AHA
-
ఓటీటీలో డిటెక్టివ్ థ్రిల్లింగ్ సినిమా స్ట్రీమింగ్
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’(Bhoothaddam Bhaskar Narayana). స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్ని పంచింది. ఆపై ఆహా ఓటీటీలోనూ అదే థ్రిల్ను కొనసాగించింది. ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.డిటెక్టివ్ థ్రిల్లర్స్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. ఇప్పటికే ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. -
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
మరో ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంంటంటే?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025 -
మరో ఓటీటీకి శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది.చికిత్స కోసం అమెరికాకు..ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన హీరోహీరోయిన్లు లేని సినిమా
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు. -
ఓటీటీలో నిహారిక కొత్త సినిమా.. వచ్చేవారమే స్ట్రీమింగ్
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన నిహారిక (Niharika Konidela) తర్వాత సడన్గా యాక్టింగ్ను పక్కనపెట్టేసింది. మధ్యలో యాంకరింగ్ ట్రై చేసింది. అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో పలు హిట్స్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అదే మద్రాస్కారన్ (Madraskaaran Movie). షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక కథానాయిక. నెల రోజుల్లోనే ఓటీటీలోకి..వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.జగదీష్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పొంగల్ రేసులో ఉన్న విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్తో దూసుకుపోయింది. కానీ మద్రాస్కారన్ మాత్రం వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది.వచ్చే వారంలో..ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. దీంతో నిహారిక సినిమా చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. Makkkale oru arumaiyana action block maatirku🤩#madraskaaran from Feb 7 only on #ahaTamil @SR_PRO_OFFL @SamCSmusic @vaali_mohandas@ShaneNigam1 @KalaiActor @IamNiharikaK @Aishwaryadutta6#Karunas @vaali_mohandas #actor_sharan @prasannadop @santhoshchoreo @DreamBig_film_s… pic.twitter.com/GovTbmKNoh— aha Tamil (@ahatamil) January 27, 2025 చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
ఈ వారం ఓటీటీకి ఏకంగా 11 చిత్రాలు.. ఆ రెండే స్పెషల్..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది థియేటర్లలో మూడు తెలుగు సినిమాలను సినీ ప్రియులను అలరించాయి. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో వెంకీమామ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఏయే సినిమాలు వస్తున్నాయని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వాటిలో ముఖ్యంగా రజాకార్, బరోజ్ 3డీ ఆడియన్స్లో ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఈ వారంలోనే సినీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఓ ఓటీటీలో రానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ వారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్..ది నైట్ ఏజెంట్- సీజన్ 2(వెబ్ సిరీస్) -జనవరి 23షాఫ్డెట్( కామెడీ సిరీస్)- జనవరి 24ది శాండ్ క్యాస్టిల్(హాలీవుడ్ మూవీ)- జనవరి 24ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్(కొరియన్ సినిమా)- జనవరి 24అమెజాన్ ప్రైమ్ వీడియో..హర్లీమ్- సీజన్ 3 (వెబ్ సిరీస్)- జనవరి 23జీ5..హిసాబ్ బరాబర్-(హిందీ మూవీ)- జనవరి 24ఆహా..రజాకార్(టాలీవుడ్ సినిమా)- జనవరి 24డిస్నీ ప్లస్ హాట్స్టార్...బరోజ్ 3డీ(మలయాళ మూవీ)- జనవరి 22స్వీట్ డ్రీమ్స్- జనవరి 24జియో సినిమా..దిది-(హాలీవుడ్ సినిమా)- జనవరి 26యాపిల్ టీవీ ప్లస్..ప్రైమ్ టార్గెట్..(హాలీవుడ్ మూవీ) జనవరి 22 -
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
సంక్రాంతి స్పెషల్.. పండుగ రోజే ఓటీటీకి వచ్చేసిన కొత్త సినిమా!
సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు. A mysterious bag changes Gayatri's life forever. Will it bring fortune or trouble? Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు. -
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
ఓటీటీకి రజాకార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'రజాకార్'(Razakar Movie). ఈ చిత్రాన్ని దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఓ వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో(OTT Streaming) రిలీజ్ కాలేదు.అయితే ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారు అయింది. ఈ నెల 24 నుంచి ఆహాలో(Aha) స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు రజాకార్ మూవీ పోస్టర్ను షేర్ చేశారు. ఈ ప్రకటనతో దాదాపు 10 నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. కాగా.. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. డిసెంబర్లోనే ఓటీటీ ప్రకటన..అయితే ఇంతకు ముందే రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా (Aha) ప్రకటించింది. దీంతో ఈ సినిమా చూడాలని కోరుకునేవారు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అప్పట్లోనే డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. కొత్త ఏడాదిలో రజాకార్ మూవీని ఆడియన్స్కు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ చిత్రంలో బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ వెల్లడించారు. చరిత్ర తెలియజేసే చిత్రం.. ఆర్.నారాయణ మూర్తిరజాకార్ ఎవరికీ వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రమని.. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ చరిత్రపై రజాకార్ చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారికి దర్శకుడు యాటా సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించినట్లు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి వెల్లడించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఓటీటీలు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలైనా సరే కథ, కథనం బాగుంటే చాలు. ఇలాంటి సినిమాలే ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. కొన్ని చిన్న చిత్రాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ అలా విడుదలయ్యే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది.తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలోనే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 35 చిన్న కథ కాదు హీరో విశ్వదేవ్ నటించిన లేటేస్ట్ మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. రవి ఎస్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అర్జున్-కార్తిక్ కథను అందించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలోనే అనౌన్స్ ఓటీటీకి వస్తుందని ప్రకటించిన చిత్రబృందం.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల 35 చిన్న కథ కాదు మూవీతో మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ ఇటీవల విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. -
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్చరణ్
ఈ సంక్రాంతికి మోత మోగిపోద్ది అంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో జనవరి 12న, వెంకటేశ్ 'సంక్రాంతికి వచ్చేస్తున్నాం'తో జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నారు. రెండు రోజుల గ్యాప్తో వరుసగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురూ ప్రమోషన్ల స్పీడు పెంచారు.అన్స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ టీమ్ఇటీవలే డాకు మహారాజ్ టీమ్ అన్స్టాపబుల్ షోకి విచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజైంది. ఇప్పుడు అన్స్టాపబుల్ షోలోకి గేమ్ ఛేంజర్ టీమ్ రానుంది. రామ్చరణ్తో పాటు, నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది.(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)మనవడు కావాలి!వచ్చీరావడంతోనే చరణ్ను చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకొక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరిక కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటవేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని బాలకృష్ణ అడగ్గా.. వీళ్లెవరితోనూ కాదు, అరవింద్తో పార్టీకి వెళ్తానని సమాధానమిచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలోని ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. (చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు)కూతురికి చరణ్ గోరుముద్దలుక్లీంకారకు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. పొద్దున రెండు గంటలు పాపకే సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ క్లీంకారను చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా? అన్న ప్రశ్నకు చరణ్.. నన్ను వదిలేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో విడుదల కానుంది.సినిమాగేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఐదు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. రెండు గంటల 45 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్ -
ఓటీటీకి వచ్చేస్తోన్న 'లవ్ రెడ్డి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్ రెడ్డి'. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ఆహా వెల్లడించింది. లవ్ రెడ్డి అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతోన్న టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేశ్ కాకుమాను, కృష్ణప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథా కమావీషు. ఈ చిత్రానికి గౌతమ్-కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గౌతమ్ కథను అందించారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను రివీల్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్తో పాటు ట్రైలర్ను కూడా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రేమ, కుటుంబం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఐ డ్రీమ్ మీడియా, త్రి విజిల్స్ టాకీస్ బ్యానర్లపై చిన వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్సంగీతమందించారు. -
ఓటీటీకి కేసీఆర్ సినిమా.. ట్రైలర్ చూశారా?
కమెడియన్గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.అసలు కథేంటంటే..'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. -
ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'జబర్దస్త్' షోతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh).. హీరోగా నటించిన నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గానీ అదే టైంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో ఇది పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan).. ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు.అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్ఫామ్లో అడుగుపెట్టింది.(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ)పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. -
ఓటీటీలో అథర్వ, శరత్కుమార్ థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్లో ఈ ఏడాదిలో విడుదలైన 'నిరంగల్ మూండ్రు' అనే సినిమా మూడు విభిన్న కథలతో తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రతిభకు తమిళ్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై కోలీవుడ్లో చాలామంది ప్రశంసలు కురిపించారు.తమిళ్లో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అథర్వ మురళి, నిక్కీ గల్రాని,అభిరామి, రెహమాన్, శరత్కుమార్ వంటి స్టార్స్ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకులను థ్రిల్లింగ్కు గురిచేసిన 'నిరంగల్ మూండ్రు' ఇప్పుడు తమిళ్ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే, తెలుగులో కూడా అదే రోజు విడుదల కావచ్చని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.'నిరంగల్ మూండ్రు' చిత్రాన్ని మొదట తమిళ్ వర్షన్తో పాటే టాలీవుడ్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో ఓటీటీలో మాత్రం రెండు భాషలలో ఒకేసారి డిసెంబర్ 20న స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. -
ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సత్యదేవ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్మీడియాలో వెల్లడించింది. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్ట్ చేసింది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఈ నెల 18 నుంచే ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్కు స్ట్రీమింగ్ కానుంది. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి చూసేయొచ్చు. జీబ్రా కథేంటంటే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్'పై ప్రకటన
'రజాకార్' చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. అయితే, సుమారు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' నుంచి ప్రకటన వచ్చేసింది.గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. త్వరలో రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించడంతో సినిమా చూడాలని కోరుకునేవారు సంతోషిస్తున్నారు. అయితే, ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కానీ, డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్పై ప్రకటన
క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మాస్ ఎంటర్ట్రైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ప్రేక్షకులను మెప్పించిన జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అయితే, అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఆ సంస్థ ప్రకటించలేదు. త్వరలో అంటూ ఒక పోస్టర్ను మాత్రమే రిలీజ్ చేసింది. అయితే, డిసెంబర్ 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
రూ.120 కోట్ల బడ్జెట్.. మరో ఓటీటీకి బాక్సాఫీస్ డిజాస్టర్ మూవీ!
హీరో అర్జున్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో ధృవ సర్జా. ధృవ్ సర్జాకు జోడీగా వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఆయన నటించిన భారీ యాక్షన్ చిత్రం మార్టిన్. ఈ మూవీకి అర్జున్ కథను అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా గతనెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.భారీ అంచనాల మధ్య రిలీజైన మార్టిన్ ఊహించవి విధంగా బోల్తాకొట్టింది. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకే పరిమితమైంది. కేజీఎఫ్ సినిమాతో పోల్చినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది.అయితే ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ రోజు నుంచే మార్టిన్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా... ఆహాలో కేవలం తెలుగు వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా చూసేయండి. -
ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు!
కొన్ని సినిమాలు ఆల్టైమ్ ఫేవరెట్ కోవలోకి వస్తాయి. ఆదిత్య 369 మూవీ అలాంటి కేటగిరీలోకే వస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.ఆదిత్య 369కి సీక్వెల్తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అన్స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. ఆ రోజుదాకా ఆగాల్సిందేఈ అప్డేట్ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్లో ఆదిత్య 369 అవతార్లో కనిపించనుండటం విశేషం. ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! కాగా భూత, భవిష్యత్ కాలాల్లోకి హీరోహీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే కథ! ఈ టైమ్ ట్రావెల్ కథతో సింగీతం 1991లో 'ఆదిత్య 369' అనే అద్భుతాన్ని సృష్టించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
ఓటీటీలో 15 రోజుల్లోనే 'సన్నీ లియోన్' సినిమా
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన చిత్రం 'మందిర'. ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించగా సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఉన్నారు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.సన్నీలియోన్ ఈ చిత్రంలో ఉండటంతో సోషల్మీడియాలో ప్రాజెక్ట్ గురించి భారీగానే చర్చ జరిగినప్పటికీ థియేటర్స్లలో మాత్రం పెద్దగా మెప్పించలేదు. అయితే, డిసెంబర్ 5న ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సన్నీతో ఆటలు మీరు అనుకున్నంత ఫన్నీ కాదు.. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఆహా తెలిపింది. మందిర సినిమాలో సన్నీ లియోన్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించింది. సన్నీ దెయ్యం రోల్ కనిపించినప్పటికీ అక్కడక్కడా తన గ్లామర్తో కూడా కొన్ని సీన్స్లలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
సిక్స్ప్యాక్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు: నవీన్ పొలిశెట్టి
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.క్లాసికల్ స్టైల్లో కుర్చీ మడతపెట్టిశ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ లేదని..ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. -
9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న సైకాలాజికల్ థ్రిల్లర్.. రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో!
2018 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు టొవినో థామస్. తాజాగా ఆయన నటించిన సైకాలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి ఫర్వాలేదనిపించింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్లో కేవలం మలయాళంలోనే అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. అన్నా బెన్ హీరోయిన్గా నటించింది. ఓ జర్నలిస్ట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. Every human is a headline!📰Bulletin by Naradhan Very soon!!🤵🏻♂️ #Naradhan Premieres November 29th on aha!#NaradhanOnAha #aha pic.twitter.com/s3PZIm4Gsz— ahavideoin (@ahavideoIN) November 27, 2024 -
ఐటీ ఉద్యోగులే టార్గెట్గా వస్తున్న మరో వెబ్ సిరీస్
తెలుగు ఓటీటీ సంస్థ ఫన్నీ వెబ్ సిరీస్ను తెరకెక్కించింది. ఇప్పటికే పలు కొత్త సినిమాలను స్ట్రీమింగ్కు తీసుకొస్తూనే తన సొంత నిర్మాణంలో పలు వెబ్ సిరీస్లను ఆహా విడుదల చేస్తుంది. 'వేరే లెవెల్ ఆఫీస్' పేరుతో ఒక వెబ్ సిరీస్ను ఆహ తెరెక్కిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే వీడియోను ఆహా విడుదల చేసింది.కార్పొరేట్ ఆఫీస్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుందని ఆహా ప్రకటించింది. అయితే, డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తన అధికారిక సోషల్మీడియాలో పేర్కొంది. ఇదే విషయాన్ని ఒక ఫన్నీ వీడియోతో పంచుకుంది. 'వేరే లెవెల్ ఆఫీస్' వెబ్ సిరీస్ తమిళంలో వచ్చిన 'వెరా మారి ఆఫీస్' సిరీస్కు రీమేక్. గతేడాదిలో తమిళ్ విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐటీ కంపెనీలో కొందరి స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలతో దీనిని నిర్మించారు. ఫన్తో పాటు రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలను సాఫ్ట్వేర్ ఉద్యోగులు లైఫ్ స్టైల్కు కనెక్ట్ చేస్తూ ఈ సిరీస్లో మేకర్స్ చూపించారు. ఈ వెబ్సిరీస్లో అఖిల్ సార్ధక్, ఆర్జే కాజల్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్ నటించారు. -
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
రీసెంట్గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్కి పెళ్లి సెట్)ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️! Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024 -
ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
ఓటీటీలో సడెన్గా థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సుమారు మూడు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది ఆగష్టులో విడుదలైన 'రేవు' అనే చిన్న సినిమా.. థియేటర్లలో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఓటీటీలో సడెన్గా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా నిర్మించారు.యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన 'రేవు' గురువారం (నవంబర్ 14) నుంచి తెలుగు ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని సోషల్మీడియా ద్వారా ఒక పోస్టర్తో వెళ్లడించారు. 'రేవు: ది బ్యాటిల్ ఫర్ ద సీ' సినిమా మత్స్యకారుల నేపథ్యం చుట్టూ జరగుతుంది. కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు నటించారు.కథేంటంటే...సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ? -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి. అలా మరో యూత్ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్బాస్లో రెండు సార్లు రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ సీజన్ 4తో పాటు బిగ్బాస్ నాన్ స్టాప్లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ వెబ్సిరీస్లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్తో ఈ వెబ్సిరీస్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్కు రీమేక్గా ఈ వెబ్సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
ఓటీటీలో సైకో థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.తెలుగు క్రైమ్ థ్రిల్లర్గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 2నుంచి ‘ఆపరేషన్ రావణ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్ను కూడా విడుదల చేసింది.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.ఇలాంటి సమయంలో తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్లు ఈ కేసును సీరియస్గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?
మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ ఏడాది మే 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంత చేసుకుంది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కిచారు. రిలీజైన దాదాపు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
'ప్రకృతిని కట్ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్!
పవన్ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు అరుణ్కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్ సిద్ధు నటించారు.ఈ వెబ్ సిరీస్లో కార్పొరేట్ వరల్డ్లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
మరో ఓటీటీలోకి వచ్చేసిన రెండు థ్రిల్లర్ సినిమాలు
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే రెండు మూవీస్ వచ్చేశాయి. కాకపోతే ఇవి ఇప్పటికే ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా వేరే వాటిలోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రెయిట్ మూవీ కాగా, మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఇంతకీ ఇవేంటి? ఏ ఓటీటీల్లో ఉన్నాయి?(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!)తెలుగమ్మాయి చాందిని చౌదరి పోలీస్గా నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యేవమ్'. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్తో దీన్ని తీశారు. ఇదివరకే ఆహా ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు సన్ నెక్స్ట్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో హాట్ బ్యూటీ అషూరెడ్డి కూడా కీలక పాత్రలో నటించింది.మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శబరి'. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా తీశారు. సస్పెన్స్తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కొన్నిరోజుల క్రితం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేశారు. ఈ వీకెండ్ ఏమైనా థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే వీటిని ట్రై చేసి చూడండి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక థ్రిల్లర్ సినిమా
'మ్యాడ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్కుమార్ తమిళ్ నటించిన రైడ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్గా నటించిగా.. విక్రమ్ ప్రభు హీరోగా మెప్పించారు.రైడ్ టైటిల్తో కోలీవుడ్లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. కన్నడలో శివరాజ్కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తగారు'కు రీమేక్గా రైడ్ తెరకెక్కించారు.అనంతిక సనీల్కుమార్ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్తో మ్యాడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్ స్క్వేర్, 8 వసంతాలు మూవీస్ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్ దక్కించుకుంది. -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్కు రీమేక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్హిట్గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు
దసరా హడావుడి అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్లు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా అయితే లాఫింగ్ బుద్ధా అనే కన్నడ మూవీ మాత్రం చూడొచ్చులే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవే. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్మైటీ మాన్స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్స్టార్రీతా సన్యల్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 141000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమాక్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆపిల్ ప్లస్ టీవీస్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16బుక్ మై షోబీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?) -
ఓటీటీలో దూసుకుపోతున్న టాలీవుడ్ మూవీ
శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాలు గానీ టాకీస్. ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఆహా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఏకంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సరికొత్త కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలు గాని టాకీస్ ఆహాలో టాప్- 2లో ట్రెండ్ అవుతోంది. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. తన మేకింగ్తో విశ్వనాథ్ ప్రతాప్ అందరినీ మెప్పించారు. -
ఓటీటీలో 'బిగ్ బాస్' తెలుగు బ్యూటీ డైరెక్ట్ చేసిన సినిమా స్ట్రీమింగ్
బిగ్ బాస్ తెలుగుతో గుర్తింపు తెచ్చుకున్న సంజన అన్నే హీరోయిన్గా నటించిన 'క్రైమ్ రీల్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఇప్పుడు నెట్టింట స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా సంజననే కావడం విశేషం. ఆమె ఇప్పటికే తెలుగులో 'నీకు నాకు పెళ్లంట' అనే సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. ఆపై 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో సంజన ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.బిగ్బాస్ సీజన్ 2 తర్వాత సంజన అన్నే పెద్దగా కనిపించింది లేదు. అయితే, సోషల్మీడియాలో ఆమె ట్రెండింగ్లోనే ఉంటూ వచ్చింది. అలా సుమారు నాలుగేళ్ల తర్వాత క్రైమ్ రీల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా అకట్టుకోలేదు. తాజాగా ఆహా ఓటీటీలో క్రైమ్ రీల్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.నేటి సమాజంలో యువత సోషల్ మీడియా వలలో చిక్కుకొని తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటుందో ఒక మంచి సందేశం ఇస్తూ.. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా సంజన నటించగా.. సిరి చౌదరి,అభి, భరత్ కీలక పాత్రల్లో నటించారు. -
సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్
రెండు రోజుల క్రితం హీరో బాలకృష్ణ గురించి ఓ వార్త బయటకొచ్చింది. సూపర్ హీరోలా నటిస్తారనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా తర్వాత చేయబోయే సినిమా కోసం ఏమోనని అభిమానులు, నెటిజన్లు అనుకున్నారు. కానీ అదంతా 'అన్స్టాపబుల్ 4' కోసమని ఇప్పుడు తేలింది. దసరా సందర్భంగా నాలుగో సీజన్కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు.(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)కంటెంట్ పరంగా చూస్తే నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో బాగుంది. కానీ సూపర్ హీరో పాత్రని యానిమేటెడ్ వేషంలో చూపించినప్పుడు.. దీనికి బాలయ్య గొంతు అయితే నప్పింది గానీ ఫేస్ కట్ విషయంలో ఎక్కడా బాలకృష్ణలా అనిపించలేదు. ఎవరో వ్యక్తికి ఈయన డబ్బింగ్ చెప్పినట్లు అనిపించింది. చివర్లో యధావిధిగా కనిపించిన బాలయ్య.. అన్స్టాపబుల్ షో కొత్త సీజన్ గురించి ప్రకటించారు.'అన్స్టాపబుల్' తొలి సీజన్ బ్లాక్బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణలో కొత్త యాంగిల్ని ఆవిష్కరించింది. కానీ రెండు, మూడో సీజన్లు మాత్రం అనకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి వేరే లెవల్ ఉండబోతుందని చెప్పారు. అక్టోబరు 24 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మరి బాలకృష్ణ చెప్పినట్లు ఉంటుందా? అనేది చూడాలి. తొలి ఎపిసోడ్కి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీమ్ రాబోతుంది.(ఇదీ చదవండి: సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన) -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వరుస సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నారు. సుహాస్ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్ 12న థియేటర్లో విడుదల కానుంది.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్ఫ్లిక్స్ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్) -
ఓటీటీలో అమలాపాల్ 'లెవల్ క్రాస్' థ్రిల్లర్ సినిమా
అమలాపాల్ తాజాగా నటించిన మలయాళ సినిమా 'లెవల్ క్రాస్'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించగా.. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు. జులై 26న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.'లెవెల్ క్రాస్' చిత్రానికి మలయాళ టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్గా వ్యవహరించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే, జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలో ఎప్పుడు..?సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్ క్రాస్ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ వర్షన్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి రానున్న 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్ ఈ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే, అక్టోబర్ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో హారర్, థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కళింగ' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే, కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా ధృవ వాయు పనిచేశారు. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించిగా మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్ ఎలిమెంట్స్కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి కళింగ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందన ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు.కథేంటి..?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024 -
ఓటీటీలో మలయాళ థ్రిల్లింగ్ సినిమా.. తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
మలయాళ హిట్ సినిమా 'అంచక్కల్లకోక్కన్' ఇప్పుడు 'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్సే రాబట్టింది.'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదల కానుంది. సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఈ సినిమా మలయాళ ఒరిజినల్ వర్షన్ 'అంచక్కల్లకోక్కన్' అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. ఉల్లాస్ చంబన్ దీనిని అద్భుతంగా తెరకెక్కించారు. చాప్రా మర్డర్ కేస్ కథ 1980ల బ్యాక్డ్రాప్లో ఉంటుంది. కేరళ - కర్ణాటక సరిహద్దులో ఉండే ఒక గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. తన తండ్రిని చంపిన వారిపై కుమారులు ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్గా దర్శకుడు చెప్పారు. -
ఓటీటీలో 'ప్రతినిధి 2'.. అధికారిక ప్రకటన
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతినిధి 2’. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సుమారు పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 10న ఈ చిత్రం విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.‘ప్రతినిధి 2’ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించగా.. కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో నారా రోహిత్తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు వంటి వారు నటించారు. -
తెలుగు ఇండియన్ ఐడల్ -3 విజేత ఎవరంటే?
ఆహాలో అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. 26 వారాలుగా సాగిన ఈ షోలో కీర్తి, అనిరుధ్, నసీరుద్దీన్ షేక్ టాప్ 3కి చేరుకున్నారు. వీరిలో నసీరుద్దీన్ విజేతగా నిలిచి టైటిల్తో పాటు రూ.10 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన అనిరుధ్ రూ.3 లక్షలు, మూడో స్థానంలో ఉన్న జీవీ శ్రీ కీర్తి రూ.2 లక్షలతో సరిపెట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కుమారుడైన నసీరుద్దీన్ తన గాత్రంతో అటు ప్రేక్షకులను, ఇటు షో జడ్జిలను మెప్పించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఇతడు ఓజీ మూవీలో పాట పాడే అవకాశం కూడా దక్కించుకోవడం విశేషం. -
OTT: కన్నడ సూపర్ హిట్ మూవీ తెలుగులో.. అప్పుడే ట్రెండింగ్లో
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగులో వచ్చింది. ఈ మూవీ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. ప్రస్తుతం యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చక్కగా చూపించారు. అంతర్జాతీయ అవార్డులుఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. ఓటీటీ ఆడియన్స్ను పలకరించేందుకు సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఆహాలో ట్రెండింగ్పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఆహాలో టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్తో ట్రెండ్ అవుతోంది.చదవండి: అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు -
ఓటీటీలో 'బాలు గాని టాకీస్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా 'బాలు గాని టాకీస్.' ఆహా ఓరిజినల్ కంటెంట్తో ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. వాస్తవంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి రెండుసార్లు వాయిదా వేశారు. అయితే, తాజాగా 'బాలు గాని టాకీస్' విడుదలపై మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో సినిమా విడుదలపై కాస్త ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.‘బాలు గాని టాకీస్’లో శివకుమార్ రామచంద్రపు ప్రధాన పాత్రలో నటించారు. ఆయన గతంలో వకీల్సాబ్, మజిలీ, నిన్ను కోరి వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. శ్రావ్య వర్మ హీరోయిన్గా నటించగా సంగీత దర్శకుడు రఘు కుంచె కీలక పాత్రలో కనిపించనున్నారు. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి సాగర్ నిర్మాత. అక్టోబర్ 4 నుంచి ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ చిత్రం.. పది రోజులుగా టాప్లోనే!
అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సింబా. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టాక్ను సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రం కావడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో ఈ సినిమాను మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ప్రస్తుతం సింబా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో ఏకంగా టాప్-6 ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఆహాలోనూ గత పది రోజులుగా టాప్లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. మేసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఓటీటీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. -
ఓటీటీలో 'తిరగబడరసామీ' స్ట్రీమింగ్పై ప్రకటన
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిరగబడరసామీ'. ఆగష్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోలే మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ప్రేమలో పడ్డారని లావణ్య అరోపించింది. తనను ప్రేమించిన రాజ్ మాల్వీ పరిచయంతో మోసం చేశాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే.(ఇదీ చదవండి: సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?)'తిరగబడరా సామీ' ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు ఒక పోస్టర్ను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. మిక్స్డ్ టాక్ రావడతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో రాజ్ తరుణ్తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా,ప్రగతి, రఘుబాబు,తాగుబోతు రమేశ్ వంటి స్టార్స్ నటించారు.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఫినాలేకి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ 3.. విజేత ఎవరు?
ఆహా ఓటీటీలో గత రెండు సీజన్ల పాటు సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగించిన సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. ప్రస్తుతం మూడో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 24 వారాల నుంచి ప్రతి శని, ఆదివారాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇది తుది అంకానికి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఈ వీకెండ్లో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫినాలేకి సింగర్స్ అనిరుధ్, కీర్తన, నజీరుద్దీన్, శ్రీ కీర్తి, స్కంద వచ్చారు. ఫినాలేలోనూ వైవిధ్యమైన పాటలతో దుమ్మదులిపేశారు. అలానే జడ్జిలు తమన్, గీతామాధురి కూడా ఫెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇలా ప్రోమో ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. ముఖ్యమంత్రి ఆశీర్వాదం) -
Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నీల వెళిచ్చమ్’(Neelavelicham) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా ప్రేమ కథలు చూస్తాం లేదంటే హారర్ కథలు చూస్తాం. కానీ ‘భార్గవి నిలయం’ (1964) హారర్ ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. ఎ. విన్సెంట్ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ మలయాళ సినిమాని రీమేక్ చేసి ‘నీల వెళిచ్చమ్’గా మన ముందు నిలిపారు దర్శకుడు ఆషిక్ అబు. ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ కథా రచయిత మారుమూల గ్రామంలోని ఓ భవంతిలోకి రావడంతో సినిమా మొదలవుతుంది. అదే భార్గవి నిలయం. ఆ ఊళ్లోని వారందరూ ఆ భవంతిలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి ఆత్మ ఆ భవంతిలో తిరుగుతుందని భయపడుతూ ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఈ రచయిత ధైర్యంగా ఆ భవంతిలోకి అడుగుపెట్టి ఆ దెయ్యం కథ రాయాలనుకుంటాడు. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)భార్గవి నిలయంలో అడుగుపెట్టిన రచయితకు దెయ్యం కనబడిందా? కనబడిన దెయ్యం తన కథ చెప్పిందా? అలాగే ఆ ఆత్మ తన కథలోని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వింటేజ్ కథ. సినిమా స్క్రీన్ప్లే కొంత ల్యాగ్లో నడిచినా చూసే ప్రేక్షకుడిని మాత్రం రీ రికార్డింగ్, అద్భుతమైన సంగీతంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. కొంత ‘చంద్రముఖి’ సినిమా ఛాయలు కనబడినా చివరకు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. టొవినో థామస్ హీరోగా నటించారు. ఈ చిత్ర కథానాయకుడు సినిమాలో భార్గవి బంగారం అని దెయ్యాన్ని ప్రేమగా పిలుస్తున్నప్పుడల్లా ప్రేక్షకుడికి ప్రేమానుభూతి కలుగుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ‘భార్గవి నిలయం’గా అనువాదం అయి, ‘ఆహా ఓటీటీ’లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రావు రమేశ్ అంటే సహాయ పాత్రలు, విలన్ పాత్రలే గుర్తొస్తాయి. తనదైన యాక్టింగ్తో తెలుగులో ఓ మార్క్ సృష్టించాడు. ఇన్నాళ్లు ఇతడు సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ రీసెంట్గా హీరోగానూ మెప్పించాడు. ఈయన్ని ప్రధాన పాత్రధారిగా పెట్టి 'మారుతీనగర్ సుబ్రమణ్యం' అనే మూవీ తీశారు. గత నెలల్లో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)రావు రమేశ్ లీడ్ రోల్ చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు సెప్టెంబరు 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'మారుతీనగర్ సుబ్రమణ్యం' విషయానికొస్తే.. మారుతీనగర్కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కోర్టు స్టే వల్ల అది హోల్డ్లో ఉండిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని పట్టుబట్టి ఖాళీగా ఉండిపోతాడు. ఊరి నిండా అప్పులు. ఇలా జీవితం సాగిస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో ఓ రోజు రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇవి వేసింది ఎవరు వేశారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)We got the laughter therapy you need!The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న గల్లీ క్రికెట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరాక్రమం. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్గా నటించారు. గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టులేకపోయింది.(ఇది చదవండి: 'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్కు సపోర్ట్గా నిలిచిన విశ్వక్ సేన్)తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 14 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. మాంగల్యం మూవీతో బండి సరోజ్ కుమార్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం, నిర్మాతగానూ బండి సరోజ్ కుమార్ వ్యవహరించడం మరో విశేషం. పులి వస్తే చెట్టుక్కుతావ్!🐅మగర్ మచ్చొస్తే ఒడ్డెక్కుతావ్!!యముడొస్తే ఏడికి పోతావ్....😈Bandi Saroj's Parakramam on aha🎬#Parakramam Premieres 14th September on aha! @publicstar_bsk @actoranilkumar @06sudheer @nikhilgopureddy pic.twitter.com/VqeiY5APsk— ahavideoin (@ahavideoIN) September 12, 2024 -
టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసింది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారంటూ ఆహా ట్వీట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. Madam, Sir twaralo #aha lo sandadi cheyyabotunnaru. Get ready to laugh out loud! 🤣 The hilarious #MaruthiNagarSubramanyam is coming soon to #aha! @lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/AWx0p6Bjuy— ahavideoin (@ahavideoIN) September 10, 2024 -
ఓటీటీలో 'ఆహా' అనిపించే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తెలుగు వర్షన్లో తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మలయాళ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా సినిమా 'ఆహా' విడుదల కానుంది. 2021లో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. బిబిన్ పాల్ శామ్యూల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేరళలో బాగా పాపులర్ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్ గురించి ఈ సినిమా తెరకెక్కించారు.'ఆహా' సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్ , మనోజ్ కె. జయన్, అమిత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి.. ఆట మొదలెట్టాక అటో ఇటో తేలిపోవాల్సిందే' అంటూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 1980, 1990ల్లో కేరళలో చాలా పాపులర్ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్లో పేరుగాంచిన ఆహా నీలూర్ స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ టీమ్లోని యువకులు పగటి సమయంలో వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే వారు. రాత్రి సమయంలో తమ గ్రామానికి చేరుకుని టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడేవారు. ఫైనల్గా ఆ యువకులు ఏం సాధించారనేది ఈ 'ఆహా' సినిమా కథ. సెప్టెంబర్ 12న ఆహా ఓటీటీలో మీరూ చూసేయండి. -
ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం సింబా. ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించగా.. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. పర్యావరణంపై తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 6 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా ట్వీట్ చేసింది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే నేపథ్యంలో రూపొందించారు. సరికొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. When the planet cries out for help, heroes rise! 🌎💔"Simbaa" a sci-fi crime thriller 🤯 Starring @anusuyakhasba & @IamJagguBhai, premiering on Sep 6 on #aha@KasthuriShankar @DiviVadthya @ImSimhaa @Kabirduhansingh @anishkuruvilla @gautamitads #SimbaaOnAha pic.twitter.com/uRBp75ppKJ— ahavideoin (@ahavideoIN) September 4, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల మలయాళం సినిమాలకు తెలుగులోనూ ప్రేక్షకాదరణ దక్కుతోంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్లో రాణించాయి. ఓటీటీలోనూ మలయాళ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టోవినో థామస్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గతేడాది థియేటర్లలో విడుదలైన నీలవెలిచమ్ మూవీ దాదాపు 16 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియన్స్ను అలరించనుంది. భార్గవి నిలయం పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 5 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఇందులో రీమా, రోషన్ మ్యాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. Our Tovino is ready to entertain you with'#BhargaviNilayam premieres on #aha from Sep 5th.🏠🎬@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/leMWbAJURc— ahavideoin (@ahavideoIN) September 3, 2024 -
ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కాబోతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ మూవీ ఒకటుంది. అదే 'సత్య'. ఇదో తమిళ సినిమా. డబ్బింగ్ చేసి తెలుగులో మే 10న థియేటర్లలో రిలీజ్ చేయగా.. ఓ మాదిరి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్నే దాదాపు నెలల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: వివాదంలో 'ఐసీ 814: కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్.. నెట్ఫ్లిక్స్కి కేంద్రం సమన్లు!)వినాయక చవితి నుంచి ఆహా ఓటీటీలో 'సత్య' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులోనే 'సత్య' పేరుతోనే రిలీజ్ చేశారు.'సత్య' విషయానికొస్తే.. ఇష్టం లేకపోయినా సరే తండ్రి చెప్పడంతో సత్య.. ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతాడు. అక్కడే పార్వతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు మనోడు అంటే ఇష్టముంటుంది కానీ బయటపడదు. ఓ రోజు ఊహించని విధంగా సత్యని చెంపదెబ్బ కొడుతుంది. దీంతో అతడు ఆ కాలేజీ వదిలేసి, తన కుటుంబం కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చివరకు ప్రేమకథ కంచికి చేరిందా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?) -
తమన్ చిలిపి పనులను బయటపెట్టిన తల్లి
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుకున్నాయి. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు. తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తను హార్డ్ వర్క్ చేస్తాడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తనకి మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు. -
ఓటీటీకి నయనతార హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ మాయనిజాల్. ఈ చిత్రంలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ఓటీటీకి వస్తోంది. ఈ నెల 30 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించారు.మర్డర్ నేపథ్యంలో..!అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఓ చిన్నపిల్లాడు ఈ మర్డర్ కేసును ఎలా కనిపెట్టాడనేదే అసలు కథ. ఇందులో నయనతార ఆ పిల్లాడికి తల్లిపాత్రలో నటించింది. కుంచకోబోబన్ న్యాయమూర్తి పాత్రలో మెప్పించారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జానర్ చిత్రాలు ఇష్టపడేవారుంటే ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఈ మూవీని ట్రై చేయొచ్చు. Ella unmayum innum rendu naal-la therinjidum😐😌#MayaNizhal premieres from August 30 #ahatamil #Nayanthara @Teamaventures @appubhattathiri @DivyaPrabhaa @Amudhavananoffl @prothiyagu @nizhalmovie @ThiPRCom pic.twitter.com/WfYfSAjKdO— aha Tamil (@ahatamil) August 28, 2024 -
ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు మూవీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. మొన్నీమధ్య 'కల్కి', 'రాయన్' స్ట్రీమింగ్లోకి రాగా.. ఇప్పుడు కొన్ని చిన్న మూవీస్ డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయాయి. ఈ రెండు కూడా ఒకే ఓటీటీలో రెండు రోజుల గ్యాప్లో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ఆయా తేదీల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా)రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు'.. జూలై 26న థియేటర్లలోకి వచ్చింది. సినిమా పర్లేదు అనిపించినప్పటికీ.. 'శ్రీమంతుడు'తో పోలికలు రావడంతో మైనస్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే బిగ్ స్క్రీన్పై అంటే కష్టం గానీ ఓటీటీలో కాబట్టి దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చేమో!సహాయ నటుడు రాజా రవీంద్ర.. ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సారంగదరియా'. జూలై 11న రిలీజైన ఈ సినిమాకు టాక్ పాజిటివ్గానే వచ్చింది. కానీ పెద్దగా పేరున్న యాక్టర్స్ లేకపోవడంతో జనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడీ మూవీని కూడా ఆహాలోనే రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ వీకెండ్లో దీనిపై కూడా అలా ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)Discover the intense and emotional world of #Sarangadhariya on @ahavideoIN @Rajaraveendar @AbbisettiPandu #SrikanthKrishnaswamy #YashaswiniSrinivas #ShivakumarRamachandravarapu @Drneelapriya @Bhavanidvd @Bhavanihdmovies pic.twitter.com/L1BKX15NVf— Bhavani Media (@BhavaniHDMovies) August 26, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా
తెలుగు సినిమాల్లో టీనేజీ ప్రేమకథలు బోలెడు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'బేబి' వరకు చాలా మూవీస్ వచ్చాయి. ఈ తరహా స్టోరీతోనే వచ్చిన మరో మూవీ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు వచ్చింది. హడావుడిలో ఇదొకటుందనే ఎవరూ పట్టించుకోలేదు. ఓ మాదిరిగా పర్లేదనిపించింది. ఇప్పుడిది ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)ఆహా ఓటీటీలో ప్రస్తుతం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గతంలో వచ్చిన చాలా తెలుగు సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. సీన్లు కూడా అరె ఎక్కడో చూశామే అనిపించేలా ఉంటాయి. కాకపోతే చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్గా ఉంటూనే టైమ్ పాస్ అయిపోతుంది.'ప్రభుత్వ జూనియర్ కళాశాల' విషయానికొస్తే.. 2004లో రాయలసీమలో పుంగనూరు అనే ఊరు. ఇంటర్ చదివే వాసు.. అదే కాలేజీలో చదువుతున్న కుమారితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతోనే గొడవ పడతాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ వాసుకి ఏం తెలిసింది? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ) View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్..టాప్లో ట్రెండింగ్!
వరుణ్ సందేశ్ లీడ్ రోల్లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ విరాజి. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 22 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో అంతగా మెప్పించలేని హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే 56 లక్షల వాచ్ మినిట్స్తో ఆహాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -' విరాజి సినిమా ఓటీటీలో 56 లక్షల వాచ్ మినిట్స్తో ట్రెండ్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు. ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. ఈ మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో చూస్తూ ఎంజాయ్ చూస్తున్నారు" అని అన్నారు. -
ఓటీటీకి సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం 'శాకాహారి'. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. కన్నడలో సూపర్హిట్గా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 24 నుంచి ఆహా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు గొప్పరాజు రమణ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. Crime, emotions, and unexpected turns - #Shakhahaari has it all! Premiering on aha on Aug 24. pic.twitter.com/oortLZG2nH— ahavideoin (@ahavideoIN) August 21, 2024 -
నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో సందడి
గాయం నుంచి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పూర్తిగా కోలుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత అమెరికా వెళ్లారు నవీన్ పోలిశెట్టి.. అనుకోకుండా ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. చాలా రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నవీన్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీలో ప్రాసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో నవీన్ పాల్గొని సందడి చేశాడు. నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ 'విరాజి' సినిమా
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'విరాజి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 2న విడుదలైంది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఓటీటీలో విరాజి విడుదల కానుందని ఆహా ప్రకటించింది. ఆగష్టు 22న స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ వెంటనే ‘విరాజి’తో మెప్పించాడు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీల వల్ల బోలెడు ఉపయోగాలు. ఇందుకు తగ్గట్లే పలు భాషల్లో డబ్బింగ్ చిత్రాలన్నీ నేరుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. గతేడాది రిలీజైన 'నల్ల నిళవుల రాత్రి' చిత్రాన్ని 'కాళరాత్రి' పేరుతో డైరెక్ట్ ఓటీటీలో తెచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీల్లో ఉన్నాయ్?)బాబు రాజ్, చెంబన్ వినోద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కాళరాత్రి'.. ఆగస్టు 17 అంటే ఈ శనివారమే ఓటీటీలోకి రానుంది. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. ఒరిజినల్ లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో అది కూడా నేరుగా ఓటీటీలోనే వచ్చేస్తుంది. కాబట్టి వీకెండ్లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు.'కాళరాత్రి' విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం. తక్కువ ధరకే వచ్చేస్తుందని 266 ఎకరాలని తోట కొనడానికి వెళ్తారు. తీరా చూస్తే తోట మధ్యలో గెస్ట్ హౌస్. దీంతో అక్కడ పార్టీ చేసుకుంటారు. అనూహ్య ఘటనలు జరిగి వీళ్లలో కొందరు చనిపోతారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు ఎలా చనిపోతున్నారు అనేదే స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)