అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | indian students died in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Published Tue, Jul 9 2024 8:21 AM | Last Updated on Tue, Jul 9 2024 11:28 AM

indian students died in America

దేవరపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే సాయిసూర్య అవినాష్‌ (26) సోమవారం వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్‌, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, 2023 జనవరిలో ఆమె సోదరుడు సాయి సూర్య అవినాష్‌ ఉన్నత చదువు (ఎంఎస్‌)కు అమెరికా వెళ్లాడు. 

అక్క ఇంటి వద్ద ఉంటూ ఉన్నత చదువుకుంటున్నాడు. ఆదివారం అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలూ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లాయి. అక్కడ సాయిసూర్య అవినాష్‌ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్‌ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement