mohammed rizwan
-
యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్ చేతిలో చిత్తు! పాక్ జట్టులో భారీ మార్పులు?
భారత్-పాకిస్తాన్(India vs Paksitan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఏ వేదిక పైన జరిగినా ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లు ఎప్పుడూ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల ఈ రెండు జట్లు మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ స్థాయిలో సన్నద్ధమైంది. "యోధుల్లాగా పోరాడండి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy) భారత జట్టును ఓడించి మీ సత్తా చూపించండి" అని ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ముందు సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆ దేశ క్రికెటర్లను తన సందేశంతో యుద్ధం స్థాయిలో సన్నద్ధం చేశారు. కానీ భారత్ క్రికెటర్ల ప్రతిభ ముందు ఇవేమి పనిచేయలేదు.ఘోర పరాజయంపాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిదూడడంతో ప్రస్తుతం గ్రూప్ స్టేజి లోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఈ ఐసీసీ టోర్నమెంట్కు ఆతిధ్యమిచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు రోజుల్లోనే అవమానకరమైన రీతిలో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ప్రకృతి కూడా సహకరించలేదుమొదట న్యూజిలాండ్, ఆ తర్వాత భారత్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్ కి ప్రకృతి కూడా సహకరించలేదు. చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధించాలని ఆశించిన పాకిస్తాన్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల నుంచి కేవలం ఒక్క పాయింట్ తో అవమానకరంగా వైదొలిగింది.స్వదేశం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో పాకిస్తాన్ క్రికేటర్ల పేలవమైన ప్రదర్శన పై ఆ దేశం మొత్తం అసంతృప్తి గా ఉంది. అభిమానులు, క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల నుండి చాలా మంది పాకిస్తాన్ ప్రదర్శన పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ని షెహబాజ్ షరీఫ్ స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారు.షెహబాజ్ షరీఫ్ రాజకీయ మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు దారుణమైన ప్రదర్శనను ప్రధాని స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ క్రికెట్ సంబంధిత అంశాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ఆయన సూచించారు.పీసీబీ అధికారులపై అసంతృప్తిప్రధాన మంత్రి సహాయకుడు రాణా సనావుల్లా, దేశంలోని ప్రొఫెషనల్ క్రికెట్పై ఆర్థిక వ్యయాలకు సంబంధించి పారదర్శకత కోసం పిలుపునిచ్చారు. క్రీడలకు వనరులు ఎలా కేటాయించబడుతున్నాయ్యో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. జవాబుదారీతనం మరియు సంస్కరణల అవసరాన్ని గురుంచి మరింత నొక్కి చెప్పారు.పాకిస్తాన్కు చెందిన 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని ఉన్నత స్థాయి అధికారుల అధిక జీతాలపై దృష్టిని సారించాలని రాణా సనావుల్లా సూచించారు. దాదాపు నెలకు రూ.5 మిలియన్ల వరకు జీతం పొందుతున్న పీసీబీ అధికారులలో చాలా మందికి వారి బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన లేదని, అయినప్పటికీ వారు తమ విధులను నిర్వర్తించకుండా గణనీయమైన పరిహారం పొందుతూనే ఉన్నారని సనావుల్లా విమర్శించారు.అంతేకాకుండా, పీసీబీ అధికారులు అనుభవిస్తున్న విపరీత ప్రోత్సాహకాలు మరియు అధికారాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వారు పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తున్నారా లేదా అభివృద్ధి చెందిన దేశంలో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పిసిబి లో చాలా కాలంగా కొనసాగుతున్న అధికార దుర్వినియోగానికి సనావుల్లా ఈ సమస్యలను ఆపాదించారు. పీసీబీ అధికారుల జవాబురాహిత్యం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ క్షీణతకు ప్రత్యక్షంగా దోహదపడిందని ఆయన వాదించారు.పాక్ జట్టులో భారీ మార్పులు ? ఈ సమీక్ష పాకిస్తాన్ జట్టులో భారీ కుదుపులకు దారితీయవచ్చు, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు నసీమ్ షా వంటి ప్రముఖ ఆటగాళ్ళు బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. జట్టు వైఫల్యం కారణంగా తాను రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, పీసీబీ అతని ఒప్పందాన్ని రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, ఈ ఏడాది లో జరిగే ఆసియా కప్ సమయంలో రెండు చిరకాల ప్రత్యర్థులు కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్ , శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ జట్లు సిద్ధమవుతున్నందున ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆసియా కప్ను నిర్వహించే హక్కులు భారత్ కి కేటాయించినప్పటికీ ఈ టోర్నమెంట్ తటస్థ దేశంలో జరుగుతుందని భావిస్తున్నారు. భారత్- పాకిస్తాన్ ఆతిథ్య దేశాలుగా ఉన్నప్పుడు, పోటీని వేరే చోట నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) గతంలో ప్రకటించింది.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
Champions Trophy 2025: పాక్తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్లో (బర్మింగ్హమ్) పాక్ భారత్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్లో మరోసారి పాక్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్లో భారత్, పాక్లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి తమ తొలి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కూడా మాంచి టచ్లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్లో లేకపోయినా పాక్తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్లోకి వచ్చాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్పై పైచేయి సాధించేందుకు భారత్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా..
భారీ అంచనాలతో చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) బరిలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆదిలోనే పరాభం ఎదురైంది. న్యూజిలాండ్(Pakistan vs New Zealand)తో జరిగిన మ్యాచ్లో అరవై పరుగుల తేడాతో చిత్తై ఓటమితో ఈ టోర్నమెంట్ను ఆరంభించింది. అంతేకాదు.. బుధవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ బృందం టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు ఒకటి నమోదు చేసింది.గత చాంపియన్స్ ట్రోఫీ-2017 ఎడిషన్లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీస్ చేరకపోయినా డిఫెండింగ్ హోదాలో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో కలిసి ఇందులో భాగం కానుంది.యంగ్, లాథమ్ సెంచరీలుఈ క్రమంలో ఆరంభ మ్యాచ్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్- న్యూజిలాండ్ కరాచీ వేదికగా తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులతో దుమ్ములేపగా.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత అజేయ శతకం(104 బంతుల్లో 118* రన్స్) సాధించాడు. ఇక ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో చెలరేగాడు.ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు కివీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. విలియం ఓరూర్కీ ఓపెనర్ సౌద్ షకీల్(6), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(3)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు.పాక్ చెత్త రికార్డుఈ క్రమంలో మరో ఓపెనర్ బాబర్ ఆజం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఈ వన్డే మ్యాచ్ పవర్ప్లే(తొలి పది ఇన్నింగ్స్)లో రెండు వికెట్ల నష్టానికి కేవలం 22 పరుగులే చేసింది పాకిస్తాన్. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పవర్ప్లేలో అత్యధికంగా మూడుసార్లు.. 25 కంటే తక్కువ సోర్లు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఈ చెత్త రికార్డు సాధించిన టీమ్గా పాక్ చరిత్రకెక్కింది. ఇక పాకిస్తాన్కు సొంతగడ్డపై వన్డే చరిత్రలో పవర్ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో పవర్ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుపాకిస్తాన్- 2013లో జింబాబ్వేపై బర్మింగ్హామ్ వేదికగా 18/2పాకిస్తాన్- 2025లో న్యూజిలాండ్పై కరాచీ వేదికగా 22/2పాకిస్తాన్- 2013లో వెస్టిండీస్పై ది ఓవల్ వేదికగా 23/3బంగ్లాదేశ్- 2017లో న్యూజిలాండ్పై కార్డిఫ్ వేదికగా 24/3శ్రీలంక- 2013లో ఇండియాపై కార్డిఫ్ వేదికగా 26/1.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్లో బాబర్ ఆజం 90 బంతుల్లో 64 పరుగులు చేయగా.. ఫఖర్ జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. అయితే, ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69), సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడటంతో పాక్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ కివీస్ బౌలర్లు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు.నాథన్ స్మిత్ సల్మాన్ను, ఖుష్దిల్ను విలియం పెవిలియన్కు పంపారు. దీంతో పాకిస్తాన్ కథ కంచికి చేరకుండానే ముగిసిపోయింది. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో విలియం ఓరూర్కీ,కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. మ్యాట్ హెన్రీ రెండు, మైఖేల్ బ్రాస్వెల్, నాథన్ స్మిత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Pak vs NZ: మెగా టోర్నీ షురూ.. టాస్ గెలిచిన పాక్.. తుదిజట్లు ఇవే
CT 2025 Pak vs NZ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్కు తెరలేచింది. పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ బుధవారం ఆరంభమైంది. ఆతిథ్య పాక్- న్యూజిలాండ్ జట్ల మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.అదే విధంగా.. తాము డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నందున కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తమేనన్న రిజ్వాన్.. అయితే, ఇటీవలి ముగిసిన త్రైపాక్షిక సిరీస్ మాదిరే దీనిని సాధారణ సిరీస్గా భావిస్తే ప్రెజర్ తగ్గుతుందన్నాడు. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందని.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హ్యారిస్ రవూఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడని తెలిపాడు.కాగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడింది. ఇందులో ఫైనల్కు చేరుకున్న పాక్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మెగా ఈవెంట్లో కివీస్దే పైచేయిఇక ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరుగగా.. పాకిస్తాన్ 61, న్యూజిలాండ్ 53 మ్యాచ్లు గెలిచాయి. ఒకటి టై కాగా.. మూడు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్లలో కివీస్ జట్టే పాక్పై గెలుపొందడం విశేషం. ఇక 1998లో మొదలైన ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని వివిధ కారణాల వల్ల 2017 తర్వాత నిలిపివేశారు. అయితే, తాజాగా మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు.. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా సొంతగడ్డపై అతిపెద్ద క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. కరాచీ, రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్ల నేపథ్యంలో దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను మోహరించేందుకు సిద్ధమైందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1200 మంది ఉన్నతాధికారులు, 10,566 మంది కానిస్టేబుల్స్, 200కు పైగా మహిళా పోలీస్ ఆఫీసర్లు భద్రతా విభాగంలో భాగమైనట్లు తెలిపాయి. అంతేకాదు టోర్నీలో పాల్గొనే జట్లు, వీరాభిమానుల కోసం పీసీబీ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు ప్రకటన.. ముగ్గురిపై వేటు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు. పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ సిరీస్లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది. -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్తో వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్తో ఆడిన తక్కువ మ్యాచ్లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్గా ఇప్పటి వరకు పాక్తో 109 మ్యాచ్లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్తో సమానంగా 71సార్లు పాక్పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్కు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్లు)ఇండియా- 57 (135 మ్యాచ్లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
ఉత్కంఠ పోరులో పాక్పై ఆస్ట్రేలియా గెలుపు
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో పాక్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (31 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్కు మిచెల్ స్టార్క్ (2 నాటౌట్) సహకరించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అబ్దుల్లా షఫీక్ (12), సైమ్ అయూబ్ (1), కమ్రాన్ గులామ్ (5), అఘా సల్మాన్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో మాథ్యూ షార్ట్ 1, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 16, లబూషేన్ 16, ఆరోన్ హార్డీ 10, మ్యాక్స్వెల్ 0, సీన్ అబాట్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్లోని రెండో మ్యాచ్ నవంబర్ 8న అడిలైడ్ వేదికగా జరుగనుంది. -
పాకిస్తాన్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల నూతన కెప్టెన్గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వి అధికారికంగా ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ వైదొలిగిన విషయం తెలిసిందే. రానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే టూర్లతో రిజ్వాన్ కెప్టెన్గా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఇవాళ ఉదయం ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ జట్లను ప్రకటించారు. జట్లను ప్రకటించే సమయంలో కెప్టెన్ పేరును వెల్లడించలేదు. తాజాగా పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వి రిజ్వాన్ పేరును ప్రకటించాడు. రిజ్వాన్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా వ్యవహరిస్తాడని నఖ్వీ తెలిపాడు.పాక్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం జట్లను ఎంపిక చేయడంతో తమ పాటు తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది. పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్లో కొత్తగా ఐదుగురికి అవకాశం లభించింది. బాబర్ ఆజమ్కు అనుకూలంగా బోర్డుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఫఖర్ జమాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా..కేటగిరీ-ఏ: బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్కేటగిరీ-బి: నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్కేటగిరీ-సి: అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్కేటగిరీ-డి: అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాక్ జట్లు..ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు పాకిస్తాన్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్జింబాబ్వేతో వన్డే సిరీస్కు పాక్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్జింబాబ్వేతో టీ20 సిరీస్కు పాక్ జట్టు..అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్ -
రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్.. రాణించిన రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన హెండ్రిక్స్ తాజాగా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. క్వెట్టా గ్లాడయేటర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్లో హెండ్రిక్స్ మెరుపు అర్ధశతకంతో (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా సుల్తాన్స్ 13 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్పై విజయం సాధించింది. సుల్తాన్స్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (51) సైతం కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్, రిజ్వాన్తో పాటు తయ్యబ్ తాహిర్ (35 నాటౌట్) రాణించాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 2, అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుల్తాన్స్ బౌలర్లలో మొహమ్మద్ అలీ అద్భుత ప్రదర్శనతో (4-1-19-3) విజృంభించగా.. డేవిడ్ విల్లే 3, ఆఫ్తాబ్ ఇబ్రహీం 2, ఉసామా మిర్ ఓ వికెట్ పడగొట్టారు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో ఖ్వాజా నఫే (36), రిలీ రొస్సో (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పాకిస్తాన్ వైస్ కెప్టెన్గా మొహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ టీ20 జట్టు వైస్ కెప్టెన్గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్కప్ అనంతరం కెప్టెన్గా బాబర్ ఆజమ్ తప్పుకోవడంతో పాక్ టీ20 జట్టుకు కెప్టెన్గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్ ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి అఫ్రిది, రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు. .@iMRizwanPak has been appointed vice-captain of Pakistan's T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML — Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024 కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం పాక్ న్యూజిలాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, డునెడిన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడిన పాక్.. 0-3 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్ మొత్తం పాక్ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్కు ముందు వరల్డ్కప్లోనూ పాక్ చెత్త ఆడి సెమీస్కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్తో ఐదు టీ20లకు పాక్ జట్టు: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్ -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన బాబర్ ఆజమ్
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్లో బాబర్ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్తో పాటు మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న మొహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్లో ఆడిన తన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్ గేమ్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. రిజ్వాన్ (62), సౌద్ షకీల్ (5) క్రీజ్లో ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది. మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్ను కదిలించలేకపోయాడు
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్లో కొనసాగుతున్నారు. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్ను కదిలించలేకపోయాడు.. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో (5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్లోనే కొనసాగుతున్నాడు. చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్కు పరాభవం
న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్మన్కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్మన్కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
సిక్సర్ బాది తన జట్టును ఫైనల్కు చేర్చిన షాహిన్ అఫ్రిది
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఇదివరకే ఫైనల్స్కు చేరుకోగా.. నిన్న (మార్చి 17) జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీపై విజయం (4 వికెట్ల తేడాతో) సాధించడంతో లాహోర్ ఖలందర్స్ ఇవాళ జరిగే తుది సమరానికి అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. మహ్మద్ హరీస్ (54 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 42; 7 ఫోర్లు), రాజపక్స (18 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. మీర్జా తాహిర్ బేగ్ (42 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఖలందర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆఖర్లో ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది (11 నాటౌట్) వరుసగా బౌండరీ, సిక్సర్ బాది తన జట్టును ఫైనల్కు చేర్చాడు. సామ్ బిల్లింగ్స్ (28), సికందర్ రజా (23) ఓ మోస్తరుగా రాణించారు. జల్మీ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, వాహబ్ రియాజ్, ఆమెర్ జమాల్, సల్మాన్ ఇర్షాద్ తలో వికెట్ దక్కించుకోగా.. ఖలందర్స్ బౌలర్లు జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన మ్యాచ్లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్, పాక్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50 స్కోర్లు చేసిన రిజ్వాన్.. నిన్న (ఫిబ్రవరి 22) కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరింతగా రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చాడు. 60 బంతుల్లోనే శతకం బాది, పీఎస్ఎల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు 42 బంతులు తీసుకున్న రిజ్వాన్.. రెండో హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేసి పీఎస్ఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ⚠️ Riz-storm! #MohammadRizwan #HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/hWD3IdESrP — Alex Cricket Prediction (@alex_prediction) February 22, 2023 ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కరాచీ కింగ్స్ సైతం అద్భుతంగా పోరాడింది. జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 75; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (26 బంతుల్లో 46 నాటౌట్; 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడినప్పటికీ ఆ జట్టు లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో కరాచీ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. కింగ్స్ జట్టులో విన్స్, ఇమాద్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. కాగా, ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్లో ఉన్న రిజ్వాన్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 109.66 సగటున, 144 స్ట్రయిక్ రేట్తో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేసి, సీజన్ టాప్ స్కోరర్గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓవరాల్గా రిజ్వాన్ గత 10 టీ20 ఇన్నింగ్స్లో 6 హాఫ్సెంచరీలు, ఓ సెంచరీ సాధించి కెరీర్లో అత్యుత్తమ ఫామ్ను కనబరుస్తున్నాడు. అతని ఫామ్ కారణంగా ముల్తాన్ సుల్తాన్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్లో డస్సెన్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్లోకి రావడంతో తదుపరి లీగ్లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
రచ్చరచ్చ చేసిన మహ్మద్ రిజ్వాన్, రిలీ రొస్సో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. పెషావర్ జల్మీతో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 66; 9 ఫోర్లు, సిక్స్), వన్డౌన్ బ్యాటర్ రిలీ రొస్సో (36 బంతుల్లో 75; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రచ్చరచ్చ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిల్లర్ (14 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), పోలార్డ్ (6 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు,సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. పెషావర్ బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 2, సుఫీయాన్ ముకీమ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన పెషావర్.. సుల్తాన్స్ బౌలర్లు ఉసామా (3/22), ఇహసానుల్లా (3/24), అబ్బాస్ అఫ్రిది (2/33), కార్లోస్ బ్రాత్వైట్ (1/22) ధాటికి 18.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. అరంభంలో ఓపెనర్ మహ్మద్ హరీస్ (23 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ సయిమ్ అయూబ్ (37 బంతుల్లో 53; 3 సిక్సర్లు, 3 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యారు. వీరు కాక రోవమన్ పావెల్ (23), జేమ్స్ నీషమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ ప్లేయర్ రొస్సో వరుసగా రెండో మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్లో ఇవాల్టి (ఫిబ్రవరి 18) మ్యాచ్లో కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
రఫ్ఫాడించిన రొస్సో.. ఐదేసి ఇరగదీసిన ఇహసానుల్లా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన సుల్తాన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ అదే రేంజ్లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇహసానుల్లా ఫైఫర్తో (4-1-12-5) గ్లాడియేటర్స్ను గడగడలాడించగా.. బ్యాటింగ్లో రిలీ రొస్సో మెరుపు హాఫ్సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. A special performance from our young quick Ihsanullah as he takes 5 wickets for 12 runs!#SultanAaGayya #LetsPlaySaeen pic.twitter.com/8HVKfheWsu — Multan Sultans (@MultanSultans) February 15, 2023 ఫలితంగా సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్.. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. .@Rileerr gets to his 5️⃣0️⃣ Nothing can go wrong for @MultanSultans today 👏#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/a3lcm44BjR — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సుల్తాన్స్.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్ అఫ్రిది (2/27), సమీన్ గుల్ (2/20), ఉసామా మిర్ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో జేసన్ రాయ్ (27), ఉమర్ అక్మల్ (11), మహ్మద్ నవాజ్ (14), హఫీజ్ (18), మహ్మద్ హస్నైన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. Cracking shot! @Rileerr making Multan roar 🎉#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/zazLskMwYm — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్.. షాన్ మసూద్ (3) వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేసి సుల్తాన్స్ను గెలిపించారు. షాన్ మసూద్ వికెట్ నువాన్ తుషారకు దక్కింది. లీగ్లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. Pace like fire! 🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/7UFeFx04kz — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ ఈ ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా టి20ల్లో అతను చెలరేగిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. టి20 వరల్డ్కప్లో టీమిండియా సెమీస్ వరకు రావడంలో సూర్యకుమార్ది కీలకపాత్ర. కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్లు ఆడిన సూర్యకుమార్ విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ఈ విధ్వంసమే అతన్ని తాజాగా ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులతో సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ 2022 టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా నుంచి సూర్యకుమార్తో పాటు ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు. సూర్యకుమార్: ఇక టి20 వరల్డ్ కప్లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టి20ల్లో ఈ ఏడాది సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31 మ్యాచ్ల్లో 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో సూర్య అత్యధికంగా 68 సిక్స్లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు.న్యూజిలాండ్ సిరీస్లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్లో రెండో టి20 సెంచరీ నమోదు చేశాడు. సామ్ కరన్: టి20 వరల్డ్ కప్ను ఇంగ్లండ్ అందుకోవడంలో సామ్ కరన్ది కీలకపాత్ర. డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సామ్ ప్రత్యర్థులను దడ పుట్టించాడు. తన ప్రదర్శనతో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. ఓవరాల్గా ఈ ఏడాది సామ్ కరన్ 19 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్: పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20ల్లో చాలా డేంజరస్ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే అతన్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఈసారి వరల్డ్కప్లో అంతగా మెరవనప్పటికి ఏడాది ప్రదర్శన మాత్రం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు.ఇక రిజ్వాన్ ఈ ఏడాది 25 మ్యాచ్ల్లో 996 పరుగులతో పాటు కీపర్గా తొమ్మిది క్యాచ్లు, మూడు స్టంపింగ్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సికందర్ రజా: ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు జింబాబ్వే సంచలనం.. పాకిస్తాన్ మూలాలున్న ఆల్రౌండర్ సికందర్ రజా. జట్టు ఓటమిపాలైనప్పటికి తన ఇన్నింగ్స్లతో అభిమానులను అలరించాడు. మొత్తంగా 24 మ్యాచ్ల్లో 735 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. మందానతో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దార్, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, ఆస్ట్రేలియా నుంచి తాహిలా మెక్గ్రాత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది -
వరల్డ్కప్లో భారత్ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ: మహ్మద్ రిజ్వాన్
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్, వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్తో సిరీస్ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి. స్కై స్పోర్ట్స్ ఛానల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్తో రిజ్వాన్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్కప్-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్కప్లో భారత్పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్కు ఎక్కడికి వెళ్లినా షాప్ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు. ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. కాగా, టీ20 వరల్డ్కప్-2021 తొలి మ్యాచ్లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు. -
కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్.. అందనంత ఎత్తులో సూర్యకుమార్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్య తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్తో రెండో టి20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ 890 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్కు 836 పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్, రిజ్వాన్ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది. ఇక టీమిండియాతో సిరీస్లో ఆకట్టకున్న కివీస్ బ్యాటర్ డెవన్ కాన్వే ఒక స్థానం ఎగబాకి 788 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోగా.. బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్తో సిరీస్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన ఆల్రౌండ్ హార్దిక్ పాండ్యా 50వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 650 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో ఉండగా.. కివీస్తో సిరీస్లో రాణించిన అర్ష్దీప్ సింగ్ ఒకస్థానం ఎగబాకి 21వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చహల్ 8 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 704 పాయింట్లో లంక స్పిన్నర్ హసరంగా తొలి స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 🔹 Suryakumar Yadav continues to shine 🔹 A host of Australia stars make big gains The latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ — ICC (@ICC) November 23, 2022 చదవండి: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..! -
రెండులో కొనసాగుతున్న సూర్య.. ఆరో స్థానంలో హార్ధిక్
ఐసీసీ తాజాగా (అక్టోబర్ 19) విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో పెద్ద మార్పులేవీ లేవు. బ్యాటర్ల విభాగంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (861), టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (838), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (808) తొలి మూడు స్థానాల్లో యధాతథంగా కొనసాగుతుండగా.. మార్క్రమ్, డెవాన్ కాన్వే, డేవిడ్ మలాన్, ఫించ్, నిస్సంక, ముహ్మద్ వసీమ్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. పదో స్థానంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ మినహా టాప్-10 జాబితా యధాతథంగా కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్లో రాణించిన ఫిలిప్స్.. 13 స్థానాలు ఎగబాకి పదో స్పాట్కు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం టాప్-10లో రెండు మార్పులు జరిగాయి. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్.. రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదిలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ హేజిల్వుడ్, రషీద్ ఖాన్, హసరంగ, షంషి తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్ల విషయానికొస్తే.. భువీ 12లో, అశ్విన్, అక్షర్ వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీని వెనక్కు నెట్టి టాప్ ప్లేస్కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో మొయిన్ అలీ, జెజె స్మిట్, హసరంగ, హార్ధిక్ పాండ్యా, సికందర్ రజా, జీషన్ మక్సూద్, మ్యాక్స్వెల్, దీపేంద్ర వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో నిలిచారు. -
'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది అంటే ఆ మ్యాచ్లో రిజ్వాన్ మెరిసి ఉంటాడనేలా అభిమానుల్లో పాతుకుపోయింది. పాక్ జట్టుకు రిజ్వానే బలం.. బలహీనత. అతను ఆడని రోజున పాకిస్తాన్ పూర్తిగా విఫలం కావడం గమనించాం. దీంతో రిజ్వాన్ పాకిస్తాన్ బ్యాటింగ్కు వెన్నుముకలా మారిపోయాడు. మహ్మద్ రిజ్వాన్కు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజం కూడా రాణించడం సానుకూలాంశం. ఈ ఇద్దరు విఫలమైతే పాక్ కష్టాల్లో పడినట్లే. టీమిండియాతో తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా జరగనున్న బ్లాక్బాస్టర్ మ్యాచ్ కోసం అభిమానులతో పాటు ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసింది మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈసారి కూడా ఎలాగైనా టీమిండియాతో మ్యాచ్లో రాణించాలని రిజ్వాన్ పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే అతని ప్రాక్టీస్ కొనసాగుతుంది. ఈ విషయం పక్కనబెడితే.. రిజ్వాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పాక్ ఓపెనర్ ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంది. రిజ్వాన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక భారత అభిమాని అతని దగ్గరకు వచ్చి.. నేను నీకు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయాలా అని అడిగాడు. మొదట రిజ్వాన్ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ సదరు వ్యక్తి మరోసారి అదే ప్రశ్న వేయడంతో స్పందించిన రిజ్వాన్.. పెషావర్కు వచ్చి బౌలింగ్ చెయ్యు అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో భారత అభిమాని నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం 'భారత్లో జరిగే వరల్డ్కప్ను బాయ్కాట్ చేస్తాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లిని అధిగమించిన రిజ్వాన్
పాకిస్తాన్తో ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్, పాక్లపై వరుస విజయాలు సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక.. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి పాక్కు వరుసగా రెండో మ్యాచ్లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకకు డిఫెండింగ్ టోటల్ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. And with that, we close the DP World #AsiaCup 2022, with Sri Lanka as CHAMPIONS! 🇱🇰🏆 What a tournament we've had! 🤩 Here are the overall performers who have impressed us with their incredible displays 👏#ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/M5v6p5QGEw — AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022 ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (281 పరుగులు).. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్-5లో ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్కు దక్కింది. భువీ 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్ సాధించినదే కావడం విశేషం. -
పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్మురేపాడు. ఆసియాకప్లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్లో మూడు మ్యాచ్లాడిన రిజ్వాన్ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్లో రిజ్వాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్ ఉండగా.. నిన్నటివరకు టాప్ ప్లేస్లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. ఇక ఆసియాకప్లో భాగంగా సూపర్-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్లో టాప్ స్కోరర్గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్వుడ్ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్ షంసీ రెండు, ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ రెండు.. 221 పాయింట్లతో మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నాడు. On 🔝 of the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings 👑 Congratulations, @iMRizwanPak 👏 👉 https://t.co/mvY3tc8Zdi — ICC (@ICC) September 7, 2022 చదవండి: ఆసియా కప్లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
'ఆసియా కప్లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది'
టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లుకు ఆస్కారం లేకపోవడంతో కేవలం మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్లో వారం గ్యాప్ వ్యవధిలో రెండోసారి ఎదురుపడుతున్నాయి. మరి లీగ్ దశలో టీమిండియాతో చేతిలో ఓడిన పాకిస్తాన్ సూపర్-4 దశలో భారత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ టీమిండియాతో మ్యాచ్కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్ మాటల మధ్యలో జోకులు వేసి నవ్వించాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్నుద్దేశించి.. '' వారం వ్యవధిలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగడం రెండోసారి. రెండుజట్లు ఎప్పుడు తలపడినా రసవత్తర పోరు ఖాయం. అయితే ముచ్చటగా మూడోసారి కూడా మ్యాచ్ జరగాలని.. అది వచ్చే ఆదివారం ఫైనల్ మ్యాచ్ కావాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఫలించాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇది చూసిన తర్వాత ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది. నాకైతే ఆసియా కప్ ఆడుతున్నట్లు లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్ సిరీస్ ఆడుతున్నట్లుగా ఉంది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. అయితే యాదృశ్చికమో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ.. రిజ్వాన్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తున్నాయి. పేరుకే ఆసియా కప్ టోర్నీగా పెట్టి.. భారత్, పాకిస్తాన్ల మధ్య దైపాక్షిక సిరీస్కు బదులు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే.. కచ్చితంగా వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్-పాకిస్తాన్లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్లో 36 పరుగులు చేసిన రిజ్వాన్.. హాంగ్ కాంగ్తో మ్యాచ్లో 78 పరుగులు నాటౌట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా ఫఖర్ జమాన్ ఫిప్టీ చేయగా.. చివర్లో కుష్దిల్ షా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా 193 పరుగుల భారీ స్కోరు చేసిన పాక్.. అనంతరం హాంగ్ కాంగ్ను 38 పరుగులకే కుప్పకూల్చి 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సూపర్-4లో అడుగుపెట్టిన పాక్.. భారత్తో మ్యాచ్కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో Chamika Karunaratne: 'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్ డ్యాన్స్ -
శివాలెత్తిన పాక్ బ్యాటర్లు.. హాంగ్ కాంగ్ ముందు భారీ లక్ష్యం
ఆసియాకప్లో భాగంగా గ్రూఫ్-ఏలో హాంగ్ కాంగ్తో మ్యాచ్లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అంతకముందు టాస్ గెలిచి పాకిస్తాన్ను బ్యాటింగ్ ఆహ్వానించిన హాంగ్ కాంగ్కు ఆరంభంలో బాబర్ ఆజం రూపంలో బిగ్ వికెట్ లభించింది. కానీ ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్లు మరో వికెట్ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్ జమాన్ ఔటైనప్పటికి.. చివర్లో కుష్దిల్ షా విధ్వంసంతో పాక్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఎహ్సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
Asia Cup 2022: పాక్ క్రికెటర్పై పుజారా ప్రశంసల వర్షం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పుజారా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పుజారా కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉండగా.. మహ్మద్ రిజ్వాన్ ఆసియాకప్ కోసం జట్టుతో పాటు యూఏఈ చేరుకున్నాడు. విషయంలోకి వెళితే.. కౌంటీ చాంపియన్షిప్లో పుజారా, మహ్మద్ రిజ్వాన్లు ససెక్స్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్తో కలిసి కౌంటీ ఆడడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక అభిమాని పుజారాకు ప్రశ్న వేశాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా రిజ్వాన్తో కలిసి ఆడిన క్షణాలను పుజారా గుర్తు చేసుకున్నాడు. ''మహ్మద్ రిజ్వాన్ మంచి టాలెంటెడ్ క్రికెటర్. అతనితో కలిసి ఆడిన సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాను. వ్యక్తిగతంగానూ చాల మంచోడు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక వన్డే క్రికెట్కు ఆదరణ తగ్గిపోతుందని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు అని మరొక అభిమాని ప్రశ్నించాడు. దీనికి పుజారా..'' అవును వన్డే క్రికెట్ ఆదరణ కోల్పోవడం దురదృష్టకరం.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్తో టెస్టు ముగిసిన అనంతరం కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొన్న పుజారా వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఆ తర్వాత రాయల్ లండన్ వన్డే కప్లోనూ పుజారా బ్యాటింగ్లో ఇరగదీస్తున్నాడు. మంగళవారం మిడిలెసెక్స్తో జరిగిన మ్యాచ్లో పుజారా కేవలం 90 బంతుల్లోనే 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో పుజారా స్ట్రైక్ రేట్ 146.66 దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత భీకరమైన ఫామ్లో ఉన్నాడనేది.. ఇటివలే లిస్ట్-ఏ క్రికెట్లోనూ పుజారా 5వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. I enjoyed my time with him, he is a very nice guy and a talented cricketer https://t.co/LloU2tG0KT — Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2022 I enjoyed my time with him, he is a very nice guy and a talented cricketer https://t.co/LloU2tG0KT — Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2022 చదవండి: ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్న్యూస్ టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. -
రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు'
నెదర్లాండ్స్తో గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మహ్మద్ రిజ్వాన్(82 బంతుల్లో 69 నాటౌట్), ఆగా సల్మాన్(35 బంతుల్లో 50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్కు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజం(57) మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే తొలి వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. నెదర్లాండ్స్ జట్టు చుక్కలు చూపించింది. 314 పరుగుల లక్ష్య ఛేదనను దాదాపు చేరుకున్నంత పని చేసిన డచ్.. చివరకు 298 పరుగుల వద్ద ఆగిపోవడంతో 16 పరుగులతో గెలిచిన పాక్ ఊపిరి పీల్చుకుంది. ఈసారి మాత్రం పాక్ జట్టు నెదర్లాండ్స్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ పాక్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. అయితే బాస్ డీ లీడే 89, టామ్ కూపర్ 66 పరుగులతో రాణించారు. జట్టు స్కోరు 186 కాగా.. ఈ ఇద్దరు చేసిన పరుగులు 155 పరుగులు కావడం విశేషం. మిగతావారంతా సింగిల్డిజిట్కే పరిమితం అయ్యారు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం(ఆగస్టు 21న) జరగనుంది. Series win sealed ✅ Pakistan win the second ODI by seven wickets 👌#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/T3vN4YPcU3 — Pakistan Cricket (@TheRealPCB) August 18, 2022 -
Mohammad Rizwan: కోహ్లి తిరిగి ఫామ్లోని రావాలని దేవుడిని ప్రార్థిస్తా..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా అభిమానించే పాకిస్థాన్ వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్.. రన్ మెషీన్ పేలవ ఫామ్పై తెగ ఆందోళన చెందుతున్నాడు. కోహ్లి తిరిగి ఫామ్లోకి రావాలని దేవున్ని ప్రార్ధిస్తానని అంటున్నాడు. కోహ్లి ఓ ఛాంపియన్ ప్లేయర్ అని, అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తప్పక అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమేనని, కోహ్లి లాంటి హార్డ్ వర్కర్ను ఇలాంటి దశలు మరింత రాటుదేలుస్తాయని, కోహ్లి త్వరలోనే మునుపటి కంటే భీకరమైన ఫామ్ను అందుకుంటాడని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా నయా వాల్ పుజారాతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న రిజ్వాన్.. క్రిక్విక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, గతేడాది టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్.. కోహ్లిని హత్తుకున్న ఫొటో వైరలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రిజ్వాన్ ప్రదర్శనకు ముగ్దుడైన కోహ్లి... మ్యాచ్ అనంతరం అతనితో చాలా సేపు ముచ్చటించాడు. మ్యాచ్ కోల్పోయామన్న బాధలోనూ కోహ్లి.. రిజ్వాన్ని ప్రశంసిస్తూ క్రీడాస్పూర్తిని చాటుకున్న వైనం ఇరు దేశాల అభిమానులను ఆకట్టుకుంది. రిజ్వాన్ సైతం కోహ్లి హుందాతనాన్ని చూసి తెగ సంబురపడిపోయాడు. టీ20 ప్రపంచకప్ 2021లో 6 మ్యాచ్ల్లో 280 పరుగులు చేసిన రిజ్వాన్.. భారత్తో జరిగిన మ్యాచ్లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్లో రిజ్వాన్, బాబర్ ఆజమ్లు చెలరేగడంతో పాక్.. భారత్పై తొలి ప్రపంచకప్ విజయాన్ని సాధించింది. చదవండి: ఎన్ని గోల్డెన్ డకౌట్లైనా.. కోహ్లి ఇప్పటికీ గోల్డే..! -
ఒకే ఫ్రేమ్లో దాయాది క్రికెటర్లు; అరుదైన దృశ్యం అంటున్న ఫ్యాన్స్
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ప్రస్తుతం కౌంటీల్లో ఆడేందుకు లండన్లో వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఫామ్ కోల్పోయి సతమతవుతున్న పుజారా మళ్లీ ఫామ్ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌంటీల్లో ససెక్స్ తరపున పుజారా అరంగేట్రం చేయనున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ కూడా ససెక్స్ తరపునే కౌంటీల్లో అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఫోటోకు ఫోజిచ్చారు. ఒకరు టీమిండియాకు ఆడుతుంటే.. మరొకరు మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్కు ఆడుతున్నాడు. ఎంతైనా టీమిండియా-పాకిస్తాన్ అంటే చాలు ఎక్కడున్నా సరే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే వీరిద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించడంపై ట్విటర్లో అభిమానులు ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. స్వాతంత్య్రం ఇచ్చే సందర్భంలో బ్రిటీష్ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్లను విడగొట్టింది..ఇప్పుడదే బ్రిటీష్ మళ్లీ కలిపింది.. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి.. ఒకసారి టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేశారు. ఇక చతేశ్వర్ పుజారా ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పుజారా తన మార్క్ చూపించాడు. ద్రవిడ్ తర్వాత అడ్డుగోడ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఇప్పుడు ఫాం కోల్పోయి సతమతవుతున్నప్పటికి తనదైన రోజున పుజారాను ఆపడం ఎవరి తరం కాదు. ఇక అటు మహ్మద్ రిజ్వాన్ కూడా పాకిస్తాన్ క్రికెట్లో కీలకంగా ఎదుగుతున్నాడు. ఇటీవలే ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. చదవండి: IND vs PAK: కన్నేసి ఉంచాలంటూ పాక్ ఆటగాళ్ల భార్యలను భారత్కు పంపించాం! Divided by British Untied by British 😂 — Tehseen Qasim (@Tehseenqasim) April 14, 2022 I really hope India Pakistan started bilateral series again. Will be a trilling series. Best of luck to both @cheteshwar1 and @iMRizwanPak — Mushahid Hussain (@mushahid345) April 14, 2022 -
పాక్ స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్లకు ఘోర అవమానం.!
లండన్: ఐపీఎల్కు పోటీగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ది హండ్రెడ్ లీగ్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్లకు ఘోర అవమానం జరిగింది. ఈ నెల 5న జరిగిన లీగ్ మెగా వేలంలో రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంగా పోటీపడిన ఈ ఇద్దరు బ్యాటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ పాక్ ద్వయం అన్సోల్డ్గా మిగిలిపోయింది. పాక్ కెప్టెన్ బాబర్ తాజాగా జరిగిన ఆసీస్ సిరీస్లో సెంచరీల మోత మోగించి పరుగుల వరద పారించినప్పటికీ అతనిపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1గా కొనసాగుతున్న పాక్ కెప్టెన్ను వంద బంతుల ఫార్మాట్లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడాన్ని పాక్ మాజీలు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ ఆజమ్ను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పోల్చుకునే పాక్ అభిమానులకు ఇది చెంపపెట్టు లాంటింది. ఐపీఎల్ వేలంలోకి తమ కెప్టెన్ పాల్గొంటే కనీసం రూ.20 కోట్లు దక్కేవి అని బడాయికి పోయిన ఆ దేశ మాజీలు ఈ పరిణామంలో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాక ముఖం చాటేస్తున్నారు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్లతో పాటు హండ్రెడ్ లీగ్ వేలంలో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కూడా చుక్కెదురైంది. వార్నర్ను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. అయితే వంద బంతుల లీగ్లో ఐపీఎల్ ఆటగాళ్లను మాత్రం భలే డిమాండ్ ఉండింది. క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. కీరన్ పొల్లార్డ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్క్ వుడ్, జోస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, మార్కస్ స్టొయినిస్, రషీద్ ఖాన్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టొన్, ఆడమ్ మిల్నే లాంటి ఐపీఎల్ స్టార్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. కాగా, వంద బంతుల ఫార్మాట్లో సాగే హండ్రెడ్ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. చదవండి: హండ్రెడ్ లీగ్లో ఐపీఎల్ స్టార్లు, ఇక్కడేమో కోట్లు కుమ్మరించారు.. అక్కడేమో..! -
తెలివిగా వ్యవహరించిన పాక్ వికెట్కీపర్.. వీడియో వైరల్
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ పట్టిన ఒక క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి ఫించ్ ఔటయ్యాడు. పాక్ బౌలర్ జహీద్ మహమూద్కు అదే తొలి వికెట్ కావడం విశేషం. అయితే కొద్దిలో ఈ అవకాశం సదరు బౌలర్కు మిస్ అయ్యేదే. ఎందుకంటే ఫించ్ ఆడిన బంతిని కీపర్ రిజ్వాన్ అందుకున్నప్పటికి గ్లౌజ్ నుంచి జారిపోయేలా కనిపించింది. ఇక్కడే తెలివి ప్రదర్శించిన కీపర్ మహ్మద్ రిజ్వాన్ డైవ్ చేస్తూ బంతి పట్టు జారకుండా పట్టుకున్నాడు. అలా జహీద్ ఖాతాలో తొలి వికెట్ పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 38 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ 3, అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ ట్రెవిస్ హెడ్ 101 పరుగులతో రాణించగా.. బెన్ మెక్డెర్మోట్ 55 పరుగులు చేసి వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ మార్క్ను సాధించాడు. మరో 12 ఓవర్లు మిగిలి ఉండడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరుపై కన్నేసింది. చదవండి: Kraigg Brathwaite: అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్ కెప్టెన్ కొత్త రికార్డు?! IPL 2022: "రాహుల్ చేసిన అతి పెద్ద తప్పు అదే.. అందుకే లక్నో ఓడిపోయింది" View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) -
'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు
టెస్టు క్రికెట్లో ఉండే మజా ఏంటో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమేనన్న తరుణంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్(196 పరుగులు) చూపించిన తెగువ.. వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీ, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 96 పరుగులు.. వెరసి టెస్టు క్రికెట్లో ఉన్న మజాను చూపించారు. ఆఖరివరకు ఉత్కంఠగా సాగినప్పటికి పాకిస్తాన్ అద్బుత ఆటతీరుతో మ్యాచ్ను డ్రాగా ముగించింది. దీంతో క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ట్విటర్ వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందంటూ అభివర్ణించారు. ''మ్యాచ్ చివర్లో మా గుండె ఆగినంత పనైంది.. వాటే టెస్టు మ్యాచ్'' అంటూ ఒక అభిమాని పేర్కొన్నాడు. ''టెస్టు మ్యాచ్లో ఉండే మజా మరోసారి రుచి చూశాము.. పాకిస్తాన్ బ్యాటర్స్ తెగువ చూపించారు''.. ''నిజమైన టెస్టు క్రికెట్ అంటే ఇదే.. టెస్టు క్రికెట్లో ఉండే బ్యూటీ ఏ విధంగా ఉంటుందో మరోసారి చూశాం'' అంటూ కామెంట్స్ చేశారు. అయితే సరిగ్గా వారం క్రితం ఇదే పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రావల్పిండి వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆ మ్యాచ్ ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాసిరకం పిచ్ తయారు చేశారంటూ.. బౌలర్లకు సహకరించని పిచ్లు తయారు చేయడం ఏంటని.. పనికిమాలిన పిచ్లు తయారు చేయడం ఆపేయండి అంటూ పీసీబీని దుమ్మెత్తిపోశారు. అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుతున్నారు. తొలి టెస్టు నుంచి పాఠాలు నేర్చుకున్న పీసీబీ రెండో టెస్టుకు మంచి పిచ్ను తయారు చేసి ప్రశంసలు పొందడం విశేషం. ఇక 408 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత ఆస్ట్రేలియా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ను వీరిద్దరు తమ అద్భుత బ్యాటింగ్తో రక్షించారు. 506 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్లో 171.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు సాధించింది. బాబర్, రిజ్వాన్ల 115 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ సఫలమైంది. తర్వాతి బంతికే ఫహీమ్ (0)ను, కొద్ది సేపటికే సాజిద్ (9)ను అవుట్ చేసి ఆసీస్ పట్టు బిగించింది. అయితే మిగిలిన 8 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడంలో విఫలమైన కంగారూలు తీవ్రంగా నిరాశ చెందారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి లాహోర్లో మూడో టెస్టు జరుగుతుంది. చదవండి: Ranveer Singh: ఫుట్బాల్ మైదానంలో బాలీవుడ్ స్టార్ వింత ప్రవర్తన Babar Azam: పాక్ వీరోచిత పోరాటం.. డబుల్ మిస్ అయినా కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్ What a test match Almost heart attack 😂#PAKvsAUS #PakVsAustraila #PAKvAUS — CricketLover 🏏 (@Cricketlover03) March 16, 2022 This is why test cricket is the purest and most important form of the sport. It must be prioritised. What a match. #PAKvAUS — Zoheb (@zoahms) March 16, 2022 Another king Rizwan!! A great Century. Both kings of team Pakistan @babarazam258 and @iMRizwanPak And dont forget future star Abdullah Shafique. They fought for a comeback. Pakistan saved it!! What a Match this was. Long live test Cricket❤️#PAKvAUS #TestCricket — Hassaan Malik 🇵🇰🇵🇸 (@ImHassaanMalik) March 16, 2022 -
పాక్ వీరోచిత పోరాటం.. డబుల్ మిస్ అయినా కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్
PAK VS AUS 2nd Test: కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో ఆతిధ్య పాకిస్థాన్ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది. 506 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రికార్డు స్థాయిలో పరుగులు (443/7) చేసి మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (305 బంతుల్లో 96; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (425 బంతుల్లో 196; 21 ఫోర్లు, సిక్స్), వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (177 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్) వీరోచితంగా పోరాడి ప్రత్యర్ధి చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఓ దశలో (బాబర్, రిజ్వాన్ క్రీజ్లో ఉండగా) పాక్ చారిత్రక విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే, బాబర్ ఔట్ కావడంతో పాక్ డిఫెన్స్లో పడి మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. పాక్ సారథి కళాత్మక ఇన్నింగ్స్ ఆడగా, రిజ్వాన్ చివరి దాకా క్రీజ్లో నిలిచి ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన పాక్ కెప్టెన్.. ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్లు డాన్ బ్రాడ్మన్ (173*), రికీ పాంటింగ్ (156), టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (141)లను అధిగమించాడు. ఇదిలా ఉంటే, ఆసీస్, పాక్ల మధ్య 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా కరాచీలో జరిగిన రెండో టెస్ట్లోనూ అదే ఫలితం రిపీటైంది. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు లాహోర్ వేదికగా జరిగే మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకం కానుంది. రెండో టెస్ట్ స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 556/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ : 97/2 డిక్లేర్ పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 148 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 443/7 చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్గా యుజ్వేంద్ర చహల్..! -
Mohammad Rizwan: నువ్వు చెప్పు బ్రో.. డీఆర్ఎస్ తీసుకోమంటావా..? వద్దా..?
AUS Vs PAK 2nd Test: డీఆర్ఎస్ విషయంలో ప్రత్యర్ధి బ్యాటర్ అభిప్రాయాన్ని కోరిన విచిత్ర ఘటన పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సాగుతుండగా (ఇన్నింగ్స్ 70.3వ ఓవర్) స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ వేసిన బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్కు తాకడంతో పాక్ ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఆ అప్పీల్ను తిరస్కరించి నాటౌట్ అని తల ఊపాడు. To DRS or not to DRS 🤔 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/X3b9mp8uaF — Pakistan Cricket (@TheRealPCB) March 12, 2022 దీంతో నౌమన్ అలీ అక్కడే స్లిప్లో ఉన్న సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ల వైపు చూస్తూ డీఆర్ఎస్ విషయంలో వారి అభిప్రాయాన్ని కోరాడు. ఈ క్రమంలో రిజ్వాన్.. క్రీజ్లో ఉన్న స్మిత్ వద్దకు వెళ్లి, అతడి భుజంపై చేయి వేసి.. ‘నువ్వే చెప్పు బ్రో.. డీఆర్ఎస్కు వెళ్లమంటావా..? వద్దా..? అని ఫన్నీగా అడిగాడు. ఎవరి ఔట్ కోసం అప్పీల్ చేశారో ఆ ఆటగాడి అభిప్రాయాన్నే రిజ్వాన్ కోరడంతో పాక్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. ఆఖరికి స్మిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఫైనల్గా స్మిత్ తో చర్చించాక రిజ్వాన్ డీఆర్ఎస్ వద్దని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగగా, స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా, లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్లో పట్టుదలగా ఆడి కెరీర్లో పదో శతకాన్ని నమోదు చేశాడు. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
వైరల్గా మారిన పాక్ క్రికెటర్ చర్య.. ఏం జరిగింది
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఆదివారం మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్పిన్నర్ నుమాన్ అలీ బౌలింగ్కు వచ్చాడు. క్రీజులో ఉన్న లబుషేన్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో నుమాన్ అలీ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. దీంతో మిస్ అయిన బంతి లబుషేన్ మోచేతిని తాకుతూ పక్కకు వెళ్లింది. ఇది గమనించిన కీపర్ రిజ్వాన్ లబుషేన్ వద్దకు వచ్చి దెబ్బ ఏమన్న తగిలిందేమో చూసి అతని మోచేతిని గట్టిగా రుద్దాడు. ఏం పర్లేదు.. బాగానే ఉంది అని చెప్పగానే రిజ్వాన్ నవ్వుతూ అతని చేతిని వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''బంతిని అందుకోవడం అంటే సాయపడడంలోనే రిజ్వాన్ ఎక్కువ సంతోషం ఉందని గ్రహించాడు'' అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా మ్యాచ్ నాలుగోరోజు వర్షం అడ్డుపడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇక మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ధీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేజార్చుకున్నాడు. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 1 పరుగులు చేసింది. లబుషేన్ 61, స్టీవ్ స్మిత్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చదవండి: Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం Shane Warne Death: వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది Rizwan is more than happy to help😄#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/yV9H595UAo — Pakistan Cricket (@TheRealPCB) March 6, 2022 -
ఒకరినొకరు భయంకరంగా గుద్దుకున్నారు..
పాకిస్తాన్ సూపర్లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పెషావర్ జాల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్లో ఇది జరిగింది. చేజింగ్కు దిగిన పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కమ్రాన్ అక్మల్ భారీ షాట్కు యత్నించాడు. అయితే బ్యాట్కు సరైన దిశలో తగలని బంతి ఫైన్లెగ్ దిశగా హైట్లోకి వెళ్లింది. చదవండి: 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్తో మెసేజ్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకవైపు నుంచి.. షాహనావాజ్ దహాని మరో ఎండ్ నుంచి క్యాచ్ కోసం పరిగెత్తారు. ఇద్దరు ఎదురుఎదురుగా వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. అనవసరంగా క్యాచ్ మిస్ అయిందని మనం అనుకునేలోపే అద్భుతం జరిగింది. కిందపడుతూనే దహాని ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముందు సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మహ్మద్ రిజ్వాన్ వచ్చి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ 42 పరుగుల తేడాతో పెషావర్ జాల్మీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మసూద్ 68, రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 34 రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ మాలిక్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు 😄#HBLPSL7 l #LevelHai l #MSvPZ pic.twitter.com/3caWheCXaK — PakistanSuperLeague (@thePSLt20) February 10, 2022 -
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..!
Mohammad Rizwan Named T20 Cricketer Of The Year: 2021వ సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డుకు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిజ్వాన్.. 29 మ్యాచ్ల్లో 73.66 సగటున 1326 పరుగులు బాదాడు. అతని స్ట్రయిక్ రేట్ 134.89గా ఉంది. బ్యాటింగ్లో మెరుపులతో పాటు వికెట్కీపింగ్లోనూ సత్తా చాటిన రిజ్వాన్.. గతేడాది పాక్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥 2021 was memorable for Mohammad Rizwan 👊 More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA — ICC (@ICC) January 23, 2022 టీ20 ప్రపంచకప్ 2021లో మూడో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచిన అతను.. తన జట్టు సెమీస్ చేరేందుకు తోడ్పడ్డాడు. కెరీర్లో ఇప్పటివరకు 19 టెస్ట్లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 3500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది అసోసియేట్ దేశాల అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డును ఒమన్కు చెందిన జీషన్ మక్సూద్ గెలుచుకున్నాడు. ఒమన్ జట్టును సమర్ధవంతంగా నడిపించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను మక్సూద్ను ఈ అవార్డు వరించింది. చదవండి: ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ -
అదే జరిగితే, యావత్ పాకిస్థాన్ మీకు స్వాగతం పలుకుతుంది.. మహ్మద్ రిజ్వాన్
Australia Tour Of Pakistan 2022: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నెలల్లో పాకిస్థాన్లో పర్యటించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది. పర్యటనలో భాగంగా ఆసీస్-పాక్ జట్ల మధ్య మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. అయితే, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటనకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనపై పాక్ మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలాకాలం తర్వాత ప్రపంచ మేటి జట్టు తమ దేశంలో పర్యటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు నిరాధారమైన కారణాల చేత తమతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేశాయని, ఇది తమను, తమ అభిమానులు తీవ్రంగా కలచి వేసిందని, అంతే కాకుండా తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయాడు. ఫైనల్గా ఆసీస్ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకోవడం శుభపరిణామమని, ఈ పర్యటన కార్యరూపం దాల్చితే, యావత్ పాక్ ఆసీస్ జట్టుకు స్వాగతం పలుకుతుందని, ఈ సిరీస్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. పాక్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్లు బిగ్బాష్ లీగ్లో ఆడుతూ.. ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడుతూ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నారని పేర్కొన్నాడు. ఈ బంధం బలపడేందుకు పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తన వంతు సహకారాన్ని అందించాడని గుర్తు చేశాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్తో తెగదెంపులు.. ఇకపై..! -
‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ రేసులో స్మృతి
దుబాయ్: ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్ల వివరాలను ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం నాలుగు పేర్లను ఐసీసీ నామినేట్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. చదవండి: Kohli Vs BCCI: 'కోహ్లి మాటల్లో నిజం లేదు.. టి20 కెప్టెన్గా తప్పుకోవద్దని సూచించాం' ఈ జాబితాలో స్మృతితో పాటు బీమాంట్ (ఇంగ్లండ్), లిజెల్లి లీ (దక్షిణాఫ్రికా), గ్యాబీ లెవిస్ (ఐర్లాండ్) ఉన్నారు. ఈ ఏడాది స్మృతి 22 అంతర్జాతీయ మ్యాచ్లలో కలిపి 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ‘పింక్ టెస్టు’లో సెంచరీ చేసిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. పాకిస్తాన్ నుంచి ఇద్దరు... ఐసీసీ అవార్డుల్లో అన్నింటికంటే మేటిగా భావించే ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్లను ఐసీసీ ప్రకటించింది. ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ మొహమ్మద్ రిజ్వాన్, పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది పోటీ పడుతున్నారు. చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్ -
అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు.. రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు
దుబాయ్: ICC Player of the Year (Sir Garfield Sobers Trophy) అవార్డు కోసం 2021 సంవత్సరానికి గాను అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ అటతీరును కనబర్చిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ శుక్రవారం(డిసెంబర్ 31) విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు నిలువగా.. టీమిండియా నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. ఈ జాబితాలో తాజా బ్యాటింగ్ సంచలనం, పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ముందువరుసలో ఉండగా.. అదే జట్టుకు చెందిన షాహీన్ అఫ్రిది, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డు విజేతను 2022 జనవరి 24న ప్రకటించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. పాక్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిజ్వాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 44 మ్యాచ్ల్లో 56.32 సగటుతో 1915 పరుగులు సాధించగా.. విలియమ్సన్ 16 మ్యాచ్ల్లో 43.31 సగటుతో 693 పరుగులు, రూట్.. 18 మ్యాచ్ల్లో 58.37 సగటుతో 1855 పరుగులు స్కోర్ చేశారు. వీరిలో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు నమోదు చేయగా.. రిజ్వాన్ రెండు శతకాలు, విలియమ్సన్ ఒకటి సాధించారు. మరోవైపు ఈ ఏడాది మొత్తం 36 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన షాహీన్ అఫ్రిది.. 20.20 సగటుతో ఏకంగా 78 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్లో కొనసాగుతున్న రిజ్వాన్.. 29 మ్యాచ్ల్లో 73.66 సగటుతో ఏకంగా1326 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వికెట్ కీపింగ్లోనూ రాణించిన అతను.. 56 వికెట్లు పడగొట్టడంలో భాగస్తుడయ్యాడు. చదవండి: ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం -
బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు..
Rashid Latif Comments On Team India: పాకిస్థాన్ మాజీ వికెట్కీపర్ రషీద్ లతీఫ్ భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు లేరని టీమిండియా ఫ్యాన్స్ బాధపడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ లతీఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా పాక్ పరిమిత ఓవర్ల ఓపెనింగ్ జోడీ(బాబర్, రిజ్వాన్)పై ప్రశంసల వర్షం కురిపించిన లతీఫ్.. భారత అభిమానులను తక్కువ చేసి మాట్లాడాడు. ఏడాది కిందట పాక్ అభిమానులు సైతం తమ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు లేరని బాధపడేవాళ్లని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బాబర్, రిజ్వాన్ ద్వయం తిరుగులేనిదని, ఈ జోడీ మున్ముందు ప్రపంచ క్రికెట్ను శాసిస్తుందని జోస్యం చెప్పాడు. తమ దేశ క్రికెటర్లను ఆకాశానికెత్తిన లతీఫ్.. విరాట్, రోహిత్లలో మునుపటి పదను లేదని పేర్కొన్నాడు. లతీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భగ్గుమంటున్నారు. సోషల్మీడియా వేదికగా లతీఫ్ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది కాలంగా పాక్ ఓపెనింగ్ ద్వయం పొట్టి ఫార్మాట్లో మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధిస్తుంది. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో భారత టీ20 ఓపెనింగ్ జోడీ రోహిత్, రాహుల్ పేరిట ఉన్న అత్యధిక శతక భాగస్వామ్యాల(6) రికార్డును బద్దలు కొట్టింది. రిజ్వాన్ ఈ క్యాలెండర్ ఇయర్లో 2000 పరుగులు చేయగా.. బాబర్ 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. చదవండి: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్కు! -
ఇంగ్లండ్లో ఆడనున్న పాక్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. 2022 సీజన్కు గాను సస్సెక్స్ క్లబ్తో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీల్లో ఆడడం రిజ్వాన్కి ఇదే తొలిసారి. అతడు వచ్చే సీజన్లో టీ20 బ్లస్ట్తో పాటు, కౌంటీ క్రికెట్ కూడా ఆడనున్నాడు.ఇక ఈ విషయంపై స్పందించిన రిజ్వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. "చరిత్రాత్మక సస్సెక్స్ క్లబ్లో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. సస్సెక్స్ క్లబ్ గురించి నేను చాలా విషయాలు విన్నాను. అటువంటి క్రికెట్ క్లబ్లో ఆడటం నా ఆదృష్టంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక సస్సెక్స్ కోచ్ సాలిస్బరీ మాట్లాడుతూ.. టీ20, టెస్ట్ల్లో అతడు సాధించిన రికార్డులను ప్రశంసించాడు. "అతడి ఫస్ట్ క్లాస్ రికార్డులు, టెస్ట్ రికార్డులు అతడు ఏంటో తెలుపుతున్నాయి. అటువంటి స్టార్ క్రికెటర్ సస్సెక్స్ క్లబ్ తరుపున ఆడడం చాలా సంతోషం" అని పేర్కొన్నాడు. ఇక టీ20 క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ దుమ్ము రేపుతున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో టి20 క్రికెట్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు. చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి -
టి20 క్రికెట్లో పాక్ ఓపెనర్ కొత్త చరిత్ర
Mohammad Rizwan First Batter Reach 2000 Runs T20Is Single Calender Year.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20 క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో టి20 క్రికెట్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు. కరాచీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి టి20లో 45 బంతుల్లోనే 87 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్.. ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయ, ఇతర లీగ్లు కలిపి 2వేల పరుగులు సాధించాడు. చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం అతనికి తోడుగా మరో ఓపెనర్ బాబర్ అజమ్ కూడా 79 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వెస్టిండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64), బ్రూక్స్ (49), బ్రెండన్ కింగ్ (43) చెలరేగారు. స్టిండీస్తో జరిగిన మూడు టి20ల సిరీస్ను పాకిస్తాన్ 3–0తో సొంతం చేసుకుంది. ఇక ఇరుజట్ల నుంచి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో విండీస్ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది. అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్ను పాక్ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి. చదవండి: పాక్ క్రికెట్కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. పాకిస్తాన్దే టి20 సిరీస్
కరాచీ: వెస్టిండీస్తో రెండో టి20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. -
హేడెన్కు ఖురాన్ను బహుకరించిన రిజ్వాన్.. పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mohammad Rizwan Gifts Holy Quran To Matthew Hayden: ఆసీస్ లెజెండరీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పర్యవేక్షనలో పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఇవాళ(నవంబర్ 11) రెండో సెమీ ఫైనల్స్లో భాగంగా బలమైన ఆసీస్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్, ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట రిజ్వాన్, పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్కు పవిత్ర ఖురాన్ యొక్క ఇంగ్లీష్ వర్షెన్ను బహుకరించాడు. ఈ విషయాన్ని హేడెనే స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పాక్ క్రికెట్ జట్టు యొక్క ఆధ్యాత్మిక సంస్కృతికి ఆకర్శితుడినయ్యానని, స్వతాహాగా క్రిస్టియన్నే అయినప్పటికీ ఇస్లాం పట్ల ఆసక్తితో ఉన్నానని వ్యాఖ్యానించాడు. రిజ్వాన్ తనకు ఇస్లాం విశ్వాసాల గురించి ఉపదేశిస్తుంటాడని.. అవి తనను బాగా ప్రభావితం చేశాయని.. ఈ క్రమంలో తాను కూడా క్రమం తప్పకుండా ఖురాన్ను చదవడం ప్రారంభించానని తెలిపాడు. ఈ సందర్భంగా హేడెన్ రిజ్వాన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిజ్వాన్ అసాధారణమైన బ్యాటర్ అని, అంతకుమించి ఛాంపియన్ హ్యుమన్ అని కొనియాడాడు. రిజ్వాన్ తనకు పవిత్ర కానుకను బహుకరించిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఇవాళ ఆసీస్తో జరగనున్న కీలక సెమీస్ సమరంలో రిజ్వాన్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. గత రెండు రోజులుగా రిజ్వాన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు పాక్ వర్గాల సమాచారం. చదవండి: Aus Vs Pak: పాకిస్తాన్దే విజయం.. చరిత్రను తిరగరాస్తుంది: టీమిండియా మాజీ క్రికెటర్ -
'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్
Pak Opener Mohammad Rizwan Tweets In Support Of Shami: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా పాక్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్కు అమ్ముడుపోయాడని, షమీని పాక్కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ షమీకి మద్దతుగా నిలిచాడు. ట్విటర్ వేదికగా ఓ అద్భుతమైన మెసేజ్ని షేర్ చేశాడు. The kind of pressure, struggles & sacrifices a player has to go through for his country & his people is immeasurable. @MdShami11 is a star & indeed of the best bowlers in the worldPlease respect your stars. This game should bring people together & not divide 'em #Shami #PAKvIND pic.twitter.com/3p70Ia8zxf— Mohammad Rizwan (@iMRizwanPak) October 26, 2021 దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఆటగాడు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడని.. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తాడని పేర్కొన్నాడు. షమీ ప్రపంచపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అలాంటి ఆటగాడిని గౌరవించుకోవాలి కాని దూషించకూడదని హితవు పలికాడు. క్రికెట్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలి కాని, విభజించకూడదంటూ షమీ ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీటాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. షమీకి అండగా నిలిచి అద్భుతమైన మెసేజ్ను షేర్ చేసిన రిజ్వాన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదే విషయమై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు షమీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాక్తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన షమీ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క శతకంతో ఐదు రికార్డులు..
లాహోర్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అజేయమైన సెంచరీతో కదం తొక్కిన పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్(104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6), అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న రిజ్వాన్.. పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మట్లలో (వన్డే, టెస్టు, టీ20ల్లో) శతకం బాదిన రెండో వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్ను న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లమ్ మాత్రమే సాధించాడు. మెక్కల్లమ్ టెస్ట్ల్లో 5, వన్డేల్లో 3, టీ20ల్లో ఒక శతకం నమోదు చేయగా, రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన ఐదో వికెట్ కీపర్గా రిజ్వాన్ నిలిచాడు. మెక్కల్లమ్, అహ్మద్ షాజాద్, మోర్న్ వాన్ విక్, లెస్లీ డన్బార్ తరువాత రిజ్వాన్ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే కావడం విశేషం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాక్ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు అహ్మద్ షాజాద్ మత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. మొత్తానికి రిజ్వాన్ ఒక్క సెంచరీతో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పాక్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ను కోల్పోయింది. -
స్విమ్మింగ్పూల్లో మునిగి యువకుడి మృతి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతిచెందాడు. యాకుత్పురా ఇమామ్బడా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అసద్ ఖాన్ కుమారుడు మహ్మద్ రిజ్వాన్ (19) కిరాణా షాపులో పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈత కొట్టేందుకు సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ఫూల్కు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం మదీనానగర్లోని స్విమ్మింగ్పూల్కు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ఫూల్లోకి దూకగా ప్రమాదవశాత్తు తలకు దెబ్బ తగిలి అందులో పడిపోయాడు. స్నేహితులు వెంటనే బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రెయిన్బజార్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.