5 నుంచి విశ్వశాంతి మహాయాగం | - | Sakshi
Sakshi News home page

5 నుంచి విశ్వశాంతి మహాయాగం

Published Mon, Apr 3 2023 1:40 AM | Last Updated on Mon, Apr 3 2023 1:40 AM

- - Sakshi

నిజామాబాద్‌ సిటీ : జిల్లా కేంద్రంలో ఈ నెల 5 నుంచి 79వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం జరుగనుంది. జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌ కలెక్టరేట్‌ బైపాస్‌రోడ్డు హనుమాన్‌ ఆలయం వెనుక ఖాళీ స్థలంలో దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 16రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగనున్నాయి. అయుత చండీ,

తిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకాలు నిర్వహించనున్నారు. యాగాలు చేయనున్నారు. దీనికిగాను ప్రత్యేకంగా వేసిన యాగశాలలో యజ్ఞకుండాలను ఏర్పాటు చేశారు.

అందరికీ ఉచితం..

యాగంలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ధ్యానం, ఉపనిషత్‌ భాష్యం, ఉదయం 11 గంటలకు మద్భగవద్గీత, భాగవతంపై స్వామిజీ అమృత భాష్యాలు ఉంటాయి. ఈ యాగంలో, పూజల్లో, హోమంలో, అభిషేక, అర్చనల్లో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు. –కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ

క్రైం కార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement