ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్ | Shraddha Kapoor Cross PM Modi In Instagram Followers Count | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: బాలీవుడ్ హీరోయిన్ తర్వాతే ప్రధాని మోదీ

Published Wed, Aug 21 2024 11:22 AM | Last Updated on Wed, Aug 21 2024 11:29 AM

Shraddha Kapoor Cross PM Modi In Instagram Followers Count

మన దేశ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఈయన్ని చూసేందుకు అభిమానులు గట్టిగానే వస్తుంటారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

ప్రస్తుతం మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడి తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మూడో స్థానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. 'స్త్రీ 2' సక్సెస్‌తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో మోదీని ఈమె అధిగమించినట్లయింది.

ట్విటర్‌లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే చాన్నాళ్ల నుంచి హిందీలో సినిమాలు చేస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తోనూ 'సాహో' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఆ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఏదేమైనా ఇప్పుడు 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.

(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement