ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై కీలక నిర్ణయం | SC Stays Maratha Quota For Government Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Sep 9 2020 3:50 PM | Updated on Sep 9 2020 4:02 PM

SC Stays Maratha Quota For Government Jobs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2020-21లో ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో మరాఠా కోటాపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరాఠా కోటా చట్టబద్ధతను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. చదవండి : ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

2018లో ఏర్పాటు చేసిన ఈ కోటా కింద ఇప్పటివరకూ ప్రయోజనాలు పొందిన వారిపై తీర్పు ప్రభావం ఉండదని పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కాగా ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని గత ఏడాది పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement