ఓటీటీకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Malayalam Horror Thriller Movie Streaming On This OTT Platform From This Date | Sakshi
Sakshi News home page

Horror Thriller Movie: 16 నెలల తర్వాత ఓటీటీకి హారర్‌ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Sep 3 2024 7:49 PM | Last Updated on Tue, Sep 3 2024 8:09 PM

Malayalam Horror Thriller Movie Streaming On This OTT Platform From This Date

ఇటీవల మలయాళం సినిమాలకు తెలుగులోనూ ప్రేక్షకాదరణ దక్కుతోంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్‌ సైతం టాలీవుడ్‌లో రాణించాయి. ఓటీటీలోనూ మలయాళ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టోవినో థామస్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

గతేడాది థియేటర్లలో విడుదలైన నీలవెలిచమ్‌ మూవీ దాదాపు 16 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియన్స్‌ను అలరించనుంది. భార్గవి నిలయం పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 5 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్‌ చిత్రానికి ఆషిక్‌ అబు దర్శకత్వం వహించారు. ఇందులో రీమా, రోషన్‌ మ్యాథ్యూ, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement