ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి
● నాపరాతి పరిశ్రమ యజమానులు,
కార్మికుల ఆందోళన
నిరసన తెలుపుతున్న నాపరాతి పరిశ్రమల యజమానులు, కార్మికులు
ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద నిలిచిన నాపరాళ్ల ట్రాక్టర్లు
బేతంచెర్ల: నాపరాళ్ల పరిశ్రమకు పాత పద్ధతిలోనే రాయల్టీలు మంజూరు చేస్తూ, ప్రైవేటు చెక్పోస్టులు ఎత్తేయాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం పట్టణ ంలోని బనగానపల్లె రహదారిలో నూతనంగా ఏర్పా టు చేసిన ప్రైవేటు రాయల్టీ చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమపై రాయ ల్టీలు పెంచడమే కాకుండా ప్రైవేటుకు అప్పగించ డం ఎంత వరకు సమంజసం అన్నారు. సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా పెద్ద తరహా పరిశ్రమలా ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమలను నడు పుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో యజమానులు, కార్మికులు వెంకటేశ్వర్లు, చింతల నాగిరెడ్డి, మోహన్ రావు, నాగేశ్వరరావు, ఓబులేసు, సుబ్రమణ్యం, నాగేష్, లక్ష్మి కాంతారెడ్డి, ఉపేంద్ర, ప్రసాద్, నాగేశ్వరరెడ్డి, కృష్ణ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి


