నంద్యాల(న్యూటౌన్): నంద్యాల జిల్లాలో 2025 ఏడాదికి ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునిత తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 1,201 మందికి గాను 1,176 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,231 మందికి గాను 1,197 మంది హాజరు కాగా 34 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment