పునీత్‌ మృతి.. అభిమానులు శాంతంగా ఉండాలి: బొమ్మై | Basavaraj Bommai Comments On Puneeth Rajkumar Death | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar Death: పునీత్‌ మృతి.. అభిమానులు శాంతంగా ఉండాలి: బొమ్మై

Published Fri, Oct 29 2021 4:32 PM | Last Updated on Fri, Oct 29 2021 4:52 PM

Basavaraj Bommai Comments On Puneeth Rajkumar Death - Sakshi

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్‌ శనివారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్‌ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. 
(చదవండి: తారక్‌ నా సోదరుడు: పునీత్‌ పాత వీడియో వైరల్‌)

పునీత్‌ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. పునీత్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ యూత్‌ ఐకాన్‌ అన్నారు. ఈ సమయంలో ఆయన అభిమానులు శాంతించాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. పునీత్‌ను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు. చిన్నవయసులోనే హార్ట్‌ ఎటాక్‌ రావడం చాలా అరుదు అన్నారు బొమ్మై. 
(చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు)

ఈ నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్‌ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. శనివారం తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పునీత్‌ కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటన ఆమె ఇండియా బయలుదేరారు.

చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement