Champions Trophy
-
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్తో మ్యాచ్ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకి పారేసి, రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్తో కలిసి ఐదో వికెట్కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇవాళ (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan).. ఓ సారి ఛాంపియన్ (1998) సౌతాఫ్రికాను (South Africa) ఢీకొట్టనుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చివరిసారిగా 2024 సెప్టెంబర్లో ఎదురెదురుపడ్డాయి. యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్లో సౌతాఫ్రికాకు శృంగభంగం జరిగింది. ఆ సిరీస్ను సౌతాఫ్రికన్లు 1-2 తేడాతో కోల్పోయారు. దీనికి ముందు ఇరు జట్లు 2023 వన్డే వరల్డ్కప్లో తలపడగా.. ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. 3 మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్, 2 మ్యాచ్ల్లో సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.గతంలో పోలిస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఫుల్ మెంబర్ టీమ్తో బరిలోకి దిగింది. అలాగని ఆఫ్ఘనిస్తాన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్లు పటిష్టమైన జట్లకు షాకిచ్చారు.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, కొర్బిన్ బాష్, రస్సీ వాన్ డర్ డస్సెన్ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలీఖిల్, నవీద్ జద్రాన్, నంగేయాలియా ఖరోటేఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగ్గా రెండు రసవత్తరంగా సాగాయి. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్కు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్లో కివీస్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్లో భారత్.. బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో భారత్కు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. -
CT 2025: వారిద్దరు బాగా ఆడారు.. అయినా క్రెడిట్ మా వారికే దక్కుతుంది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.అక్షర్ హ్యాట్రిక్ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్తోనే పిచ్ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్లోనే జరుగుతుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్ల్లో ఓడింది. మూడు మ్యాచ్లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్ల్లో వచ్చాయి. కెప్టెన్గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్కు 324 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్ల్లో సాధించగా.. రోహిత్కు 261 ఇన్నింగ్స్లు పట్టింది. -
షమీ... శుబ్... ఆరంభం
229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్మన్ గిల్ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్ పదునైన బౌలింగ్కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్... తౌహీద్, జాకీర్ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్ హృదయ్ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. మొహమ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్ రాణా 3, అక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ తన తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్జీద్ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్ (0)ను అవుట్ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్ జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్ తొలి బంతికి సింగిల్తో తౌహీద్ 114 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాహుల్... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అవుటయ్యారు. అయితే గిల్కు రాహుల్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్తో 125 బంతుల్లో గిల్ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) రాహుల్ (బి) అక్షర్ 25; సౌమ్య సర్కార్ (సి) రాహుల్ (బి) షమీ 0; నజు్మల్ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్ (సి) గిల్ (బి) షమీ 5; తౌహీద్ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) అక్షర్ 0; జాకీర్ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్జీమ్ (బి) షమీ 0; తస్కీన్ (సి) అయ్యర్ (బి) షమీ 3; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్: షమీ 10–0–53–5, హర్షిత్ రాణా 7.4–0–31–3, అక్షర్ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్ 10–0–43–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రిషాద్ (బి) తస్కీన్ 41; గిల్ (నాటౌట్) 101; కోహ్లి (సి) సర్కార్ (బి) రిషాద్ 22; అయ్యర్ (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 15; అక్షర్ (సి అండ్ బి) రిషాద్ 8; రాహుల్ (నాటౌట్) 41; ఎక్స్ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్: తస్కీన్ 9–0–36–1, ముస్తఫిజుర్ 9–0–62–1, తన్జీమ్ 8.3–0–58–0, మిరాజ్ 10–0–37–0, రిషాద్ 10–0–38–2. అక్షర్ ‘హ్యాట్రిక్’ మిస్ మ్యాచ్లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్ ఫీల్డింగ్ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను స్లిప్లో రోహిత్ వదిలేశాడు. దాంతో అక్షర్ ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. రోహిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్లో స్టంప్ చేసే అవకాశాన్ని రాహుల్ చేజార్చాడు. చివరకు బ్యాటర్ 68 పరుగులు సాధించగలిగాడు. తౌహీద్ స్కోరు 23 వద్ద కుల్దీప్ బౌలింగ్లో మిడాఫ్లో పాండ్యా సునాయాస క్యాచ్ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 12 వద్ద తన్జీద్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్ త్రో స్టంప్స్కు చాలా దూరంగా వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్లో రాహుల్ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్ సులువైన క్యాచ్ వదిలేసి మేలు చేశాడు.200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్ స్టార్క్కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్లలో 60) సవరించాడు.11000 వన్డేల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.156 వన్డేల్లో కోహ్లి క్యాచ్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా అజహరుద్దీన్ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్ (160) వీరికంటే ముందున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్ వేదిక: కరాచీ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్కు పెవిలియన్కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్లో శుభ్మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. రోహిత్ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్కు 260వ ఇన్నింగ్స్లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
CT 2025: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు చేదు ఆరంభం లభించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ చిత్తుగా ఓడింది. ఓటమి బాధలో ఉన్న పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఫకర్ జమాన్ భారత్తో జరుగబోయే కీలక మ్యాచ్కు దూరమయ్యాడు. జమాన్కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. భారత్తో మ్యాచ్కు జమాన్ దూరం కావడం పాక్కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ టోర్నీలో పాక్ సెమీస్కు చేరాలంటే భారత్తో సహా బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ల్లో విజయాలు సాధించాల్సి ఉంది.గాయపడినా బరిలోకి దిగిన జమాన్న్యూజిలాండ్తో మ్యాచ్లో ఫీల్డింగ్ సందర్భంగా గాయపడిన ఫకర్ జమాన్.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని బ్యాటింగ్కు దిగాడు. అయితే జమాన్ తన రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు జమాన్ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్వెల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జమాన్.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జమాన్.. భారత్తో మ్యాచ్కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓపెనర్ విల్ యంగ్ (107), వికెట్కీపర్ టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో డెవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారిల్ మిచెల్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రౌఫ్ 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులిచ్చాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేసింది. పాక్ ఏ దశలోనూ గెలవాలన్న ఆసక్తితో బ్యాటింగ్ చేయలేదు. బాబర్ ఆజమ్ (64) బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. సౌద్ షకీల్ (6), కెప్టెన్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఖుష్దిల్ షా (69), సల్మాన్ అఘా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు విలియమ్ ఓరూర్కీ (9-0-47-3), మిచెల్ సాంట్నర్ (10-0-663), మ్యాట్ హెన్రీ (7.2-1-25-2), బ్రేస్వెల్ (10-1-38-1) రెచ్చిపోవడంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్.. ఈ నెల 23న జరిగే తమ తదుపరి మ్యాచ్లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది -
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్లో గురువారం బంగ్లాదేశ్తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్ల ఆల్రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
PAK Vs NZ: పాక్కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను మట్టికరిపించిన న్యూజిలాండ్ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో సాంట్నర్ సారథ్యంలోని కివీస్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. యంగ్, లాథమ్ నాలుగో వికెట్కు 118 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) (సబ్) ఫహీమ్ (బి) నసీమ్ 107; కాన్వే (బి) అబ్రార్ 10; విలియమ్సన్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 1; మిచెల్ (సి) అఫ్రిది (బి) రవూఫ్ 10; లాథమ్ (నాటౌట్) 118; ఫిలిప్స్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 61; బ్రేస్వెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–68–0, నసీమ్ 10–0–63–2, అబ్రార్ 10– 0–47–1, రవూఫ్ 10–0–83–2, ఖుష్దిల్ 7–0– 40–0, సల్మాన్ 3–0–15–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షకీల్ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్ ఆజమ్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 64; రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) రూర్కే 3; ఫఖర్ (బి) బ్రేస్వెల్ 24; సల్మాన్ (సి) బ్రేస్వెల్ (బి) స్మిత్ 42; తాహిర్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 1; ఖుష్దిల్ (సి) బ్రేస్వెల్ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; నసీమ్ (బి) హెన్రీ 13; రవూఫ్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 19; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. బౌలింగ్: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్వెల్ 10–1–38–1, ఫిలిప్స్ 9–0–63–0, సాంట్నర్ 10–0–66–3, స్మిత్ 2–0–20–1. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్పై న్యూజిలాండ్దే పైచేయి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్లను పాక్లో ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి.టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని కరాచీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పాక్పై న్యూజిలాండ్కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో తలపడగా.. మూడుసార్లు న్యూజిలాండే విజేతగా నిలిచింది.కెన్యా వేదికగా జరిగిన టోర్నీ రెండో ఎడిషన్లో (2000) పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 49 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరఫున సయీద్ అన్వర్ (104) సెంచరీ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వూస్ (87) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెమీస్లో పాక్పై విజయం సాధించిన న్యూజిలాండ్.. ఆతర్వాత ఫైనల్లో భారత్పై కూడా గెలుపొంది తమ తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆతర్వాత భారత్లో జరిగిన 2006 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్దే పైచేయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాక్ 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున స్కాట్ స్టైరిస్ (86), పాక్ తరఫున మొహమ్మద్ యూసఫ్ (71) టాప్ స్కోరర్లుగా నిలిచారు.సౌతాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మూడో సారి తలపడ్డాయి. ముచ్చటగా మూడోసారి కూడా న్యూజిలాండే విజేతగా నిలిచింది. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్లో పాక్పై గెలుపుతో ఫైనల్కు చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై ఘనమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ మరో విజయం సాధిస్తుందో లేక తొలి ఓటమిని మూటగట్టుకుంటుదో వేచి చూడాలి. ఛాంపియన్స ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్పాకిస్తాన్ జట్టు..మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, సౌద్ షకీల్ -
Champions Trophy 2025: ఎట్టకేలకు పాక్లో భారత జెండా ఎగిరింది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది. భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు. The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025. Via - @imransiddique89 #ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధమైన జట్లు
-
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్లూ దుబాయ్లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్లో ప్రధానం కాగా...బౌలింగ్లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
CT 2025: రోహిత్ సేన కొడుతుందా!.. స్పిన్నర్ల ప్రభావం కీలకం
సాక్షి క్రీడా విభాగం: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు అజేయంగా తమ జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా పది విజయాలతో ఆల్టైమ్ గ్రేట్ వన్డే టీమ్లలో ఒకటిగా కనిపించింది. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడినా... ఇప్పుడు దాదాపు పదిహేను నెలల తర్వాత ఇదే ఫార్మాట్లో శిఖరాన నిలిచే అవకాశం మళ్లీ జట్టు ముందుకు వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ కప్ టీమ్లో ఉన్న ఆటగాళ్లే దాదాపుగా ఈ మెగా టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు. కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ విజయం వారికి ప్రత్యేకంగా మారవచ్చు. ఫామ్పరంగా చూసినా ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ సేననే బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి మన జట్టు టైటిల్ కొడుతుందా అనేది ఆసక్తికరం.2017లో రన్నరప్గా నిలిచిన జట్టులోని ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుత టీమ్లో భాగంగా ఉన్నారు. యూఏఈలో 2021 టి20 వరల్డ్ కప్లో సెమీస్ చేరడంలో విఫలమైన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఐసీసీ టోర్నీలో బరిలో నిలిచింది. బ్యాటింగ్లో సత్తా ప్రదర్శిస్తే... టీమిండియా వన్డే బ్యాటింగ్ కూర్పు చాలా కాలంగా అనూహ్య మార్పులు లేకుండా నిలకడగా ఉంది. అదే జట్టుకు ప్రధాన బలం కూడా. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్లతో టాప్–5 విషయంలో ఎలాంటి సమస్య లేదు. 2023 నుంచి చూస్తే వీరంతా కనీసం 1000 పరుగులు సాధించారు. ఇటీవల ఇంగ్లండ్తో సిరీస్లో రాణించడం కూడా సానుకూలాంశం. గిల్, అయ్యర్ చెలరేగిపోతుండగా ఫామ్ను అందుకున్న రోహిత్ సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లి, రాహుల్ కూడా ఆకట్టుకున్నారు. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల బ్యాటింగ్ మనకు ఎప్పుడూ అదనపు ప్రయోజనాన్ని అందించింది. వీరికి ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా జత కలిశాడు. ఇటీవలి కాలంలో బ్యాటింగ్లో అక్షర్ అంచనాలకు మించి మెరుగై ఏ స్థానంలోనైనా ఆడి ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ విఫలమైతే పంత్ రూపంలో తగిన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి బెంగ లేదు. పేసర్లు రాణిస్తారా... జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడం నిస్సందేహంగా జట్టుకు పెద్ద దెబ్బ. రవిశాస్త్రి చెప్పినట్లు అతని గైర్హాజరు జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అయితే అందుబాటులో ఉన్నవారిలో షమీ ఆ స్థాయి బౌలర్. కానీ గాయం నుంచి కోలుకొని వచ్చిన అతను ఎంత వరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడనేది చూడాలి. పెద్దగా అనుభవం లేని అర్‡్షదీప్, హర్షిత్ రాణా ఒత్తిడిని తట్టుకొని షమీకి అండగా నిలవడం అవసరం. హార్దిక్ పాండ్యా సత్తా చాటగలడు కాబట్టి మూడో పేసర్ బెంగ లేదు. ముగ్గురు ఖాయం! చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపుపై ఆశలు రేపుతున్న కీలక విభాగం స్పిన్ బౌలింగే. మన మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతుండటం కచ్చితంగా సానుకూలాంశం. అందుకే టీమ్ ఐదుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. ఫిబ్రవరి 9 వరకు ఐఎల్టి20 మ్యాచ్ల నిర్వహణలో పిచ్లన్నీ నెమ్మదిగా మారిపోయాయి. 11 రోజుల వ్యవధిలో జీవం ఉన్న పిచ్లను తయారు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇవన్నీ స్పిన్కు అనుకూలించవచ్చు.బౌలింగ్లో వైవిధ్యం ఉన్న మన స్పిన్నర్లు ఫామ్లో కూడా ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టంగా మారిపోనుంది. ఆరేళ్లుగా ఇక్కడ పెద్ద జట్లేవీ వన్డేలు ఆడలేదు. అయితే 2018 నుంచి ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 213 మాత్రమే. తక్కువ స్కోరింగ్ల మ్యాచ్లలో స్పిన్నర్లు ప్రభావం చూపడం ఖాయం. తుది జట్టులో కనీసం ముగ్గురిని జట్టు ఎంచుకుంటుంది. 2 చాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు (2002, 2013)లలో విజేతగా నిలిచిన భారత్ మరో రెండుసార్లు (2000, 2017)లో ఫైనల్లో ఓడింది. 9 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత్ 9 వన్డేలే ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. వీటిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లపై సిరీస్ నెగ్గగా... శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. -
CT 2025: ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన టీమిండియా జెర్సీల ఆవిష్కరణ (ఫొటోలు)
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు మరో పెద్ద వికెట్ పడింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుడికాలి పాదంపై గాయమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై ముందు నుంచి అనుమానంగా ఉండింది. ప్రస్తుతం అదే నిజమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కానున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫెర్గూసన్కు రీప్లేస్మెంట్గా కైల్ జేమీసన్ను (Kyle Jamieson) ఎంపిక చేశారు న్యూజిలాండ్ సెలెక్టర్లు. గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన 11వ ప్లేయర్ ఫెర్గూసన్.ఇదివరకే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, అన్రిచ్ నోర్జే, గెరాల్డ్ కొయెట్జీ, సైమ్ అయూబ్, జేకబ్ బేతెల్, అల్లా ఘజన్ఫర్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. స్టార్ ఆటగాళ్లు.. ముఖ్యంగా పేసర్లు దూరం కావడంతో మెగా టోర్నీ కళ తప్పే అవకాశముంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం బారిన పడిన రెండో ఆటగాడు ఫెర్గూసన్. కొద్ది రోజుల ముందు పేసర్ బెన్ సియర్స్ కూడా గాయం బారిన పడ్డాడు. అతని స్థానంలో జేకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. తాజాగా ఫెర్గూసన్ కూడా గాయపడటంతో న్యూజిలాండ్ పేస్ విభాగం బలహీనపడినట్లు కనిపిస్తుంది. ఆ జట్టు పేస్ విభాగంలో మ్యాట్ హెన్నీ ఒక్కడే అనుభవజ్ఞుడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ పాకిస్తాన్తో తలపడనుంది. కరాచీలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న ఆడనుంది. తొలి మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న భారత్.. న్యూజిలాండ్తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ షెడ్యూల్..ఫిబ్రవరి 19న పాకిస్తాన్తోఫిబ్రవరి 24న బంగ్లాదేశ్తోమార్చి 2న టీమిండియాతోఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్ -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బౌలింగ్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తండ్రి హఠాన్మరణం కారణంగా భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మోర్కెల్.. టీమిండియాతో కలిసి ఫిబ్రవరి 15న భారత్ నుంచి దుబాయ్కు వచ్చాడు. ఫిబ్రవరి 16న తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న మోర్నీ.. ఆతర్వాత తండ్రి మరణవార్త విని సౌతాఫ్రికాకు బయల్దేరాడు. మోర్నీ తిరిగి భారత బృందంతో ఎప్పుడు కలుస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. మోర్నీ లేని లోటు టీమిండియా పేస్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్లో భారత పేస్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. మోర్నీ అండర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో యువ పేసర్ హర్షిత్ రాణా సత్తా చాటాడు. మోర్నీ ఆథ్వర్యంలోనే హర్షిత్ రాటుదేలాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికైనా మోర్నీ అందుబాటులోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. దీని తర్వాత భారత్.. మార్చి 2న న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
Champions Trophy 2025: పాక్లో ఎగరని భారత జెండా
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్కు చేరుకున్నాయి. 1996 వరల్డ్కప్ తర్వాత పాక్లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది. -
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
Champions Trophy 2025: రాణా మెరుపులు మెరిపిస్తాడా?
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది. సిరాజ్ను మినహాయించడం ఆశ్చర్యకరంసిరాజ్ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.ఇంగ్లాండ్ సిరీస్లో రాణించిన రాణా ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం. -
ఐదుగురు స్పిన్నర్లా?
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండటంపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎలా చూసినా ఈ సంఖ్య ఎక్కువేనని అతను అభిప్రాయ పడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో... టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘దుబాయ్లో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్తో పాటు పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు దక్కొచ్చు. వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే... ఒక పేస్ బౌలర్ను తగ్గించి పాండ్యానే రెండో పేసర్గా పరిగణించాల్సి ఉంటుంది. అదనపు పేసర్ను బరిలోకి దింపాలంటే ఒక స్పిన్నర్ను తగ్గించుకోక తప్పదు’ అని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్... టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టులో సూపర్ సెలబ్రిటీ విధానాన్ని తగ్గించాలి. దాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. జట్టులో ఉండేది ఆటగాళ్లే... సూపర్ స్టార్లు కాదు. కెరీర్లో ఎంతో సాధించిన కోహ్లి, రోహిత్ ఇప్పుడు మరో సెంచరీ కొట్టినా అదేమీ పెద్ద ఘనత కాదు, మీ వ్యక్తిగత రికార్డు కూడా కాదు. అంతా జట్టు కోసమే’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ప్లేయర్లు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని అశ్విన్ సూచించాడు. జాతీయ జట్టు తరఫున 106 టెస్టులాడి 537 వికెట్లు పడగొట్టిన అశ్విన్... 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 65 టి20ల్లో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మూడో టెస్టు అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
లంక చేతిలో ఘోర పరాజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు అవమానం
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆసీస్ 0-2 తేడాతో చిత్తుగా ఓడింది. ఇవాళ (ఫిబ్రవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 174 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ను ఈ పరాజయం మరింత కృంగదీసింది.మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) వికెట్ కోల్పోయింది. అయితే నిషాన్ మధుష్క (51), కుసాల్ మెండిస్ (101) రెండో వికెట్కు 98 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్కు జీవం పోశారు. మధుష్క ఔటైన అనంతరం కుసాల్ మెండిస్.. కెప్టెన్ అసలంక (78 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. మెండిస్, అసలంక నాలుగో వికెట్కు 94 పరుగులు జోడించి తమ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఇన్నింగ్స్ చివర్లో అసలంకతో కలిసి జనిత్ లియనాగే (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలుత ఆసీస్ను అశిత ఫెర్నాండో (4-0-23-3) ఇబ్బంది పెట్టాడు. ఆతర్వాత దునిత్ వెల్లలగే (7.2-0-35-4), వనిందు హసరంగ (7-2-23-3) ఆసీస్ భరతం పట్టారు. లంక బౌలర్ల ధాటికి ఆసీస్ 100 పరుగులు చేయడం కూడా అసాధ్యమనిపించింది. మొత్తానికి ముక్కీమూలిగి ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (22), ట్రవిస్ హెడ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ఆసీస్ తొలి వన్డేలోనూ ఇదే రీతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ అసలంక సెంచరీ చేయడంతో అతికష్టం మీద 214 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇంతటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆసీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహీశ్ తీక్షణ (9.5-1-40-4), అశిత ఫెర్నాండో (5-1-23-2), వెల్లలగే (7-0-33-2), హసరంగ (6-0-47-1), అసలంక (2-0-5-1) ఆసీస్ను దెబ్బకొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే, ఆసీస్.. శ్రీలంక నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా పాకిస్తాన్కు బయల్దేరుతుంది. ఛాంపియన్స్ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
కుటుంబసభ్యులు లేకుండానే...
న్యూఢిల్లీ: పాక్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు తమవెంట కుటుంబసభ్యులను తీసుకెళ్లడం లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే కొత్త పాలసీని తీసుకొచి్చన సంగతి తెలిసిందే. దీనిప్రకారం ఎన్నో ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో స్టార్లు, దిగ్గజ హోదా పక్కనబెట్టి కెపె్టన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ రాష్ట్ర జట్లకు ఆడిన సంగతి తెలిసిందే! అలాగే ఇప్పుడు తాజాగా విదేశీ ప్రయాణం విషయంలోనూ ఈ పాలసీ అమలవుతోంది. దుబాయ్లో ఈ నెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్లతో భారత్ లీగ్ దశ మ్యాచ్ల్ని ఆడనుంది. నాకౌట్ దశ, ఫైనల్స్ కలిపినా మార్చి 9న టోర్నీ ముగుస్తుంది. అంటే మూడు వారాల్లోపే ముగియనున్న ఈ టోర్నీ కోసం కొత్త నియమావళి ప్రకారం భార్యబిడ్డలను అనుమతించరు. కొత్త పాలసీ ప్రకారం ఏదైనా విదేశీ పర్యటన 45 రోజులు, అంతకుమించి జరిగితేనే గరిష్టంగా రెండు వారాల పాటు కుటుంబసభ్యుల్ని క్రికెటర్ల వెంట వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ 8 దేశాలు ఆడే చాంపియన్స్ ట్రోఫీ కనీసం నెల రోజుల పాటైనా జరగకపోవడంతో దుబాయ్ స్టేడియంలో ఆట, ఇది పూర్తయ్యాక భార్యబిడ్డలతో సరదాగా దుబాయ్ వీధుల్లో సయ్యాట ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. అలాగే స్టార్ ఆటగాళ్ల వెంట పరిమిత సంఖ్యలో అనుమతించే వ్యక్తిగత సిబ్బందికి జట్టు, కోచింగ్ సిబ్బంది బస చేసిన హోటల్లో కాకుండా వేరే హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారు. గతంలో వ్యక్తిగత ట్రెయినర్, మేనేజర్, షెఫ్లకు కోచింగ్ బృందంలో కలిపి వసతి ఏర్పాటు చేసేవారు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్ఫన్ నాలుగు నెలలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ (AM Ghazanfar) త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) దూరమయ్యాడు. 18 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్ఫన్ నాలుగు నెలలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ అయిన ఖరోటే ముందుగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రావెలింగ్ రిజార్వ్గా ఉన్నాడు. 20 ఏళ్ల ఖరోటే ఆఫ్ఘనిస్తాన్ తరఫున 7 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ విషయానికొస్తే.. ఈ మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 11 వన్డేల్లో 21 వికెట్లు.. ఓ టెస్ట్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ లేని లోటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుంది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లు..ఫిబ్రవరి 21న సౌతాఫ్రికాతోఫిబ్రవరి 26న ఇంగ్లండ్తోఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ముందు ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మరో వికెట్ పడింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వ్యక్తిగత కారణాల చేత మెగా టోర్నీ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. స్టార్క్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకతో జరిగే రెండు వన్డేల్లో కూడా పాల్గొనడని బెయిలీ ప్రకటించాడు. స్టార్క్కు ముందు గాయాల కారణంగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh), కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), పేసర్ జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ మధ్యలో మరో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టార్క్తో కలుపుకుని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో మొత్తం ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్,తన్వీర్ సంఘా, సీన్ అబాట్లతో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కూపర్ కన్నోలీ ట్రావెలింగ్ రిజర్వ్గా ఉంటాడని పేర్కొంది. మార్పులు చేర్పుల తర్వాత ప్రకటించిన 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథ్యం వహిస్తాడు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇవాళ (ఫిబ్రవరి 12) ఆ జట్టు లంకతో వన్డే మ్యాచ్ ఆడుతుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ వన్డే జరుగుతుంది. రెండో వన్డే ఫిబ్రవరి 14న జరుగుతుంది. ప్రస్తుత లంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్ట్లు కూడా ఆడింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆ జట్టే జయభేరి మోగించింది. రెండు వన్డేల సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా పాకిస్తాన్కు (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) బయల్దేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]శ్రీలంకతో రెండు వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. -
ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా
జొహన్నెస్బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్లో మొదలుకానుంది. జూన్లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్ఏటి20’ టోర్నీకి కమిషనర్గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతామని చెప్పాడు. గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. -
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం... జట్టులోకి హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ ఈవెంట్కు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ అనంతరం అతని ఫిట్నెస్పై వైద్యులు బీసీసీఐకి నివేదిక అందించారు. ఇందులో గాయం తీవ్రతపై వివరాలు లేకున్నా... ఇప్పుడు బౌలింగ్ చేసే స్థితిలో లేడని మాత్రం స్పష్టమైంది. బుమ్రా ఆడటంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నా... ఇప్పుడు మాత్రమే బోర్డు దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ టీమ్లోకి తీసుకున్నారు. వరుణ్ కోసం యశస్వి జైస్వాల్ను టీమ్ నుంచి తప్పించారు. స్థిరమైన ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉండటంతో జైస్వాల్పై వేటు వేయాల్సి వచి్చంది. అయితే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్లుగా జైస్వాల్, సిరాజ్, శివమ్ దూబేలను ఎంపిక చేశారు. వీరు అవసరమైతేనే దుబాయ్కు ప్రయాణిస్తారు. -
బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్నెస్ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇటీవలే స్కానింగ్ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) టీమ్లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. -
రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్లోని పిచ్లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champion Trophy-2025) ముందు ఇంగ్లండ్కు (England) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ (Jacob Bethell) గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధృవీకరించాడు. బేతెల్ లాంటి ప్రామిసింగ్ ఆల్రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం దురదృష్టకరమని బట్లర్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బేతెల్ సేవలు కోల్పోనుండటంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ బేతెల్కు కవర్గా టామ్ బాంటన్ను ఎంపిక చేసింది.21 ఏళ్ల బేతెల్ ఇటీవలే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. భారత్తో జరిగిన టీ20 సిరీస్లో పెద్దగా రాణించలేని బేతెల్.. నాగ్పూర్ వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సహా వికెట్ తీసుకున్నాడు. గాయం కారణంగా బేతెల్ భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆడలేదు.తొలి మ్యాచ్లో ఆసీస్ను ఢీకొట్టనున్న ఇంగ్లండ్ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడనుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలువుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉండగా.. భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్, పాక్ల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది.రెండో వన్డేలోనూ భారత్దే విజయంమూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్ వేదికగా నిన్న జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలి వన్డేలోనూ నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా భారత్ 4-1 తేడాతో గెలుపొందింది.రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ద సెంచరీలతో రాణించారు. సాల్ట్ 26, హ్యారీ బ్రూక్ 31, బట్లర్ 34, లివింగ్స్టోన్ 41, ఆదిల్ రషీద్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.సెంచరీతో చెలరేగిన రోహిత్ఛేదనలో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లి (5) మరోసారి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10 పరుగులకు ఔటయ్యారు. రవీంద్ర జడేజా (11 నాటౌట్) సాయంతో అక్షర్ భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్లో జరుగనుంది. -
రోహిత్ శర్మకు భారీ షాక్!.. వన్డే కెప్టెన్సీ కూడా అవుట్?
-
బుమ్రా ఫిట్గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్నెస్పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్నెస్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు వరుస ఎదురుదెబ్బలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ ముందువరసలో ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.తొలి టెస్ట్లో ఆసీస్ భారీ విజయంతొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సరికొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. ఫొటోలు వైరల్
-
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్లో తొలి మ్యాచ్కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్తో తలపడుతుంది.న్యూజిలాండ్తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్తో మ్యాచ్కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు అతి భారీ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy) ముందు ఆస్ట్రేలియాకు (Australia) అతి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కమిన్స్ కాలి మడమ సమస్యతో బాధపడుతున్నట్లు మెక్డొనాల్డ్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమైన పక్షంలో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ రేసులో ఉంటారని మెక్డొనాల్డ్ అన్నాడు. కమిన్స్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ పాల్గొనడం లేదు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనందున లంక సిరీస్కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ జట్టులో లేని సభ్యులు లంకతో వన్డే సిరీస్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ బృందంలో కమిన్స్ లేడు. మరోవైపు మెక్డొనాల్డ్ మరో ఆసీస్ పేసర్ గాయంపై కూడా కీలక అప్డేట్ ఇచ్చాడు. గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే వైదొలిగిన జోష్ హాజిల్వుడ్ ఫిట్నెస్ సాధించేందుకు పోరాడుతున్నాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజిల్వుడ్ కూడా అనుమానమే అని మెక్డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కొద్ది రోజుల ముందే ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు కమిన్స్, హాజిల్వుడ్ కూడా మెగా టోర్నీకి దూరమైతే ఆ జట్టు విజయావకాశాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. మార్ష్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. బ్యూ వెబ్స్టర్ మార్ష్కు బదులు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో యాడ్ అవుతాడని కోచ్ మెక్డొనాల్డ్ అన్నాడు. పై ముగ్గురితో పాటు ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న మరికొందరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆల్రౌండర్లు మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారని సమాచారం.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు వన్డేల సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో తొలుత టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి టెస్ట్ ముగిసింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో ఆసీస్కు స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు (కమిన్స్ గైర్హాజరీలో). తొలి టెస్ట్లో స్మిత్ కెప్టెన్సీలో సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ (141) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ తన అరంగేట్రం టెస్ట్లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఆసీస్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్ ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
వరుణ్ చక్రవర్తికి బంపరాఫర్..?
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) బంపరాఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో (Team India) వరుణ్కు చోటు కల్పించనున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో వరుణ్కు చోటు దక్కలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ ముగిసిన టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వరుణ్కు ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ ఖరారైందని తెలుస్తుంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ముగిసినా వరుణ్ భారత వన్డే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.వరుణ్ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి నాగ్పూర్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.Varun Chakaravarthy training with Indian ODI Team in Nagpur 🚨- He's not officially part of the squad yet.📸: Sandipan Banerjee#INDvENG #ChampionsTrophy #Nagpur pic.twitter.com/vqfyQJtdLe— OneCricket (@OneCricketApp) February 4, 2025కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో చెలరేగిన నేపథ్యంలో వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల రిటైరైన భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సిఫార్సు చేశాడు. ఒకవేళ వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కు యాడ్ చేస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్లో వరుణ్ 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో వరుణ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో వరుణ్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడిపోయారు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ (టీ20 సిరీస్లో) ఇరగదీశాడు. ఆ సిరీస్లో వరుణ్ 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లపై వరుణ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా భాగమన్న విషయం తెలిసిందే.వన్డేల్లో ఇదే జోరు కొనసాగించగలడా..?ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ విషయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతుంది. టీ20 ఫార్మాట్లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వరుణ్ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదో వేచి చూడాలి. వరుణ్ భారత్ తరఫున 18 టీ20ల్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్ల్లోనే 9 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీశాడు. వరుణ్కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. వరుణ్ గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్స్టోన్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ప్రకటన.. ముగ్గురిపై వేటు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు. పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ సిరీస్లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది. -
Champions Trophy 2025: మా జెర్సీలపై పాక్ పేరు వద్దు.. మా కెప్టెన్ మీ దేశానికి రాడు..!
ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతున్న వేల మరో వివాదం తెరపైకి వచ్చింది. మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ భారత క్రికెటర్ల జెర్సీలపై తమ దేశం పేరును ముద్రించింది. ఇందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్ పేరును తమ దేశ క్రికెటర్ల జెర్సీలపై ఉండేందుకు ఒప్పుకోమని భీష్మించుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. బీసీసీఐ అభ్యంతరాన్ని పీసీబీ కూడా అంతే గట్టిగా వ్యతిరేకిస్తుంది. బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను లాగేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగే సమయంలో ఆ టోర్నీ పేరుతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా ఆయా జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని పీసీబీ ఆరోపిస్తుంది. వేదిక విషయంలో నానా యాగీ చేసిన బీసీసీఐ ఇప్పుడు జెర్సీల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని పాక్ మాజీలు మండిపడుతున్నారు.జెర్సీల వివాదం నడుస్తుండగానే బీసీసీఐ తాజాగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఫోటో షూట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాక్కు వెళ్లబోడని స్పష్టం చేసింది. ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్లను వేరే వేదికకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. తాజా వివాదాల నేపథ్యంలో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టోర్నీ జరిగినా భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ పెడుతున్న కండీషన్లకు పీసీబీ ఒప్పుకునేలా కనిపించడం లేదు. వేదిక విషయంలో తలోగ్గామని బీసీసీఐ ప్రతి విషయాన్ని రద్దాంతం చేస్తుందని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జెర్సీల విషయం అటుంచితే ఫోటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాల్గొనేందుకు అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐసీసీ పీఠంపై బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే. షా జోక్యంతో ఈ వివాదాలన్నిటికీ పుల్స్టాప్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీని సజావుగా సాగేలా చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి హోల్ అండ్ సోల్గా పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం తమ జట్టును పాక్ పంపబోమని తేల్చి చెప్పింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత పీసీబీ భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించుకునేందుకు ఒప్పుకుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఫైనల్కు చేరినా దుబాయ్లోనే ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్తో) ఆడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
చాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో మరోసారి సంబరాలు
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు. వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా. ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు. తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. -
‘ఈడెన్’లో టీమిండియా సాధన
కోల్కతా: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్లో తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. గాయం కారణంగా ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రాక్టీస్లో ఆకట్టుకున్నాడు. మూడు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్లో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, శుబ్మన్ గిల్, హార్దిక్పాండ్యా, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు ప్రాక్టీస్ చేశారు. -
‘చాంపియన్స్’ పోరుకు సిద్ధం
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్లో ఫైనల్ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య, సంచలనాలు లేకుండా చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్నెస్పై కాస్త సందేహాలు ఉన్నా...అతడిని టీమ్లోకి తీసుకోగా, వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమీ కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా... ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్ తొలిసారి వన్డే టీమ్లోకి వచ్చాడు. ఓవరాల్గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతోంది. ముంబై: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెపె్టన్సీపై చర్చ జరిగినా...2023 వన్డే వరల్డ్కప్లో జట్టును ఫైనల్ చేర్చిన అతని నాయకత్వంపై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు ‘సంధి దశ’లో ఉందని వినిపించినా...వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్కప్లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్లోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుబ్మన్ గిల్ను వైస్ కెపె్టన్గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లతో భారత్ తలపడుతుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. రెండు వన్డేలకు హర్షిత్... ఫిట్నెస్పై సందేహాలు ఉన్నా...ప్ర«దాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా టీమ్లో స్థానం లభించింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా...జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తుండటంతో ఫిట్నెస్పై స్పష్టత వచి్చంది. ఫిట్గా మారి ఇంగ్లండ్తో టి20 సిరీస్కు ఎంపికైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీమ్లోనూ స్థానం దక్కింది. టీమిండియా తరఫున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి...టి20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తొలిసారి వన్డే టీమ్లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ టాప్–5లో ఉంటారు. నలుగురు ఆల్రౌండర్లు... సెలక్టర్లు ఒక ప్రధాన బౌలర్ను తగ్గించి మరీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా...ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్లకు స్థానం లభించింది. ఈ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కాగా, పాండ్యాతో కలిపి భారత టాప్–6 రైట్ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో ముగ్గురే ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రధమ ప్రాధాన్యత ఇచి్చనట్లుగా భావించవచ్చు. వన్డేల్లో ఎప్పుడూ రెగ్యులర్గా చోటు దక్కించుకోకపోయినా, పెద్దగా ప్రభావం చూపని రిషభ్ పంత్ను రెండో కీపర్గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే... సంజు సామ్సన్పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్తో వివాదం కారణంగా విజయ్హజారే ట్రోఫీకి సామ్సన్ దూరం కావడం కూడా సెలక్షన్పై ప్రభావం చూపించి ఉండవచ్చు. ‘బోర్డు కార్యదర్శితో మాట్లాడాలి’ క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల విషయంలో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై మరికొంత సడలింపును వారు కోరుతున్నారు. ఇదే మాట మీడియా సమావేశంలో రోహిత్ నోటినుంచి వచి్చంది. ఇది నేరుగా రోహిత్ మీడియాతో చెప్పకపోయినా... అగార్కర్కు చెబుతుండటం అందరికీ వినిపించింది. ‘కొత్త నిబంధనలపై మరింత స్పష్టత కావాలి.ఈ సమావేశం తర్వాత నేను బోర్డు కార్యదర్శితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్నే అడుగుతున్నారు’ అని అగార్కర్తో రోహిత్ అన్నాడు. మరో వైపు తనకు, హెడ్ కోచ్ గంభీర్కు మధ్య పరస్పర నమ్మకం ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగడానికి ముందే తమ మధ్య వ్యూహాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని...ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అన్నీ తానే చూసుకుంటానని కెపె్టన్ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు స్పష్టమైన విభజన రేఖ ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
చాంపియన్స్ ట్రోఫీకి నోర్జే దూరం
జొహన్నెస్బర్గ్: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న రెండు రోజులకే పేసర్ ఆన్రిక్ నోర్జే కథ మారింది! వెన్ను నొప్పి గాయంతో అతను ఈ టోరీ్నకి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. సోమవారం ప్రకటించిన టీమ్లో నోర్జే పేరు కూడా ఉంది. ఫిట్గా ఉన్నాడని సెలక్టర్లు నోర్జేను ఎంపిక చేయగా... స్కానింగ్తో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. టోర్నీ ప్రారంభమయ్యే లోగా అతను కోలుకునే అవకాశం లేదని తేలింది. గత ఆరు ఐసీసీ టోర్నీల్లో మూడు సార్లు అతను గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్లతో పాటు ఇప్పుడు మరో వన్డే టోర్నీకి దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో జరిగిన మూడు టి20 వరల్డ్ కప్లు (2021, 2022, 2024)లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. నోర్జే స్థానంలో మరో ఆటగాడి పేరును దక్షిణాఫ్రికా ఇంకా ప్రకటించలేదు. -
భారత్ వర్సెస్ పాక్.. నెట్ఫ్లిక్స్లో దాయాది జట్ల డ్రామా
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ, ఉత్సాహమే వేరు. ఈ రెండు దాయాది జట్ల మధ్య ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప మ్యాచ్లు జరిగాయి. టెస్టులైనా, వన్డేలైనా, టి20లైనా ప్రతీ పోరు ప్రత్యేకమే. మైదానంలో ఇరు జట్ల వైరానికి సంబంధించి ఎన్నో ఘటనలను అభిమానులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఆసక్తికర ఘటనలు, వ్యాఖ్యలు, వివాదాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ద గ్రేటెస్ట్ రైవల్రీ’ పేరుతో సిద్ధం చేసిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న ప్రసారం కానుంది. గ్రే మ్యాటర్ ఎంటర్నైట్మెంట్ నిర్మించిన ఈ డ్రామాకు చంద్రదేవ్ భగత్, స్టివార్ట్ సగ్ దర్శకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్, సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్, వీరేంద్ర సెహా్వగ్, షోయబ్ అక్తర్, రవిచంద్రన్ అశి్వన్ ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి. ‘రెండు దేశాల మధ్య మ్యాచ్లలో ఉండే భావోద్వేగాలు, తీవ్రతవంటివి ఇందులో చూపించాం. మీ అంచనాలకు తగ్గకుండా ఉత్కంఠభరితంగా దీనిని రూపొందించాం. మైదానంలో ఆట మాత్రమే కాదు. మైదానం బయట ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూడవచ్చు’ అని రూపకర్తలు పేర్కొన్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్కప్లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికా రన్నరప్గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్ను చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్ను మట్టికరిపించింది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్లోనే ఉన్నాడు. వీహెచ్టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్లో లేని శుభ్మన్ గిల్తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్ల్లో నాటౌట్గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. వీహెచ్టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్టీ సింగిల్ ఎడిషన్లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ను కాదని ఘజన్ఫర్ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్గా వ్యవహరించాడు. విండీస్తో సిరీస్ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్తో జరిగిన మూడు మ్యాచ్లో వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఆతిథ్య పాకిస్తాన్తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
అరివీర భయంకరమైన ఫామ్లో అయ్యర్.. టీమిండియాలో చోటు పక్కా..!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దేశవాలీ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్ ఆడాడు. శ్రేయస్ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్రేట్తో 452 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్రేట్తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్టీలో శ్రేయస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ యావరేజ్ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్రేట్ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్ ఇంగ్లండ్ సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు తిరుగే ఉండదు. శ్రేయస్ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ తన చివరి టీ20ను 2023 డిసెంబర్లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శ్రేయస్కు చివరి టీ20. టెస్ట్ల విషయానికొస్తే..శ్రేయస్ టెస్ట్ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్లో తొలి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్తో) ఆడిన శ్రేయస్.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (ఇంగ్లండ్) ఆడాడు. 33 ఏళ్ల శ్రేయస్ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్తో పరిమత ఓవర్ల సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్ రాకతో మిడిలార్డర్లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్లో మొదటి నుంచి శ్రేయస్కు తిరుగులేదు. ఈ ఫార్మాట్లో అతను 62 మ్యాచ్లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్రేట్తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లోనూ శ్రేయస్కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రేయస్ 51 మ్యాచ్లు ఆడి 136.12 స్ట్రయిక్రేట్తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్.. 14 మ్యాచ్ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
అజయ్ జడేజాతో కటీఫ్.. అఫ్గానిస్తాన్ మెంటార్గా పాక్ దిగ్గజం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు మెంటార్గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్ను ఏసీబీ నియమించింది. ఈ విషయాన్నిఏసీబీ అధికారికంగా బుధవారం ప్రకటించింది."ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అఫ్గానిస్తాన్ మెంటార్గా పాకిస్తాన్ లెజెండ్ యూనిస్ ఖాన్ను ఏసీబీ ఎంపిక చేసింది. అతడు ఈవెంట్ ఆరంభానికి ముందు జట్టుతో అతడు కలవనున్నాడు" అని అఫ్గాన్ క్రికెట్ అధికార ప్రతినిధి సయీద్ నసీమ్ సాదత్ పేర్కొన్నాడు. కాగా యూనిస్ ఖాన్ గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు.అజయ్ జడేజాతో కటీఫ్..ఇక వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గాన్ జట్టు మెంటార్గా పనిచేసిన భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాతో ఈసారి ఏసీబీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అతడి మార్గదర్శకత్వంలో అఫ్గానిస్తాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను ఓడించి అడుగు దూరంలో తొలిసారి సెమీస్ చేరే అవకాశాన్ని అఫ్గాన్లు కోల్పోయారు. వరల్డ్క్లాస్ జట్లను అఫ్గాన్ ఓడించడంలో అజయ్ జడేజాది కీలక పాత్ర అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో జడేజాకు వీసా సమస్యలు తలెత్తే అవకాశముంది. అంతేకాకుండా పరిస్థితుల అనుగుణంగా యూనిస్ వైపు ఏసీబీ మొగ్గు చూపినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్ టీ20 వరల్డ్కప్-2024లో కూడా సంచలన ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్లను ఓడించి తొలిసారి పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు.కోచ్గా అనుభవం..పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన యూనిస్ ఖాన్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా కూడా పనిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ,అబుదాబి T10 లీగ్లో బంగ్లా టైగర్స్తో కూడా కలిసి పనిచేశాడు. పాక్ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10,099 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే 2009 టీ20 ప్రపంచకప్ను పాక్ సొంతం చేసుకుంది.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఇంగ్లండ్కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో (జిమ్లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో తలపడ్డాయి.జింబాబ్వేతో మ్యాచ్ను బహిష్కరించిన ఇంగ్లండ్ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2003 వన్డే ప్రపంచకప్లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరుగుతాయి. పాక్తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్కు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో వైట్ బాల్ సిరీస్లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.అయితే ఈ సిరీస్లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్పై వర్క్లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లిఇక ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడి తమ రిథమ్ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం -
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాలు ఎదురు కానుంది. పాకిస్తాన్, యూఈఏ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గోనేందుకు టీమిండియా సిద్దం కానుంది.50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా రన్నరప్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షూరూ కానుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఐసీసీ నిర్దేశించిన గడువుకు ఒక రోజు ముందు (జనవరి 11)న భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినవెంటనే జట్టు ఎంపికకు కసరత్తులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్గా రోహిత్ శర్మ.. అయ్యర్కు ఛాన్స్కాగా ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్గా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే విధంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లతో షమీ పునరాగమనం చేసే అవకాశముంది.ఇంగ్లీష్ జట్టుతో టీ20 లేదా వన్డే సిరీస్కు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సైతం సెలక్టర్లు తిరిగి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లను అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్తో 3 (బంగ్లాదేశ్తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్లో)వెస్టిండీస్తో 2 (భారత్లో)సౌతాఫ్రికాతో 2 (భారత్లో) -
పాక్ ఎత్తులకు చెక్
-
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్
-
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్తో వన్డే సిరీస్కు ముందు జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్వన్ ర్యాంక్తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ భారత్తో జరిగే సిరీస్కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్కోట్లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్పూర్లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్లో) -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్బాల్ సిరీస్లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్బాల్ సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్తో సిరీస్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్గా మెక్కల్లమ్కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్గా ఉన్నాడు.భారత్తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
ఐసీసీ వేదికపై మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్
-
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'రెవ్స్పోర్ట్జ్' అనే స్పోర్ట్స్ వెబ్ సైట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.రెవ్స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే టీమిండియా తమ మొదటి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ తటస్ధ వేదికపై జరుగుతాయి అని సదరు వెబ్సైట్ పేర్కొంది.దాయాదుల పోరు ఎప్పుడంటే?రెవ్స్పోర్ట్జ్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్లను ఆడనుంది. న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2న ఆడనుంది.మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తమ మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికలగా ఆడే అవకాశముంది.కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత మ్యాచ్లు మినహా మిగితా అన్నీ పాక్లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్కు చేరితే ఆ మ్యాచ్లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్లతో -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్లు ఆడే అన్నీ మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్లో భారత్ ఆడాల్సిన మ్యాచ్లు యూఏఈ (దుబాయ్)లో... భారత్లో పాక్ ఆడాల్సిన మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి. -
పాకిస్తాన్ తలవంచినట్లే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్కు అంగీకరించేది లేదని, మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు మినహా ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్కు వెళ్లి మ్యాచ్లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్లతో పాటు ఆసియా కప్కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు. -
‘హైబ్రిడ్’ మోడల్కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్కు చెప్పేసింది. దుబాయ్లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
‘హైబ్రిడ్’ మోడల్పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్ మోడల్. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్ నాకౌట్ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఆసియా కప్ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్ కప్ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్ మోడల్కు తాము అంగీకరించాలంటే భారత్లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్కు వెళ్లమని పాక్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక
వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇరకాటంలో పడింది. భద్రతా కారణాల చేత భారత్ ఇప్పటికే పాక్లో పర్యటించబోదని తేల్చి చెప్పగా.. తాజాగా పాక్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణను మరింత అడ్డుగా మారాయి. పాక్లో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇమ్రాన్ జైలులో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాడు. అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆర్మీ రంగంలో దిగింది. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంకపాక్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ నుంచి వైదొలిగింది. రెండు అనధికారిక టెస్ట్లు, మూడు వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాక్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్లు, ఓ వన్డే ముగిశాయి. ఈలోపు పాక్లో ఆల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్దంతరంగా వైదొలిగింది. శ్రీలంక ఏ జట్టు పాక్-ఏ టీమ్తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ రెండు వన్డేలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, శ్రీలంక-ఏతో ఆడిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. లంక-ఏతో జరిగిన తొలి వన్డేలో కూడా పాకిస్తానే గెలిచింది. -
భారత్, పాక్ మధ్య ఐసీసీ మధ్యవర్తిత్వం
ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్దత నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది. మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ పాక్ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఐసీసీ తెర వెనుక పావులు కదుపుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోతే ఎదురయ్యే నష్టాలను ఐసీసీ పాక్కు వివరిస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్లో పర్యటించేందుకు ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీని తటస్థ వేదికపై నిర్వహిస్తేనే తాము పాల్గొంటామని భారత్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఛాంపియన్స్ టోర్నీని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే నిర్వహించాలని పాక్ భీష్మించుకుని కూర్చుంది.ఈ టోర్నీ కోసం తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, అలాగే టోర్నీ నిర్వహణ కోసం భారీగా నిధులు సమకూర్చామని పాక్ చెబుతుంది. టోర్నీ నిర్వహణ విషయంలో ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పాక్ కోరుతుంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనపోతే వేరే దేశానికి అవకాశం కల్పించాలని పాక్ అంటుంది. టోర్నీ షెడ్యూల్ను వీలైనంత త్వరలో విడుదల చేయాలని పాక్ ఐసీసీని కోరుతుంది.వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను నవంబర్ 12నే విడుదల చేయాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య పంచాయితీ నడుస్తుండటంతో షెడ్యూల్ విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు.పాక్ ఒప్పుకోకపోతే వేదిక మారనుందా..?హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాక్ ఒప్పుకోకపోతే వేదికను దక్షిణాఫ్రికాకు మార్చాలని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వేదికను దక్షిణాఫ్రికాకు షిప్ట్ చేస్తే పాక్ పాల్గొంటుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి భారత్ తాము ఆడబోయే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని కోరుతుంది. మిగతా మ్యాచ్లన్నిటినీ యధాతథంగా పాక్లోనే నిర్వహించుకోవచ్చని భారత్ అంటుంది. ఇందుకు పాక్ ఒప్పుకోవడం లేదు. -
సూర్యకుమార్ యాదవ్ను నిలదీసిన పాక్ అభిమాని
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్లో పర్యటించేది లేదని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్దతిలో (తటస్థ వేదిక) టోర్నీని నిర్వహిస్తే పాల్గొంటామని భారత్ తెలిపింది. ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం కానీ.. హైబ్రిడ్ పద్దతిలో మాత్రం టోర్నీని నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పీసీబీ హైబ్రిడ్ పద్దతిలో టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించకపోతే వేదికను సౌతాఫ్రికాకు మారుస్తామని ఐసీసీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Aayat Raza Qureshi (@aayatqureshi.14)ఇదిలా ఉంటే, సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో రెండో టీ20 ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్కు హాజరైన ఓ పాక్ అభిమాని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఫోటో దిగాడు. అనంతరం సదరు అభిమాని మీరు పాక్కు ఎందుకు రావడం లేదని స్కైని ప్రశ్నించాడు. ఇందుకు స్కై బదులిస్తూ.. మా చేతుల్లో ఏముంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, పాక్ మొండిపట్టు వీడకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ సందిగ్దంలో పడింది. ఒకవేళ పాక్ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోక పోతే టోర్నీ రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇదిలా ఉంటే, భారత సీనియర్ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా నవంబర్ 22న ప్రారంభమవుతుంది. మరోవైపు భారత టీ20 జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్ ఇదివరకే రెండు మ్యాచ్లు ఆడేసింది. ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్లో మరో రెండు మ్యాచ్లు జరగాల్సి ఉంది. -
భారత్ రాదు... నిర్ణయం మీదే!
కరాచీ: వచ్చే ఏడాది పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్లో ఆడేందుకు భారత్ ససేమిరా అంటోంది. మరోవైపు హైబ్రిడ్ మోడల్ (భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహణ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారత్ మెగా టోర్నీ ఆడే విషయమై ఐసీసీని మరింత స్పష్టత కోరాలని పీసీబీ భావిస్తుండగా... ఐసీసీ నాన్చకుండా తేల్చేసింది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలో... ఫైనల్ పోరు దుబాయ్లో నిర్వహించే హైబ్రిడ్ పద్ధతికే తాము అంగీకరిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమకు స్పష్టం చేసిందని పాక్ బోర్డుకు ఐసీసీ తేల్చిచెప్పింది. భారత్ ఆడే మ్యాచ్లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచి్చంది. ఇక కాదు... కూడదంటే... మీ ఇష్టమని పాక్ బోర్డుకు స్పష్టం చేయడంతో పీసీబీ కినుక వహించింది. నిరసనగా ఆతిథ్య హక్కులు వదిలేసుకోవాలని బోర్డు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. టోర్నీ ఆతిథ్యం నుంచి ఒకవేళ పాక్ తప్పుకుంటే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఎలాగైనా పాక్లో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్కు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తోంది. ‘హైబ్రిడ్ పద్ధతిలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆలోచన పీసీబీకి లేదు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు అంచనా వేస్తోంది. (పాక్) ప్రభుత్వాన్ని సంప్రదించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది’ అని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య గడిచిన 16 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసే జరగడం లేదు. 2008లో ముంబైపై పాక్ ఉగ్రదాడి అనంతరం రాజకీయ, క్రికెట్ బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నల్లో, చాంపియన్స్ ట్రోఫీల్లోనే తలపడుతున్నాయి. -
‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్తో పాటు భారత్కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుది. పాక్తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది. భారత మ్యాచ్లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. -
ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అన్న బిరుదు ఉంది. ధోని ఆన్ ఫీల్డ్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాలా నింపాదిగా కనిపించేవాడు. టెన్షన్ అన్నది అతని ముఖంలో కనపడేది కాదు. విజయాలకు ఉప్పొంగిపోవడం.. ఓటములకు ఢీలా పడిపోవడం ధోనికి తెలీదు. అలాంటి ధోని ఒకానొక సందర్భంలో చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరెగిరి గంతులేశాడు. ఆ సందర్భం 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటిది.2013, జూన్ 23న ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఫైనల్లో భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్పై 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్లో గెలుపు ఖరారైన వెంటనే మిస్టర్ కూల్ కెప్టెన్ మిస్టర్ జాలీ కెప్టెన్గా మారిపోయాడు. ఆ విజయం ధోనికి, అటూ టీమిండియాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే ధోని తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.Relive @ashwinravi99's magical ball in #CT13 🪄He bowled 4 overs, gave 15 runs including a maiden and took key wickets of Joe Root & Jonathan Trott in the final 👌pic.twitter.com/zBr1VkBVy8— CricTracker (@Cricketracker) September 17, 2024ధోని వరల్డ్కప్లు గెలిచినప్పుడు కూడా అంత ఎగ్జైట్ కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ధోనికి అంత తృప్తినిచ్చింది. ఈ విషయాన్ని ధోని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తీరు.. నాటి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అందుకే భారత్కు అది చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ధోని కెరీర్లో హైలైట్గా నిలిచిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో మూడు ఐసీసీ టైటిల్స్ (టీ20, వన్డే వరల్డ్కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తొలి కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా టీ20 మ్యాచ్గా మార్చబడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 నాటౌట్, శిఖర్ ధవన్ 31 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, దినేశ్ కార్తీక్ 6, సురేశ్ రైనా 1, ధోని 0, అశ్విన్ 1 పరుగుకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బొపారా 3, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ట్రెడ్వెల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో 5 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడిన్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అశ్విన్ 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశ్విన్ వేసిన మ్యాచ్ చివరి బంతిని మ్యాజిక్ డెలివరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు.భారత విజయంలో అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ధోని కూడా కీలక భూమికలు పోషించారు. ఇషాంత్, జడ్డూ చెరో 4 ఓవర్లు వేసి తలో 2 వికెట్లు తీయగా.. ధోని రెండు కీలకమైన స్టంపౌట్లు, ఓ రనౌట్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఇయాన్ మోర్గన్ (33), రవి బొపారా (30), జోనాథన్ ట్రాట్ (20), ఇయాన్ బెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. కుక్ (2), రూట్ (7), బట్లర్ (0), బ్రేస్నెన్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపు అనంతరం భారత సంబురాలు అంబరాన్నంటాయి. ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే షైన్ అవుతున్న కోహ్లి ఈ విజయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు.భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మినీ వరల్డ్కప్గా చెప్పుకునే ఈ టైటిల్ను గెలిచిన అనంతరం భారత్ 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్ను కూడా సాధించలేకపోయింది. చివరికి 2024లో టీమిండియా కల సాకారమైంది. భారత్ 2024 టీ20 వరల్డ్కప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు టైటిల్ను అందించాడు. భారత్ మొత్తంగా రెండు వన్డే వరల్డ్కప్లు (1983, 2011), రెండు టీ20 ప్రపంచకప్లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013) గెలిచింది. -
మరోసారి 'యూ టర్న్' తీసుకోనున్న బెన్ స్టోక్స్..!
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సారధి బెన్ స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బరిలోకి దిగాడు. వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఘోర పరాభవం నేపథ్యంలో స్టోక్స్ అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా స్టోక్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లోని మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని క్లూ ఇచ్చాడు. ఈ విషయమై జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తనను సంప్రదిస్తే తాను రెడీ అంటూ సంకేతాలు పంపాడు.రిటైర్మెంట్ విషయమై ఆటగాళ్లు మనసు మార్చుకోవడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. చాలా మంది క్రికెటర్లు స్టోక్స్ లాగే తొలుత రిటైర్మెంట్ ప్రకటిస్తారు.. ఆతర్వాత ఆ కారణం.. ఈ కారణం చెప్పి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తావించాడు. రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకోవడం ఆటగాళ్లకు ఫ్యాషన్గా మారిపోయిందని హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.స్టోక్స్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ టెస్ట్ సారధి వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ మెగా టోర్నీ కావడంతో స్టోక్స్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తుండవచ్చు. మళ్లీ ఈ టోర్నీ అయిపోయిన వెంటనే స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్యర్యపోనక్కర్లేదు. 33 ఏళ్ల స్టోక్స్ ఫిట్నెస్ పరంగానూ పెద్దగా పర్ఫెక్ట్గా లేడు. టెస్ట్ల్లో కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతున్నాడు. బౌలింగ్ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్ట్ల్లో మాత్రం అతన్ని మ్యాచ్ విన్నర్గా తీసిపారేయడానికి వీళ్లేదు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం అతనికి ఇంకా ఉంది.స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 105 టెస్ట్లు, 114, 43 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను గత కొంతకాలం యాక్టివ్గా లేడు. మెక్కల్లమ్ ఇంగ్లండ్ ఫుల్టైమ్ హెడ్ కోచ్గా నియమితుడైన తర్వాత స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. చదవండి: మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్ -
'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్పై సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత రెండేళ్లగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. టీ20 వరల్డ్కప్-2022లో రన్నరప్గా నిలిచిన తర్వాత పాక్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. గతేడాది జరిగిన ఆసియాకప్, వన్డే ప్రపంచకప్లో దారుణ ప్రదర్శన కనబరిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.దీంతో పాక్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టాప్ను మొత్తాన్ని పీసీబీ ప్రక్షాళన చేసింది. పాక్ వైట్బాల్ హెడ్కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్గా గ్యారీ కిర్స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. రెడ్బాల్ కోచ్గా ఆసీస్ దిగ్గజం గిల్లెస్పీ నియమితుడయ్యాడు. అయితే కోచ్లు మారినప్పటకి పాక్ క్రికెట్ తలరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. టీ20 వరల్డ్కప్-2024లోనూ పేలవ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్కమ్రించింది.దీంతో హెడ్కోచ్ గ్యారీ కిర్స్టెన్పై కూడా పీసీబీ వేటు వేస్తుందని ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. కానీ పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అయితే ఈ విషయంపై ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కిర్స్టెన్ను పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తారని అలీ తెలిపాడు."గ్యారీ కిర్స్టన్కు అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ జట్టు హెడ్కోచ్గా అతడు కొనసాగుతాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిని తప్పించనున్నారు. అందుకే ఇప్పుడే గ్యారీకి టాటా, బై బై చెప్పాలనకుంటున్నాను. ఈ మెగా టోర్నీలో పాక్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిస్తే చాలు అదే పెద్ద విజయంగా భావిస్తాము. పాక్ క్రికెట్లో రాజకీయాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. క్రికెట్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం అంతమంచిది కాదు అంటూ" బసిత్ అలీ తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు ఆక్టోబర్ 7 నుంచి ఇంగ్లండ్తో మూడు టెస్టుల సిరీస్లో తలపడనుంది.