సామాన్య ప్రజలపై భారం మోపొద్దు.. | - | Sakshi
Sakshi News home page

సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..

Published Wed, Mar 26 2025 1:21 AM | Last Updated on Wed, Mar 26 2025 1:19 AM

సామాన

సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..

ధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్‌ స్పేస్‌ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్‌రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్‌పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు.

– మహ్మద్‌ అన్సార్‌ హుస్సేన్‌, బంగారు తెలంగాణ రియల్‌ ఎస్టేట్స్‌ మార్కెటింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం..

ఎల్‌ఆర్‌ఎస్‌పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్‌ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్‌తో కొన్ని, కొందరు రూల్స్‌ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్‌ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.

– వి.రవీందర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
సామాన్య ప్రజలపై  భారం మోపొద్దు..1
1/1

సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement