
మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. తాజాగా మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా శుక్ర వారం నేరుగా అమేజాన్లో విడుదలయింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. మొదటి భాగంలో నటించిన వెంకటేశ్ ఈ సీక్వెల్లోనూ చేసేందుకు పచ్చజెండా ఊపారట. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్ను డైరెక్ట్ చేయనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment