కొరాపుట్‌ పంటలకు ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ పంటలకు ప్రత్యేక గుర్తింపు

Published Wed, Mar 5 2025 12:51 AM | Last Updated on Wed, Mar 5 2025 12:48 AM

కొరాప

కొరాపుట్‌ పంటలకు ప్రత్యేక గుర్తింపు

జయపురం: కొరాపుట్‌ రైతులు పండించే పంటలకు ప్రత్యేక గుర్తింపు ఉందని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి అన్నారు. స్థానిక దసరాపొడియ మైదానంలో నిర్వహిస్తున్న కృషి యంత్ర మేళ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అన్ని రకాల పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వం సైతం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు యంత్రాల వినియోగం అవసరమని పేర్కొన్నారు. నవరంగపూర్‌ జిల్లా వ్యవసాయ విభాగ విశ్రాంత అధికారి జి.వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక ప్రణాళికతో మొక్కజొన్న పంటసాగును రైతులకు వివరించారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోకుల చంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృషి యంత్ర విభాగ అధికారి సంతోష్‌ కుమార్‌ మిశ్ర, నందపూర్‌ వ్యవసాయ అధికారి ఎన్‌.ప్రకాశరావు, ఎస్పీ రోహిత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మేళాలో దాదాపు రూ.5.3 కోట్ల యంత్రాలు అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొరాపుట్‌ పంటలకు ప్రత్యేక గుర్తింపు1
1/1

కొరాపుట్‌ పంటలకు ప్రత్యేక గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement