-
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
మలయాళ స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్స్టార్గా రాణిస్తున్న మోహన్లాల్ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లిడియన్ సంగీతం అందిస్తున్నారు.#Barroz Releasing On September 12,2024 ( Onam Release)A Film By @Mohanlal 💥 pic.twitter.com/fJsh3OwDew— Akshay 𓃵 (@Akshayk_2255) May 6, 2024 -
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. https://t.co/zHnUR7TwM4 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024 -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
'కన్నప్ప' విడుదల ఫిక్స్.. ఆ తేదీలో బిగ్ఫైట్
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్లో కీలకమైన ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్ భావిస్తోందట. ఇందులో కీ రోల్లో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కన్నప్ప చిత్రం షూటింగ్ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్తో ప్రమోషన్స్ కార్యక్రామాలను కూడా సెట్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్. ఒకేరోజులో రామ్ చరణ్, తారక్ సినిమాలు ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు కూడా విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో మోహన్లాల్, కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, నయనతార పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ బ్లాక్బస్టర్ వచ్చేసింది. 'సలార్'కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ మూవీ అద్భుతమైన హిట్గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచిందనే టాక్ వినిపించింది. ఇకపోతే ఈ సినిమాని వెంకటేశ్ రీమేక్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ అలాంటిదేం లేకుండానే తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజైపోయింది. ఇంతకీ ఇదే సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ కాంబో మళ్లీ మలయాళ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. స్టార్ హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో పడిపోకుండా అప్పుడప్పుడు స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. అలా గతేడాది మోహన్లాల్ లాయర్ పాత్రలో 'నెరు' అనే సినిమా చేశారు. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీస్తోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మనకు తెలిసిన ప్రియమణి కూడా ఓ లాయర్గా నటించడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) ఆ ఓటీటీలోనే ఇకపోతే మలయాళంలో మాత్రమే డిసెంబరు 21 ఈ సినిమా రిలీజైంది. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీరియస్గా సాగే కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు ఇష్టపడితే మాత్రం దీన్ని అస్సలు మిస్సవొద్దు. 'నెరు' కథేంటి? కళ్లు కనిపించని ఓ అమ్మాయి.. మానభంగానికి గురవుతుంది. అయితే వ్యక్తిని గుర్తించలేనప్పటికీ.. మట్టితో అతడి పోలికలున్న ఓ బొమ్మని తయారు చేస్తుంది. దీనిబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? లేదా అనేది 'నెరు' స్టోరీ. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్బాబు,శరత్కుమార్లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్లో 'మహాభారతం' సిరీస్ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
వృషభ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్!
మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్ అరైస్. రోషన్ మేకా, షనాయా కపూర్, సహారా ఎస్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై వరుణ్ మందుర్, సౌరవ్ మిశ్రా, ఏక్తా ఆర్ కపూర్, శోభాకపూర్, విశాల్ కుర్నానీ, జూసీ పరేక్ మేతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్లో తన ఫేట్ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్లాల్, శివరాజ్కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్లాల్కు రూ.8 కోట్లు, శివరాజ్కుమార్కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్లు!
మోహన్ లాల్.. పేరుకే మలయాళ హీరో గానీ దక్షిణాది ప్రేక్షకులు అందరినీ తన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో నటించి మనవాళ్లకు బాగా దగ్గరైపోయాడు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వయసు ప్రస్తుతం 63 ఏళ్లు. అయితేనేం కుర్రాళ్లే భయపడిపోయేలా రిస్కులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) మలయాళంలో స్టార్ హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మోహన్లాల్.. ప్రస్తుతం వాలిబన్, వృషభ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సూపర్స్టార్ రజినీకాంత్ 'జైలర్'లోనూ ఓ పాత్ర చేశాడు. ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. ఇలా మూవీస్ గురించి పక్కనబెడితే ప్రతిరోజూ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ఫిట్గా ఉండేలా చూసుకుంటుంటాడు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ మోహన్లాల్ కనిపించాడు. వేరే ఎవరో ఈ బరువు ఎత్తితే పెద్దగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. 63 ఏళ్ల వయసులో ఈ స్టార్ హీరో ఇలా చేయడంతో అందరూ షాకవుతున్నారు. ఓవైపు మెచ్చుకుంటూనే, మరోవైపు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
'దృశ్యం 3' ఆ రెండు భాషల్లో ఒకేసారి.. నిజమెంత?
ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: హీరోయిన్తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్) -
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
కేరళ హైకోర్టులో మోహన్ లాల్కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్లాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
జైసల్మేర్ టు మంగళూరు
మంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జైలర్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్’. శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో రజనీ, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్’ షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ను చెన్నైలో ప్లా న్ చేశారట. -
పెళ్లిలో సందడి చేసిన సౌత్, బాలీవుడ్ హీరోలు
బాలీవుడ్ నటులు మరో పెళ్లి ఫంక్షన్లో సందడి చేశారు. ఇటీవల కియారా- అద్వానీ పెళ్లిలో బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్లో జరిగిన మరో వివాహా వేడుకలోనూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులంతా ఓకే వేదికపై మెరిశారు. రాజస్థాన్లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్,అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్టార్ హీరోలు సందడి చేశారు. అక్షయ్ కుమార్, మోహన్లాల్ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోనూ అక్షయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీతో చేసిన ఈ డ్యాన్స్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కె మాధవన్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా మేనేజింగ్ ప్రెసిడెంట్. రాజస్థాన్లో పలువురు ప్రముఖులు హాజరైన ఆయన పెద్ద కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. I’ll forever remember this dance with you @Mohanlal Sir. Absolutely memorable moment 😊🙏 pic.twitter.com/GzIwcBbQ5H — Akshay Kumar (@akshaykumar) February 10, 2023 -
చరణ్ - శంకర్ సినిమాలో మోహన్ లాల్
-
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్గా సెట్స్కు వెళ్తే డల్గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్ను ఎంచుకున్నందుకు మోహన్లాల్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
గాడ్ఫాదర్ హిట్.. కానీ ఆ చిత్రం కంటే వెనుకంజలో ఉందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్కు రీమేక్గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై విడుదలైంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. (చదవండి: గాడ్ఫాదర్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే) కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్ను దాటలేకపోయింది. ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
మోహన్ లాల్కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం
స్టార్ హీరో మోహన్ లాల్కు గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మంచు లక్ష్మి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల సన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్స్టర్ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. -
త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..?
ఒకే చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోయిన్లు నటిస్తే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరే లెవల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వార్త ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న ఈమె తాజాగా బాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేశారు. షారూఖ్ఖాన్ జవాన్ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడుగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఆయనకు సోదరిగా కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా ఈ లేడీ సూపర్స్టార్ను మరో స్టార్ హీరోయిన్ త్రిషతో కలిసి ఒక చిత్రంలో నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటించిన త్రిష మంచి ప్రశంసలను అందుకుంటున్నారు. 40 ఏళ్ల వయసు టచ్ చేస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అందాలతో అభిమానులను అలరిస్తున్న ఈమె ఇప్పటికీ కథానాయకిగానే నటిస్తున్నారు. కాగా తమిళ సినిమాలో అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్న నయనతార, త్రిష ఇప్పటి వరకు ఒక చిత్రంలో కూడా కలిసి నటించలేదు. ఈ మధ్య అలాంటి సందర్భం వచ్చినా అది సెట్ కాలేదు. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంలో నటి త్రిష కూడా నటించాల్సింది. అందుకు గాను త్రిషతో చర్చలు కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తరువాత ఆ పాత్రలో సమంత నటించారు. కాగా ప్రస్తుతం త్రిష తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న రామ్ అనే చిత్రంలో మోహన్లాల్కు జంటగా నటిస్తున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో మరో నాయకితో చర్చలు జరుగుతున్నట్లు టాక్. చిత్ర తొలి భాగం క్లైమాక్స్ సన్నివేశాలు నయనతార, త్రిష కలిసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయని, రెండవ భాగంలో నయనతార పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి నయనతార అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. -
తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్లాల్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. బాహుభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకుడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథనం ఉంటుంది. లవ్ అండ్ రివేంజ్ అంశాలు కూడా ఉంటాయట. ఈ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో మోహన్లాల్ కొడుకు పాత్రలో ఓ తెలుగు హీరో నటిస్తారని టాక్. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. చదవండి: మేకోవర్ కోసం కష్టపడుతున్న భామలు.. దేనికైనా రెడీ -
ఓ కంక్లూజన్తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
11 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆడిన ఆట ఒకరి ప్రాణం తీస్తే.. '12th మ్యాన్' రివ్యూ
టైటిల్: 12th మ్యాన్ (మలయాళం) నటీనటులు: మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ తదితరులు కథ: కెఆర్. కృష్ణ కుమార్ దర్శకుడు: జీతూ జోసేఫ్ సంగీతం: అనిల్ జాన్సన్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలక్షణ నటుడు, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-జీతూ జేసేఫ్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్ సిద్ధార్థ్ (అను మోహన్) బ్యాచ్లర్ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్లర్ పార్టీ బాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్ ఫోన్స్తో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ? ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్ (మోహన్ లాల్) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్' మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. దృశ్యం సిరీస్తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ జీతూ జోసేఫ్ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ను ఎలా సస్పెన్సింగ్గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్, సస్పెన్సింగ్గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్లర్ పార్టీలో మొబైల్ ఫోన్స్ గేమ్ ఆడతారు. ఈ గేమ్లో బ్యాచ్లర్ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్కు వచ్చిన ఫోన్ కాల్తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మోహన్ లాల్ గురించి ఒక విషయం రివీల్ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్గా నారేట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్ను క్రియేట్ చేసేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదిరింది. ఎవరెలా చేశారంటే ? తాగుబోతుగా, మరొక రోల్లో మోహన్ లాల్ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్లో నటించిన వారంతా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్గా డైరెక్ట్ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్లా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే '12th మ్యాన్' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement