కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు | Venkatesh heads to Kerala for Drishyam-2 Shoot | Sakshi
Sakshi News home page

కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు

Mar 30 2021 6:27 AM | Updated on Mar 30 2021 9:04 AM

Venkatesh heads to Kerala for Drishyam-2 Shoot - Sakshi

కుటుంబంతో సహా కేరళ వెళ్లారు రాంబాబు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికేనా? అంటే కథ ప్రకారం అంతే. ఇంతకీ రాంబాబు అండ్‌ ఫ్యామిలీ ఏం చేసింది? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? అనే విషయం ‘దృశ్యం 2’లో తెలుస్తుంది. ‘దృశ్యం’ చూసినవాళ్లకు విషయం ఏంటో తెలుసు. ఆ సినిమాలో కేసు క్లోజ్‌ అయిపోతుంది. రాంబాబు కుటుంబం హ్యాపీ ఫీలవుతుంది. కానీ మళ్లీ కేసు రీ ఓపెన్‌ అవ్వడమే ‘దృశ్యం 2’ కథ. మలయాళ ‘దృశ్యం’కి సీక్వెల్‌ ఇది.

తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ప్రస్తుతం మలి భాగం ‘దృశ్యం 2’లోనూ నటిస్తున్నారు. వెంకటేశ్‌ పాత్ర పేరు రాంబాబు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కేరళలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్‌  చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement