ఇంటి మహాలక్ష్మి.. భార్య కాళ్లు మొక్కితే తప్పేంటి? : హీరో | Vikrant Massey Reacts on Trolling for Touching Wife Sheetal Thakur Feet on Karwa Chauth | Sakshi
Sakshi News home page

Vikrant Massey: భార్య కాళ్లు మొక్కినందుకు ట్రోలింగ్‌.. హీరో ఏమన్నాడంటే?

Nov 7 2024 6:25 PM | Updated on Nov 7 2024 6:43 PM

Vikrant Massey Reacts on Trolling for Touching Wife Sheetal Thakur Feet on Karwa Chauth

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు కర్వాచౌత్‌ పండగ జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జల్లెడలో భర్త ముఖాన్ని చూస్తారు. ఉత్తరాదిన సెలబ్రిటీలందరూ ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో 12th ఫెయిల్‌ హీరో విక్రాంత్‌ మాస్సే.. భార్య, నటి షీతల్‌ ఠాకూర్‌ కాళ్లకు నమస్కరించాడు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తనను విపరీతంగా ట్రోల్‌ చేశారట!

భార్య కాళ్లు మొక్కితే..
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ఫోన్‌లో ఉన్న ఫోటోల్లో నాలుగు బాగా హైలైట్‌ అయ్యాయి. కొందరికి అవి నచ్చాయి. మరికొందరికి నచ్చకపోవడంతో నానా బూతులు తిట్టారు. ఎందుకలా తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది తప్పేమీ కాదని నా అభిప్రాయం.

అది తప్పేం కాదు
ఆమె నా ఇంటి మహాలక్ష్మి. లక్ష్మీదేవి పాదాలు తాకడం తప్పు కాదు. పదేళ్ల క్రితం నా జీవితంలో అడుగుపెట్టి లైఫ్‌ను అందంగా మార్చిందని గర్వంగా చెప్తాను. తను వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతోంది. మీరెన్ని అనుకున్నా నేను నా భార్య కాళ్లు మొక్కడం మానను అని చెప్పుకొచ్చాడు.

పర్సనల్‌ లైఫ్‌
కాగా విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. ఇకపోతే విక్రాంత్‌ మాస్సే.. ద సబర్మతి రిపోర్ట్‌ అనే సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నవంబర్‌ 15న విడుదల కానుంది.

 

 

చదవండి:  అది లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు: హీరో రాకేశ్ కామెంట్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement