ఛాంపియన్‌ ట్రోఫీ భారత్‌ కైవసం, నాట్స్‌ సంబరాలు | Team India wins Champion Trophy NATS Celebrations | Sakshi
Sakshi News home page

ఛాంపియన్‌ ట్రోఫీ భారత్‌ కైవసం, నాట్స్‌ సంబరాలు

Published Tue, Mar 18 2025 4:07 PM | Last Updated on Tue, Mar 18 2025 4:14 PM

 Team India wins Champion Trophy  NATS Celebrations

ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్‌లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్‌ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.

మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

కాగా పాకిస్తాన్‌, దుబాయ్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్‌ వేదికగా ఇవాళ  (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌,  49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.  తొలివికెట్‌ భాగస్వామ్యం రోహిత్‌ (76) శుభ్‌మన్‌ గిల్‌ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ  కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్‌ రాహుల్‌ (34 నాటౌట్‌).. హార్దిక్‌ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్‌) బౌండరీతో భారత్‌ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement