Sequel movie
-
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్లిమిటెడ్గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
ఈగ సీక్వెల్.. నానితో పనిలేదన్న రాజమౌళి!
రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఈగ’. 2012లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని సినీ ప్రియులతో పాటు హీరో నాని కూడా కోరుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి నాని మాట్లాడారు. రాజమౌళి ఫిక్స్ అయితే ఈ సీక్వెల్ కచ్చితంగా వస్తుందని.. చిన్న ఈగతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పట్లో ఈ సీక్వెల్ ఆలోచన రాజమౌళికి లేదని చెబుతూ.. వారిద్దరి మధ్య ఈగ2పై జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.ఓ సారి రాజమౌళితో ఈగ సీక్వెల్ గురించి మాట్లాడాను. సీక్వెల్ పనులు ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన ‘మేము ఈగ 2 చేసినా..నీతో పనిలేదు.మాకు ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఒక చిన్న ఈగతో సినిమా తీయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఆయన ఈగ 2 చేస్తే.. అది కచ్చితంగా మరో అద్భుతమైన విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఆయనకు అయితే సీక్వెల్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఈగ 2 గురించి ఆలోచించి..మంచి కథతో సీక్వెల్ తీస్తాడని అనుకుంటున్నాను’ అన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మురారి సీక్వెల్ కావాలంటున్న మహేష్ ఫ్యాన్స్..
-
అమ్మ బ్లాక్బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్బస్టర్ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.సీక్వెల్పై బోనీ కపూర్కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్పై హింట్ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై బోనీ కపూర్, సురీందర్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు. -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా చేశారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
ఇండియన్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పుతున్న టాలీవుడ్...
-
అన్న దారిలో తమ్ముడు నెక్స్ట్ ఇయర్ ఖైదీ సీక్వెల్ స్టార్ట్..
-
కౌంట్డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్డౌన్ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
ఖురేషిగా ఎందుకు మారాడు?
ఖురేషి అబ్రమ్గా స్టీఫెన్ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ (2019). హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్లోనే ‘లూసిఫర్’కి సీక్వెల్గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతోంది.ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్లాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్ లుక్ను విడుదల చేశారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్హిట్గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నారు. -
హాలీవుడ్లో సీక్వెల్ జోరు
హాలీవుడ్లో సీక్వెల్ అనగానే దాదాపు అందరి దృష్టి ‘అవతార్’ మీద ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు (2022) పట్టింది. మూడు, నాలుగు, ఐదు భాగాలను ప్రకటించారు కామెరూన్. మూడో భాగం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ‘అవతార్’ అభిమానులను ఇది నిరాశపరిచే విషయమే. అయితే ఈ ఏడాది దాదాపు పది సీక్వెల్స్ రానున్నాయి. పలు హిట్ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న ఆ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో సైన్స్ ఫిక్షన్ ఈ వేసవికి రానున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017)కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగం. మూడు భాగాలూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియమ్ టీగ్, ఫ్రెయా అలన్ తదితరులు నటించారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫుల్ యాక్షన్తో బ్యాడ్ బాయ్స్ జూన్లో బ్యాడ్ బాయ్స్ తెరపైకి రానున్నారు. బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. 2003లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’కి నాలుగో భాగం ఇది. మూడో భాగం ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’ (2020) విడుదలైన నాలుగేళ్లకు వస్తోన్న సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో డిటెక్టివ్ ల్యూటినెంట్ మైఖేల్గా లీడ్ రోల్ని విల్ స్మిత్ చేశారు. రెండో, మూడో భాగానికి దర్శకత్వం వహించిన ఆదిల్, బిలాల్ ద్వయం తాజా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. నాలుగు భాగాల్లోనూ మైఖేల్ పాత్రను విల్ స్మిత్నే చేశారు. యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఆరేళ్లకు డెడ్పూల్ ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డ సీక్వెల్ చిత్రాల్లో ‘డెడ్పూల్ 3’ది ప్రముఖ స్థానం. ర్యాన్ రేనాల్డ్స్ టైటిల్ రోల్లో షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మార్వెల్ కామిక్ బుక్స్లోని డెడ్పూల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిన తొలి చిత్రం ‘డెడ్పూల్’ (2016). టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి సీక్వెల్గా షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్పూల్ 2’ (2018) కూడా బంపర్ హిట్. ఆరేళ్లకు మూడో భాగం ‘డెడ్పూల్ అండ్ వుల్వరిన్’ వస్తోంది. మూడు భాగాల్లోనూ డెడ్పూల్ పాత్రను ర్యాన్ రేనాల్డ్స్ చేశారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హారర్ జూయిస్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ‘బీటిల్ జూయిస్’ (1988) సంచలన విజయం సాధించింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ పోషించారు. దాదాపు 35 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్గా టిమ్ బర్టన్ దర్శకత్వంలోనే ‘బీటిల్ జూయిస్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్లో జోకర్ అక్టోబర్ నెల రెండు సీక్వెల్స్ని చూపించనుంది. ఒకటి ‘జోకర్’ సీక్వెల్... మరోటి ‘వెనమ్’ సీక్వెల్. అమెరికన్ కామిక్స్ ఆధారంగా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జోకర్’ (2019). టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోకర్ అనే ఆర్థర్ ఫ్లెక్స్ పాత్రను జోక్విన్ ఫీనిక్స్ పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘జోకర్’కి సీక్వెల్గా ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ చిత్రం రూపొందింది. అక్టోబర్ 4న ఈ జోకర్ తెరపైకి రానున్నాడు. ఇదే ఆఖరి వెనమ్ కొలంబియా పిక్చర్స్ నిర్మించిన స్పైడర్మేన్ యూనివర్స్లో ఆరో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్. ‘వెనమ్’ (2018), ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఈ మూడో భాగంతో ‘వెనమ్’ సీక్వెల్ ముగుస్తుందని టాక్. కెల్లీ మార్సెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెనమ్ పాత్రను టామ్ హార్డీ పోషించారు. ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వేతనాల పెంపుకి రచయితలు చేపట్టిన సమ్మె వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రెండు దశాబ్దాలకు గ్లాడియేటర్ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గ్లాడియేటర్’ (2000) అనూహ్యమైన విజయం సాధించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రసెల్ క్రో, జోక్విన్ ఫీనిక్స్ తదితరులు నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోనే రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. పౌల్ మెస్కల్, డెంజల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సోనిక్ ది హెడ్హాగ్ 3’ డిసెంబర్ 20న, అదే రోజున యానిమేటెడ్ మూవీ ‘హూ ఫ్రేమ్డ్ రాగర్ రాబిట్ 2’, ‘ది కరాటే కిడ్’ ఆరో భాగం డిసెంబర్ 13న... ఇంకా వీటితో పాటు ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉంది. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
సలార్ 'శౌర్యంగపర్వం' యాక్షన్తో స్టార్ట్
‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్లో షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం. -
జై హనుమాన్తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను
‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి సీక్వెల్గా ‘జై హనుమాన్’ వర్క్ ఆరంభమైంది. ‘హనుమాన్’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ‘హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్’ని హైదరాబాద్లో నిర్వహించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్ఫుల్ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 150 థియేటర్స్లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్గారి విజన్’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ఓ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ కథకు సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే కొనసాగించాలంటే కథలో స్కోప్ ఉండాలి. పైగా ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లుగా ఉండాలి. అలా కొన్ని చిత్రాలకు స్కోప్ దొరికింది. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లు తొలి భాగం చివర్లో ట్విస్ట్ ఇచ్చి, మలి భాగం రూపొందించే పనిలో ఉన్నారు. ఈ ఏడాది అరడజనుకు పైగా సీక్వెల్ చిత్రాలు రానున్నాయి. ఈ రెండు భాగాల చిత్రాల గురించి తెలుసుకుందాం... స్వాతంత్య్రం రాక ముందు... సేనాపతి వీరశేఖరన్, అతని కొడుకు చంద్రబోస్ సేనాపతిల కథలను ‘ఇండియన్’ (1996) సినిమాలో చూశాం. ఈ రెండు పాత్రల్లోనూ కమల్హాసన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్గా కమల్హాసన్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఇందులోనూ కమల్ది ద్విపాత్రాభినయం. ఈ చిత్రంలో సేనాపతికి, అతని తండ్రికి మధ్య జరిగే కథను చూపిస్తారట శంకర్. అంటే.. కథ దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత కాలాన్ని కూడా కనెక్ట్ చేశారట. ‘ఇండియన్ 2’ ఏప్రిల్లో విడుదల కానుందని తెలిసింది. మిత్రులే శత్రువులు ఎంతోమంది జీవితాలను మార్చిన ఖాన్సార్ (‘సలార్’ చిత్రం కోసం క్రియేట్ చేసిన ప్రాంతం) ఇద్దరు మిత్రులు దేవరథ, వరదరాజ మన్నార్లను మాత్రం శత్రువులుగా చేసింది. మరి... ఈ మిత్రులు ఎందుకు శత్రువులు కావాల్సి వచ్చిందనే కథను ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో చూడాలంటున్నారు ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా దేవరథ పాత్రలో నటిస్తుండగా, దేవ మిత్రుడు వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ్రపారంభంలో రిలీజయ్యే చాన్స్ ఉంది. ఇక హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సలార్: శౌర్యాంగ పర్వం’ రానుంది. పుష్పగాడి రూల్ ‘పుష్ప’ సినిమాలో సిండికేట్ రూల్స్ను దాటి హెడ్ అయ్యాడు పుష్పరాజ్. మరి.. సిండికేట్ మెంబర్స్కు పుష్పరాజ్ ఎలాంటి రూల్స్ పాస్ చేశాడు? ఈ రూల్స్ను ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే పుష్పరాజ్ ఏం చేసాడనేది ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో చూడొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. డబుల్ ఇస్మార్ట్ కిరాయి రౌడీ ఇస్మార్ట్ శంకర్కు సీబీఐ ఆఫీసర్ అరుణ్ మెమొరీని సైంటిఫిక్గా ఇంజెక్ట్ చేసి, చిప్ పెడితే ఏం జరుగుతుంది? అనేది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. రామ్ టైటిల్ రోల్ చేయగా, సీబీఐ ఆఫీసర్ అరుణ్గా సత్యదేవ్ నటించారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి. కాగా అరుణ్ జ్ఞాపకశక్తి పూర్తిగా శంకర్కు వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఓ కిరాయి రౌడీ సీబీఐ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు? శంకర్ నిజంగానే గతం మర్చిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మార్చి 18న రిలీజయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ చూస్తే తెలుస్తుంది. యాత్ర 2 ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కొన్ని ఘటనలు, ఆయన పాద యాత్ర నేపథ్యంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘యాత్ర’. మహి వి. రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర 2’ తెరకెక్కించారు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నేతగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందింది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. రెట్టింపు వినోదం డీజే టిల్లుగానితో ఎట్లుంటదో ‘డీజే టిల్లు’ సినిమాలో చూశారు ఆడియన్స్. 2022లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రానుంది. ‘డీజే టిల్లు’లో టైటిల్ రోల్ని సిద్ధు జొన్నలగడ్డ చేయగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సీక్వెల్లో సిద్ధూనే హీరో. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిందని తెలుస్తోంది. గూఢచారి 2 ఏజెంట్ గోపీ 116 అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సినిమా గుర్తుకు వస్తుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్. శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో బిజీగా ఉన్నారు అడివి శేష్. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘గూఢచారి 2’ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ► గృహిణి, యూ ట్యూబర్ అనుపమా మోహన్గా ‘భామా కలాపం’లో మెప్పించారు ప్రియమణి. డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘భామాకలాపం 2’ను రెడీ చేస్తున్నారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిమన్యు దర్శకుడు. అలాగే అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తెరకెక్కుతోంది. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సీక్వెల్కు శివ తుర్లపాటి దర్శకుడు. అలాగే అనుష్కా శెట్టి హిట్ ఫిల్మ్ ‘భాగమతి’కు సీక్వెల్గా ‘భాగమతి 2’ తెరకెక్కనుంది. ► ‘బింబిసార 2’, ‘డెవిల్ 2’ ఉంటాయన్నట్లగా కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ‘మ్యాడ్ 2’ ‘మత్తు వదలరా 2’ చిత్రాల స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది. ‘హను–మాన్’కు సీక్వెల్గా ‘జై హను–మాన్’ను ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘రాక్షసుడు 2’ని దర్శకుడు రమేశ్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు . ఇంకొన్ని సీక్వెల్ చిత్రాలున్నాయి. -
డీజే టిల్లు మూవీ సీక్వెల్..?
-
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
'సలార్' సీక్వెల్కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!
డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. 'సలార్' దెబ్బకు థియేటర్లన్నీ మాస్ మేనియాతో హోరెత్తిపోతున్నాయి. అయితే థియేటర్లలో 'సలార్: పార్ట్-1' చూసిన తర్వాత కొందరు ఫుల్ జోష్లో ఉండగా, మరికొందరు మాత్రం కథ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే అసలు స్టోరీ అంతా సీక్వెల్లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే? గత కొన్నాళ్ల నుంచి సీక్వెల్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. 'సలార్'ని కూడా అలా రెండు భాగాలుగా విడగొట్టారు. అయితే తాజాగా రిలీజైన పార్ట్-1లో దేవ పాత్రలో ప్రభాస్ని చూపించారు. ఆద్య(శృతి హాసన్)ని విలన్స్ బారి నుంచి కాపాడటం లాంటి సీన్స్తో ఫస్టాప్.. వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) కోసం ఎంతకైనా తెగించే ప్రాణ స్నేహితుడు దేవాగా ప్రభాస్ని సెకండాఫ్లో చూపించారు. చివర్లో సీక్వెల్కి 'సలార్: శౌర్వంగ పర్వం' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పుడు రిలీజైన 'సలార్ పార్ట్-1: సీజ్ఫైర్'లో చాలావరకు ప్రశ్నలు వదిలేశారు. శౌర్వంగ పర్వం అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దేవా-వరదా ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు? ఖాన్సార్ సామ్రాజ్యానికి ఎవరు కింగ్ అవుతారు? ఆద్య(శృతిహాసన్)ని ప్రభాస్ ఎందుకు రక్షిస్తున్నాడు? ప్రభాస్ తల్లి (ఈశ్వరీ రావు) అతడిని ఎందుకు కట్టడి చేస్తోంది? ఇలాంటి చాలా కీ పాయింట్స్ అన్నింటికీ సమాధానాలన్నీ పార్ట్-2లో చూపించబోతున్నారు. అయితే 'సలార్' పార్ట్-2కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయిందట. కొన్ని సీన్స్ మాత్రమే తీయాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 'కల్కి' మూవీతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్.. తన తర్వాతి మూవీ ఎన్టీఆర్తో చేయాల్సి ఉంది. దీనిబట్టి చూస్తే.. 'సలార్ పార్ట్-2' రిలీజ్ ఎప్పుడవుతుందో ఏంటనేది? క్లారిటీ రావాల్సి ఉంది. అలానే ఇప్పుడొచ్చిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సీక్వెల్లో కొత్తగా ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్! దిమ్మతిరిగే రేటుకు..) -
పూర్తిగా సీక్వెల్ సెంటిమెంట్ లో స్టార్ హీరోలు..
-
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్, చైత్ర జె. ఆచార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాకు ఇది సీక్వెల్. ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’ సినిమాను తెలుగులో ‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’గా టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిభొట్ల ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశానికి ఓ అతిథిగా హాజరైన అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి. ‘సైడ్ ఏ’లో కనిపించని కోణాలు ఏమైనా ‘సైడ్ బి’లో కనిపిస్తాయా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’కు లభించిన ప్రేక్షకాదరణ ‘సైడ్ బి’కి కూడా లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మరో అతిథి కేవీ అనుదీప్. రక్షిత్శెట్టి మాట్లాడుతూ– ‘‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’కి కూడా లభిస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘‘నా జీవితంలో తారసపడిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘సప్త సాగరాలు దాటి..’ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు హేమంత్ రావు. ‘‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’కు లభించినట్లే ‘సైడ్ బి’కీ ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్హాసన్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
ఈ సినిమా నాకో పెద్ద వేడుక
‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది. కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్లతో సాగుతుంది. నా కెరీర్లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్తేజ్ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
నో లిమిట్స్
ధన్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ.. ఇలా రా 2’. ‘బుజ్జీ ఇలా రా’ (2022)కి ఇది సీక్వెల్. ‘నో లిమిట్స్’ ఉపశీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడు. ‘‘తండ్రీకూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సర్వేశ్ మురారి. -
సీక్వెల్స్ అనౌన్స్ చేసి...రామమౌళి చేయలేకపోతున్న సినిమాలు ఇవే
-
సీక్వెల్కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్లో ‘జైలర్ 2’, కమల్హాసన్తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్చరణ్ హీరోగా నటించారు) బ్లాక్బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
జెంటిల్మన్లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్
‘‘జెంటిల్మన్ 2’ సినిమాలో నటించాలని నిర్మాత కేటీ కుంజుమోన్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్గా ఫీలయ్యాను. ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్ అన్నారు. అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జెంటిల్మేన్’. కేటీ కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమా 1993లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘జెంటిల్మన్ 2’ నిర్మిస్తున్నారు కుంజుమోన్. చేతన్ చీను హీరోగా ఎ.గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంపైప్రాచీ తెహ్లాన్ మాట్లాడుతూ–‘‘జెంటిల్మన్ 2’ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నాను. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నాను. ఈ సీక్వెన్స్ లో నటించటం సవాల్తో కూడుకున్నది.. ఇందుకోసం శిక్షణ తీసుకున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు. -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. తొలి సీన్కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
'జెంటిల్ మేన్ 2' ప్రారంభం
ముప్పైఏళ్ల క్రితం అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్’ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’ వంటివి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. చాలా గ్యాప్ తర్వాత కుంజుమోన్ ‘జెంటిల్ మేన్ 2’కి శ్రీకారం చుట్టారు. చేతన్ శ్రీను హీరోగా గోకుల్కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో తమిళనాడు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ వేదికపై కీరవాణిని సన్మానించారు కుంజుమోన్. ‘‘ప్రతి ఒక్కరూ జెంటిల్మేన్ అవ్వాలి అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అన్నారు కుంజుమోన్. -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
ఆన్స్క్రీన్పై మరోసారి జత కట్టనున్న రియల్ కపుల్.. పెళ్లయ్యాక తొలిసారి!
తమిళసినిమా: నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి గల్రాణి జంటగా నటించిన చిత్రం మరకత నాణయం. ఈ చిత్రం ద్వారా ఏఆర్కే శరవణ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడు ఏ ఆర్ కె .శరవణ్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఈయన సుమారు ఐదేళ్ల తర్వాత ఇటీవల హిప్ హాప్ తమిళా ఆది హీరోగా వీరన్ అనే సోషియో ఫాంటసీ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఓటిటిలోనూ వీక్షకుల విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు ఏ ఆర్ కె శరవణ్ తన తాజా చిత్రాల పనిలో చాలా బిజీగా ఉన్నారు. దీని గురించి ఆయన పేర్కొంటూ తన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటం సంతోషంగా ఉందన్నారు. వీరన్ చిత్రం తర్వాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2023– 24 లో తాను చాలా బిజీగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆది పినిశెట్టి, నిక్కి గల్రాణి జంటగా తాను దర్శకత్వం వహించిన మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ కు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందులోనూ అదే జంట నటిస్తారని తెలిపారు. ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఇది ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు ఏఆర్కే శరవణ్ చెప్పారు. -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
ఐదు రెట్ల వినోదం
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్లో ‘హౌస్ఫుల్’ మూవీ ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం. అక్షయ్లోని కామెడీ స్టైల్ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘హౌస్ఫుల్’ చిత్రాలే. ఇప్పటివరకూ ‘హౌస్ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన నాలుగు చిత్రాల్లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్లు నటించారు. తాజాగా ‘హౌస్ఫుల్ 5’ని ప్రకటించారు. ‘దోస్తానా’, ‘డ్రైవ్’ సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్ మన్సుఖాని ‘హౌస్ఫుల్ 5’ సినిమాను తెరకెక్కించనున్నారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ‘‘ఐదు రెట్ల వినోదంతో ‘హౌస్ఫుల్ 5’ను 2024 దీపావళికి విడుదల చేయనున్నాం’’ అన్నారు అక్షయ్ కుమార్. -
'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. మనం వాటిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయాం. కానీ 'ఆదిపురుష్'పై వచ్చినన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. నిరాశపరిచిన 'ఆదిపురుష్'! 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. పలు వైవిధ్యమైన సినిమాల్ని ఒప్పుకొన్నాడు. 'సాహో' యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, 'రాధేశ్యామ్' ఓ లవ్ స్టోరీ, ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్' మైథలాజికల్ చిత్రం. 'బాహుబలి' తప్పితే మిగతా మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి! ఇలా అంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. అయినా ఇదే నిజం! (ఇదీ చదవండి: 'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!) నో చెప్పిన ప్రభాస్! 'ఆదిపురుష్'లో రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏం అనడం లేదు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ని బూతులు తిడుతున్నారు. ఇదంతా చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనతో వెళ్లాడట. దీన్ని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంపైనే ఇన్ని వివాదాలు వచ్చాయి. సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు బహుశా! కలెక్షన్స్ ఎంత? తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్ల వసూళ్లు సాధించిన 'ఆదిపురుష్'.. నాలుగురోజు నుంచి డల్ అయిపోయింది. చెప్పాలంటే రోజురోజుకీ దారుణంగా పడిపోయాయి. అలా మొత్తంగా పది రోజుల్లో రూ.450 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అవి ఎంతనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది. #Adipurush goes from strength to strength at the Global Box Office and collects Rs 450 CR in 10 days. Continues its steady march at the box office!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @TSeries @Retrophiles1 @UV_Creations @peoplemediafcy… pic.twitter.com/ErYJ1F8Mce — People Media Factory (@peoplemediafcy) June 26, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) -
వినాయక చవితి కు రిలీజ్ అవ్వనున్న టిల్లు స్క్వేర్
-
ఆవారా సీక్వెల్ లో నటిస్తున్న కార్తీ
-
డీజే టిల్లు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
‘డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు..’ అంటే యూత్తో పాటు ఫ్యామిలీస్ని కూడా ఆకట్టుకున్నాడు టిల్లు. సిద్ధు జొన్నలగొడ్డ టైటిల్ రోల్లో మీడియమ్ బడ్జెట్తో రూపొందిన ‘డీజే టిల్లు’ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా సిద్ధు జొన్నలగడ్డతోనే నాగవంశీ, సాయి సౌజన్య ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఈసారి రెట్టింపు వినోదం గ్యారంటీ అంటూ.. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే సిద్ధు, అనుపమల రొమాంటిక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
బిచ్చగాడు 2 సంచలనం
-
12 ఏళ్లుగా డాన్ 3 గురించి చర్చ.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన నిర్మాత
షారుక్ ఖాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘డాన్’ (2006) ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘డాన్ 2’ (2011) కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ‘డాన్ 3’కి సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన పన్నెండేళ్లల్లో ‘డాన్ 3’ గురించి అడపా దడపా చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘డాన్ 3’ గురించి చిత్రనిర్మాత రితేష్ అద్వానీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కథ సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చెబుతామనీ పేర్కొన్నారు రితేష్. -
ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్!
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రిషబ్ శెట్టి ప్లానింగ్ కాంతారా 2
-
బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది
‘‘విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు.. రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు. ‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్. -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
‘సీతారామం 2’ కోసం వెయిటింగ్: మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు సీతారామంకు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరి మనసును తాకిన ఈ అందమైన ప్రేమ కావ్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే అంతటి ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్కు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా సీతారామం టీంకు మూవీ స్వీకెల్పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ట్విటర్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటించిన మృణాల్కు సీతారామం సీక్వెల్పై ప్రశ్న ఎదురైంది. ఈ చిట్చాట్లో ఓ అభిమాని ‘సీతా రామంకు’ సీక్వెల్ ఉందా? అని మృణాల్ను అడిగారు. చదవండి: భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై మెగా డాటర్ క్లారిటీ? ఆ ప్రశ్నకు మృణాల్ స్పందిస్తూ.. ‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ఈ మూవీ సీక్వెల్ ఉంటే బాగుండు అనుకుంటున్నా. దానికి కోసం నేరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సమాధానం ఇచ్చింది. అలాగే మరో అభిమాని తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘అదిగో మళ్లీ మొదలు..’ అని ‘సీతా రామం’ డైలాగ్ చెప్పింది. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ టీంను మిస్ అవుతున్నానంది. ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు గతంలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మృణాల్ ట్వీట్తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. -
దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్లో నితిన్, వర్కౌట్ అయితే కాసుల వర్షమే!
టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసి సక్సెస్ అందుకుంటున్నారు హీరోలు..దర్శకులు. అందుకే ఈ మధ్య దర్శకులు సీక్వెల్ కి లీడ్ ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేసున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సీక్వెల్ మూవీ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమాలో నటించింది ఒక హీరో అయితే...సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని తెలుస్తుంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఎం.సి.ఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాలో నాని, సాయిపల్లవి జంటగా నటించగా...భూమిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు వసూళ్లు చేసింది. నాని కెరీర్ లో ఎం.సి.ఎ బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే...సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పలేదు. అయితే ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ స్టోరీస్ తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన దర్శకత్వంలో హిట్ అయిన ఎం.సి.ఎ మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే ఈ ఎం.సి.ఎ సీక్వెల్ లో నాని బదులు యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడట. దిల్ రాజు ముందుగా హీరో నానికి ఈ సీక్వెల్ మూవీ ఆఫర్ చేశాడట. అయితే ఇతర సినిమాలతో బిజిగా ఉండటం వల్ల చేయలేనని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎం.సి.ఎ సీక్వెల్ ఆఫర్ నితిన్ కి చేరింది. ప్రస్తుతంనితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్ హీరోగా ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకువెళ్లాడు నితిన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా ఓ మూవీలో నటించనున్నారు. భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన నితిన్...దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ..డైరెక్టర్ వేణుశ్రీరామ్ కి నితిన్ తో మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్...నితిన్ కి ఎం.సి.ఎ మూవీ సీక్వెల్ స్టోరీ చెప్పి ఎస్ అనిపించుకున్నాడట. వక్కంతం వంశీ సినిమా అయిపోయాక.. నితిన్-వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే మాట టి.టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మరో వారం రోజుల్లో అవకాశం ఉంది. -
బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో
‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్ ఆంటోని. 2016లో విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్ కంపోజింగ్, సింగర్ విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. -
సమ్మర్ స్పెషల్గా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై మంచి పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా పిచ్చైక్కారన్–2 తెరకెక్కుతోంది. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ విశేషమేంటంటే ఈ చిత్రం ద్వారా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. #ANTIBIKILI 👺#Pichaikkaran2 #Bichagadu2 #Bhikshuka2 #Bhikshakkaran2 Satellite & Digital rights acquired by Star Network 🔴 Summer 2023 🔥@vijaytelevision @StarMaa @asianet @StarSuvarna @DisneyPlusHS @mrsvijayantony @vijayantonyfilm @DoneChannel1 @gskmedia_pr @gobeatroute pic.twitter.com/w0YPShC1xy — vijayantony (@vijayantony) December 20, 2022 -
మరో సంచలనమైన కొత్త కేసుతో జై భీమ్-2 ..!
-
టీజే టిల్లు సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి వచ్చే మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. ‘డబుల్ ఫన్.. డబుల్ రొమాన్స్’ అని ట్వీట్ చేశారు సిద్ధు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, కెమెరా: సాయి ప్రకాష్. -
అప్పుడే సర్దార్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్, స్పెషల్ వీడియో రిలీజ్
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్ అలియాస్ ‘సర్దార్’, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించారు కార్తీ. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్గా చేరాలన్న ఆఫర్కు విజయ్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, విజయ్ కొత్త మిషన్ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్ కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. #Sardar 💥 Once a spy, always a spy! Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp — Prince Pictures (@Prince_Pictures) October 25, 2022 -
సూర్య గజిని సీక్వెల్కు సిద్ధం?
తమిళ సినిమా: నటుడు సూర్య దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గజిని. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుదాస్ అమీర్ ఖాన్ హీరోగా హిందీలోనూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ తర్వాత సూర్య, ఏఆర్. మురుగదాస్లో కాంబినేషన్లో రూపొందిన ఏళామ్ అరివు చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. ఏఆర్ ముగురుదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా తుపాకీ- 2 చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెర్కెక్కించబోతున్నట్టు ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏఆర్.మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈయన చిత్రం చేసి చాలా కాలమే అయ్యింది. చదవండి: ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే కాగా తాజాగా సూర్యతో మరోసారి సినిమా చేయడానికి ఈయన సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన గజిని చిత్రానికి సీక్వెల్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో సంప్రదింపులు జరుపుతున్న ట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక నటుడు సూర్య చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
‘ఆషికీ 3’లో హీరోయిన్గా రష్మిక మందన్నా?
రష్మికా మందన్నా కెరీర్ మంచి జోరు మీద ఉంది. ఒకవైపు దక్షిణాది సినిమాలు సైన్ చేస్తూ మరోవైపు ఉత్తరాదిపై కూడా దృష్టి పెట్టారీ బ్యూటీ. ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజు్న’, ‘యానిమల్’ వంటి చిత్రాలు ఆమె లిస్ట్లో ఉన్నాయి. తాజాగా ఓ హిట్ సీక్వెల్ (ఆషికీ) లో హీరోయిన్గా రషి్మకా దాదాపు ఖరారు అయ్యారని సమాచారం. రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా రూపొందిన ‘ఆషికీ’ (1990) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్లో అదరగొట్టిన ప్రభాస్ ఆ తర్వాత పదమూడేళ్లకు ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన ‘ఆషికీ 2’ (2013) కూడా హిట్టయింది. ఇప్పుడు ‘ఆషికీ 3’లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా రషి్మకను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
రిలీజ్కు ముందే సీక్వెల్ ప్రకటన.. ఇప్పుడెలా?
ఒక సినిమా రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించి.. మూవీ హిట్టైన తర్వాత సీక్వెల్ తీస్తే ఎక్కడ లేని కిక్. కాని సీక్వెల్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసిన తర్వాత మూవీ ఫట్ అయితే మాత్రం ఎక్కడలేని ఇబ్బంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ది వారియర్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల దర్శకులు. ఈ రెండు చిత్రాలు కూడా జులైలోనే రిలీజ్ అయ్యాయి. వీటి సక్సెస్ పై హీరోలు మాత్రమే కాదు,దర్శకులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే రిలీజ్ కు ముందే సీక్వెల్స్ స్టోరీస్ రెడీగా ఉన్నట్లు తెలిపారు.సీన్ కట్ చేస్తే రామ్ నటించిన వారియర్, రవితేజన కనిపించిన రామారావు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఈ సినిమా దర్శకులు, హీరోలు సీక్వెల్స్ తో తిరిగొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: రీ-రిలీజ్కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్బస్టర్ చిత్రాలు!) సీక్వెల్ అంటేనే హిట్ సినిమాకు కొనసాగింపు.అలాంటిది మొదటి సినిమానే పరాజయం పాలైతే ఇక ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉండదు.అందుకే పార్ట్ 2తో ఫెయిల్యూర్ కాగానే కొంతమంది హీరోలు పార్ట్ 3కి దూరంగా ఉండిపోయారు. శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, రాజు గారి గది 2, మన్మథుడు 2 చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఈ లెక్కన రవితేజ, రామ్ లు రామారావు, వారియర్ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
మళ్లీ రానున్న 'జోకర్'.. అతనికి ప్రేయసిగా పాపులర్ సింగర్!
Lady Gaga As Harley Quinn In Joaquin Phoenix Joker 2: జోకర్.. 2008లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ 'బ్యాట్మేన్: ది డార్క్ నైట్' సినిమాతో ఎంతో పాపులర్ అయ్యాడు. అందులో విలన్గా అలరించిన జోకర్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాత్రకున్న క్రేజ్ చూసిన దర్శకనిర్మాతలు 2019లో 'జోకర్' సినిమా తెరకెక్కించారు. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో అలరించిన ఈ మూవీ వరల్డ్వైడ్గా 1.07 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా అనేక ఇంటర్నేషన్ల్ అవార్డులను కూడా అందుకుంది. ఈ మూవీలో జోకర్గా నటించిన జోక్విన్ ఫీనిక్స్కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ రావడం విశేషం. అయితే ఈ జోకర్ మళ్లీ రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే 'జోకర్'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సీక్వెల్లో హార్లే క్విన్ అనే కీలక పాత్రలో అమెరికన్ పాపులర్ సింగర్ లేడీ గాగా అలరించనుంది. Joker: Folie à Deux 10.04.24 pic.twitter.com/obp7T9lBFL — Lady Gaga (@ladygaga) August 4, 2022 కాగా 2016లో వచ్చిన డిస్నీ సినిమాటిక్ ఎక్స్టెండ్ యూనివర్స్ (డీసీఈయూ) మూవీ 'సూసైడ్ స్క్వాడ్'లో హార్లే క్విన్గా మార్గోట్ రోబీ పరిచయమైంది. ఇందులో జోకర్కు ప్రేయసిగా హార్లే క్వీన్ పాత్ర ఉంటుంది. తర్వాత వచ్చిన డీసీ సిరీస్లోని బర్డ్స్ ఆఫ్ ప్రే, ది సూసైడ్ స్క్వాడ్ చిత్రాల్లో హార్లే క్వీన్గా మార్గోట్ రోబీ అదరగొట్టింది. మరీ ఇప్పుడు వస్తున్న సీక్వెల్ మూవీ 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్'లో లేడీ గాగాను జోకర్కు ప్రేయసిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
రవితేజ లిస్ట్లోకి మరో సీక్వెల్.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో!
ఒక స్టోరీని రవితేజను దృష్టిలో పెట్టుకుని రాస్తే ఆ క్యారెక్టర్ తనదైన శైలిలో లైఫ్ ఇస్తాడు మాస్ మహా రాజా. అందుకే ఆ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు దర్శకులు ముందుగానే సీక్వెల్ ఐడియా రాసుకుంటారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ కూడా చేరిపోయాడు. రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్లో మాస్ మహా రాజా ను మరింత పవర్ ఫుల్ కు షిఫ్ట్ చేసాడు. (చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ) కాగా, రవితేజ ఇప్పటికే కిక్ సీక్వెల్ కిక్ 2 చేశాడు. అయితే ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే రవితేజ సీక్వెల్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. కాని మాస్ రాజాతో మూవీస్ తీస్తున్న దర్శకులు మాత్రం ఆయన కోసం సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టుకున్నారు. రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీతో అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విచ్చేసిన సందర్భంలో కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ గురించి మాట్లాడాడు. గతేడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మాస్ రాజా కమ్ బ్యాక్ మూవీ క్రాక్ కు సీక్వెల్ కు స్టోరీని రాసిపెట్టుకున్నాడు గోపీచంద్ మలినేని. రవితేజ డేట్స్ ఇస్తే మరోసా భూమ్ బద్దలయ్యే బ్లాక్ బస్టర్ అందిస్తానంటున్నాడు. మొత్తంగా మాస్ రాజా చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్ 3కు పెరిగింది. వీటిల్లో ఏ సీక్వెల్ కు రవితేజ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. -
ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్
కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్హాసన్ ‘భారతీయుడు 2’, ‘శభాష్ నాయుడు’, విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ జోష్లో ఉన్నారు కమల్హాసన్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్ హిట్ సాధించారు కాబట్టే కమల్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్’ కంటే ముందు కమల్ ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్ అయ్యుండేది. కానీ దర్శకుడు శంకర్కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు మధ్య విభేదాలు, ‘ఇండియన్ 2’ సెట్స్లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్ చొరవతో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్ ఉన్నారు. కాజల్ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉందట ‘ఇండియన్ 2’ టీమ్. 1986లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్’కి సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్ నాయుడు’. 2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ కూడా ఓ నిర్మాత. షూటింగ్కి బ్రేక్ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్ 2, శభాష్ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. -
డీజే టిల్లు సీక్వెల్ నుంచి డైరెక్టర్ అవుట్ !.. కారణం ఇదేనా ?
Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ఇక 'డీజే టిల్లు' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా 'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య పలు క్రియేటివ్ డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయని వినికిడి. సిద్ధు ప్రవర్తనతో హర్ట్ అయిన విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సీక్వెల్కు అన్ని తానై చూసుకుంటున్నాడట సిద్ధు. విమల్ ప్లేస్లో కొత్త దర్శకుడు సైతం వచ్చనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్, కొత్త డైరెక్టర్ వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. కాగా అటు విమల్ కృష్ణ.. నాగ చైతన్యకు ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. -
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా!
వారిద్దరూ స్టార్ హీరోలే. ఒకరు యాక్షన్ హీరో అయితే.. మరొకరు యూనివర్సల్ హీరో. రియల్ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీన్లలో అదరగొట్టేది ఒకరైతే.. నటనలో విశ్వరూపం చూపిస్తూ మెస్మరైజ్ చేసేది ఇంకొకరు. ఈ ఇద్దరు ఆరు పదుల వయసువారే. ఒకరికి 60 అయితే మరొకరికి 67. ఈ వయస్సులో కూడా పోరాట సన్నివేశాలు చేస్తూ, నటనలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఐ ఫీస్ట్ చేస్తారు. వారిద్దరికీ ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. వీరి సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు పడిగాపులు పడుతుంటారు. వచ్చే వరకు ఆరాదిస్తూనే ఉంటారు. ఇలా ఒక సూపర్ హిట్ కోసం అటు ఆ హీరోలు.. ఇటు వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇద్దరు తమ సినిమాలను ఒకే ఏడాది రిలీజ్ చేసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు. అందులోనూ సుమారు 36 ఏళ్ల క్రితం చిత్రాలను సీక్వెల్గా తెరకెక్కించి ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా రికార్డు సైతం క్రియేట్ చేశారు. మరీ ఆ స్టార్ హీరోలెవరో తెలుసుకుందామా. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' సినిమా 2022 జూన్ 3న విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్కు మాసీవ్ కమ్బ్యాక్ హిట్ ఇచ్చింది ఈ మూవీ. అయితే ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మల్టీవర్స్ తరహాలో (LCU-లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) తెరకెక్కించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ 'ఖైదీ' సినిమా సీన్లను చూపించడం, తర్వాత 'ఖైదీ 2'లో కూడా కమల్ హాసన్ విక్రమ్గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 'విక్రమ్ 3'లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని కమల్ హాసన్ ఒక ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ 'విక్రమ్ 3' అని ఎందుకు అన్నారు ? అంటే ఇప్పటికే 'విక్రమ్ 2' వచ్చిందా ? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి 'విక్రమ్: ది హిట్ లిస్ట్' కన్నా ముందు 1986లో 'విక్రమ్' సినిమా వచ్చింది. ఇదే 'రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్'లో 'ఏజెంట్ విక్రమ్ 007' రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. ఈ పాత్ర కొనసాగింపుగా తాజాగా 'విక్రమ్: ది హిట్ లిస్ట్'ను రూపొందించారు లోకేష్ కనకరాజ్. అంటే ఈ 'విక్రమ్: ది హిట్ లిస్ట్ (విక్రమ్ 2)', 1986లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్ 007' చిత్రాల కథా నేపథ్యం ఒకే లైన్పై ఆధారపడింది. దీన్ని బట్టి చూస్తే 'ఏజెంట్ విక్రమ్ 007'కు 'విక్రమ్ 2' సీక్వెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 1986లో కమల్ హాసన్కు ఒక క్రేజ్ తీసుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తడబడుతున్న కమల్ హాసన్కు ఒక బ్లాక్ బస్టర్గా నిలిచి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రూ. కోటి బడ్జెట్తో తెరకెక్కిన ఈ 'ఏజెంట్ విక్రమ్ 007' బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8 కోట్లను కొల్లగొట్టాడు. అంతేకాకుండా ఈ మూవీలోని టైటిల్ ట్రాక్లో (విక్రమ్ టైటిల్ సాంగ్) మొట్ట మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ వాయిస్ (రోబోటిక్ వాయిస్లా)ను ఉపయోగించారు సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఈ వాయిస్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అయితే ఈ వాయిస్ను 'విక్రమ్: ది హిట్ లిస్ట్' టైటిల్ ట్రాక్లో కూడా కొనసాగించారు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్. ఈ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక్కో బీజీఎం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' మూవీ సుమారు రూ. 120-150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు రూ. 442.45 కోట్లు రాబట్టింది. కాగా సరైన హిట్ లేకుండా సతమవుతున్న కమల్ హాసన్కు.. 36 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ కథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ 'విక్రమ్ 2' సెన్సేషనల్ హిట్గా నిలవడం విశేషం. 1986లో 32 ఏళ్ల వయసులో కమల్ ఎలాంటి నటనతో అలరించాడో 67 ఏళ్ల వయసులో కూడా అంతకుమించిన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక కమల్ హాసన్లానే కెరీర్ ప్రారంభంలో స్ట్రగులై అదే 1986లో హిట్ కొట్టిన మరో స్టార్ హీరో టామ్ క్రూజ్. ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో రియల్ స్టంట్స్, ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోకు కూడా కెరీర్ ఆరంభంలో సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన మూవీ 'టాప్ గన్'. 1986 మే 16న విడుదలైన 'టాప్ గన్' అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1.5 కోట్ల (యూఎస్ డాలర్స్) బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35.73 కోట్లు (యూఎస్ డాలర్స్) రాబట్టింది. తర్వాత అనేక యాక్షన్ మూవీస్తో అదరగొట్టిన టామ్ క్రూజ్కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అయితే సుమారు 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్గా 'టాప్ గన్: మావెరిక్' వచ్చి టామ్ క్రూజ్కు సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. 'టాప్ గన్'లో 24 ఏళ్ల వసయసులో బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్, యాక్టింగ్, రొమాన్స్తో టామ్ క్రూజ్ ఎలా అయితే ఆకట్టుకున్నాడో 59 ఏళ్ల (సినిమా చిత్రీకరణ సమయంలో) వయసులోనూ అదే జోష్తో మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో రియల్ స్టంట్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాప్ గన్: మావెరిక్' సుమారు 170 మిలియన్ డాలర్ల బడ్జెట్తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద సుమారు 1. 131 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక ఆరు పదుల వయసులోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న కమల్ హాసన్, టామ్ క్రూజ్.. యాక్టింగ్, యాక్షన్ స్టంట్స్లో 'ఇద్దరూ.. ఇద్దరే' అనిపించుకుంటున్నారు. కాగా 36 ఏళ్ల క్రితం సినిమాలను సీక్వెల్గా తెరకెక్కించి, హిట్ లేని సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్, టామ్లది ఎంతటి యాదృచ్ఛికం. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
భారీ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి!
ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం కామన్. అలా కోలీవుడ్లో అరడజనుకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. భారీ హిట్స్ సాధించిన చిత్రాలకు ‘కథ కంటిన్యూ’ అవుతోంది. ఈ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు 26ఏళ్ల క్రితం వెండితెరపై శంకర్ చూపించిన ‘భారతీయుడు’ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు’ (1996) చిత్రానికి అంతటి రెస్పాన్స్ లభించింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)కి స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు శంకర్. సీక్వెల్లోనూ కమల్హాసనే హీరో. అయితే షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో లొకేషన్లో యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు, దర్శకుడు శంకర్కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం వంటి కారణాలతో ‘ఇండియన్ 2’ షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అయితే మళ్లీ పట్టాలెక్కించి, వీలైతే ఈ ఏడాదే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చెప్పారు.. సో.. సమయం కాస్త అటూ ఇటూ అయినా తెరపైకి మరోసారి భారతీయుడు రావడం ఖాయం. అలాగే శంకర్ దర్శకత్వంలోనే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘జెంటిల్మేన్’ (1993) చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి తెలిసిందే. దీంతో ఈ చిత్రనిర్మాత టి. కుంజుమోన్ ‘జెంటిల్మేన్ 2’ను ప్రకటించారు. కానీ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడంలేదు. నానీతో ‘ఆహా కళ్యాణం’ సినిమా తీసిన గోకుల్ కృష్ణ ‘జెంటిల్మేన్ 2’కు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రియాలాల్, నయనతార చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తారు. అయితే హీరోగా ఎవరు నటిస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే విషయాలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ‘జయం’ రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ల ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. చోళ సామ్రాజ్య నేపథ్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ సెప్టెంబరు 30న రిలీజ్ కానుంది. సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలవుతుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్పైకి వచ్చేందుకు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (‘యుగానికి ఒక్కడు’ – 2010) మళ్లీ రెడీ అవుతున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ, రీమాసేన్, ఆండ్రియా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సెట్స్పైకి వెళ్లనుంది. అయితే సీక్వెల్లో మెయిన్ హీరోగా కార్తీ కాదు...ధనుష్ నటిస్తారు. కార్తీ పాత్ర కూడా ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక ‘లక లక లక...’ అనగానే అందరికీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ (2005) సినిమాయే గుర్తుకు వస్తుంది. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు, వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. సీక్వెల్కు పి. వాసుయే దర్శకుడు కానీ హీరోగా నటించేది మాత్రం రజనీకాంత్ కాదు. రాఘవా లారెన్స్ నటిస్తారు. కాగా ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ధృవ’లో రామ్చరణ్ హీరోగా నటించారు) చిత్రం మంచి హిట్ సాధించింది. దీంతో ‘తని ఒరువన్’ సీక్వెల్ను ప్రకటించారు దర్శకుడు మోహన్రాజా. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అలాగే కార్తీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖైదీ’కి సీక్వెల్ ఉందని ఈ చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఇటీవల కమల్హాసన్ నటించిన హిట్ ఫిల్మ్ ‘విక్రమ్’కు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాదు.. సూర్య, శింబు, అజిత్ నటించిన హిట్ మూవీస్ సీక్వెల్స్కు సంబంధించిన వార్తలను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇంకా హీరో సూర్య–దర్శకుడు హరి కాంబినేషన్లోని ‘సింగమ్’ సిరీస్, దర్శక–నిర్మాత, నటుడు రాఘవా లారెన్స్ ‘కాంచన’, దర్శకుడు సుందర్. సి ‘అరణ్మణై’ ఫ్రాంచైజీల నుంచి సీక్వెల్ చిత్రాలు రెడీ అవుతున్నాయన్నది కోలీవుడ్ ఖబర్. చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్లు.. -
హీరోలకు చోటు లేదు.. ఆసక్తిగా 'ఏక్ విలన్ 2' పోస్టర్స్
Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్ విలన్'కు సీక్వెల్గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' చిత్రంలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్తో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
'డీజే టిల్లు 2'కు ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే షూటింగ్
Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి ప్రేక్షకులతోటి 'అట్లుంటది మనతోని' అనేలా చేసింది. అయితే విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొనసాగింపు కూడా ఉంటుందనేలా సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆడియెన్స్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ వస్తే 'అట్లుంటది మాతోటి' అనేలా హిట్ ఇద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్తో 'డీజే టిల్లు' సినిమా సీక్వెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్క్రిప్ట్కు సంబంధించిన పుస్తకాన్ని దేవుడి పటాల ముందుంచి పూజ చేసిన ఫొటోను శనివారం (జూన్ 25) ట్విటర్ వేదికగా పంచుకున్నారు నాగవంశీ. ఈ ఫొటోకు 'ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది.' అని రాసుకొచ్చారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?) The most awaited Franchise... Gearing up for Round 2 🔥 Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ — Naga Vamsi (@vamsi84) June 25, 2022 దీంతో నెటిజన్స్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ రానుందని భావిస్తున్నారు. అలాగే 'టిల్లు అన్న రెడీ అవుతున్నాడు' అని నెటిజన్స్ కామెంట్ చేయగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ 'సోదరా.. పార్ట్ 2 కూడా బ్లాక్బస్టర్ కావాలి' అని విష్ చేస్తూ సిద్ధు జొన్నలగడ్డను ట్యాగ్ చేశారు. దీనికి 'థ్యాంక్యూ సర్' అని సిద్ధు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్లతో 'డీజే టిల్లు 2' రానుందని తెలుస్తోంది. (చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్పై అధికారిక ప్రకటన
Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్ను చూసుకోనున్నారు. Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH — Lyca Productions (@LycaProductions) June 14, 2022 అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్, పి. వాసు కాంబినేషన్లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC — Lyca Productions (@LycaProductions) June 14, 2022 -
36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కెరీర్లో హిట్ సాధించిన సినిమాల్లో 'టాప్ గన్' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా 'టాప్ గన్: మేవరిక్' రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ను ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ప్రదర్శించారు. 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్గా రావడం, కేన్స్ ఫెస్టివల్లో ప్రీమియర్ వేయడంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. ఈ మూవీని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీని రూ. 12 వందల కోట్ల బడ్జెట్తో జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ రచనా సహకారం అందించారు. కాగా 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ను సుమారు 25 ఏళ్లుగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈసినిమా సిరీస్తో టామ్ క్రూజ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్లో మంచి హిట్ ఇచ్చిన టాప్ గన్ సీక్వెల్కు మాత్రం 36 ఏళ్లు పట్టింది. అయితే ఈ సీక్వెల్ను మూడేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఈ సంవత్సరం సీక్వెల్స్తో తగ్గేదే లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం. త్రిబుల్ సందడి... ‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తగ్గేదే లే అంటూ... ‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్లకు సీక్వెల్... నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ హిట్ కోసం... వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే.. రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన
Gentleman 2 Movie Producer Kunjumon Announces Second Heroine: 1993లో విడుదలై సంచలన విజయం సాధించిన యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం 'జెంటిల్ మేన్'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా 'జెంటిల్ మేన్ 2' రానుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ 2020లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఇటీవల మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ను సెలెక్ట్ చేసినట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో మరో హీరోయిన్గా ప్రియాలాల్ నటించనుందని అధికారికంగా తెలిపారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో ఇంకా హీరో ఎవరనేది వెల్లడికాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిచనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. కాగా ఇదివరకు వచ్చిన 'జెంటిల్ మేన్' చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. మరీ ఈ సీక్వెల్ మూవీకి దర్శకత్వ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. The enthusiastic @PriyaaLal will be the another lead actress in our Mega movie #Gentleman2#ஜென்டில்மேன்2 #जेंटलमेन2 #ജെന്റിൽമാൻ2 #ಜಂಟಲ್ಮನ್2 #జెంటిల్మాన్2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @PRO_SVenkatesh @Fridaymedia2 pic.twitter.com/3mHPuvQ4jz — K.T.Kunjumon (@KT_Kunjumon) April 13, 2022 -
సినిమా ఎండ్ కాలేదు..పిక్చర్ అభీ బాకీ హై.. సీక్వెల్ చూపిస్త మామా..
సినిమాకి ఎండ్ కార్డు పడింది.. కానీ సినిమా ఎండ్ కాలేదు. పిక్చర్ అభీ బాకీ హై.. అంటే... సినిమా ఇంకా ఉందని అర్థం. అలా హిందీలో ఇప్పుడు ‘కొనసాగింపు’ సినిమాలు చాలా ఉన్నాయి. ‘సీక్వెల్ చూపిస్త మామా..’ అంటూ అరడజనకు పైగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్లో ‘టైగర్’, ‘దబాంగ్’ చిత్రాల ఫ్రాంచైజీలు చెప్పుకోదగ్గవి. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తోన్న తాజా చిత్రం ‘టైగర్ 3’. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. ‘దబాంగ్ 4’ చిత్రం చేసే ఆలోచన ఉందని ఇటీవల సల్మాన్ చెప్పారనే వార్తలు వచ్చాయి. ఇవే కాదు.. కామిక్ టచ్ ఉన్న ‘నో ఎంట్రీ’, ఎమోష నల్ టచ్ ఉన్న ‘భజరంగీ బాయిజాన్’ చిత్రాలకు సల్మాన్ ఇటీవల సీక్వెల్స్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ సెప్టెంబరులో విడుదల కానుంది. ఇందులో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున లీడ్ రోల్స్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యాక్షన్ హీరో హృతిక్ రోషన్ను సూపర్ హీరోను చేసిన ఫ్రాంచైజీ ‘క్రిష్’. ఇప్పటికే మూడు సార్లు వెండితెరపైకి వచ్చిన క్రిష్ నాలుగోసారి కూడా రావాల్సింది. అయితే ‘క్రిష్’ దర్శకుడు రాకేష్ రోషన్ (హృతిక్ తండ్రి, రచయిత) క్యాన్సర్ బారిన పడి కోలుకోవడం, కరోనా పరిస్థితులు వంటి కారణాల చేత ‘క్రిష్ 4’ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఫైటర్’, ‘విక్రమ్ వేదా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు హృతిక్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ‘క్రిష్ 4’ను ఆరంభించాలని అనుకుంటున్నారట. మరోవైపు బాలీవుడ్లో ఆమిర్ఖాన్ ‘లగాన్’ చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు (15 జూన్ 2001)నే రిలీజైన మరో మూవీ సన్నీ డియోల్ ‘గదర్: ఏక్ ప్రేమ్కథ’ కూడా బంపర్హిట్ సాధించింది. ఇరవయ్యేళ్ల తర్వాత ‘గదర్ 2’ను అనౌన్స్ చేశారు. ‘గద ర్’ ఫస్ట్ పార్ట్కు దర్శకత్వం వహించిన అనిల్ శర్మయే ‘గదర్: ప్రేమ్ కథ కంటిన్యూ’ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్ నటిస్తున్నారు. ఇంకోవైపు రెండు సీక్వెల్ సినిమాల్లో గెస్ట్గా కనిపించనున్నారు అక్షయ్ కుమార్. హిట్ ఫిల్మ్ ‘ఓ మైగాడ్’ (2012)కు సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘ఓ మై గాడ్ 2’లో తొలి భాగంలో కనిపించినట్లుగానే అక్షయ్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ‘ఓ మై గాడ్’కి ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించగా, సీక్వెల్కు అమిత్ రాయ్ డైరెక్టర్. తొలి భాగంలో పరేష్ రావల్ చేసిన లీడ్ రోల్ను సీక్వెల్లో పంకజ్ త్రిపాఠి చేస్తున్నారని తెలిసింది. ఇటు ‘భూల్ భులెయ్యా 2’ టీమ్కు కూడా అక్షయ్ కుమార్ అతిథే. అనీష్ బాజ్మి దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ఇది. 2007లో అమీషా పటేల్, విద్యా బాలన్, అక్షయ్ కుమార్ ప్రధాన తారాగణంగా ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన ‘భూల్ భులెయ్యా’ చిత్రం అప్పట్లో ఓ హిట్ మూవీగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరోవైపు మలయాళంలో ఘనవిజయం సాధించిన హిట్ మూవీ ‘దృశ్యం’ను హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేసి కెరీర్లో మరో హిట్ సాధించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’లో నటిస్తున్నారు అజయ్ దేవగన్. టబు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకుడు. దాదాపు పదిహేనేళ్ల క్రితం అమితాబ్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ కాంబినేషన్లో రూపొందిన ‘బంటీ ఔర్ బబ్లీ’కి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. ‘బంటీ ఔర్ బబ్లీ 2’కి వరుణ్ వి. శర్మ దర్శకుడు. బాలీవుడ్ యాక్షన్ హీరోలు జాన్ అబ్రహాం, టైగర్ ఫ్రాష్లు కూడా సీక్వెల్స్పై ఓ కన్నేశారు. క్రైమ్ థ్రిల్లర్ ‘ఏక్ విలన్’కు సీక్వెల్గా ‘ఏక్ విలన్ రిటర్న్స్’తో పాటు ఫ్లయిట్ హైజాకింగ్ డ్రామా ‘ఎటాక్ 1’, ‘ఎటాక్ 2’ లోనూ నటిస్తున్నారు జాన్ అబ్రహాం. మోహిత్ సూరి డైరెక్షన్లోని ‘ఏక్ విలన్ రిటర్న్స్’, లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలోని ‘ఎటాక్ 1’ ఈ ఏడాదిలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి. మరో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్ మొదలైంది ‘హీరో పంతి’ చిత్రంతో. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు టైగర్ ఫ్రాష్. ‘హీరో పంతి’కి సబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, సీక్వెల్కు అహ్మద్ ఖాన్ దర్శకుడు. ఈ సీక్వెల్ ఏప్రిల్లో విడుదల కానుంది. అలాగే 2018 హిట్ మూవీ ‘దోస్తానా’కు సీక్వెల్గా ‘దోస్తా నా 2’ రానుంది. కోలిన్ డికున్హా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఇవే కాదు.. మరికొన్ని సీక్వెల్స్ హిందీ తెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నాయి. -
3 పాత్రల్లో సల్మాన్ ఖాన్.. 10 మంది హీరోయిన్లు !
10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ గతేడాది డిసెంబర్ 27న పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను చేసే వరుస సినిమాలను ప్రకటించాడు. అందులో 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్తోపాటు 'నో ఎంట్రీ' సీక్వెల్ చేయనున్నట్లు తెలిపాడు సల్లూ భాయ్. 2005లో విడుదలైన నో ఎంట్రీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సల్మాన్తోపాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'నో ఎంట్రీ 2' సినిమాకు కూడా ఇదే తారాగణంతో అనీస్ బజ్మీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ అయితే ఈ సినిమాలో ఏకంగా 10 మంది హీరోయిన్లు యాక్ట్ చేయనున్నారట. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ ముగ్గురు మూడు పాత్రల్లో నటించనున్నారని సమాచారం. అంటే మొత్తంగా 9 పాత్రల్లో సందడి చేయనున్నారు. అందుకే ఈ 9 పాత్రలకు తగినట్లుగా 9 మంది హీరోయిన్లు అలరించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో 10వ కథానాయికకు కీలక పాత్ర పోషించనుందట. ఆ పాత్రకు పాపులర్ హీరోయిన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో డైసీ షా హీరోయిన్గా చేస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్కు సంబంధించిన ఒకరు చెప్పినట్లు సమాచారం. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు.. 'కబీ ఈద్ కబీ దివాళీ' సినిమా షూటింగ్ తర్వాత 'నో ఎంట్రీ 2' చిత్రీకరణను ప్రారంభించనున్నాడు సల్మాన్. సినిమాలో మూడు పాత్రలు ఉండటంతో సల్మాన్ అధికంగా డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్లూ భాయ్ 'టైగర్ 3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో అతిథిపాత్రలో అలరించనున్నాడు సల్మాన్ ఖాన్. ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్.. -
టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
Tiger Shroff Shares Heropanti 2 New Look: బాలీవుడ్ యాక్షన్ హీరోగా జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ పేరుపొందాడు. 'హీరోపంటి' సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ యాక్షన్ హీరో బాఘీ, బాఘీ 2, బాఘీ 3, వార్ చిత్రాలతో అలరించాడు. మరోసారి తన యాక్షన్ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్ తొలి చిత్రమైన హీరోపంటి సినిమాకు సీక్వెల్గా వస్తున్న హీరోపంటి 2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ యాక్షన సీక్వెన్స్ను రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఓ భారీ పోరాట సన్నివేశం కేసం అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు టైగర్ ష్రాఫ్. 'హీరోపంటి స్థాయిని ఈ షెడ్యూల్ రెట్టింపు చేసింది. అత్యంత ఛాలెంజింగ్ సీక్వెన్స్లలో ఒకదాని కోసం షూటింగ్ చేస్తున్నాం. దాని గ్లింప్స్ షేర్ చేసుకునేందుకు వేచి ఉండలేను.' అని టైగర్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తుండగా తారా సుతారియా హీరోయిన్గా నటిస్తోంది. అయితే టైగర్ పోస్ట్కు 'వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది బీటౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని. టైగర్ ష్రాఫ్, దిశా రిలేషన్లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు -
ఆకట్టుకుంటున్న అడవి శేష్ కేడీ ఫస్ట్ గ్లింప్స్
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు నాని 'హిట్ 2 ది సెకండ్ కేస్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. నేడు(డిసెంబర్ 17) అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ వదిలారు. ఇందులో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. -
చంద్రముఖి సీక్వెల్లో అనుష్క! ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే
Anushka Shetty: సౌత్లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా మరో సూపర్హిట్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో లారెన్స్-అనుష్క కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి : 'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు షాకింగ్.. తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో -
బాలయ్య క్లారిటీ.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా?
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన తొలి సైన్స్ ఫిక్ష్న్ మూవీ ‘ఆదిత్య 369’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మరో సారి ఈ చిత్ర స్వీక్వెల్ పై స్పందిస్తూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ‘ఆదిత్య 369’ సినిమాకు సంబంధించి బాలయ్య మీడియాతో ముచ్చటించారు. అందులో.. ఈ సినిమాకు సీక్వెల్ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు, ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశామని చెప్పారు. అయితే ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదని చెబుతూ.. తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ‘ఆదిత్య 369’ చిత్రం అప్పట్లోనే ఓ రేంజ్ గ్రాఫిక్స్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నెవ్వర్ బిఫోర్ అనేలా ‘ఆదిత్య 999’ మ్యాక్స్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీని బట్టి చూస్తే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. ఇంకో రెండేళ్లు వెయిట్ చెయ్యాలని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గతంలో బాలయ్య.. తాను నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్తో మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.