సుహానీ భట్నాగర్‌ మృతిపై ఆమె తల్లి ఏం చెప్పారంటే..? | What Did Suhani Bhatnagar Mother Say About Her Death | Sakshi

సుహానీ భట్నాగర్‌ మృతిపై ఆమె తల్లి ఏం చెప్పారంటే..?

Feb 19 2024 2:02 PM | Updated on Feb 19 2024 2:59 PM

What Did Suhani Bhatnagar Mother Say About Her Death - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ దంగల్‌ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్‌ (19) మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో బబితా కుమారీగా ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో భవిష్యత్‌ ఉన్న ఆమె చిన్న వయసులోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు చింతించారు.

సుహానీ  మృతి పట్ల తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. 'సుహానీ ఈ వ్యాధితో చాల రోజులుగా ఇబ్బంది పడుతుంది. కానీ మేము ఎవరికీ చెప్పలేదు. సుహానీకి అమీర్‌ ఖాన్‌ చాలా సపోర్ట్‌గా ఉంటారు.. కానీ ఆయనకు కూడా తెలపలేదు. వాస్తవానికి మేము చర్మవ్యాధి అనుకున్నాం. అందువల్లనే చాలామంది డెర్మటాలజిస్ట్‌లను కలిశాం. ఎక్కడా ఆమెకు నయం కాలేదు.

దీంతో చివరకు ఎయిమ్స్‌లో చేర్పించాము.. అక్కడే ఈ వ్యాధి (డెర్మటోమయోసైటీస్‌) గురించి మొదటిసారి చెప్పారు. ఈ వ్యాధికి వైద్యం లేదని తెలిసింది. ఆమె శరీరం ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో సుహానీ ప్రాణాలు విడిచింది.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సుహానీ తుదిశ్వాస విడిచిందన్న వార్త తమ మనసుల్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఆమె లేని 'దంగల్‌' అసంపూర్ణం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement