ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలి

Published Wed, Feb 19 2025 2:02 AM | Last Updated on Wed, Feb 19 2025 1:58 AM

ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలి

ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలి

కర్నూలు: జైలులో ఉన్న ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు ఖైదీలకు ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్స్‌ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేటు, పారా లీగల్‌ వలంటీర్‌ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. సత్ప్రవర్తనతో ఖైదీలు జైలు శిక్షను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, వారి ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100పై ఖైదీలకు అవగాహన కల్పించారు. జైలు అధికారులతో పాటు న్యాయవాది శివరాం కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

లీలా వెంకటశేషాద్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement