నెలవారం.. జనహారం | - | Sakshi
Sakshi News home page

నెలవారం.. జనహారం

Published Thu, Feb 20 2025 8:37 AM | Last Updated on Thu, Feb 20 2025 8:32 AM

నెలవా

నెలవారం.. జనహారం

చివ్వెంల, సూర్యాపేట టౌన్‌: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో నాలుగోరోజు కూడా భక్తుల కోలాహలం నెలకొంది. బుధవారం సంప్రదాయం ప్రకారం నెలవారం కార్యక్రమాన్ని యా దవ పెద్దలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లింమంతుల స్వామిని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేల్‌, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, మల్టీ జోన్‌–2 ఐజీ సత్యనారాయణ తదితరులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం మకరతోరణం తరలింపుతో జాతర ముగియనుంది.

దేవరపెట్టె తరలింపు

పెద్దగట్టు లింగమంతుల జాతరలో నాలుగోరోజు నెలవారం తంతును నిర్వహించారు. అనంతరం చంద్రపట్నం ఎత్తిపోసి సమీపంలోని నాగులమ్మ పుట్టలో పోశారు. తర్వాత చౌడమ్మ, లింగమంతుల విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తీసుకొని మెంతనబోయిన, గొర్ల వంశీయులు సూర్యాపేట మండలం కేసారం బాటపట్టారు. దీంతో నెలవారం పండుగ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.

నేడు ముగియనున్న జాతర

నాలుగు రోజులుగా లక్షలాది భక్తుల పూజలు అందుకున్న పెద్దగట్టు లింగమంతుల జాతర గురువారంతో ముగియనుంది. సూర్యాపేట యాదవ బజార్‌ నుంచి గట్టుకు తెచ్చిన మకర తోరణం గురువారం స్వస్థలానికి చేరనుంది. మకర తోరణం తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు.

ఫ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

ఫ కేసారం చేరిన దేవరపెట్టె

ఫ నేడు జాతర ముగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
నెలవారం.. జనహారం1
1/1

నెలవారం.. జనహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement