
రుద్రూర్: సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు సామాజిక సమానత్వం, భూ సంస్కరణలు, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. పోరాటాలు, ఉద్యమాలతో కార్మికుల హక్కులు సాధించడంతోపాటు ప్రజాసమస్యలను పరిష్కరించిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎ.విఠల్గౌడ్, నాయకులు నల్ల గంగాధర్, రాజు, నగేశ్, శరత్, శివరాజు, రహీం, ఇమ్రాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment