ఉత్తరాదిన కుండపోత.. 28 మంది మృతి | Rain fury claims 30 lives in 4 northern states, 5 missing | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిన కుండపోత.. 28 మంది మృతి

Published Mon, Aug 12 2024 6:06 AM | Last Updated on Mon, Aug 12 2024 6:06 AM

Rain fury claims 30 lives in 4 northern states, 5 missing

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు రెండు రోజులుగా వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనల్లో 28 మంది మృతి చెందారు. హరియాణాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూకశీ్మర్‌ యంత్రాంగం అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజస్తాన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 16 మంది చనిపోయారు.

 రాష్ట్రంలోని కరౌలీ జిల్లాలో రికార్డు స్థాయిలో 38 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆదివారం వరదల్లో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబంలోని 8 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిల్చి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏడేళ్ల బాలుడు నీట మునిగి చనిపోయాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement