మల్లన్నకు పట్టువస్త్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం శ్రీకాళహస్తి దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ప్రధానార్చకులు సంబంధం గురుకుల్, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పట్టువస్త్రాలతో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి, వస్త్ర సమర్పణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment