భాగంగా ఓ సర్కిల్ ఉంటుంది. అందులో అందరూ నిలబడి ఒకరు మరొకరి టీ షర్ట్పై చేతులతో రంగు పూయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరి టీ షర్ట్పై ఎక్కువ రంగుంటే వాళ్లు ఎలిమినేట్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. తొలి రౌండులో భాగంగా సందీప్ మాస్టర్ టీ షర్ట్ని లాగేశాడు. అయితే లాగడంతోపాటు ముఖంపై కొట్టాడని సందీప్, ప్రశాంత్పై ఆరోపణలు చేశాడు. ఈ గొడవ చాలాసేపు నడిచింది. సంచాలక్ ప్రియాంక దీన్ని సరిదిద్దింది. అయితే తొలి రౌండ్లో సర్కిల్ దాటాడని తేజని ఎలిమినేట్ చేశారు. రెండో రౌండ్లో సందీప్ ఒక్కడిని.. గౌతమ్-ప్రశాంత్ కలిసి టార్గెట్ చేసి కలర్ ఎక్కువ పూశారు. దీంతో అతడు ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్ రౌండ్లో గౌతమ్-ప్రశాంత్ ఒకరిపై ఒకరు పోటీపడి మరి కలర్స్ పూసుకున్నారు. రౌండ్ పూర్తయిన తర్వాత వీళ్లిద్దరినీ చాలాసేపు పరీక్షించిన ప్రియాంక.. ప్రశాంత్ని విజేతగా ప్రకటించింది. అతడికి కెప్టెన్ అని రాసున్న బ్యాడ్జి పంపారు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!
ఈ ఏడాది బిగ్బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్హాట్గా సాగిన బిగ్బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్లోని కంటెస్టెంట్స్కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది. (ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..) ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్ను సైతం ఫుల్ ఎమోషనల్గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు లెటర్స్ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
రతిక జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రపోని ప్రశాంత్.. రైతుబిడ్డపై రతిక పోస్ట్
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అత్యంత దారుణమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది రతికానే! మొదట్లో బాగానే క్లిక్ అయిన ఈ బ్యూటీ కంటెంట్ కోసం అతి చేస్తూ నెమ్మదిగా ట్రాక్ తప్పింది. రైతు బిడ్డగా జనాల్లో సింపథీ ఉన్న పల్లవి ప్రశాంత్తో లవ్ ట్రాక్ నడిపి.. ఇది వర్కవుట్ అయ్యేలా లేదని అర్థం అయిన మరుక్షణం ప్లేటు ఫిరాయించింది. అప్పటినుంచి హౌస్ లోపల, బయట రతిక పతనం మొదలైంది. డిప్రెషన్లో రతికరోజ్? ప్రశాంత్ను టార్గెట్ చేయడం, తప్పు రెండు వైపులా ఉన్నా అవతలివారిదే తప్పని వాదించడం, కావాలని గొడవలు సాగదీయడం.. ఇలా చాలానే చేసింది. దీంతో జనాలు మాకొద్దీ కంటెస్టెంట్.. అని ఆమెను బయటకు పంపించేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్.. తనపై వచ్చిన నెగెటివిటీ చూసి డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరినీ కలవడానికి, ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా సుముఖంగా లేదు. తను చేసిన తప్పొప్పులను ఇప్పుడిప్పుడే బేరీజు వేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ప్రశాంత్: అన్నా, నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చిందన్నా.. నిద్ర పట్టలేదు. శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఏం చేస్తాంరా.. చిన్నపిల్ల. ప్రశాంత్: అది చిన్న పిల్ల ఏందన్నా బర్రె పిల్ల.. మస్త్ కోపం వస్తుందన్నా.. శివాజీ: బయటకు వెళ్లాక కలుద్దాంలేరా, నువ్వు బాధపడకు, నాకు అర్థమైంది నీ బాధ. ప్రశాంత్: రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్న దాన్ని.. నా మీద ఎందుకన్నా అంత కోపం? నేనేం చేశా? నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడిన.. కానీ, తను నన్ను నమ్మలేదు. శివాజీ: చిన్న పిల్లరా ఒదిలేయ్.. ప్రశాంత్: బయటకు పోయాక నన్ను కలవదన్నా.. ఇలా ప్రశాంత్... రతికను తలుచుకుంటూ బాధపడ్డాడట! దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తూ.. 'సో స్వీట్.. నేను కూడా వాళ్లను మిస్ అవుతున్నాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. హౌస్లో ప్రశాంత్ను ఫుట్బాల్ ఆడావు, ఇప్పుడు జనాల రియాక్షన్ చూశాక మిస్ అవుతున్నానని నాటకాలు ఆడుతున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
'బిగ్బాస్' ఇప్పటికి లైన్లో పడ్డాడు.. కంటెస్టెంట్స్ తన్నుకున్నారు!
బిగ్బాస్ లో ఇప్పటికే నాలుగు వారాలు అయిపోయింది. నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఈ సీజన్లో పెద్దగా జోష్ అయితే కనిపించలేదు. గేమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి జరగలేదు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన గేమ్ ఇప్పటివరకు అయిన వాటితో పోలిస్తే కాస్త ఇంట్రెస్ట్ కలిగించింది. ఇందులో ఊహించని వ్యక్తులు విజేతలుగా నిలవడం విశేషం. ఇంతకీ హౌస్లో బుధవారం ఏం జరిగిందనేది Day 31 హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: ఆ రోగంతో బాధపడుతున్న 'జవాన్' నటి.. దీని కారణంగా!) తెగని గొడవ ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా స్మైల్ ప్లీజ్ అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. చాలా గందరగోళంగా సాగిన అందులో గౌతమ్-శుభశ్రీని విజేతగా ప్రకటించారు. అయితే యవర్ తీర్పుపై హౌసులోని ప్రతిఒక్కరూ అసహనం వ్యక్తం చేశారు. అలా మంగళవారం ఎపిసోడ్ అయిపోయింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. రాత్రంతా ఆ గొడవ అలా సాగుతూనే ఉంది. రెండో టాస్క్ ఇక కెప్టెన్సీ పోటీలో భాగంగా 'దొరికితే దొంగ దొరక్కపోతే దొర' అని రెండో టాస్కు పెట్టారు. ఇందులో భాగంగా యాక్టివిటీ రూంలో బిగ్బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. ఆ రూంలోకి జోడీల్లో ఒక్కో సభ్యుడు వెళ్తాడు. మైకులో బిగ్బాస్ ఇచ్చిన క్లూస్ ప్రకారం వస్తువుల్ని కొట్టేయాల్సి ఉంటుంది. ఇలా సాగిన ఈ ఆటలో బాగానే సాగింది. అయితే బయటకొచ్చిన తర్వాత ప్రశాంత్ ఓ వస్తువుని కింద పడేయడంతో దాన్ని పక్కనే ఉన్న యవర్ తీసుకుని తన సంచిలో పెట్టేశాడు. దీంతో బయటంతా గందరగోళంగా మారింది. తెచ్చుకున్న దాంట్లో తీసుకోవడం ఏంట్రా అని శివాజీ గగ్గోలు పెట్టాడు. అయితే ఈ గేమ్లో భాష రాని కారణంగా శుభశ్రీ, యవర్ చేతికి దొరికిన వస్తువుల్ని పట్టుకొచ్చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ అయితే క్లూస్ ఆధారంగా చెప్పిన వస్తువులు కాకుండా రూంలో నుంచి వేరే వస్తువులు కూడా తీసుకొచ్చేయడంపై బిగ్బాస్ సీరియస్ అయ్యాడు. అలా అనవసర వస్తువులు ఎవరైతే తక్కువ తీసుకొచ్చారో వాళ్లే ఈ పోటీలో విజేతలన్నట్లు చెప్పాడు. అలా శివాజీ-ప్రశాంత్ ఇందులో విజయం సాధించారు. మూడో టాస్కులో భాగంగా ఫ్రూట్ నింజా అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జోడీలోని ఒకరు.. దూరంలో ఉన్న మరో వ్యక్తి తలపై ఉన్న బుట్టలో ఆరెంజ్ ఫ్రూట్ వేయాలి. అలా చెప్పిన టైంలో కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ నుంచి జ్యూస్ సేకరించాలి. ఎవరిదైతే ఎక్కువ పరిమాణం ఉంటుందో వాళ్లు విన్నర్. ఇందులో తేజ-యవర్ విజేతగా నిలిచారు. ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్-శుభశ్రీ 4 స్టార్స్, అమరదీప్-సందీప్ 4 స్టార్స్, ప్రశాంత్-శివాజీ 5 స్టార్స్, ప్రియాంక-శోభా 2 స్టార్స్, తేజ-యవర్ 2 స్టార్స్ సాధించారు. దీన్నిబట్టి చూస్తుంటే అస్సలు ఏ మాత్రం అంచనాల్లేని ప్రశాంత్-శివాజీ జోడీ ఈ కెప్టెన్సీ పోటీలో గెలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక వీళ్లిద్దరి మధ్య తొలి కెప్టెన్సీ కోసం పోటీ ఉండనుంది. అది తర్వాత ఎపిసోడ్స్లో చూడొచ్చు. (ఇదీ చదవండి: ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ) -
ఆ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు మహిళ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచింది. అయితే బిగ్బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు.. హౌస్లోని కంటెస్టెంట్స్ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్ను చూపిస్తున్నాడు. అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్కు సపోర్ట్కు మాట్లాడుతున్న బిగ్బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ సార్థక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ను చూపించాలంటూ ఫైరయ్యాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్లో ఉన్నప్పుడే చాలా చూశానని చెప్పుకొచ్చాడు. అయితే హౌస్లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అఖిల్ మాట్లాడుతూ..' నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్గా నిలిచినా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండుసార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్లోకి వెళ్లి గేమ్ క్లియర్గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం అఖిల్ సార్థక్కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by 𝔸𝕜𝕙𝕚𝕝 𝕊𝕒𝕣𝕥𝕙𝕒𝕜 ℕ𝕒𝕚𝕕𝕦 (@akhilsarthak_official) -
రైతుబిడ్డ అనుకున్నది సాధించాడు.. వాళ్లని ఓడించాడు!
బిగ్బాస్ 7లో రైతుబిడ్డ అనుకున్నది సాధించాడు. వాళ్లని ఓడించి సక్సెస్ అయ్యాడు. తనని గెలవనివ్వకూడదని రతిక చాలా ప్రయత్నించింది. కానీ అది సాధ్యపడలేదు. అలానే హౌసులో కీలకమైన గేమ్లో తను విజేత కాకపోవడంపై అమరదీప్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఇలా కాస్త బోరింగ్, కాస్త ఎంటర్టైన్మెంట్తో శుక్రవారం ఎపిసోడ్ సాగింది. ఓవరాల్గా ఏమైందనేది Day 26 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గలాటాలో గలాటా బజర్ రౌండులో ఎక్కువ కాయిన్స్ గెలుచుకుని టాప్-2లో ఉన్న యవర్-ప్రశాంత్.. నాలుగో పవరస్త్ర పోటీలో నిలిచారు. వీళ్లకు పోటీగా మూడో కంటెండర్ కోసం బిగ్బాస్.. 'బిగ్బాస్ గలాటా' పేరుతో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ఇంట్లోని వస్తువులతో క్రియేటివ్గా రెడీ అవ్వాలి. గురువారం ఈ గేమ్ కొంతవరకు జరిగింది. శుక్రవారం మిగతాది జరిగింది. ఫైనల్గా శుభశ్రీని విజేతగా ప్రకటించారు. అయితే ఆమెనే ఎందుకు విన్నర్ అని ప్రకటించారంటూ అమరదీప్, జడ్జిలతో గొడవ పెట్టుకున్నాడు. కాసేపట్లో అది ఆగిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?) శివాజీ అదే గోల ఇకపోతే గలాటా ఆట విజేత ప్రకటించిన తర్వాత అమరదీప్ తనతో గొడవ పెట్టుకోవడాన్ని శివాజీ తట్టుకోలేకపోయాడు. హౌస్మేట్ కావడం వేస్ట్, కంటెస్టెంట్గా ఉండటమే బెటర్ అని యవర్తో మాట్లాడుతూ అన్నాడు. మొదటివారంలో హోస్ట్ నాగార్జున.. ఇలా అనొద్దని శివాజీతో చెప్పినా సరే అతడు తీరు మార్చుకోకుండా అదే పాట పాడుతున్నాడు. రతిక కూడా తన దగ్గరకొచ్చి గేమ్ గురించి అడిగేసరికి.. నన్ను ఈ వారం ఎలిమినేట్ చేసేయ్ బిగ్బాస్ అని శివాజీ సోది ముచ్చట చెప్పుకొన్నాడు. పట్టు వదల్లేదు నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ మధ్య బిగ్బాస్... 'పట్టు వదలకురా డింభకా' పేరుతో ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒకే పవరస్త్రని ముగ్గురు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డ్రాప్ అవుతారో వాళ్లు ఓడిపోయినట్లని చెప్పారు. ఇది దాదాపు మూడు గంటలపాటు సాగిన ఫలితం తేలలేదు. దీంతో పవరస్త్ర బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు. దీంట్లో యవర్, శుభశ్రీ త్వరగా ఔటయ్యారు. దీంతో ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో యవర్ మళ్లీ బాధపడ్డాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) -
Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!
బిగ్బాస్ హౌస్లో టాస్క్లు అంటే కాస్త కఠినంగానే ఉంటాయి. గెలవడం కోసం కంటెస్టెంట్స్ ఏమైనా చేస్తారు. బిగ్బాస్ ఏడో సీజన్లో ప్రారంభం నుంచే కాస్త కఠనమైన టాస్కులు ఇస్తున్నారు నిర్వహాకులు. తాజాగా పవరాస్త్ర గెలవడం కోసం ఇచ్చిన టాస్కులో పల్లవి ప్రశాంత్ గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయ కావడంతో కుప్పకూలిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. నాలుగో పవరాస్త్ర కోసం పోటీ బిగ్బాస్ హౌస్లో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే వారంతా పోటీదారులు మాత్రమే. ఇంటి సభ్యులు కావాలంటే బిగ్బాస్ పెట్టిన టాస్కులు గెలవాల్సిందే. పవరాస్త్ర గెలిస్తే..కొన్ని సదుపాయాలు ఉంటాయి. అందుకే పవరాస్త్ర కోసం కంటెస్టెంట్స్ పోటీపడి మరి గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే సందీప్, శివాజీ, శోభా శెట్టి పవరాస్త్ర గెలిచారు. ఇక నాలుగో పవరాస్త్ర కోసం ఈ వారం పోటీపడుతున్నారు. బ్యాంకుగా మారిన బిగ్బాస్ హౌస్ నాలుగు పవరాస్త్ర కంటెంటర్ని సెలెక్ట్ చేయడం కోసం బిగ్బాస్ హౌస్ని బ్యాంకుగా మార్చారు. బ్యాంకర్స్గా శివాజీ, సందీప్,శోభా శెట్టి వ్యవహరిస్తారని బిగ్బాస్ చెప్పాడు. మిగతవారు బీబీ కాయిన్స్ సేకరించాల్సి ఉంటుంది. ఆట ముగినే సరికి ఎవరి దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటే వారు నాలుగో పవరాస్త్ర కంటెంటర్గా నిలుస్తారు. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. బజర్ మోగగానే పరుగెత్తుకెల్లి ఏటీఎంకి అమర్చిన బటన్ నొక్కాలి. ఎవరు ముందుగా నొక్కితే వారు గెలిచినట్లు. పల్లవి ప్రశాంత్ తలకు గాయం! ఏటీఎం బజర్ నొక్కేందుకు కంటెస్టెంట్స్ అంతా ప్రయత్నించారు. బజర్ మోగగానే అంతా పరుగెత్తుకెల్లి ఏటీఎం బజర్ని నొక్కేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మిగతా కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్ చుట్టు చేరి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. శివాజీ అయితే ఏం పర్లేదు.. ఏం కాలేదని చెబుతున్నాడు. మరి ప్రశాంత్ తలకు ఏ మేరకు గాయమైంది అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!
బిగ్బాస్ నాలుగోవారం నామినేషన్స్ ముగిశాయి. ఫైనల్ ఆరుగురి లిస్టులోకి వచ్చారు. అయితే ఈ నామినేషన్స్ వ్యవహారం కంటే బయట జరిగిన గొడవలే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అయితే ఈసారి మాత్రం అవాక్కయ్యే గొడవలు జరిగాయి. మిగతా వాటి సంగతేమో గానీ రతికని ప్రశాంత్ అక్క అని పిలవడం ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ మంగళవారం ఎపోసిడ్లో ఏం జరిగిందనేది Day-23 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ పిచ్చిలేసింది సోమవారం ఎపిసోడ్లో ప్రియాంక, రతిక నామినేట్ అయ్యారు. దీంతో వీళ్ల ఫొటోల్ని జ్యూరీ సభ్యులు గిల్టీ వాల్పై అతికించారు. గౌతమ్ తన నామినేషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. యవర్ని బోనులో నిలబెట్టిన గౌతమ్.. అతడికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ నామినేట్ జరుగుతున్న సమయంలో శివాజీ తీరుతో విసిగిపోయిన గౌతమ్.. లాయర్లా ఒకవైపే సపోర్ట్ చేస్తున్నారని కుండ బద్ధలు కొట్టేశాడు. దీంతో మొత్తానికి జ్యూరీ సభ్యులు.. ప్రిన్స్ని నామినేట్ చేశారు. అయితే వాదనతో విసిగిపోయిన గౌతమ్.. ఈసారి తనని డైరెక్ట్గా నామినేట్ చేస్తే, ఇంటినుంచి బయటకెళ్లిపోతానని సందీప్ తో అని అసహనం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) అమరదీప్ vs ప్రశాంత్ తర్వాత వచ్చిన అమరదీప్.. శుభశ్రీ, ప్రశాంత్ని బోనులో నిలబెట్టాడు. గత వారం తన ఆడలేక సైడ్ అయిపోయానని, మళ్లీ అదే విషయాన్ని ఎత్తిచూపినందుకు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. అతడు నటిస్తున్నాడని, దాగుడుమూతల దండాకోర్ టైపు గేమ్ ఆడుతున్నాడని అమరదీప్ అన్నాడు. అయితే అమర్ మాట్లాడుతుంటే.. ప్రశాంత్ రెచ్చగొట్టేలా నవ్వుతూ ఉండేసరికి.. సెగలుగా నవ్వకు అని అమరదీప్ సీరియస్ అయ్యాడు. ప్రశాంతంగా ఉండాల్సిన వాదన.. వీళ్లిద్దరి మధ్య సీరియస్ అయింది. ఫైనల్ శుభశ్రీ, ప్రశాంత్ ఇద్దరిలో ఒకరినే సెలెక్ట్ చేయాలి కాబట్టి జ్యూరీ సభ్యులు శుభశ్రీని నామినేట్ చేశారు. శుభశ్రీ ఏడుపు తప్పు కారణానికి తనని నామినేట్ చేశారని.. అదొక కారణమా.. సిల్లీయెస్ట్ రీజన్.. ఛీ అని అమరదీప్తోనే సీరియస్గా అంది. దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో, మనోభావాలు దెబ్బతిన్నాయ్ అట అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ప్రశాంత్.. గౌతమ్, అమరదీప్ని బోనులో నిలబెట్టాడు. అమర్ గతవారం గేమ్ లో ముందుకెళ్లకపోవడం తనకు బాగా అనిపించలేదని కారణం చెప్పిన ప్రశాంత్.. అమ్మాయి(శోభాశెట్టి) ముందు షర్ట్ తీసి గౌతమ్ షో హాఫ్ చేయడం తనకు నచ్చలేదని నామినేషన్స్కి కారణం చెప్పాడు. ఫైనల్గా జ్యూరీ సభ్యులు గౌతమ్ని నామినేట్ చేశారు. (ఇదీ చదవండి: నిత్యామేనన్ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ) రతిక అక్క అయిపోయింది ఇక ప్రశాంత్ తన నామినేషన్స్ చెబుతున్న సమయంలో రతికతో ప్రశాంత్ కొన్నిరోజుల ముందు బిహేవ్ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. ఆమె సింగిల్ పీస్ డ్రస్ వేసుకుంటే ఏమన్నాడో చెప్పుకొచ్చాడు. దీంతో గొడవ సైడ్ అయిపోయింది. దీంతో రతిక, ప్రశాంత్ వాదన పెట్టుకున్నారు. తను చాలా నార్మల్ గా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. ఎలా పడితే అలా అంటే ఒప్పుకొనేది లేదని రతిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలా కాసేపు వాదించిన తర్వాత.. ఇక నిన్ను రతిక కాదు ఏమని పిలవను కేవలం అక్క అని మాత్రమే పిలుస్తానని రైతుబిడ్డ వరస మార్చేశాడు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే తొలివారం వెంటబడ్డాడు, రెండో వారం గొడవపెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా అక్క అని పిలిచి అపరిచితుడిలా బిహేవ్ చేయడం వింతగా అనిపించింది. ఆరుగురు నామినేట్ తొలుత జ్యూరీ సభ్యులు ఐదుగురిని నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్బాస్ కల్పించుకుని.. తేజ, ప్రశాంత్, అమరదీప్లలో ఒకరిని నేరుగా సెలెక్ట్ చేయాలని చెప్పాడు. దీంతో జ్యూరీ(శోభాశెట్టి, శివాజీ, సందీప్).. తేజని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేట్ చేశారు. తనని నామినేట్ చేయడంపై తేజ.. కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. మరోవైపు రాత్రి కిచెన్లో శుభశ్రీ, అమరదీప్ గొడవపడ్డారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్) -
లాయర్లా మాట్లాడకు.. నువ్వెంత.. శివాజీపై శివాలెత్తిన గౌతమ్!
ఈ ఏడాది ఉల్టా పల్టా అనే సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్బాస్ సీజన్-7 అదే రేంజ్లో దూసుకెళ్తున్నాడు. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ వాతావరణం నడుస్తోంది. గతవారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో నామినేషన్స్లో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇవాళ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. అమర్దీప్ ఫైర్ ఏ టాస్క్ జరిగిన ప్రతి ఒక్కరికీ అదే విధంగా బిహేవియర్ ఉండాలి అని జడ్జిని ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు గౌతమ్. దీనికి శివాజీ ప్రతి ఒక్కరితో నీకు అనవసరం అంటూ కౌంటర్ ఇస్తాడు. కానీ నా ఇంట్లో వాళ్ల గురించి అవసరమే అని గౌతమ్ అడగడంతో.. ఇదే కేవలం గేమ్ మాత్రమే.. ఫ్యామిలీ కాదు అని శివాజీ అంటాడు. ఆ తర్వాత మీరు లాయర్ లాగా వన్సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారంటూ గౌతమ్ కౌంటరిస్తాడు. శివాజీ తీరుతో విసుగు చెందిన గౌతమ్ నువ్వెంత? అంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే ఈ వారంలో నామినేషన్స్ బాధ్యత శోభా శెట్టి, శివాజీ, సందీప్ల మీద పెట్టాడు బిగ్ బాస్. వీరు ముగ్గురు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అయితే కంటెస్టెంట్ తాము ఎవరినీ నామినేట్ చేయాలనుకున్న వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరినీ నామినేట్ చేయాలో జడ్జిలు నిర్ణయిస్తారు. నువ్వు ఎంత.. శివాజీపై గౌతమ్ ఫైర్ ఈ క్రమంలో మన డాక్టర్ బాబు గౌతమ్.. యావర్. తేజలను నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పాడు. ఏ టాస్క్ ఓడిపోయినా కూడా యావర్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు అని ఇలా ఏదో కారణం చెప్పబోయాడు గౌతమ్. ఇంటి సభ్యులందరికీ ఇబ్బందిగా ఉందని అంటాడు. అది నీకు సంబంధిచిన సమస్య కాదు అని శివాజీ అంటాడు. ఇది ఫ్యామిలీ అని గౌతమ్ అంటాడు.. ఇది ఫ్యామిలీ కాదు.. ఆట అని శివాజీ సమాధానం ఇస్తాడు. దీంతో హౌస్లో హీట్ ఓ రేంజ్కు దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్ల మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నావంటూ అమర్ దీప్ ప్రశాంత్కు కౌంటరిస్తాడు. నీకు రెండు మొహాలు, రెండు నాలుకలతో మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని ప్రశాంత్పై అమర్ దీప్ ఫైర్ కాగా.. దీనికి సైతం వ్యంగంగానే సమాధానమిస్తాడు ప్రశాంత్. ఆ తర్వాత ఏకంగా రేయ్ నువ్వు సెగలుగా నవ్వొద్దంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇస్తాడు. అయితే దీనికి నా ఆట నేను ఇలాగే ఆడతా అని పల్లవి ప్రశాంత్ అంటాడు. నువ్వు కూడా రెండు మొహాలు కాదా అమర్దీప్ను అనడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నేను ఇలానే ఉంటా అనే అమర్ దీప్ అంటే.. నేను కూడా ఇంతే అంటూ పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రోమో ముగిసింది. రోజు రోజులు హౌస్లో హీట్ పెంచుతోన్న నామినేషన్స్ ప్రక్రియ ఈ వారంలో ఎవరెవరూ నామినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఈ సీజన్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా రిలీజైన మరో ప్రోమోలో గౌతమ్కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. కారణాలపై ప్రశాంత్ మాట్లాడుతూ.. 'అమ్మాయి అరిచినప్పుడు నువ్వూ అరువు. మస్తు అనిపిస్తది. కానీ మళ్లీ ఇక్కడకు వచ్చి షర్ట్ తీయడం నాకు నచ్చలేదు.' అని అన్నాడు. ఆ తర్వాత రతిక పొట్టి దుస్తులు వేసుకోవడంపై ప్రశాంత్ మాట్లాడగా గొడవ మరింత ముదిరింది. రతికను ఏదో సరదాగా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. మజాక్ చేయడానికి నేనెవర్రాభయ్ నీకు అంటూ రతిక మండిపడింది. మరో వైపు శుభ శ్రీని అమర్దీప్ నామినేట్ చేయగా.. ప్రియాంకతో ఫేవర్గా ఉన్నానంటే అది మా స్ట్రాటజీ. ఆ పాయింట్ నాకు హర్టింగ్గా అనిపించింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తన కారణం చెప్పాడు. దీనికి శుభశ్ ఆగ్రహంతో అదొక కారణమా? ఛీ అంటూ మండిపడింది. దీంతో విరిద్దరీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్గా మారాయి. -
రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి
బిగ్బాస్ రియాలిటీ షో చరిత్రలో తొలిసారి ఓ రైతుబిడ్డ హౌస్లో అడుగుపెట్టాడు. అతడికి సోషల్ మీడియా అకౌంట్ ఉండి బోలెడంత ఫ్యాన్బేస్ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగానే సుపరిచితం. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ మళ్లొచ్చిన.. అంటూ ఎప్పుడూ రైతు పడే కష్టాలే చెప్తుంటాడు. అందుకే బిగ్బాస్ 7 లాంచ్ రోజు బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలు సిసలైన రైతుబిడ్డ అని నిరూపించుకున్నాడు. రైతుబిడ్డకు నిజంగా అంత ఆస్తి ఉందా? అయితే బిగ్బాస్ ఇంట్లో పదేపదే తాను రైతుబిడ్డ అని చెప్పుకోవడం అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్లకు అస్సలు నచ్చలేదు. దీంతో అతడిని విమర్శిస్తూ అతడి ఆటకు, మాటలకు అడ్డం పడుతున్నారు. హౌస్లో పరిస్థితి ఇలా ఉంటే బయట మరో కొత్తరకమైన గొడవ మొదలైంది. ప్రశాంత్ పేదవాడేమీ కాదు, అతడికి 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందంటూ కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ ప్రచారంపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించాడు. 26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి ఆయన మాట్లాడుతూ.. 'మా గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవంతి ఉన్నాయంటున్నారు. నిజంగా అవన్నీ ఉంటే నా కొడుకు బిగ్బాస్కు ఎందుకు వెళ్తాడు? నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు. అసలు 26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి. నాకున్నదల్లా ఆరెకరాల పొలం మాత్రమే! దాన్ని పంచితే ప్రశాంత్కు రెండెకరాలు వస్తాయంతే! రైతులకు ఇస్తే అదే సంతోషం.. రైతులను ఎప్పుడూ చిన్నచూపే చూస్తారు, కానీ పెద్ద చూపు చూడరు. బిగ్బాస్ ఇంట్లో నా కొడుకుని చులకన చేస్తూ మాట్లాడుతుంటే బాధేసింది. ఒకవేళ నా కొడుకు బిగ్బాస్ గెలిస్తే వాడు చెప్పినట్లుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకోటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే ప్రాణాలు విడిచారు. వారు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు' అని గద్గద స్వరంతో మాట్లాడాడు ప్రశాంత్ తండ్రి. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన విక్రమ్ హీరోయిన్ -
టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!
'బిగ్బాస్ 7' మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. తొలి రెండు వారాల్లో కిరణ్, షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజా నామినేషన్స్లో ఏకంగా ఏడుగురు నిలిచారు. అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది. ఇంతకీ బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? మళ్లీ పులిహోర మొదలు తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు. రెండో వారం వచ్చేసరికి అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు. తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక ఏడుస్తుంటే.. ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్ ఫర్టింగ్ చేశాడు. కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు. దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది. (ఇదీ చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!) చేతులేయడంతో గొడవ రెండో ప్రోమోలో భాగంగా మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం అమరదీప్, శోభాశెట్టి, యవర్ని బిగ్బాస్ సెలెక్ట్ చేశాడు. అయితే వీళ్లలో ఎవరు పోటీకి అనర్హులో చెప్పమని మిగిలిన వాళ్లని అడిగాడు. దీని తర్వాత ఏ విషయం గురించో తెలీదు గానీ ప్రశాంత్-రతిక గొడవపడ్డారు. 'హే పో' అని ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ అరిచాడు. దీంతో సీరియస్ అయిన రతిక.. మర్యాదగా ఉండదు చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. నామినేషన్స్ సంగతేంటి? ఈ వారం నామినేషన్స్లో శుభశ్రీ, గౌతమ్, అమరదీప్, ప్రియాంక, దామిని, రతిక, యవర్ ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతానికి అయితే ఓటింగ్ విషయంలో అమర్ టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. దామిని చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మూడో ఎలిమినేషన్కి ఇంకా నాలుగైదు రోజుల టైముంది కాబట్టి అంతలో ఏదైనా జరగొచ్చు. ఓటింగ్ తారుమారు కావొచ్చనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీనే!) -
నామినేషన్స్లో యవర్ అతి.. ప్రశాంత్ సిల్లీ రీజన్స్!
'బిగ్బాస్' మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయి, బయటకెళ్లిపోవడంతో కాస్త ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు.. నామినేషన్స్ వచ్చేసరికి మళ్లీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావుడి చేశారు. ఈ వారం కూడా ఏడుగురు నామినేషన్స్లో నిలవగా, చివరలో 'బిగ్బాస్' చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్లో చూద్దాం. సుత్తిలేకుండా మొదలయ్యాయి షకీలా ఎలిమినేట్ అయి, హౌస్ నుంచి బయటకెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ షురూ అయింది. బెడ్ రూంలో దామిని, ప్రియాంక.. ప్రిన్స్ యవర్ గురించి మాట్లాడుకున్నారు. అతడి ప్రవర్తన నచ్చలేదని అన్నారు. నిద్రపోయే లేచేసరికి సోమవారం వచ్చేసింది. నేరుగా సుత్తిలేకుండా నామినేషన్స్ ప్రారంభమైపోయాయి. హుసులో అనర్హుడు అనిపిస్తున్న ఇద్దరినీ నామినేట్ చేయమని బిగ్బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రియాంక - యవర్, గౌతమ్ ప్రశాంత్ - తేజ, దామిని శోభాశెట్టి - శుభశ్రీ, రతిక అమర్దీప్ - గౌతమ్, శుభశ్రీ రతిక - శుభశ్రీ, గౌతమ్ తేజ - ప్రశాంత్, గౌతమ్ యవర్ - ప్రియాంక, దామిని దామిని - యవర్, శుభశ్రీ గౌతమ్ - రతిక, అమర్దీప్ శుభశ్రీ - తేజ, ప్రియాంక నామినేషన్స్లో ఏం జరిగింది? తొలుత వచ్చిన ప్రియాంక.. యవర్, గౌతమ్ని నామినేట్ చేసింది. అయితే గౌతమ్ పెద్దగా వ్యతిరేకించనప్పటికీ, ప్రిన్స్ యవర్ మాత్రం చాలా హడావుడి చేశాడు. ఇక ప్రశాంత్.. తేజని నామినేట్ చేస్తూ సరైన కారణం చెప్పలేకపోయాడు. మధ్యలో కల్పించుకున్న బిగ్బాస్.. సిల్లీ రీజన్స్ వద్దని మొట్టికాయలు వేశాడు. అయినా వల్ల కాకపోయేసరికి వదిలేశాడు. దామిని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. వంట విషయంలో తనకు పదే పదే చెప్పడం నచ్చలేదని అన్నాడు. శోభాశెట్టి.. శుభశ్రీ నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పింది. రతికకి మొండితనం, స్వార్థం ఎక్కువని కారణాలు చెప్పింది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) అతి చేసిన యవర్! అమర్దీప్, రతిక, యవర్.. తమ తమ నామినేషన్స్ని పెద్దగా హడావుడి లేకుండా ముగించేశారు. అయితే దామిని.. తనని నామినేట్ చేసేసరికి ప్రిన్స్ యవర్ తట్టుకోలేకపోయాడు. అలానే ఆమె చెప్పేది అతడికి సరిగా అర్థం కాకపోవడం వల్ల వేరేది అనుకుని అటుఇటూ తిరుగుతూ కాస్త అతి చేశాడనిపించింది. ఇక శుభశ్రీ అయితే దామిని తనని టార్గెట్ చేస్తుందని ఈ విషయాన్ని ఆమెతోనే చెప్పింది చివర్లో ట్విస్ట్ మిగిలిన వాళ్లలో గౌతమ్, శుభశ్రీ కూడా తమ తమ నామినేషన్స్ని సింపుల్గానే ముగించేశారు. దీంతో ఈ వారం నామినేషన్స్లో తొలుత శుభశ్రీ, గౌతమ్, తేజ, ప్రియాంక, దామిని, రతిక, యవర్ నిలిచారు. అయితే చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్బాస్.. పవరస్త్ర గెల్చుకున్న శివాజీ, సందీప్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. లిస్టులో ఒకరిని సేవ్ చేసి, సేఫ్ గా ఉన్నవాళ్లని నామినేట్ చేయాలని అన్నారు. దీంతో ఇద్దరూ అనుకుని తేజని సేవ్ చేసి, అతడి ప్లేసులో అమర్దీప్ నామినేట్ చేశారు. అలా ఏడుగురు నామినేషన్స్లో నిలవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మిగతారోజుల సంగతెలా ఉన్నా.. సోమవారం మాత్రం టాప్ లేచిపోతూ ఉంటుంది. ఈసారి అలాంటిదేం లేకుండా, చాలా ప్లెయిన్గా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) -
ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా
బిగ్బాస్ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్ లైన్లో ఉంది ప్రిన్స్ యావర్ అనుకున్నారు. కారణం కిరణ్లాగే అతడికి కూడా తెలుగు రాదు. ఇంకేముంది, తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం అని అందరూ ఊహించారు. కానీ ప్రిన్స్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఊహించినట్లే జరిగింది.. గేమ్లో ఫైర్బ్రాండ్లా ఆడుతూ చెలరేగిపోయాడు. తన టీమ్ను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ప్రిన్స్ గ్రాఫ్ పెరిగి సేఫ్ జోన్లో అడుగుపెట్టాడు. ఇక హౌస్లో పెద్దగా ఏ గొడవల జోలికి పోని షకీలా ఎలిమినేట్ కావచ్చని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. రెండో వారం షకీలా అమ్మ ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె బిగ్బాస్ బజ్లో పాల్గొంది. నువ్వేంటి నన్ను అడిగేది? షకీలా ఫైర్ గీతూ రాయల్ అడిగే పదునైన ప్రశ్నలకు అంతే పదునుగా సమాధానాలిచ్చింది. హౌస్లో మీరు శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా? అని అడగ్గా నేను బ్యాచ్లో ఉన్నానని చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అని గీతూపై ఫైర్ అయింది. హౌస్లో రియల్గా ఉన్నారా? ఫేక్గా ఉన్నారా? అని అడగ్గా తానేదీ ప్లాన్ చేయలేదని చెప్పింది. పిలిస్తే వచ్చాను తప్ప ఏదో ఆశయం పెట్టుకుని ఇక్కడకు రాలేదని పేర్కొంది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గురించి కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడింది. ప్రశాంత్కు డ్రగ్ ఎక్కేసింది 'అమర్ దీప్.. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రిన్స్ యావర్.. వెధవ, కేవలం తనకున్న బాడీని ఉపయోగించి శారీరక బలంతో అంచెలంచెలు ఎదుగుతానంటే అది అసాధ్యం. పల్లవి ప్రశాంత్.. బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. పాపులారిటీ అనే డ్రగ్ ప్రశాంత్కు ఎక్కేసింది. ఆట సందీప్ హౌస్లో ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తి. రతిక అందంగా కనిపించే పాము.. నేను చస్తే హౌస్లో ఉన్న 14 మంది రావాలి. అదీ నాకు కావాల్సింది' అని చెప్పుకొచ్చింది షకీలా. -
రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్పై నాగ్ సీరియస్!
రెండో పవరస్త్ర కోసం జరిగిన పోటీతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక శనివారం ఎపిసోడ్లో ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. అందరినీ నవ్విస్తూనే.. ఓవైపు చేసిన పనులకు మెచ్చుకుంటూ మరోవైపు ఎవరికి ఇవ్వాల్సిన డోస్ వాళ్లకు ఇచ్చేశాడు. ఇక చివర్లో నామినేషన్స్ గురించి కూడా చెప్పి భయపెట్టాడు. ఇంతకీ 'బిగ్బాస్'లో 13వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టిన మెగాకపుల్) యవర్ అది మర్చిపోలేదు మాయస్త్ర ఇచ్చే విషయమై రతిక తనని సపోర్ట్ చేయడంపై యవర్ మాట్లాడాడు. ఆమెపై గౌరవం పెరిగిందని అన్నాడు. ఇక తనకు అన్యాయం జరగడంపై.. మార్నింగ్ ఎక్సరసైజ్ చేస్తూ శుభశ్రీతో మాట్లాడాడు. 'ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు.. డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి' అని కెమెరాని చూస్తూ అన్నాడు. కాసేపటికి బెడ్ రూంలో అందరూ ఉన్న టైంలో ప్రిన్స్-గౌతమ్ మధ్య షకీలా కాంప్రమైజ్ చేసింది. అలానే రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర.. రూంలో నిద్రపోవడం గురించి సందీప్ చెప్పిన ప్రిన్స్ వినలేదు. అతడితో గొడవపడ్డాడు. ఈసారి కింగ్స్ మీటర్ శుక్రవారం జరిగింది అంతా చూసిన నాగార్జున.. శనివారం కంటెస్టెంట్స్తో మాట్లాడేందుకు వచ్చేశాడు. గతవారం ఆడియెన్స్ చెప్పారు, ఈసారి మాత్రం కింగ్స్ మీటర్తో తానే చెబుతానని అన్నాడు. అలా ఒక్కో కంటెస్టెంట్స్ ఈ వారం ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ చేశారనేది చెప్పుకొచ్చాడు. అలానే రెండో పవరస్త్ర గెలుచుకున్నది శివాజీ అని అనౌన్స్ చేశారు. 'బిగ్బాస్' అరిచే గేమ్లో శివాజీకి అత్యధికంగా 11 పాయింట్లు వచ్చాయి. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్) శివాజీకి పడ్డాయి గేమ్, టీమ్ ని లీడ్ చేసే విషయంలో శివాజీని సూపర్ అని మెచ్చుకున్న నాగ్.. 'తలుపు తీయరా సామీ బయటకెళ్లిపోతా' అని బిగ్బాస్తో పదేపదే అనడంపై నాగ్ ఓ రేంజులో కౌంటర్స్ వేశాడు. అది కరెక్ట్ కాదన్నాడు. అమర్దీప్ కూడా బాగానే ఆడాడని చెప్పిన నాగ్.. ప్రశాంత్ నామినేషన్ టైంలో చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్ కాదని హితబోధ చేశాడు. షకీలా గురించి మాట్లాడుతూ.. వయసుతో శరీరానికి సంబంధం లేదు. వయసుకు తగ్గట్లు కాదు వయసుకు మించి ఆడాలని నాగ్ ఆమెతో చెప్పాడు. రైతుబిడ్డ తుస్ సందీప్ని బాగా ఆడుతావని మెచ్చుకున్న నాగార్జున.. శుభశ్రీ, ప్రియాంక ఇంకా బాగా ఆడాలని వాళ్లతోనే అన్నాడు. అయితే రైతుబిడ్డ ప్రశాంత్కి మాత్రం గట్టిగా కౌంటర్స్ పడ్డాయి. ఒక మొక్కని చూసుకోలేనివాడు రైతుబిడ్డా? అని నాగ్ అనేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. బిగ్బాస్ని అడిగి మరో మొక్క పంపిస్తా. ఈసారి గానీ మొక్క మాడిపోతే.. నామినేషన్స్లో అందరూ చెప్పింది నిజమని తాను నమ్ముతా అని నాగ్ ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ) యవర్కి గీతోపదేశం ప్రిన్స్ యవర్తో మాట్లాడిన నాగ్.. నీ అరుపులతో మేం డిసప్పాయింట్ అయ్యాం. బాగా ఆడావ్. ఎక్సప్రెస్ చేయ్ కానీ అరవాల్సిన అవసరం లేదు, అన్యాయానికి అరిస్తే న్యాయం జరగదు. నీకు రివార్డ్ దొరకదని చెప్పాడు. గౌతమ్ స్టెరాయిడ్స్ అని సైగ చేయడంపై మాట్లాడిన నాగ్.. అక్కడే గౌతమ్తో యవర్కి సారీ చెప్పించాడు. గౌతమ్తో మాట్లాడిన నాగ్.. ఏ గేమ్ లోనూ గెలవలేదు, వ్యక్తిగతంగానూ గెలుచుకోలేకపోయావ్. ఇంప్రూవ్ యువర్ గేమ్ అని నాగార్జున చిన్న వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు ఇంకా డేంజర్లోనే మిగతావాళ్లలో శుభశ్రీ, దామిని, శోభాశెట్టి, తేజ సరిగా ఆడటం లేదని హెచ్చరించిన నాగార్జున.. రతికకి మాత్రం గట్టిగానే ఇచ్చాడు. టీమ్ గేమ్ అంటే టీమ్ గేమ్ ఆడాలి, ఒక్కటే పాయింట్ పట్టుకుని మొండితనం కరెక్ట్ కాదు, బఫూన్ అంటే ఏంటో తెలుసా? అని అన్నాడు. ఆట ఆడు.. మనుషులతో ఆడుకోవద్దని చెప్పి కూల్ చేశాడు. ఇకపోతే రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న శివాజీ.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. అమర్దీప్ కూడా సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఏడుగురు అంటే ప్రశాంత్, షకీలా, గౌతమ్, యావర్, తేజ, శోభాశెట్టి, రతిక.. ఇంకా డేంజర్ లో ఉన్నారని చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. మరి రెండో వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తేలనుంది. ఆ కంటెస్టెంట్స్ ఎవరని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!) -
నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!
'బిగ్బాస్ 7' సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ వారమంతా గొడవలే టార్గెట్ అన్నట్లు కంటెస్టెంట్స్ తిట్టుకున్నారు. తెగ హడావుడి చేశారు. అయితే వీకెండ్ వస్తే నాగార్జున వచ్చేస్తాడు. అప్పటివరకు జరిగిన వాటికి కౌంటర్స్ ఇచ్చేస్తాడు. అలా ఈ సారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీకి గట్టిగానే పడ్డాయి. ఇంతకీ తాజా ప్రోమోలో ఏముంది? 'బిగ్బాస్' షోలో మిగతా రోజుల్లో ఎలా ఉన్నా గానీ సోమవారం, శని-ఆదివారం మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. వీకెండ్ మాత్రం నాగార్జున వచ్చేస్తాడు. అందరికీ పేరుపేరున కౌంటర్స్ ఏసేస్తాడు. మంచి చేస్తే మెచ్చుకుంటాడు. ఎక్కువచేస్తే మాటలతో గాలి తీసేస్తాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ) అలా ఈ వారం పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయలేదని శివాజీకి కౌంటర్స్ పడ్డాయి. ప్రతిసారి వయసు అంశాన్ని మాట్లాడుతున్నందుకు షకీలాకు కూడా స్మూత్గా పడ్డాయి. ఇక నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్పై అమరదీప్ అరిచాడు. ఈ విషయమై స్పందించిన నాగార్జున.. 'అతడు డబ్బులు అతడి ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు?' అని అన్నాడు. హౌసులోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్కి హోస్ట్ నాగార్జున ఓ మొక్క ఇచ్చాడు. అయితే దాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో అది ఆకులు రాలిపోయి, పూర్తిగా వాడిపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పిన నాగార్జున.. 'మొక్కనే సరిగా చూసుకోలేకపోయావ్ నువ్వు రైతుబిడ్డవా?' అని అన్నాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది. ఇంకా ఎవరెవర్ని ఏమేం కౌంటర్స్ పడ్డాయో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!) -
రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్దీప్ అయితే..:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్
బిగ్బాస్ షోలో తన ఆటతో రాణిస్తున్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్బాస్ షోకి వెళ్లాలని ఐదు సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. తన మాటతీరుతో, ఆటతో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా అతడి గురించి పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చస్తానని పొలం దగ్గరకు వెళ్లి.. 'నా కొడుకు బిగ్బాస్ షోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్దీప్ నా కొడుకును ఏందిరా.. అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారు. నాకు అదుంది, ఇదుందని విర్రవీగొద్దు. హౌస్లో అందరూ సమానమే. నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ తీస్తే రూ.7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకుని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా ఏడ్చాడు. ఒకరోజైతే చస్తానని పొలం దగ్గరకు వెళ్లిండు. నీకే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పిన. అప్పుడు ఫోన్ కొనిస్తే రీల్స్ చేసుకుంటానన్నాడు. అదే సంతోషం ఫోన్ కొనిచ్చిన, రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయిండు. కానీ ఏదో ఒకటి చేయాలని తిండీతిప్పలు లేకుండా తిరిగిండు. బిగ్బాస్కు వెళ్లిండు, నాగార్జున సార్ను కలిశిండు, అదే సంతోషం. ప్రశాంత్కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, తనకు ముందు సెటిలవ్వాలని ఉంది. సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుంటా, మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ఇంట్లోకే రానని అన్నాడు. అందుకే ఊరుకున్నాం. బిగ్బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుంది, వాడుకుంది. అంతే! ప్రశాంత్ అందరినీ అక్కాచెల్లె అనుకుంటూనే మాట్లాడతాడు. తను ఎటువంటి దురాలోచన చేయడు' అని చెప్పుకొచ్చారు. చదవండి: మార్క్ ఆంటోని మూవీ ట్విటర్ రివ్యూ.. విశాల్ హిట్ కొట్టాడా? -
'బిగ్బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!
'బిగ్బాస్' రెండో వారం నామినేషన్స్ హడావుడి సైడ్ అయిపోయింది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అనేంతలా గొడవపడ్డ కంటెస్టెంట్స్ కాస్త.. ఇప్పుడు దాని గురించే మర్చిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే 'మాయ అస్త్ర' అని 'బిగ్బాస్' ఓ పోటీ పెట్టారు. మంగళవారం సగం ఆట కాగా, బుధవారం మిగతాది పూర్తి చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ పిల్లిమొగ్గలు వేశారు. ఓవరాల్గా ఏం జరిగిందనేది Day-10 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. దొంగతనం ప్లాన్ 'మాయ అస్త్ర' టాస్కులో భాగంగా మంగళవారం పెట్టిన 'పుల్ రాజా పుల్' గేమ్లో రణధీర సమూహం (శివాజీ, అమర్దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా) గెలిచారు. దీంతో వీళ్లకి ఓ తాళం చెవిని 'బిగ్బాస్' ఇచ్చాడు. అక్కడితో మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. దాన్ని దొంగతనం చేయాలని మహాబలి టీమ్ ప్లాన్ వేయడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. తాళం సంపాదించమని చెప్పారు గానీ దొంగతనం చేయొద్దని చెప్పలేదుగా అని తేజ తొలుత డౌట్ పడ్డాడు. దీంతో తాళం చెవి కొట్టేద్దామని గౌతమ్ అన్నాడు. (ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!) తాళం కోసం తిప్పలు అప్పటికే రాత్రి అయిపోవడంతో అందరూ నిద్రపోవడానికి ఉపక్రమించారు. మహాబలి (రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, దామిని, ప్రశాంత్) మాత్రం.. రణధీర గ్రూప్ దగ్గరున్న తాళాన్ని ఎలాగైనా కొట్టేయాలని రాత్రంతా నిద్రపోకుండా తెగ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిద్రపోయినట్లు నటిస్తున్న శుభశ్రీ దగ్గరకొచ్చిన శివాజీ.. 'ఏం యాక్టింగ్ చేస్తున్నావ్' అని అన్నాడు. ఇది జరిగిన తర్వాత దామిని-రతిక-శుభశ్రీ రాత్రంతా తాళం కోసం జాగరం చేశారు. తాళం కోసం మరో గేమ్ ఇప్పుడు 'బిగ్బాస్' మలుపులో గెలుపు అని రెండు గ్రూపులకు మధ్య మరో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా సంచాలకుడు సందీప్ ఓ చక్రంలో ఉన్న పుల్లని తిప్పుతాడు. అది ఏ రంగు అయితే వచ్చి ఆగుతుందో.. పోటీపడే కంటెస్టెంట్స్.. తమ ఎదురుగా బల్లపై ఉన్న సర్కిల్స్లో ఆ కలర్పై చేతులు లేదా కాలు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే ముందు తప్పు చేస్తారో వాళ్లు ఓడినట్లు. తొలుత గౌతమ్పై ప్రియాంక విజయం సాధించింది. ఆ తర్వాత శోభాపై ప్రశాంత్, రతికపై ప్రిన్స్ గెలిచారు. అలా తొలి గేమ్లో విజయం సాధించిన రణధీర్ టీమ్.. మళ్లీ రెండు పాయింట్లతో ఈ పోటీలోనూ గెలిచింది. (ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు) పవర్ అస్త్ర కొట్టేశారు ఇక తాళాలు దొంగిలించలేకపోయిన మహాబలి టీమ్ సభ్యులు.. సందీప్ గెలుచుకున్న 'పవర్ అస్త్ర' దొంగిలించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చిన్న చమక్కు విసిరిన దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నందుకు ప్రిన్స్కు 'బిగ్బాస్' పనిష్మెంట్ ఇచ్చాడు. లాన్ ఏరియాలో 'ఇంట్లో ఉన్నంతకాలం తెలుగులోనే మాట్లాడుతాను' అనే పేరా మళ్లీమళ్లీ చాలాసేపు చదువుతూనే ఉన్నాడు. చదువుతుంటే ప్రిన్స్ దగ్గరే తాళం ఉందనే విషయం తెలిసి, అతడిని మహాబలి టీమ్ తెగ ఇబ్బంది పెట్టారు. 'మాయ అస్త్ర' సొంతం ఇక పెట్టిన రెండు పోటీల్లోనూ విజేతలుగా నిలిచిన రణధీర్ సమూహానికి బిగ్బాస్ 'మాయ అస్త్ర' ఇచ్చాడు. అందులో ఆరు భాగాల్ని గ్రూపులో ఉన్న ఆరుగురు పంచుకున్నారు. వీళ్లందరూ కూడా 'పవర్ అస్త్ర' పోటీలో ఉంటారని బిగ్బాస్ గుర్తు చేశాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. మరి గురువారం ఏ టాస్క్ ఇస్తాడో ఎలా ఉండబోతుందనేది చూడాలి. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) -
రైతు బిడ్డ అని చిన్న చూపా? ఆ వల్గర్ మాటలేంటి?: సీరియల్ బ్యాచ్పై అఖిల్ ఫైర్
Akhil Sarthak - Pallavi Prashanth: బిగ్బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ ఓ రేంజులో జరిగాయి. అయితే చాలామంది మూకుమ్ముడిగా పల్లవి ప్రశాంత్ను నామినేట్ చేశారు. వారు చెప్పే కారణాలు, మాటలు చూస్తుంటే ఇదేదో పకడ్బందీ ప్లాన్లాగే అనిపించింది. చివరకు అదే నిజమైంది. ముందురోజు రాత్రే ప్రశాంత్ను కలిసికట్టుగా నామినేట్ చేయాలని సీరియల్ బ్యాచ్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ నెట్టింట వైరలవుతోంది. నోరు జారిన అమర్.. రైతు బిడ్డ అని చెప్పుకోవడం ఆపాలని ఆర్డర్లు, గత బిగ్బాస్ షో సీజన్లు చూసి వచ్చావని విమర్శలతో అతడిని టార్గెట్ చేసింది. అయినా గత సీజన్లు చూస్తే తప్పేంటి? పోనీ వీళ్లెవరైనా చూడకుండా వచ్చారా? అంటే అదీ లేదు.. ఇలా అర్థంపర్థం లేని వాదనలు, విమర్శలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో అమర్దీప్ అరేయ్, రా.. అంటూ కాస్త హద్దు దాటి మాట్లాడాడు. కానీ ప్రశాంత్ మాత్రం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా.. నోరు జారలేదు. అన్న అంటూనే మర్యాద ఇచ్చాడు. రైతు బిడ్డకు అఖిల్ సపోర్ట్ తాజాగా ఈ వ్యవహారంపై బిగ్బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ స్పందించాడు. పల్లవి ప్రశాంత్కు అందరూ భయపడ్డారు, అందరూ అతడిని టార్గెట్ చేశారు. రైతు బిడ్డ నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఆర్టిస్టులమైన మనకే బిగ్బాస్ అంటే ఎంతో ఎగ్జయిట్గా ఫీలైతాం. ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతాం. అలాంటిది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతడు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంబరపడ్డాడు. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. లవ్ ట్రాక్తో కామెడీ చేయాలనుకున్నాడు.. కానీ అది కరెక్ట్ కాదు. అతడి గురించి రీసెర్చ్ చేసి మరీ వచ్చారు! అయినా సరే హౌస్లో ఉన్న అందరిలాగే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. అందులో తప్పేం ఉంది. కొందరైతే పల్లవి ప్రశాంత్ గురించి అధ్యయనం చేసి మరీ వచ్చారు. కానీ అతడు మిగతా కంటెస్టెంట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. తన ఆట తను ఆడేందుకు వచ్చాడు. నామినేషన్స్లో పల్లవి ప్రశాంత్ను చూస్తే బాధేసింది. ఎవరూ అతడిని మాట్లాడనివ్వడం లేదు. పైగా కొందరు అరేయ్, రా.. అంటూ వల్గర్గా మాట్లాడారు. అతడు ఒక రైతు అని చులకన చేస్తున్నారా? చాలా చిన్నచూపు చూస్తున్నారనిపించింది. అందరూ తనను డామినేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు ఉల్టాపుల్టా నామినేషన్స్ అంటే అందరూ మాట్లాడతారు కానీ అతడిని మాత్రం మాట్లాడనివ్వరన్నమాట! వాళ్లు చెప్పే పాయింట్స్ కరెక్ట్.. కానీ అతడిని మాట్లాడనివ్వకపోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంకో విషయం.. అన్ని సీజన్లు చూసి వచ్చాడు అంటున్నారు. హౌస్లో ఉన్నవాళ్లు కూడా కచ్చితంగా గత సీజన్లు చూసే ఉంటారు. ఎందుకంటే బిగ్బాస్ షో అంటే అందరికీ ఇష్టం. అసలు షో చూస్తే తప్పేంటి? వీళ్లందరూ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్ నిజంగా ఉల్టా పుల్టా.'. అని ఫైర్ అయ్యాడు అఖిల్. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: సమాధి దగ్గరే నిద్ర.. అక్కడే కూతురితో ఆటలు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడని హీరో -
'బిగ్బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!
'ఉల్టా పల్టా' అనే ట్యాగ్ లైన్తో బిగ్బాస్ 7వ సీజన్.. గత వారం మొదలైంది. ఇప్పటికే ఓ వీకెండ్ కూడా పూర్తయింది. అయినా సరే షోలో పెద్దగా జోష్ కనిపించట్లేదు. ఇలాంటి టైంలో ఈ సోమవారం నామినేషన్స్ ఒక్కసారిగా హీట్ పెంచాయి. మంగళవారం కూడా నామినేషన్స్ హంగామా కొనసాగనుంది. అయితే ఎపిసోడ్ రావడానికి ముందే నామినేషన్స్ లో ఉన్నవాళ్ల లిస్ట్ ఒకటి బయటకొచ్చింది. సెప్టెంబరు 3న ప్రారంభమైన 'బిగ్బాస్ 7'లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యవర్, శోభాశెట్టి, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శుభశ్రీ, రతిక, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, అమర్దీప్.. హౌసు లోపలికి వచ్చారు. అయితే తొలివారం తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. (ఇదీ చదవండి: ప్రశాంత్, శివాజీని ఉతికారేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్స్) ఇకపోతే తాజాగా సోమవారం నామినేషన్స్ జరగ్గా.. శివాజీని అమర్దీప్, ప్రియాంక, శోభాశెట్టి, దామిని నామినేట్ చేశారు. ప్రశాంత్ని గౌతమ్, అమర్దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక నామినేట్ చేశారు. అలానే పవర్ అస్త్ర సొంతం చేసుకున్న సందీప్.. ప్రిన్స్ని నేరుగా నామినేట్ చేశాడు. మంగళవారం మాత్రం రతికని గౌతమ్, శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. వీళ్లతో పాటు గౌతమ్, అమర్దీప్, టేస్టీ తేజ, షకీలా కూడా ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. గతవారంతో పోల్చి చూస్తే.. నామినేషన్స్లోకి శివాజీ, అమర్దీప్, తేజ కొత్తగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు 9 మంది ఉన్నారు. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందో చూడాలి. (ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్లో గలీజ్ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్!) -
పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!
తెలుగు ప్రేక్షుకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హోస్లోకి ఎంట్రీ ఇవ్వగా తొలిరోజు నుంచే ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా బిగ్బాస్-7 సీజన్ ఈసారి ఉల్టా పల్టాగా ఉంటుందని ప్రకటించిన నాగార్జున ఈ షోపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే తొలివారం అంతంత మాత్రంగానే అలరించిన కంటెస్టెంట్స్.. రెండోవారం వచ్చేసరికి విమర్శలతో షోను రసవత్తరంగా మార్చేశారు. దీంతో రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్గా మారింది. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య రణరంగం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో పరిస్థితి అర్థమవుతోంది. వాడీవేడీగా నామినేషన్స్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ చాలా వాడీవేడీగా కొనసాగుతోంది. శక్తి అస్త్రాను సొంతం చేసుకున్న సందీప్ ఐదు వారాల పాటు సేవ్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఈ వారం ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని సందీప్ సొంతం చేసుకున్నాడు. ప్రిన్స్ యావర్ను సందీప్ అతడిని నామినేట్ చేశాడు. సందీప్.. ప్రిన్స్ యావర్ను నామినేట్ చేయడంతో మిగిలినవాళ్లు అతన్ని నామినేట్ చేసేందుకు వీల్లేదని బిగ్బాస్ ఆదేశించాడు. పల్లవి ప్రశాంత్పై చర్చ టేస్టీ తేజను శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయగా.. శివాజీని అమర్దీప్, ప్రియాంకజైన్, షకీలా, శోభాశెట్టి, దామినిలు నామినేట్ చేశారు. నామినేషన్ సమయంలో వారి మధ్య తీవ్ర చర్చ జరిగింది. రైతు బిడ్డ అంటూ సింపథీ కోసం ప్రయత్నస్తున్నాడని పల్లవి ప్రశాంత్ని గౌతమ్ కృష్ణ, దామిని, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, షకీలా, అమర్దీప్లు నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ సమయంలో రైతుబిడ్డ ఇష్యూపై పెద్ద చర్చే నడిచింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా కొనసాగనుంది. శివాజీతో గొడవ నామినేషన్స్ ప్రక్రియ చూస్తే గౌతమ్, రతికా రోజ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ? అంటూ రతిక ఓ రేంజ్లో ఫైర్ అయింది. మరోవైపు తనను నామినేట్ చేసినందుకు.. శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. నువ్వు ఆర్టిస్ట్ కాబట్టే ఇంప్రెస్ చేశావు అంటూ శివాజీ ఫైర్ కావడంతో.. ‘అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను’ అని శోభ కౌంటరిచ్చింది. దీంతో మంగళవారం రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో ఎంత హీట్ ఉందో అర్థమవుతోంది. -
ప్రశాంత్, శివాజీని ఉతికారేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్స్
బిగ్బాస్ 7వ సీజన్ మొదలై అప్పుడే వారమైపోయింది. షో మొదలైనప్పుడు హోస్ట్ నాగార్జున.. 'ఉల్టా పల్టా' అని తెగ హడావుడి చేశాడు. కానీ తొలివారం పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. దీంతో ఈ సీజన్ కూడా అంతా యధావిధాగానే ఉండనుందా అని అనుకున్నారు. కానీ సోమవారం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివాజీ, ప్రశాంత్ ని అందరూ ఉతికే ఆరేశారు. ఇంతకీ నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా సాగింది. ఏంటనేది ఇప్పుడు Day-8 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హాస్టల్ కుర్రాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) బెడ్ రూంలో గొడవ కిరణ్ రాథోడ్.. ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్. ఆమె వెళ్లిపోయేసరికి శుభశ్రీ కాస్త బాధపడింది. మంచిగా జోకులు వేసుకుని నవ్వుకున్నామని.. అలాంటి ఆమె వెళ్లిపోవడం కాస్త వెలితిగా ఉందని చెప్పుకొచ్చింది. కాసేపటి తర్వాత బిగ్బాస్ మాట్లాడుతూ.. అందరూ బెడ్ రూంలో పడుకోవాలని ఆదేశించాడు. అయితే అందరికీ పెద్ద ఇబ్బంది లేనప్పటికీ.. రతిక వచ్చి గొడవ పెట్టుకుంది. సందీప్ నువ్వు.. వీఐపీ రూంలోకి వచ్చినవాళ్లని అడగవా అని అతడిని రెచ్చగొట్టింది. నేలపై శోభా-ప్రియాంక వీఐపీ రూంలో రతిక.. తమని అంటుందేమో అనుకున్న ప్రియాంక-శోభాశెట్టి, అదే రూంలో నేలపై పడుకున్నారు. రతిక మాత్రం ఎంచక్కా బెడ్పై రాత్రంతా నిద్రపోయింది. మరోవైపు బాత్రూం కడిగే విషయంలో శోభాశెట్టికి సహాయం చేస్తున్న టేస్టీ తేజ.. ఇప్పుడే కడగమని బిగ్బాస్ ఏం చెప్పలేదు కదా అని ఆమెతోనే గొడవపడ్డాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ) నామినేషన్స్ స్టార్ట్ ఈ వారం నామినేషన్లో భాగంగా ఓ బాక్స్ లాంటిది ఉంటుంది. బిగ్ బాస్ పిలిచినవాళ్లు అందులో వెళ్లి నిలబడాది. ఎవరెవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. ఎదురుగా నిలబడి కారణాలు చెప్పాలి. దీంతో పై నుంచి నామినేట్ అయిన కంటెస్టెంట్పై కలర్ వాటరు పడుతుంది. ఇక పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్.. ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పగా.. ప్రిన్స్ పేరు చెప్పాడు. అయితే తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని ప్రిన్స్ అనడంతో.. ప్రిన్స్-సందీప్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ప్రిన్స్ డైరైక్ట్ నామినేషన్ అయినందున అతడిని మరెవరు నామినేట్ చేయకూడదని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. శివాజీకి ఇచ్చిపడేశారు ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. అనంతరం దామిని వస్తే.. ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు. తర్వాత శివాజీ రాగా.. ఇతడిని అమర్దీప్, ప్రియాంక, షకీలా, శోభాశెట్టి, దామిని.. ఇలా ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అమర్దీప్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నిఅస్తమానం పొగుడుతూ తమని తక్కువ చేసేలా శివాజీ మాట్లాడుతున్నారని అన్నాడు. అలానే తాము చెప్పేది శివాజీ అస్సలు వినిపించుకోవడం లేదని ప్రియాంక, శోభాశెట్టి కారణాలు చెప్పారు. అలానే శివాజీ తీరుతో ప్రియాంక.. బయటకొచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రశాంత్ బలైపోయాడు ప్రశాంత్ని ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. వీళ్లలో గౌతమ్, అమర్దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక ఉన్నారు. అయితే తొలివారం అంతా రతికతో పులిహోర కలుపుతూ బాగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతడిని నామినేట్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ప్రియాంక, అమర్దీప్తో చాలాసేపు వాదించాడు. తమకు అసలైన ప్రశాంత్ కనిపించట్లేదని, అలానే సెంటిమెంట్ పేరు చెప్పి, కావాలనే కెమెరాల ముందు యాక్ట్ చేస్తాడని వీళ్లు కారణాలు చెప్పారు. ఇకపోతే బిగ్ బాస్ లో అవకాశం కోసం స్టూడియో చుట్టూ కుక్కలా తిరిగానని ప్రశాంత్ చెప్పగా.. మరి ఛాన్స్ వస్తే ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్ అని రతిక అతడికి కౌంటర్ వేసింది. పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేస్తున్న టైంలో అమర్దీప్ చెప్పిన పాయింట్స్కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని, గౌతమ్ కృష్ణ.. ప్రశాంత్తో వాదించారు.ఈ మొత్తం వ్యవహారంలో శివాజీ, ప్రశాంత్.. ఏదో తామే తోపు తురుము అన్నట్లు ప్రవర్తించినట్లు అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
బిగ్బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ
బిగ్బాస్ హౌస్మేట్స్కు ఓ విషయం అర్థమైంది. ఇక మెతకగా ఉంటే పని అవ్వదని, అందరి కంట్లో పడాలంటే ఏదో ఒకటి చేసేయాలని తెలిసొచ్చింది. అసలే వీకెండ్లో నాగ్ కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు. ఇంకేముంది, నామినేషన్స్లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. బిగ్బాస్కే బాస్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న శివాజీని, పదేపదే రైతుబిడ్డ అని చెప్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ సింపథీ కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్ను ఉతికారేశారు. ముందు ఎదుటివారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీకి గట్టిగానే కౌంటరిచ్చింది. అది తప్పా? అనంతరం హౌస్లో చాలామంది ప్రశాంత్ను వరుసపెట్టి నామినేట్ చేశారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నాయనా, నాకు నువ్వు నాకు కనిపించడం లేదని షకీలా మొదట ప్రశాంత్ను నామినేట్ చేసినట్లు చూపించారు. ఇక గౌతమ్ కృష్ణ.. తనను నామినేట్ చేస్తూ కారణం చెప్తుండగా అతడిని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రశాంత్. నేను చేసే పని గర్వంగా చెప్పుకున్నా, అది తప్పా? అని నిలదీశాడు. గౌతమ్ను మాట్లాడనివ్వకపోవడంతో.. ఫస్ట్ మొత్తం విన్నాక మాట్లాడు అని ప్రశాంత్పై ఫైర్ అయింది ప్రియాంక. అదిరే ఆన్సర్ ఇచ్చిన ఆట సందీప్ ఇక అమర్దీప్ అయితే రైతుబిడ్డ అనే క్యాసెట్ వినలేక తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రతిసారి రైతుబిడ్డ అనే సెంటిమెంటల్ డైలాగ్ వాడకురా అని హెచ్చరించాడు. సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చెప్పకు అని ఎదురుతిరిగాడు ప్రశాంత్. ఇంతలో ఆట సందీప్ కలగజేసుకుంటూ భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరూ రైతుబిడ్డే.. మా తాతలు కూడా రైతుబిడ్డేరా అని చెప్పాడు. కుక్కలా తిరిగినా అందరూ ఒకేసారి తనను వరుసపెట్టి వాయించడంతో ఏడ్చేశాడు ప్రశాంత్. ఆరో సీజన్ సమయంలో ఇదే స్టూడియో ముందు కుక్కలాగా తిరిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే రతిక రంగంలోకి దిగుతూ.. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నవ్? అని పాయింట్ లాగింది. ఆమె దగ్గరి నుంచి అటువంటి ప్రశ్న ఊహించని ప్రశాంత్ దెబ్బకు సైలైంట్ అయిపోయాడు. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. చదవండి: Kiran Rathod: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా?