
సురేష్ రవి, ఆశా వెంకటేశ్ జంటగా జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చంద్రేశ్వర’(Chandreswara). బేబీ అఖిల సమర్పణలో డా. రవీంద్ర చారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ‘‘మంచి కాన్సెప్ట్తో రూపొందించిన ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ ఎంటర్టైనర్ మూవీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని కోప్రొడ్యూసర్స్ పి. సరిత, వి. బాలకృష్ణ పేర్కొన్నారు.
‘‘ఆర్కియాలజీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీవన విధానం ఎలా ఉండేది? అనే అంశంతో ఈ చిత్రాన్ని డివోషనల్ టచ్తో పాటు వినోద ప్రధానంగా రూపొందించాం’’ అని డా. రవీంద్ర చారి తెలిపారు.