Champions Trophy 2025: పాక్‌తో కీలక సమరం.. మళ్లీ టాస్‌ ఓడిన రోహిత్‌ శర్మ | Champions Trophy 2025: Pakistan Won The Toss And Choose To Bat, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: పాక్‌తో కీలక సమరం.. మళ్లీ టాస్‌ ఓడిన రోహిత్‌ శర్మ

Published Sun, Feb 23 2025 2:06 PM | Last Updated on Sun, Feb 23 2025 2:17 PM

Champions Trophy 2025: Pakistan Won The Toss And Choose To Bat, Here Are Playing XI

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో టాస్‌ ఓడాడు. 

ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్‌ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఫకర్‌ జమాన్‌ స్థానంలో ఇమామ్‌ ఉల్‌ హక్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు..

పాకిస్తాన్‌: సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజమ్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, రిజ్వాన్‌ (కెప్టెన్‌, సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, షమీ, కుల్దీప్‌ యాదవ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement